భారత్ పౌరసత్వం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వైనం
ఒకప్పుడు అతను పాకిస్థాన్ పార్లమెంట్ మెంబర్ . అంటే ఎంపీ అన్న మాట . పరిస్థితులు ఎలా తారుమారవుతాయో ఇతని ఉదంతం ఒక ఉదాహరణ . ఆ మాజీ ఎంపీ ప్రస్తుతం భారత్లో ఐస్క్రీములు అమ్ముకుంటున్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న దివాయా రామ్, హరియాణాలోని ఫతేబాద్లో ఐస్క్రీమ్ వ్యాపారం చేసుకుంటున్నారు. 25ఏళ్ల క్రితం భారత్కు వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడిపోయారు. తాజాగా భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీసాలు రద్దు చేయగా ఈయన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ఆయన భారత్కు ఎందుకు వచ్చారు? జీవనం సాగించేందుకు ఐస్క్రీములు వ్యాపారం ఎంచుకున్నారు .
పాకిస్థాన్కు చెందిన దివాయా రామ్ 1989లో మైనార్టీల రిజర్వ్ స్థానంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా ఆయన కుటుంబంపై దాడులు మాత్రం ఆగలేదు. ఒకసారి దివాయా రామ్ కూతురిని కిడ్నాప్ చేసినా, పోలీస్ వ్యవస్థ కూడా ఈయనకు సహకరించలేదు . దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఎంపీ పదవికి రాజీనామా చేసి కుటుంబంతో సహా భారత్కు వచ్చేశారు. భార్య రాజో రాణి, 8మంది కుమారులు, ఇద్దరు కూతుళ్లు సహా 13 మంది వచ్చారు. ఆ తర్వాత ఒక కుమార్తె జన్మించగా, ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యుల సంఖ్య 30కి చేరింది. తొలుత నెల రోజుల టూరిస్ట్ వీసాతో వచ్చిన ఆయన, తర్వాత ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తున్నారు . అనంతరం ఐదేళ్లకు ఆయన వీసాను 2018 వరకు పొడిగించారు.
పాకిస్థాన్లో వేధింపులు తాళలేక దివాయా రామ్ బంధువు రామ్ ప్రకాశ్ కుటుంబం కూడా 2006లో భారత్కు వచ్చి స్థిరపడింది. ఫతేబాద్లోని సర్దావాలాకు వచ్చి స్థిరపడి, ఇక్కడే వివాహం చేసుకున్నాడు. అనంతరం అతడి కుటుంబంలోని ఆరుగురికి భారత పౌరసత్వం దక్కగా, ఇంకా కొందరివి ప్రాసెస్లో ఉన్నాయి. కాగా, జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత్ విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్కు తిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ నుంచి 1,367మంది పౌరులు భారత్ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
2018 వరకు వీసాతో ఉన్న దివాయా రామ్ కుటుంబం శరణార్థిగా భారత్లోనే ఉంటున్నారు. అనంతరం 2018లో వీసా గడువు పెంపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన వీసా గడుపు పెంచడానికి స్థానిక నేతలతో పాటు అందరి చూట్టూ తిరిగారు. CAA చట్టం ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా పాకిస్తాన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ఆ దేశ పౌరులైన . . దీర్ఘకాలంగా ఇక్కడే ఉంటున్న వారికి భారత్ పౌర సత్వం విషయంలో మానవత్వంతో ఆలోచించి . .. నిర్ణయం తీసుకోవాలి .
సన్యాస దీక్ష ఇచ్చిన ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి
కంచి కామకోటి పీఠం . . ప్రపంచంలోనే పురాతన పీఠంగా పేరొందింది. శంకర భగవత్పాదుల వారు స్థాపించిన ఈ పీఠానికి పీఠాధిపతిగా అధిష్టించాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అన్నవరం ప్రాంతానికి చెందిన ఓ యువ సన్యాసికి ఈ అరుదైన గౌరవం దక్కింది.
కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరం వేద పండితుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రవిడ్ (24) ఏప్రిల్ 30న అక్షయ తృతీయ రోజున అభిషేకం చేయబడ్డారు . ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆయనకు సన్యాస దీక్ష ఇచ్చి సంప్రదాయబద్దంగా కార్యక్రమాలు నిర్వహించారు .
గణేశశర్మ 1998లో జన్మించారు. కర్ణాటకకు చెందిన చందుకుట్టు హోసమనే రత్నాకర భట్ శర్మ ఆధ్వర్యంలో వేదవిద్య అభ్యసించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితుడు పల్లమూడి సత్య వెంకట రమణమూర్తి వద్ద శబ్ద మంజరి, ధాతు రూపావళి, సమాస కుసుమావళి, ఇతర సంస్కృత గ్రంథాల్లో తదుపరి అధ్యయనాలు అభ్యసించారు. రుగ్వేద పండితుడు, సంస్కృత ఉపాధ్యాయుడు కమ్మపల్లి సతీషాచార్యుల వద్ద వేద వివరణ, సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నారు. సంప్రదాయ వేదశిక్షణతో పాటు గణేశశర్మ అన్నవరంలోనే పదోతరగతి వరకు పూర్తి చేసి అధికారిక విద్యను కూడా అభ్యసించారు.
యాదృచ్చికంగా . .. : 2009 మేలో గణేశశర్మ తిరుపతిలో బంధువుల ఇంటికి వెళ్లారు. కంచి కామకోటి పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఆచార్యులు ఆశీర్వదించి రుగ్వేద పండితుడు, ద్వారకా తిరుమలలో సేవ చేస్తున్న రత్నాకరభట్ శర్మ వద్ద వేదవిద్యలో చేర్పించమని సలహా ఇచ్చారు. గణేశశర్మ అక్కడ చేరారు. 12 ఏళ్లు రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణం, ఉపనిషత్తులు నేర్చుకున్నారు. ఆ తర్వాత మంత్ర ఉచ్ఛరణలో ప్రావీణ్యం పొందారు. అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో రత్నాకరభట్ కుమారుడు శ్రీనివాసశర్మ మార్గదర్శకత్వంలో వేద గ్రంథాల్లో ఉన్నత శిక్షణ పొందారు. తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేదపాఠశాలలోనూ సేవలు అందించారు. కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు.
జగద్గురు ఆది శంకరాచార్యులు ప్రబోధించిన అద్వైత మతానికి కాలక్రమంలో ఏర్పడిన కేంద్రపీఠాల్లో తమిళనాడులోని కంచి కామకోటి పీఠం ఒకటి!
మొక్కుబడులు, కృతజ్ఞతలు చెల్లించుకునే జంతు బలులు, రక్తతర్పణాల నుండి మానవ సమాజాలను సాత్విక, ఆధ్యాత్మిక దృక్పధాల్లోకి నడిపిన తాత్వికుడు, మత సంస్కర్త ఆది శంకరాచార్యులు. అస్పృశ్యత కూడదన్న ఆచరణవాది. 2500 ఏళ్ళ క్రితం భారతీయ సామాజిక, మతపరమైన స్ధితిగతులకు ఊహించగలిగితే శంకరాచార్య మత విప్లవవేత్త అని బోధపడుతుంది.
గుంపులు, సమూహాల పూజావిధానాన్ని వైదికమతాన్ని, దేవాలయాల వైపు, దేవతారాధన వైపు తిప్పడం ద్వారా ఆయన సఫల మయ్యారు. దేశ స్థితిగతుల దృష్ట్యా మధ్యేమార్గంగా ఆయన పంచాయతన పూజ రూపంలో బహు దేవతా సంఖ్యను షణ్మతానికి పరిమితం చేశారు.
షణ్మతాలు అంటే ఆరు ప్రధాన హైందవ సంప్రదాయాలు, ఇవి వివిధ దేవతల ఆరాధనను కేంద్రీకరించి ఉంటాయి. ఇవి:
1. శైవం – శివుడిని ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.
2. వైష్ణవం – విష్ణువు లేదా అతని అవతారాలను (రామ, కృష్ణ) ఆరాధించే సంప్రదాయం.
3. శాక్తం – దేవి (శక్తి)ని ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.
4. గాణపత్యం – గణపతిని (వినాయకుడు) ప్రధాన దేవతగా ఆరాధించే సంప్రదాయం.
ఆది శంకరాచార్యులు ఈ ఆరు సంప్రదాయాలను సమన్వయం చేసి, హైందవ ధర్మంలో ఏకత్వాన్ని స్థాపించేందుకు కృషి చేశారు. ఈ షణ్మతాలు ఒక్కొక్కటి విభిన్న దేవతలను ఆరాధించినప్పటికీ, అన్నీ ఒకే బ్రహ్మతత్త్వాన్ని సూచిస్తాయని శంకరులు బోధించారు. ఇది అద్వైత వేదాంత సిద్ధాంతంతో సమన్వయం చేయబడింది.
ఈ విధంగా, షణ్మత స్థాపన హైందవ ధర్మంలో వైవిధ్యాన్ని గౌరవిస్తూనే ఏకత్వాన్ని ప్రోత్సహించింది.
అద్వైత తత్వం: ఈ లోకమంతా విడివిడిగా కనిపించినా, నిజానికి అన్నీ ఒక్కటే అని చెప్పే తత్వమే అద్వైతం. మనం చూస్తున్న ఈ జగత్తు తాత్కాలికం, మాయ వల్ల కలిగిన భ్రమ మాత్రమే. అసలు నిజం — బ్రహ్మం మాత్రమే, అది ఎప్పటికీ మారదని, శుద్ధమైన చైతన్యంగా ఉంటుందని శంకరాచార్యులు వివరించారు. మనం అనుకునే “నేను” కూడా బ్రహ్మంతోనే సమానం — జీవాత్మ అంటే పరమాత్మే. ఈ సత్యాన్ని మనం జ్ఞానంతో తెలుసుకున్నప్పుడు, అజ్ఞానం తొలగిపోతుంది; మనం భయాలను, బంధాలను దాటి నిజమైన స్వేచ్ఛను పొందుతాం — అదే మోక్షం.
అనేక సాంఘిక పరిణామాల నుంచి ప్రపంచమంతా వేర్వేరు ప్రదేశాల్లో సాంస్కృతిక పునర్జీవనం సంభవించిన కాలంలో ఆదిశంకరాచార్యులు (క్రీస్తుపూర్వం) అద్వైత తత్వాన్ని ప్రభోదించారు. ఆయన స్థాపించిన కాంచీపురం (కంచి) పీఠంనుంచి హిందూ దేశమంతటా అద్వైత తత్వం విస్తరించింది. ఆదిశంకరాచార్యులను “నడిచే శివుడు” అని హిందువులు విశ్వసిస్తారు.
కంచిపీఠం ఆధిపత్యం ఒక పరంపరగా సాగుతుంది. వేదాలను వైదిక శాస్త్రాలను అపపోసిన వారిని అనేక వడపోతల ద్వారా, పీఠాధిపతి నిర్ణయానుసారం ఉత్తరాధికారిగా ఎంపిక చేస్తారు. పీఠాధిపతి మహానిర్యాణానంతరం ఉత్తరాధికారి కంచి స్వామి (పీఠాధిపతి) అవుతారు. ఇది పరంపరగా సాగుతోంది.
ఇపుడు పీఠాధిపతిగా వున్న శంకర విజయేంద్ర సరస్వతి ఈ పరంపరలో 70 వ స్వామి.
68 వ స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి (ఇదే పేరుతో అప్పటికి ఏడుగురు కంచిపీఠం అధిపతులుగా వున్నారు) సుదీర్ఘకాలం 1907 నుంచి 94 వరకూ కంచి పీఠాధీశులుగా వున్నారు.
వారిహయాంలో చాలా సంస్కరణలు జరిగాయి. హిందువుల్లో అద్వైతం బ్రాహ్మణులను దాటి బయటకు రావడంలేదన్న అభిప్రాయం బలపడుతున్న సమయంలో ఆయన కంచి పీఠంలోకి అన్ని కులాలవారూ వచ్చేలా చేసి అద్వైతాన్ని సమాజంలో విస్తరింపచేశారు. జ్ఞాన సాధనే మోక్షమార్గమని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా మానవ సమాజాల్లో హేతుబద్ధతను పెంపొందించారు.
చంద్రశేఖరేంద్ర సరస్వతి అనంతరం కంచి పీఠం బాద్యతలు చేపట్టిన 69 వ స్వామి జయేంద్ర సరస్వతి 1994 నుంచి 2018 మధ్యలో వైద్య వసతుల ద్వారా, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించడం ద్వారా హిందూ మతాన్ని సమాజంలో లోతుగా విస్తరింపచేశారు. అయితే జయేంద్ర సరస్వతి పీఠంలో ఒక అధికారి హత్యకేసులో అరెస్టవ్వడం పెద్ద సంచలనమైంది. హేతువాదాన్ని భుజానవేసుకున్న ఎఐడిఎంకే అధినేత్రి ఎన్నికలకు ముందు ఓట్లకోసం పీఠంలో జరిగిన హత్యను అడ్డుపెట్టుకుని జయేంద్రసరస్వతిని కేసులో ఇరికించారని ప్రజలు నమ్మారు. స్వామి పై ఆరోపణలు రుజువు కాకపోవడం వల్ల జయేంద్ర సరస్వతి నిర్దోషిగా జైలునుంచి బయటపడ్డారు. అయినా శంకరుడి రూపమైన స్వామి హత్యకళంకాన్ని మోయక తప్పలేదు. వారితర్వాత 70 వస్వామిగా (అప్పటి ఉత్తరాధికారి) శంకర విజయేంద్ర సరస్వతి 2018 నుంచి పీఠాధీశులుగా వున్నారు.
గణేశ శర్మ ద్రవిడ్ ఒక ఆధ్యాత్మిక కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి దన్వంతరి అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన పూజారి. పూర్వీకులూ ప్రముఖ వేద పండితులే.
వారు 2006లో వేద విద్య ప్రారంభించి ఋగ్వేదంతో పాటు యజుర్వేదం, సామవేదం, దశోపనిషత్తులపై లోతైన అధ్యయనం చేశారు. శ్రీ కాంచి పీఠం శంకరాచార్యుల ఆశీస్సులతో విద్యాభ్యాసం కొనసాగించారు.
ఈ ఉత్తరాధికార అభిషేకం, జగద్గురు ఆది శంకరాచార్యుల 2,534వ జయంతి సందర్భంలో జరగడం విశిష్టతను సంతరిస్తోంది .
కార్యకర్తలకే బిజెపిలో పెద్దపీట – ఇది ఎపిలో వ్యూహం – నాలుగు దశాబ్దాల నిబద్దత కలిగిన కార్యకర్తకు రాజ్యసభ
పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతో, అత్యంత విధేయతతో సుదీర్ఘ కాలం పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలకు బీజేపీ పెద్ద పీట వేస్తోంది. రాజకీయంగా ఉనికి కోసం యత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఇది మరీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది .
నమ్మకంతో కట్టుబడి పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఊహించలేనంత పెద్ద అవకాశాలు ఇవ్వగలమన్న సంకేతాలను బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది కాలంలోనే కల్పించింది .
పక్కజిల్లాలో సొంత పార్టీ కార్యకర్తలకు కూడా కు తెలియని బి. శ్రీనివాసవర్మకు నరసాపురం నుంచి లోక్ సభ టికెట్ ఇచ్చారు. జగన్ వ్యతిరేకప్రభంజనంలో వర్మగెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు.
రాజ్యసభకు రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు విజయసాయిరెడ్డి స్ధానంలో పి వెంకట
సత్యనారాయణను ఎంపిక చేసినట్టు బిజెపి ప్రకటించింది. కూటమి బలం కారణంగా ఆయన ఎన్నిక ఎన్నిక కేవలం లాంఛనమే!
శ్రీనివాస్ వర్మ పశ్చిమగోదావరి జిల్లా స్థాయి లో పార్టీపరంగా అనేక బాధ్యతలు నిర్వహించారు. సత్యనారాయణ బిజెపి క్రమశిక్షణ సంఘం రాష్ట్ర కమిటీ చైర్మన్ గా వున్నారు. ఇద్దరిదీ భీమవరమే! ఇద్దరూ స్వయం సేవకులే! ఇద్దరూ పటాటోపాలకు దూరంగా వుండే కార్యకర్తలుగా గుర్తింపు పొందినవారే కావడం గమనార్హం. బిజెపి బలంలేని ఆంధ్రప్రదేశ్ లో పెద్దపెద్ద పదవులు వున్నవారి ప్రభావం కూడా సహజంగా తక్కువగానే వుంటుంది.
అయితే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి చిన్నగా విస్తరిస్తోంది. బిజెపికి పార్లమెంటులో ఆధిక్యత వున్నపుడు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు మొదలైన అనేక అంశాల్లో దగా చేసినందుకు ప్రజలు ఆపార్టీ ప్రజలు ఆగ్రహంగా వున్నారు. 2024 ఎన్నికల్లో మెజారిటీలేక తెలుగుదేశం మీద ఆధారపడి కేంద్రంలో (రాష్ట్రంలో కూడా) కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక “పట్టి విడిచినట్టు” రాష్ట్రం కోర్కెలను కేంద్రం చిన్నగా తీరుస్తోంది. ఇందువల్ల ప్రజల ఆగ్రహం తగ్గింది. ఒకప్పుడు పార్టీ జెండా మోయడానికి కార్యకర్తలు లేని ఎపిలో బిజెపి సభ్యత్వాల సఖ్యపెరుగుతోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1 లక్షా 50 వేలమంది కంటే ఎక్కువ మందే బిజెపిలో సభ్యులుగా వున్నారు. పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి ఏ నియోజక వర్గంలోనైనా పాతిక ముప్పై మంది క్రియాశీలక సభ్యులే పార్టీకి వున్నారు.
కొద్దినెలల క్రితం బిజిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కి కూడా అనూహ్యంగానే ఎమ్మెల్సీ పదవి దక్కింది. బిజెపి, తెలుగుదేశం మధ్య పొత్తు వున్న కాలంలోనే వీర్రాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు కి వ్యతిరేకంగా విమర్శలు చేసి రెండుపార్టీల మద్య వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. అలాంటి వీర్రాజు మళ్ళీ ఎమ్మెల్సీ కావడం అనూహ్యమే! టీడీపీని కాదని వీర్రాజు ఆర్ఎస్ఎస్ పెద్దల ద్వారా ఎమ్మెల్సే కొట్టగలిగారు . అదీ బీజేపీలో జరిగే రాజకీయం . చంద్రబాబు విధిలేక ఒప్పుకోవడం లేదా హుందాగా అంగీకరించడంలో బిజెపి మేనేజిమెంటు చాతుర్యం కూడా వుంది.
తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిలో పార్టీ బలం పెంచుకోడానికి సొంత ఎత్తుగడలు వున్నాయి. తెలుగుదేశంపార్టీ తన ఎమ్మెల్యేలు లేనిచోట ఇంచార్జ్ లను నియమించి వారి ద్వారా రోజువారీ పాలనలో కూడా జోక్యం చేసుకుంటోంది. జనసేనకు పవన్ కళ్యాణ్ నాయకత్వం తప్ప సంస్ధాగత నిర్మాణం దాదాపు లేదనే చెప్పొచ్చు. అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ అధికార కేంద్రాలు బలపడుతున్నాయి. తెలుగుదేశం ఇన్ చార్జ్ వ్యవస్థకు జనసేన అధికార కేంద్రాలకు మధ్య స్పర్ధలు వున్నాయి. అవి రోడ్డున పడే పరిస్ధితి ఇప్పట్లో వుండకపోవచ్చు .
పార్టీ కమిట్ మెంట్ ఉంటే పదవి అదే వస్తుంది
పార్టీకి కట్టుబడిన వారికే పదవులు అనే బిజెపి ఎత్తుగడ, లాయలిస్టుల్లో నిరాసక్తత ను తొలగించి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అది ఆ పార్టీ విధానం… దానిని తప్పుపట్టడం పెద్దతప్పే అవుతుంది. ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెడుతోంది. “ఎంతపని చేసినా ఇంతే! లాయల్టీకి గుర్తింపు గౌరవం లేవు. బాబు మారడు. అధికారంలో లేనపుడు కార్యకర్తలే ప్రాణ సమానం అంటాడు. అధికారంలోకి వచ్చాక అదంతా మరచిపోతాడు……” ఇలాంటి కామెంట్లు తెలుగుదేశంలో తరచూ వినిపిస్తుంటాయి.
ఏరాజకీయ పార్టీ అయినా బలంపెంచుకోవలసిందే! అయితే ప్రజల్లోకి వెళ్ళడానికంటే కంటే కేంద్రం లో వున్న అధికారాన్ని ఇందుకు ఉపయోగించడం ఒక నైతిక ప్రశ్న! బిజెపికి ఇలాంటి నైతికమీమాంసలేమీ వుండవు అని రకరకాల పరిణామాల ద్వారా దేశప్రజలందరికీ తెలుసు!
బీజేపీ మింగేస్తుంది
బిజెపికి అవకాశం వచ్చినపుడు, ఇతరపార్టీలు ఆదమరచి వున్నపుడు బిజెపి ఆన్ని విధాలా ఆక్రమించేస్తుందని జనసేన కు తెలుస్తుందోలేదో కానీ , , తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ మర్మం ఖచ్చితంగా తెలుసు. అయినా కొన్ని పదవులు , కొన్ని పనులు వ్యవహారంలో వైసీపీకి సపోర్టుగా ఉండే బీజేపీ నేతలకు సైతం పెద్ద పీట వేయాల్సి రావడం టీడీపీ కి గత్యంతరంలేని పరిస్థితిగా కనిపిస్తోంది . అమరావతి , పోలవరం వంటి వాటిని నెరవేర్చాలంటే బీజేపీ పెద్దల అండదండలు కావాల్సిందే . అందుకోసం కొన్నింటిలో కాంప్రమైజ్ కాక తప్పడంలేదు .
తెలుగు రాష్ట్రాలలో అత్యున్నతమైన మెడికల్ కాలేజ్ రంగరాయ ప్రిన్సిపాల్ గా డాక్టర్ అత్తలూరి విష్ణ వర్ధన్ నియమితులయ్యారు . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధ0గా ఉన్న మెడికల్ కాలేజీలో అనస్తీసియా విభాగం HOD గా విధులు నిర్వహిస్తున్న విష్ణు రెండేళ్లుగా ఇదే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు . డాక్టర్ విష్ణు వర్ధన్ కు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ గుర్తింపుతోపాటు , పేషేంట్స్ పట్ల సేవాభావం చూపుతారని మంచి పేరుంది . 1997లో కాకినాడ జీజీహెచ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన విష్ణు తర్వాత 2006లో అసోసియేట్ ప్రొఫెస్సర్ గా పదోన్నటి పొందారు . 2015 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు . 2018 లో విష్ణు సేవలకు గాను , ప్రభుత్వం నుంచి ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్నారు .
నాసిరకం మద్యం స్కామ్ లో బాద్యులపై హత్యానేరం కింద క్రిమినల్ కేసులు సిద్ధం చేస్తున్నారా?
2019లో అధికారం చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధనదాహానికి ఆంధ్రప్రదేశ్ లో వందలమంది మందుబాబులు బలయ్యారు . వేలమంది అనారోగ్యంపాలై , రోగాలతో కునారిల్లడానికి నాసిరకం , కల్తీ మద్యం కారణమని చెప్పవచ్చు .
అప్పట్లో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి సర్కార్ ‘సిట్ ‘ వేసింది . ఈ కేసులో ఇప్పటివరకు పదిమంది వరకు అరెస్టయ్యారు . కీలక సూత్రధారులైన రాజ్ కసిరెడ్డి , సజ్జల రెడ్డి వంటి వారు అరెస్టయ్యారు . మరికొందరు అరెస్టవ్వడానికి సిద్ధంగా ఉన్నారు . ఇంతవరకు ఓకె . అయితే ఈ కేసును కేవలం ఆర్ధిక దోపిడీ వరకు చూసి వదిలేయడానికి లేదు . జగన్ సర్కార్ చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరి తరపున మద్యం కుంభకోణంలో సూత్రదారులు , పాత్రదారులపై హత్య నేరం కింద కేసులు పెట్టాలన్న డిమాండ్ రోజురోజుకీ ఎక్కువవుతోంది .
హత్య నేరం కేసులు
సీఎంగా అధికార పీఠం ఎక్కిన వెంటనే జగన్మోహన్రెడ్డి మద్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని సమూలంగా మార్చి తనకు, తన వారికి పాడి ఆవుగా చేసుకున్నారు. అప్పటి వరకు ఉన్న పాపులర్ బ్రాండ్లను పక్కనబెట్టి, కమీషన్లు ముట్టజెప్పిన కంపెనీల మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేసే విధానాన్ని తీసుకువచ్చారు. ఊరూ పేరూ లేని కంపెనీలను సృష్టించి, వాటి ద్వారా నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించి ప్రభుత్వం తరపున కొనుగోలు చేశారు. ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోగా, మరెందరో రోగాలు పాలయ్యారు. కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులో వేసుకోవడంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ కారణంగా దీన్నొక ఆర్థిక నేరంగానే కాకుండా ప్రజల చావుకు కారకులుగా గుర్తించి కేసు కట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి.
ఇసుకలో తిన్నారు . . లిక్కర్ లోనూ బొక్కేయలా ?
ఇసుక, మద్యంను సొంత ఆదాయ వనరులుగా మార్చుకోవడంలో జగన్ అండ్ కో ఆరితేరారు . అంతకు ముందు 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకలో మాత్రం బాగానే దండుకున్నారు . దీనిని గమనించిన జగన్ ఇసుక అక్రమాలలో మరో అడుగు ముందుకేసి వేల కోట్ల సమకూర్చుకోగలిగారన్న ఆరోపణలు ఉన్నాయి . ఇసుక వంటి వాటిలో దోపిడీని ప్రజలు సైతం పెద్దగా పట్టించుకోరు . అవసరమైన వాళ్ళు మాత్రం డబ్బు ఎక్కువ పెట్టాల్సిన వస్తుందని ఆ కాసేపు తిట్టుకుని వదిలేస్తారు . మద్యం విషయం అలా కాదు . . నాసిరకం మద్యం సరఫరా ద్వారా బోలెడంత డబ్బుతో పాటు . . అంతకు అనేకరెట్లు పాపం కూడా మూటకట్టుకున్న జగన్ అండ్ కో మాత్రం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే . చంద్రబాబు సర్కార్ వదిలిపెట్టిన పైవాడు మాత్రం వదిలిపెడతాడా ? అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయ్ .
లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన వారితో పాటు విచారణకు హాజరైన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం… ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అమానవీయంగా వ్యవహరించారు. తమ ధనదాహం పేదల ఉసురు తీస్తుందన్న విషయాన్ని విస్మరించిన అధికారులు , అత్యున్నత పదవులు నిర్వహించిన వారు నాసిరకం మద్యంతో మరణించిన , అనారోగ్యంపాలైన కుటుంబాల ఆర్తనాదాలు తగలకుండా ఉంటాయా ? కర్మ ఫలం అనుభవించక తప్పదని మరువకండి .
జమ్మూ కాశ్మీర్ సమీపంలో పహల్గాంలో జరిగిన మారణహోమం తరువాత భారతదేశానికి ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతోంది. పాకిస్థాన్ ఏకాకి అయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ పై క్రమంగా ఒత్తడి పెరుగుతోంది. దీనితో ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నోరు మెదిపారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
“జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల ఓ విషాదకర ఘటన జరిగింది. దీంతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతికే మేము ప్రాధాన్యత ఇస్తాం” అని షరీఫ్ పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.
చర్చల ద్వారానే పరిష్కారం! ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పరోక్షంగా స్పందించారు. “మా దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో ఎన్నటికీ రాజీపడం. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘ఇండియా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఇలాంటి చర్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మేము చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలువురు పాక్ మంత్రులు భారత్పై తమ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను బలితీసుకుని నరమేధం సృష్టించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న పాకిస్థాన్కు భారత్ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు ఆంక్షలు విధించింది. పాక్ పౌరులు తక్షణమే భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని లోలోపల భయంగానే ఉన్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు .
ఏప్రిల్ 25 శుక్రవారం, హైదరాబాద్లోని ‘’హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’’ (HICC) భారత్ సమ్మిట్ 2025లో భాగంగా డైనమిక్ యువత-కేంద్రీకృత రాజకీయ చర్చకు ఆతిథ్యం ఇచ్చింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రగతిశీల పార్టీల సంఘంగా ప్రచారం చేయబడిన కార్యక్రమం. .. భారతదేశం, న్యూజిలాండ్ మరియు మలేషియా నుండి వచ్చిన ప్యానెలిస్టులు వ్యక్తిగత కథలను పంచుకున్నారు, సమ్మిళిత సంస్కరణలు, విద్యార్థుల ఎన్నికలు మరియు వాతావరణ చర్యల అవసరాన్ని హైలైట్ చేశారు. వారు ముందస్తు రాజకీయ భాగస్వామ్యం, పౌర బాధ్యత మరియు ఓటింగ్ వయస్సు తగ్గింపును నొక్కి చెప్పారు.
న్యూజిలాండ్లోని అతి చిన్న పార్లమెంటేరియన్లు మెరీనా హే మరియు అరీనా విలియమ్స్ నుండి మలేషియా తమిళ ప్రతినిధి లినేష్ సెల్యుండన్ మరియు పొన్నం ప్రభాకర్, బల్మూరి వెంకట్ మరియు వరుణ్ చౌదరి వంటి భారతీయ నాయకుల వరకు, ప్యానెల్ బలవంతపు వ్యక్తిగత ప్రయాణాలు మరియు పాలన యొక్క భవిష్యత్తు కోసం ధైర్యమైన ఆలోచనలను పంచుకుంది.
విద్యార్థి రాజకీయాలు, సమ్మిళిత సంస్కరణలు, వాతావరణ న్యాయం, రాజకీయ స్థలాల ప్రజాస్వామ్యీకరణ వంటి అంశాలను నొక్కి చెబుతూ, యువతరం పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించాలని ఈ సెషన్ పిలుపునిచ్చింది.
ఈ భావనను ప్రతిధ్వనిస్తూ, ప్రపంచం మారడాన్ని చూడాలనుకుంటే యువత తిరుగుబాటు చేయాలి, అధికారాన్ని ప్రశ్నించాలి మరియు కొత్త ఆలోచనలను తీసుకురావాలి అని అరీనా విలియమ్స్ నొక్కిచెప్పారు.
“రేపటి యువత మరియు రాజకీయాలు” అనే శీర్షికతో జరిగిన ఈ ప్రసంగానికి యూత్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ అల్లవారు మోడరేటర్గా వ్యవహరించారు మరియు వారు ఇలా అన్నారు: కార్యక్రమంలో వీరు పాల్గొని స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు .
ఈ సందేశానికి బలం చేకూరుస్తూ, బల్మూరి వెంకట్ నాయకత్వానికి తనదైన మార్గాన్ని పంచుకున్నారు. “నేను రాజకీయ కుటుంబం నుండి రాలేదు. విద్యార్థిగా, నేను NSUIలో చేరి నన్ను నేను నిరూపించుకున్నాను. అది నన్ను దేశంలోనే అతి పిన్న వయస్కుడైన MLCగా మార్చడానికి దారితీసింది” అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థి ఎన్నికలను తిరిగి ప్రవేశపెట్టాలని వెంకట్ గట్టిగా వాదించారు, కొత్త రాజకీయ ప్రతిభను పెంపొందించడానికి ఇది చాలా అవసరమని అన్నారు. “కొత్త రక్తం అలా వస్తుంది. కొత్త నాయకులు అలా పుడతారు.”
అరీనా విలియమ్స్, MP, న్యూజిలాండ్
వరుణ్ చౌదరి, NSUI అధ్యక్షుడు
మెరీనా హే, MP, న్యూజిలాండ్
లీనేష్ సెల్లువాండన్, వైస్ చైర్మన్, DAPSY, మలేషియా
పొన్నం ప్రభాకర్, రవాణా మంత్రి, తెలంగాణ
బల్మూరి వెంకట్, MLC, తెలంగాణ
వంశీ కృష్ణ గడ్డం, MP, పెద్దపల్లి, తెలంగాణ
యువతరం గొంతుల అవసరం
యువత రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్యానెల్లోని సభ్యులందరూ తమ రాజకీయ ప్రయాణాలను ముందుగానే ప్రారంభించారు మరియు ఇప్పుడు తదుపరి తరం కూడా అదే చేయాలని కోరుతున్నారు.యువతపై దృష్టి సారించిన రాజకీయ ప్యానెల్ అంతటా ఒక శక్తివంతమైన సందేశం ప్రతిధ్వనించింది –
“రాజకీయాలకు అనేక ప్రతికూల అర్థాలు జతచేయబడ్డాయి. అయితే, ఇది చాలా సానుకూల పనులు చేయడానికి ఒక మార్గం” అని పెద్దపల్లి ఎంపీ వంశీ గడ్డం అన్నారు. యువత నడిచే మార్పు యొక్క సామర్థ్యాన్ని ఆయన నొక్కిచెప్పినప్పటికీ, సోషల్ మీడియా దుర్వినియోగానికి వ్యతిరేకంగా కూడా ఆయన హెచ్చరించారు, దీనిని పెరుగుతున్న ముప్పుగా అభివర్ణించారు. “రాజకీయాలకు యువ గొంతులు అవసరం” అని లీనేష్ సెల్లువాండన్ పునరుద్ఘాటించారు.
ప్రత్యామ్నాయంగా ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
స్వీట్ల0టే చచ్చేంత ఇష్టమా? మీరు ప్రత్యేకంగా స్వీట్స్ తినకుండానే రోజూ మీ శరీరానికి అవసరమైనదానికంటే ఎక్కువే షుగర్ తింటున్నారు. ఔను మీరు విన్నది నిజమే… కూల్ డ్రింకులు, కాఫీ, టీ లు, జ్యుస్ లు, బ్రెడ్, కేకులు వంటి వాటిని రెగ్యులర్ గా తినడం ద్వారా అనేక కేలరీలు చక్కెర అదనంగా మీ ఒంట్లో చేరుతోంది.. గమనించండి..
తియ్యదనం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ రోజులో ఏదో రకంగా తీపిని తమ బాడీలోకి పంపిస్తూనే ఉంటారు. అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా సరే.. తీపి పదార్థం అనగానే ఎక్కువమందికి నోరూరడం సహజం. అయితే, దీని వల్ల బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువై . . అనేక ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుంది .
రోజులో ఎంత చక్కెర తీసుకోవాలి? ఎంత పరిమాణంలో తీసుకోవాలి? అనేది పరిశీలిద్దాం… అధికంగా చక్కెర తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, రోజుకు ఎంత పరిమితి మోతాదులో చక్కర తీసుకోవాలి? అంతకంటే ఎక్కువ తీసుకుంటే డేంజరేనా? చక్కెర శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది కానీ, అది అధికమైతే ఒబెసిటీ, డయాబెటిస్, కేన్సర్ , గుండె జబ్బులతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
అనారోగ్య సమస్యలెన్నో!
ఒక మనిషి సగటున రోజుకు 25-32 గ్రాముల చక్కెర తీసుకోవచ్చన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు. కానీ, ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న భారతీయలు వినియోగంలో మాత్రం ముందున్నారు. బిస్కెట్లు, కూల్డ్రింకులు, చాక్లెట్లు, స్వీట్లు, కేక్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. శరీరానికి పెద్దగా అవసరం లేకున్నా అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, ఒబేసిటీ బారిన పడుతున్నారు.
‘’షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందుగా బరువు పెరుగుతాం. ఇది గుండెపోటుకు దారి తీస్తుండి. దీనిపై చాలామంది అశ్రద్దగా, నిర్లక్షయంగా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు… ‘’ అని డాక్టర్ ఆదిత్య చౌతి చెబుతారు. ఆదిత్య బెంగళూరులోని ఇంటర్నల్ మెడిసిన్ ఫోర్టిస్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. షుగర్ ఫుడ్స్ తినడం వల్ల దంత సమస్యలు, క్యావిటీస్ వంటివి కూడా పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలో మంట పెరగడానికి షుగర్ కారణమవుతుంది. అందుకే చక్కెరతో నిండిన ఆహారానికి బదులు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ శక్తితో పాటు ఆరోగ్యం బావుంటుందని ఈ డాక్టర్ గారు సూచిస్తున్నారు. .
రోజువారీ జీవనశైలి, ఆహార మార్పుల కారణంగా మన దేశంలో సగటున 11-12 శాతం మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నట్లు “ఐసీఎంఆర్-ఇండియా” అధ్యయనం వెల్లడించింది. పట్టణాల్లో 16శాతం, పల్లెల్లో 9శాతం మంది మధుమేహం బారిన పడుతున్నారని గణాంకాలు ప్రకటించింది. ఫలితంగా పక్షవాతం, గుండెజబ్బులు, పెరలాసిస్, కేన్సర్ , అధిక రక్తపోటు జబ్బులెన్నో తరుముకొస్తున్నాయని చక్కెర వెనుకున్న చేదు నిజాలను వెల్లడింది.
15 ఏళ్ల లోపు పిల్లలు రోజుకి 30 గ్రాముల లోపు చక్కర తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ ఏజ్ గ్రూప్ చిన్నారులలో ఎక్కువమంది రోజుకి సరాసరి.. 50-75 గ్రాముల షుగర్ తినేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
తాజా పండ్లు మేలు . . చక్కరెకు ఆల్టర్ నేటివ్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ మేలని చెపుతున్నారు . మోతాదులో షుగర్ న్ని ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన మొత్తంలో నియంత్రణ ముఖ్యమని సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు తగ్గించాలని, రోజూ సమతుల్య ఆహారంతో పాటు పోషకాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా అరటి , బొప్పాయి , దానిమ్మ , జామ , సీతాఫలం , రామాఫలం , లక్షణ ఫలం , వంటి దేశీయ పండ్లు మేలని ఇటీవల అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి .
అరెస్టులతో తెలుగు తమ్ముళ్లను సంతృప్తి పరచవచ్చని లోకేష్ భావిస్తున్నారా ?
వైసీపీ హయాంలో భారీ దోపిడీ, అరాచకాలకు పాల్పడిన వారి అరెస్టులకు ముహూర్తం పెట్టారా ?
అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా.. గత ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడి , అక్రమాలకు ఒడిగట్టిన బడాబాబులపై చర్యలు జాప్యం కావడంతో ఇన్నాళ్లు టీడీపీ, జనసేన కేడర్ లో అసంతృప్తి చెలరేగింది. అడపా , దడపా చిన్న చిన్న అరెస్టులు చేసి తూతుమంత్రంగా చేతులు దులుపుకుంటున్నారన్న అక్కసుతో ఉన్న కేడర్ … వారం రోజులుగా జరుగుతున్న అరెస్టులతో సంతృప్తి చెందుతుందా? అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్న సోషల్ మీడియా సైన్యం ఆక్రోశం ఈ అరెస్టులతో కాస్త చల్లారుతుందా >
వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కొంత మందికి కంటిమీద కునుకు కరువైంది . అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోంది . జగన్ అండ్ కో అండ చూసుకుని చెలరేగిపోయిన అరాచకవాదులు , అక్రమార్కులకు సెగ పుడుతోంది .
వరుసగా అరెస్టులు -చర్యలు
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అక్రమాలు , అరాచకాలు రాజ్యమేలాయి . పలు అధరాలు దొరికినా మొదట్లో కూటమి సర్కార్ , ముక్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నాన్చుడు ధోరణితో వ్యవహరించారు . ఈ మెతక వైఖరితో ప్రధానంగా టీడీపీ కేడర్ , సొంత పార్టీకి వాలంటీర్ గా పనిచేస్తున్న సోషల్ మీడియా ఏకంగా చంద్రబాబుపైనే తిరుగుబాటు ప్రకటించింది . దీంతో గత్యంతరం లేక అరాచకుల అరెస్టులు మొదలుపెట్టారన్న ప్రచారం సాగుతోంది .
ఐదు సంవత్సరాల పాటు జరిగిన రాజ్యాంగ వ్యతిరేక, నేరస్తుల పాలనపై వ్యతిరేకతతో ప్రజలు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేశారు. తమను చిత్ర హింసలు పెట్టిన వారి సంగతి తేల్చాలని కూటమి పార్టీలు టీడీపీ , జనసేన కేడర్ తో పాటు ప్రజలు కూడా కోరుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నింపాదిగా వ్యవహరిస్తూ వస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. అయితే ప్రభుత్వం ఓ ప్రణాళికతో ఉందని స్పష్టమయింది. మాజీ మంత్రి విడదల రజని మరిది గోపీనాధ్ అరెస్టు దగ్గర నుంచి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ పై చార్జెస్ వరకూ అన్నీ ప్రణాళికాబద్దంగా, క్రమబద్ధంగా.. చట్టబద్దంగా జరిగిపోతున్నాయి. కింగ్ పిన్ ను పూర్తి స్థాయిలో బుక్ చేసే వరకూ ఇవి సాగిపోతాయి.
పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుతో టెన్షన్: జగన్ సీఎంగా ఉన్నపుడు ఇంటెలెన్గ్స్ డీజీ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆంజనేయులు అరెస్టుతో వైసీపీ అరాచకవాదులతోపాటు , అప్పట్లో ఆ ఆపార్టీకి తొత్తులుగా వ్యవహరించి , అక్రమాలలో భాగస్వాములైన ఉన్నతాధికారుల వెన్నులో వణుకుపుడుతోంది .
ముంబై నటి జత్వానిని అక్రమంగా అరెస్ట్ చేసి , వేధింపులకు గురిచేసి , చివరికి వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను కూడా ముంబై నుంచి చట్ట విరుధ్దగా తీసుకువచ్చి నిర్బంధించిన కేసులో ఆంజనేయులు అరెస్ట్ కావడం గమనార్హం . ఈ కేసులో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీ , కాంతి రానా టాటా లు అరెస్ట్ కాకుండా తాత్కాలికంగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు .
మద్యం కుంభకోణం కేసులో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి , , అలియాస్ రాజ్ కసిరెడ్డి ని సిఐడి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు . విచారణల్లో ఇప్పటికే అతను కీలక విషయాలు వెల్లడించినట్లు చెపుతున్నారు . ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డి , సజ్జల రామకృష్ణారెడ్డి , మిదున్ రెడ్డి , మాజీ సీఎం జగమ్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైసీపీ వర్గాలే బాహాటంగా వెల్లడిచేస్తున్నాయ్ .
పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ అరెస్టు
మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లను దహనం చేసిన ఘటనలో మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. కానీ పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేయించి మరీ అరెస్టు చేశారు. ఇలా చేస్తారని ఏ మాత్రం ఊహించలేకపోయాడు మాధవరెడ్డి. ఈయన పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు. ఈ ఫైళ్ల కాల్చివేతలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వచ్చాయి . అయితే డైరెక్ట్ గా పెద్దిరెడ్డిని ఈ కేసులో అరెస్టు చేయడానికి బలమైన అధరాలు దొరకలేదు . అయితే మాధవరెడ్డి వాంగ్మూలం ఆధారంగా మరికొంత మందిని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
అరెస్ట్ చేసి జైలుకెస్తే , ,, కొన్నాళ్ళకి బెయిల్ వస్తుంది . బయటకు వచ్చి సదరు నేతలు , అధికారులే తొడకొట్టి కూటమి సర్కార్ నేతలతో ఆటలాడుకునే పరిస్థితి తలెత్తుతుంది . దీనిని దృష్టిలో పెట్టుకుని , చట్ట ప్రకారం బలమైన అధరాలు సేకరించిన తర్వాతే అరెస్టులు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు చెపుతున్నారు .
మాజీ మంత్రి కొడాలి నాని , మాజీ ఎమ్మెల్యే, జగన్ ముఖ్య అనుచరుడు, బియ్యం స్మగింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి , అటవీ భూములను నకిలీ రికార్డులతో కానేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . .. ఇలా పలువురు కీలక నేతల అరెస్టులపై టీడీపీ , జనసేన కేడర్ ఎదురు చూస్తోంది . నెమ్మదిగా వీరంతా కూడా జైలుకెళ్లి పరిస్థితి తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయ్ .
”ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమయింది . .” అని ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు . పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులకు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని, వారిని మట్టిలో కలిపి సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యటకులపై జరిగిన దాడి కాదని, భారత్ ఆత్మపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి వేటాడి భారత్ హతమారుస్తుందని మోదీ స్పష్టం చేశారు.
కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయని చెప్పారు.కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని మోదీ తెలిపారు. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని మోదీ హెచ్చరించారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయిందని, ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడని అన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రతి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు.