“ అసలు జీవితం అంటే ఏమిటి? మనం ఎందుకు ఉన్నాం? పుట్టడం , చనిపోవడం . . ఇంతేనా జీవితం . ఇంకేమైనా ఉందా ? ” అని తన మెదడును తొలిచేసిన ఆలోచనే హైందవం వైపు నడిచేలా చేసింది .
1950 డిసెంబర్ 7న అమెరికాలోని చికాగో పట్టణంలో ఒక సాధారణ యూదు కుటుంబంలో రిచర్డ్ స్లావిన్ జన్మించాడు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే తనలో ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడేది!. “జీవితం అంటే ఏమిటి? మనం ఈ భూమి మీదకు ఎందుకు వాచం . .. ” 3 ఏళ్ల వయస్సులో తల్లి మరణం, బాల్యంలో ఎదిగిన ఒంటరితనం అతని హృదయంలో ఆధ్యాత్మికత పట్ల విచిత్రమైన ఆకర్షణను పెంచాయి. హైస్కూల్ దాటిన తర్వాత కూడా ఆ ప్రశ్నలు అతన్ని వదల్లేదు. ఈ ప్రపంచంలో ఏదో లోతైన నిజం ఉందని, అది పుస్తకాల్లో కాదు, అనుభవంలోనే దొరుకుతుందని రిచర్డ్ స్లావిన్ విశ్వసించేవాడు .
అమెరికాలో హిప్పీ ఉద్యమం ప్రేరణతో . . : 1960ల చివర్లో అమెరికాలో హిప్పీ సంస్కృతి బాగా పాపులర్. ప్రపంచం శాంతి కోసం, ప్రేమ కోసం కేకలేస్తున్న కాలం. రిచర్డ్ కూడా అలాంటి అస్థిరతల మధ్య పెరిగాడు. కాలేజీ చదువుతున్నా హృదయం అక్కడ లేదని గ్రహించి, 19 ఏళ్లకే చదువు వదిలి “ఆత్మ జ్జ్ఞానం ” తెలుసుకోవడానికి బయలుదేరిపోయాడు. అమెరికా వీధుల్లో వీణ, గిటార్, ధ్యానం అతడు ఆధ్యాత్మికతకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. కానీ అసలు జవాబు అక్కడ లేదు. “సత్యం తూర్పున ఉండొచ్చు” అనే భావన అతన్ని యూరప్ వైపు ద్రుష్టి సారించేలా చేసింది . . 19 సంవత్సరాల వయస్సులో హిచ్హైకింగ్ ద్వారా యూరప్, టర్కీ, ఇరాన్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మార్గంగా భారతదేశాన్ని చేరుకోవడం అంత సులువుకాదు. కఠినమైన వాతావరణం, యుద్ధభూములు, ఆకలి, రోగాలు… కానీ ఈ ప్రయాణమే అతన్ని పూర్తిగా మలిచింది. యుగోస్లావియాలో అరెస్టు, ఆఫ్గానిస్తాన్లో డిసెంటరీతో మరణమునకు అంచున, ఇరాన్లో యుద్ధ ప్రాంతం కానీ ఈ ప్రతి పరీక్ష అతనిలో “దివ్య శక్తి నడిపిస్తుంది” అన్న నమ్మకాన్ని బలపరచింది. తూర్పు వైపు సాగిన ప్రతి అడుగు అతన్ని కృష్ణభక్తికి మరింత దగ్గర చేసింది.
బృందావనంలో : 1971లో ముంబై చేరుకొని, అక్కడి నుండి బృందావనానికి ప్రయాణించిన రిచర్డ్ జీవితం పూర్తిగా మారిపోయింది. యమునా తీరం, రాధా కుండ్, బృందావనం లోని పుణ్యస్థలాలు అతని హృదయాన్ని ఆవహించాయి. అదే సమయంలో అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చిన సంఘటన శ్రీల ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదను మొదటిసారి చూడటం. ప్రభుపాద ముఖంలో కనిపించిన శాంతి, వాక్యాల్లో కనిపించిన జ్ఞానం, సేవలో కనిపించిన వినయం అతనికి “ఇదే నా మార్గం” అని స్పష్టంగా చెప్పినట్టు అనిపించింది.
ఇస్కాన్లో అప్పుడే ప్రవేశం, భక్తీ మార్గంలోకి ప్రయాణం: 1973లో ప్రభుపాద చేత దీక్ష పొంది అతడు “రాధానాథ్ దాస్” అయ్యాడు. పాశ్చాత్యదేశంలో పుట్టిన ఒక యువకుడు, వైష్ణవ సంస్కృతిలో ఇంతలా లీనమవడం అరుదు. బృందావనం లో కఠిన వ్రతాలు, సన్యాసుల సేవ, పాదయాత్రలు, అర్ధరాత్రి కీర్తన ఇవన్నీ అతని జీవితం పూర్తిగా మార్చాయి. 1982లో అతడు సన్యాసం తీసుకొని “రాధానాథ్ స్వామి” అన్న శాశ్వత ఆధ్యాత్మిక పేరును పొందాడు. ఇది అతని సేవా జీవితానికి ప్రారంభం మాత్రమే.
ఆధ్యాత్మిక మార్గంలో కష్టాలు: దివ్యమైన జీవితమంటే సులభమని ఎవరూ చెప్పలేదు. రాధానాథ్ స్వామి జీవితం కూడా పరీక్షలతో నిండింది. ఇస్కాన్లో జరిగిన అంతర్గత రాజకీయాలు, కీర్తనానంద స్వామి వివాదాల్లో 1988లో బయటపడటం, 1994లో తిరిగి చేరడం ఇవన్నీ అతనికి బలమైన పరీక్షలుగా నిలిచాయి . ముంబై రాధా గోపీనాథ్ ఆలయ నిర్మాణంలో ల్యాండ్ డిస్ప్యూట్స్, స్థానిక వ్యతిరేకత, ఆర్థిక అవరోధాలు అన్నీ ఎదురయ్యాయి. కానీ అతను ఎప్పుడూ “ఇవి కృష్ణుని పరీక్షలు” అని భావించి, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు.
పాశ్చాత్య ప్రపంచంపై ప్రభావం: అమెరికాలో ఇస్కాన్ వ్యాప్తి 1970–2025 మధ్య 25% పెరిగింది. రాధానాథ్ స్వామి ప్రభావంతో అనేక యూత్ క్యాంపులు, యోగా రిట్రీట్స్, ధ్యానం, భక్తి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముంబై మోడల్ అయిన అన్నామృత ఎకో విలేజ్ మోడళ్లు అమెరికా, ఇటలీ, యూరప్లో అమలులోకి వచ్చాయి. పాశ్చాత్య భక్తులు 1 మిలియన్ సంఖ్యకు చేరుకోవడానికి రాధానాథ్ స్వామి సేవ పునాది అయింది.
రచయితగా ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు: ది జర్నీ హోమ్ (బృందావనానికి అతని ఆధ్యాత్మిక యాత్ర కథ) ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్సెల్లర్గా నిలిచింది. తరువాతి పుస్తకాలు ది జర్నీ వితిన్, ఈవాల్వ్ ప్రపంచ యూత్కు భక్తి యోగాలో ఒక కొత్త దిశ చూపాయి. అతని యూట్యూబ్ లెక్చర్లు, కీర్తనాలు, ధ్యానం సెషన్లు లక్షలాది మందిని ప్రేరేపిస్తున్నాయి.
ముంబైలో అద్భుత సేవా విప్లవం: రాధానాథ్ స్వామి నాయకత్వంలో ముంబై రాధా గోపీనాథ్ ఆలయం భక్తి–సేవా కేంద్రంగా మారింది. అన్నామృత ప్రాజెక్ట్ ద్వారా 2004 నుండి ఇప్పటి వరకు 1.2 కోట్ల పిల్లలకు రోజువారీ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఆకలి ఉన్న బిడ్డకు భోజనం పెట్టడం అతని భక్తి తత్వంలో ముఖ్య భాగం. భక్తివేదాంత హాస్పిటల్ 150 పడకలతో వేలాది పేదలకు ఉచిత వైద్యం అందిస్తుంది. పేషెంట్స్తో మాట్లాడే అతని శైలిలో “సేవే ధర్మం” అన్న భావం స్పష్టంగా కనిపిస్తుంది. (Visit MegaMindsIndia website)
గోవర్ధన్ ఎకో విలేజ్ ప్రపంచాన్ని ఆకట్టుకున్న భారతీయ మోడల్ గ్రామం: ముంబై బయట ఉన్న వాడర్ గ్రామంలో స్థాపించిన గోవర్ధన్ ఎకో విలేజ్ ప్రపంచానికి సస్టైనబుల్ ఫార్మింగ్కు ఒక విజయవంతమైన ఉదాహరణ అయింది. పశువుల సంరక్షణ, వర్షజల సంరక్షణ, ఆర్గానిక్ ఫార్మింగ్, వేదవనాలు ఇవన్నీ కలిపి యునైటెడ్ నేషన్స్ కూడా ప్రశంసించిన మోడల్. ప్రపంచంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఆధ్యాత్మికత + సస్టైనబిలిటీ = భారతీయ దృష్టి అనే సూత్రాన్ని స్వామీజీ ప్రపంచానికి చూపించారు.
శిక్షణ విద్యా సంస్కరణలలో ఆయన పాత్ర: రాధానాథ్ స్వామి విద్యారంగంలో కూడా విశేష స్థానం సంపాదించారు. మాయాపూర్లోని బెంగాల్ భక్తివేదాంత అకాడమీ 12 సంవత్సరాల దీక్షిత వేదాంత కోర్సులు అందిస్తుంది. గురుకుల వ్యవస్థలో “డే-స్కూల్” మోడల్ని ప్రవేశపెట్టి ఆధ్యాత్మికత ఆధునిక విద్య అనుసంధానాన్ని బలపరిచారు. భక్తి వైభవ, భక్తి వేదాంత కోర్సుల ద్వారా వేలాది భక్తులు శాస్త్రపరమైన మార్గదర్శనం పొందుతున్నారు.
33 వేల ఎకరాలు.. అమరావతి మున్సిసిపాలిటీయే . .. సీఎం చంద్రబాబు బెదిరింపు వెనుక ఏమి జరిగింది . .. రైతులలో ఆందోళన
..రెండవ విడత భూములు ఇవ్వకపోతే … 33 వేల ఎకరాలకు పరిమితం అయితే మున్సిపాలిటీ గా ఉండిపోతుందట.. రైతులకు చంద్రబాబు బెదిరింపులు . రైతులు సహకరించకపోతే మీరే నష్టపోతారు . .. అంటూ డైరెక్ట్గా రైతు నేతల సమావేశంలోనే ఈ హెచ్చరికలు చేయడంతో చంద్రబాబు వ్యవహారశైలిపై నీలినీడలు అలుముకుంటున్నాయి .
కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తవుతున్నా …. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కూడా పూర్తిగా కేటాయించలేదు . రైతులు రోడ్డెక్కుతామని హెచ్చరిస్తే . .. కాస్త భయపడిన సర్కార్ వాళ్ళతో చర్చలకు దిగి వచ్చింది . లేకపోతె అంతే సంగతులు .
”అమరావతి విశ్వ నగరంగా ఎదగాలంటే మరింత భూమి కావాలి . ఇపుడున్న భూములతోనే నగరాన్ని అభివృద్ధి చేయాలంటే కుదరదు . విశ్వ నగరంగా రూపుదిద్దాలంటే మరోవిడత భూసమీకరణ తప్పనిసరి . లేకపోతె అమరావతి కేవలం ఒక మున్సిసిపాలిటీగా మిగిలిపోతుంది . దీనిపై రైతులు ఆలోచించుకోవాలి . ..” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి ? 33 వేళా ఎకరాల భూమిని ఇచ్చింది . .. మున్సిసిపాలిటీ కోసమా ? ఈ ధోరణితో మాట్లాడటం సీఎం స్థాయికి తగునా ? రైతులను బెదిరిస్తున్నారు ? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ? అన్న సందేహం కలగకమానదు .
అద్భుత రాజధాని అన్న చంద్రబాబే . .. మున్సిసిపాలిటీ అంటున్నారు . .. ఎందుకు ? ”ఇపుడు రాజధాని నిర్మాణం శరవేంగంగా సాగుతోంది . ఈ అభివృద్ధి చూసి . .. మీరే మరింత భూమి ఇవ్వాలి . .” అని అడగడంలో తప్పులేదు . కానీ చంద్రబాబు చేసిన హెచ్చరికలు , బెదిరింపులు మాదిరిగా ఉన్నాయంటూ రైతు నేతలు మదనపడుతున్నారు . చంద్రబాబు వ్యవహారశైలిపై అనుమానాలు పెంచుకుంటున్నారు .
”రైతులు రాజధాని కోసం త్యాగాలు చేసారు . వారి త్యాగాలకు వారి తర్వాత తరాలకు ప్రతిఫలం అందేలా చేస్తున్నాం . .” ఆంటు చంద్రబాబు పదేపదే చెపుతూ ఉంటారు . అలాంటి మాటలు చెప్పే చంద్రబాబు . .. 33 వేల ఎకరాలకు పరిమితం అయితే మిసిసిపాలిటీ గా మిగిలిపోతుంది . .. అంటూ అమరావతిపై నెగిటివ్ కామెంట్స్ చేయడంపై రైతులు , పలువురు మేధావులలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది . సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేత ఈ విధమైన బెదిరింపు ధోరణితో చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాలలో చర్చ సాగుతోంది .
ల్యాన్డ్ పూలింగ్ కి గ్రీన్ సిగ్నల్ . ..
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో వివాదాస్పద కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో16 వేల ఎకరాల సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రాజధాని అమరావతి కోసం మొత్తం 50 వేల ఎకరాలు రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. మొదటి దశలో రైతుల నుంచి 34 వేల ఎకరాల సమీకరణ.. రెండో దశలో మరో 16 వేల ఎకరాలపై కసరత్తు చేస్తోంది. త్వరలో ల్యాండ్ పూలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను సీఆర్డీఏ విడుదల చేయనుంది.మొత్తం ప్రభుత్వ భూమి, రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమితో కలిపి 74 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. ఇక ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,168 ఎకరాలు, కర్లపూడిలో 2,946 ఎకరాలు, వడ్డమానులో 1,915 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అసైన్డ్ భూములతో కలిపి మొత్తం 20, 496 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది.
అప్పుడు రిక్వస్ట్… ఇపుడు వార్న్0గ్ … రాజధాని కోసం భూ సమీకరణ సమయంలో రైతులు , రైతు నేతలను బతిమాలి భూసమీకరణకు ఒప్పించారు . అదే చంద్రబాబు టీమ్ . ..ఇపుడు భూములు ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీగా ఉండిపోతుంది . .. తర్వాత మీ ఇష్టం . ..అంటూ హెచ్చరికలు చేయడంపై రైతుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది . ”మొదటి విడత తీసుకున్న భూములను అభివృద్ధి చేసి . … రెండో విడత భూ సమీకరణ అంటే మేము సహకరిస్తాం . … ఏమీ లేకుండా మళ్ళీ భూములు అంటే . .. రాజకేయం తారుమారై . … జగన్ మళ్ళీ గెలిస్తే . .. మా పరిస్థితి ఎవరికీ చెప్పుకోవాలి . . ఇపుడు టీడీపీ , జనసేన ఎమ్మెల్యేల అరాచకాలకు ప్రజలలో తిరుగుబాట వచ్చి . .. కూటమి ఓటమిపాలైతే … జగన్ వచ్చి అమరావతిని స్మశానం చేస్తే . .. మా తర్వాత తరాల వారు ఏమి కావలి . ..దీని గురించి ఆలోచన చేయాలి . .. అని రైతులు కోరుతున్నారు .
”కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని నేను చేయను, ఎవరినీ చేయనివ్వను . .. ” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ”దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుంది . ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదు . ..” సీఎం చంద్రబాబు ధీమాగా చెప్పారు .
అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. రూ.260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.
‘వేంకటేశ్వరస్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి ముందుకు వచ్చి భూములిచ్చారు. భూ త్యాగాలు చేసిన రైతులకు గత 5ఏళ్లలో పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశాను. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులకు దేవుడు అన్యాయం జరగకుండా చూశాడు. తప్పు చేసిన వారికి ఈ జన్మలోనే వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తాడు . .. ‘ ఎన్నో అనుభవాలు చూశాను. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే నేను ప్రాణదానం చేపట్టా. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతీ ఒక్కరికీ ఇవ్వాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాను. వేంకటేశ్వరస్వామి దయతో అమరావతికి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలి . . ‘– ఎన్ . చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి
రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకార నిర్మాణం : మొదటి దశలో రూ.140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మిస్తారు. రూ.48 కోట్లతో ఏడంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, వాహన మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మిస్తారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడ వీధులు, అప్రోచ్రోడ్డు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనుల్ని చేపడతారు. వీటికి రూ.120 కోట్ల వ్యయం కానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఎడతెగని కర్ణాటక రాజకీయం . . రాహుల్ ముందుకి పంచాయతీ
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు . .. అనేది పాత సామెత . కర్నాటక అధికార పార్టీలో ఈ సామెత సరిపోతుంది .
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు వ్యవహారం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నర ఏళ్లు పూర్తి చేసుకున్న మరుక్షణమే ముఖ్యమంత్రి పదవి కోసం పోరు మొదలైంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గం తమ నాయకుడిని సీఎం చేయాలంటూ ఢిల్లీలో మకాం వేసింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చాల సీరియస్గా తీసుకున్నారు. అక్కడ అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు ఒక పూర్తి నివేదికను తెప్పించుకుంటున్నారు.
ఆ రహస్య ఒప్పందం ఏంటి?
ఈ గొడవకు ప్రధాన కారణం 2023 మే నెలలో జరిగినట్లు చెబుతున్న ఒక ఒప్పందం అని చెపుతున్నారు . . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. అప్పుడు ఢిల్లీ పెద్దలు ఒక రాజీ ఫార్ములా తెచ్చారు. అదే ‘2.5 ఏళ్ల ఫార్ములా’. దీని ప్రకారం మొదటి రెండున్నర ఏళ్లు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారు. మిగిలిన కాలం డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు. నవంబర్ 20తో సిద్ధరామయ్య గడువు ముగిసిందని శివకుమార్ వర్గం వాదిస్తోంది.
డీకే శివకుమార్ ఏమంటున్నారు?
ఇప్పటివరకు మౌనంగా ఉన్న డీకే శివకుమార్ ఇప్పుడు గట్టిగానే గళం విప్పారు. తన నియోజకవర్గంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు. “అప్పుడు ఐదు, ఆరుగురు పెద్దల మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది. ఆ వివరాలు నేను బయటపెట్టను. కానీ నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ‘రహస్య ఒప్పందం’ అమలయ్యే సమయం వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ గొడవ తేలేలా కనిపించడంలేదు .
సిద్ధరామయ్య ధీమా
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం పదవి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. వచ్చే బడ్జెట్ కూడా తానే ప్రవేశపెడతానని ఆయన ధీమాగా చెబుతున్నారు. అధిష్టానం ఏం చెబితే అది చేస్తానని పైకి అంటున్నా, లోపల మాత్రం తన వ్యూహాల్లో తాను ఉన్నారు. కుల గణన నివేదికను బయటపెట్టి, వెనుకబడిన వర్గాల (అహిందా) మద్దతు కూడగట్టే పనిలో ఆయన ఉన్నారు. ఈ సమయంలో తనను మార్చితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన వర్గం హెచ్చరిస్తోంది.
స్తంభించిన పాలన
నాయకుల కుమ్ములాటలో రాష్ట్ర అభివృద్ధి పడకేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల వేటలో బిజీగా ఉండటంతో ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. బెంగళూరులో రోడ్ల పనులు, టన్నల్ ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మొక్కజొన్న ధరలు భారీగా పడిపోయినా కొనేవారు లేరు. కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోలేదు. పాలన పట్టించుకునే నాథుడే లేడని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
రాహుల్ గాంధీ చేతిలో నిర్ణయం
విషయం చేతులు దాటడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే ఇద్దరు నేతలతో మాట్లాడారు. డిసెంబర్ 1న పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేలోపు ఈ సమస్యను తేల్చాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. సిద్దరామయ్యను కొనసాగిస్తారా? లేక శివకుమార్కు అవకాశం ఇస్తారా? అనే ఉత్కంఠ ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది
”ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . .. నాకు ఫోన్ చేసి . .. చిన్నారులకు నైతిక విలువలు , కుటుంబ బాంధ్యవ్యాలు గురించి మీలాంటి వారు చేపితే వింటారు . ఎంతో మార్పు వస్తుంది . మీరు ఈ పని చేయాలి . .. అని కోరారు . పిల్లల కోసం చంద్రబాబు గారు పడుతున్న తపనకు నేను చలించి .. అంగీకరించాను . నాకు పదవుల కోసం మాత్రం కాదు . ..’ అని చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యములో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యార్థులకు “విలువలపై విద్యాసదస్సు”లో చాగంటి మాట్లాడారు . విద్యార్థులకు విలువలపై తమ అద్భుత సందేశాన్ని అందించారు. ముందు కుటుంబము నుండే విద్యార్థులలో విలువలకు బీజం పడుతుందని, అందుకే కుటుంబ అనుబంధములు, విలువలు అత్యంత ప్రధానమని, గురువులను మరియు తల్లిదండ్రులను గౌరవించటం యొక్క ఆవశ్యకతను గురించి అనేక మంది మహానుభావుల జీవిత విశేషాలను ఉటంకిస్తూ ప్రవచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు సమాధానములు ఇచ్చి, వారిని మరింత ప్రోత్సహించారు.
కార్యక్రమములో ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యా శాఖామాత్యులు నారా లోకేష్, విజయవాడ MP కేశినేని శివనాథ్ , పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ , డైరెక్టర్ . . విజయరామరాజు . , NTR జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల , , స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ – సమగ్ర శిక్ష బి శ్రీనివాసరావు ఇతర పురప్రముఖులు, విద్యార్థులు, వారి అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమములో శ్రీ చాగంటి వారు చెప్పిన ప్రతి మాట అమృత తుల్యమైనదని వారందరూ తమ ఆనందమును, కృతఙ్ఞతలు వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా మంత్రి లోకేష్ ,.. చాగంటి కోటేశ్వరరావుకి పాదాభివందనం చేశారు .