తుపాన్ల లక్షణాలు ఎందుకు మారిపోతున్నాయ్‌?

తుపాన్ల లక్షణాలు ఎందుకు మారిపోతున్నాయ్‌?

వేగంగా బలపడి, అంత వేగంతో బలహీనపడిన ‘మొంథా’ వాతావరణ పెను మార్పులు

”మొంథా’, తుఫాను సోమవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంగా ఈదురు గాలులు వీస్తాయి .. కనుక జిల్లా అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి . .” అంటూ వాతావరణ శాఖ అధికారులు సీరియస్ గా అప్రమత్తం చేశారు . కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపట్టింది . అయితే తుపాను తన దిక్కును మార్చుకుంది . ఇలా ఎందుకు జరుగుతుంది . వాతావరణ అంచనాలకు తుపాను వంటి వైపరీత్యాలు అందకపోతే ప్రమాదాలు మరింత పెరుగుతాయా ?

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపంలో ప్రారంభమైన ‘మొంథా’, శనివారం ఉదయానికి వాయుగుండంగా, ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుపానుగా మారింది. మంగళవారం నాటికి ఇది తీవ్రమైన తుపానుగా బలపడింది. కానీ తీరం దాటిన తర్వాత అదే వేగంతో బుధవారం తెల్లవారుజామున తుపానుగా, ఆపై తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.

తుపాన్ల లక్షణాలు మారిపోతున్నాయ్‌: ఏ రెండు తుపాన్లు ఒకేలా ఉండవు. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో ఇప్పుడు తుపాన్ల లక్షణాలు వేగంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘మొంథా’ తుపాను ఏర్పడే వరకు బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగిన విధంగా ఉన్నాయి. కానీ తర్వాత పరిస్థితులు అది బలం పుంజుకునేందుకు, ప్రభావం చూపేందుకు అనుకూలించలేదు. వాతావరణ మార్పుల దృష్ట్యా తుపాన్ల ప్రవర్తన మారిపోతోందని విశాఖపట్నం వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు.

క్రైసిస్ మేనేజిమెంటులో బాబు సక్సెస్ ఫార్ములా

క్రైసిస్ మేనేజిమెంటులో బాబు సక్సెస్ ఫార్ములా

తుపాను నష్టం, ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష – రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై అంచనాలు

విపత్కర పరిస్థితులలో సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు అందెవేసిన చేయి . ప్రకృతి వైపరీత్యాలను ఆపేసి టెక్నాలజీ లేకపోయినా . .. పక్కా ప్రణాళిక , నిరంతర మానిటరింగ్ , టెక్నాలజీ ఉపయోగించుకుని సాధ్యమైనంత నష్టం తగ్గించడం , , చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో . ..

..29 ఏళ్ళ వ్యవధిలో విరుచుకు పడిన మూడు పెను తుపానుల మధ్య అతిపెద్ద సాంకేతిక విప్లవం వుంది. ఈ మూడు పెద్ద తుపాను సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండటం యాదృచ్చికమే . .

. 1996 కొనసీమ తుపాను (నవంబర్ 6, 1996) నాటికి కమ్యూనికేషన్లు, టెక్నాలజీ అంతగా లేవు. పెను తుపాను దెబ్బకి అపుడు 1000 మందికి పైగా చనిపోయారు. 2014 లో హుదూద్ తుపాను నాటికి కమ్యూనికేషన్లు బాగా పెరిగాయి. అపుడు 64 మంది చనిపోయారు. ఇపుడు మొంథా తుపాను నాటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనూహ్యంగా వ్యాపించింది. ఈ తుపానులో మరణాలు రెండుకి పరిమితం కావడం కాస్త బెటర్ . .

రాష్ట్రంలో తుపాను నష్టంపై తాజా వివరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 59 వేలకుపైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం కలిగిందని ఇంకా భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోగా, రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. దెబ్బతిన్న 2294 కి.మీ. పొడవున ఆర్​అండ్​బీ రహదారుల వల్ల ఆర్​అండ్​బీ శాఖకు రూ.1,424 కోట్లు నష్టం కలిగిందని తెలిపారు. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్‌ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వచ్చిందనిని అధికారులు సీఎంకి వివరించారు.

18 లక్షల మందిపై తుపాను ప్రభావం: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని తేల్చిచెప్పారు. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రకృతి వైపరీత్యాలను అపేసే టెక్నాలజీలు లేవు. ముందు జాగ్రత్తల వల్ల ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించ వచ్చు. టెక్నాలజీ ని పూర్తిగా వినియోగించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇంతటి సాంకేతికత లేనపుడే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు కి మించిన నాయకుడు లేడన్న పేరు తెచ్చుకున్నారు. అన్ని వనరులను సమీకృతం చేసి పనిచేసే ప్రళాళికలే ఆయన విజయ రహస్యం.

1996 నవంబర్ 6 నాటి కోనసీమ తుపానులో 200 కిలోమీటర్ల గాలివేగానికి పబ్లిక్ ప్రయివేట్ ఆస్ధులు అపారంగా ధ్వంసమయ్యాయి. వెయ్యిమంది చనిపోయారు. కోనసీమ తుపాను నష్టాలకు ప్రధాన కారణం ఉప్పెన/ నీరు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే ఏర్పడిన ఈ విపత్తులో సహాయక చర్యలకోసం ఆయన రాజమండ్రిలో మకాం వేశారు. సబ్ కలెక్టర్ ఆఫీసే సెక్రటేరియట్ / సిఎం పేషీగా మారిపోయింది. ప్రిస్సిపల్ సెక్రటరీ రమాకాంత రెడ్డి ప్రధాన అధికారిగా, ఆర్ డి ఒ శ్రీధర్ ఆయన ప్రధాన సహాయకుడిగా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో “తుపాను సహాయక ప్రభుత్వమే” నడిచింది. కకా వికలమైం కోనసీమ కోలుకోడానికి ఆ తర్వాత ఐదారేళ్ళు పట్టింది.

అప్పటికి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రెండే కంప్యూటర్లు వున్నాయి. ప్లాస్టిక్ కవర్ తో ముసుగు వేసి వుండేవి. ఎందుకంటే అప్పటికి ఏడాది క్రితమే వచ్చిన “విండోస్ 95” కి ప్రయివేటు రంగం అలవాటు పడుతున్నంతగా ప్రభుత్వ రంగం అలవాటు పడలేదు. నల్లటి స్క్రీన్ మీద తెల్లటి text కనబడే Dos ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి విండోస్ 95 గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (GUI) తో ప్రామాణికమైన, వినియోగం పెరుగుతున్న ఇంటర్‌ఫేస్‌గా మారింది. దీనిపై చంద్రబాబుకి లోతైన అవగాహన వుంది. ఆయన సూచన మేరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ కంప్యూటర్లను అప్ డేట్ చేయించారు. కానీ దానిని వినియోగించే వారు అక్కడ లేకపోవడంతో వేరే చోట నుంచి తీసుకువచ్చారు .

18 ఏళ్ళు గడచిపోయాయి. ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ సాధనాలైన కాల్ కాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వీటిని నిర్వహించడానికి నిర్దిష్టమైన బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తూ, వాటి విజయాన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్స్ (KPIs) ద్వారా లెక్కగట్టడం మొదలైంది. ఈ సాంకేతికతలు ఫోర్త్ ఐటి రివల్యూషన్ కు ఊతమిచ్చాయి.

2014 అక్టోబర్ 12 న హుదూద్ తుపాను వచ్చింది. 210 కిలోమీటర్ల గాలివేగానికి విశాఖపట్నం ఏరియాలో 64 మంది చనిపోయారు. విద్యుత్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలడం వల్ల 21 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది . హుదూద్ నష్టాలకు ప్రధాన కారణం భారీ గాలి. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో మకాం వేశారు. తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక సహాయ చర్యలు అమలు చేయించారు. విశాఖ ప్రాంతం ఏడాదిలో కోలుకోవడంలో చంద్రబాబు తనవంతు పాత్ర నిర్వహించారు .

ప్లానింగ్ + టెక్నాలజీ = క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు సూత్రం ఇదే . ..

కూలిపోయిన చెట్లను కూలీలతో ముక్కలు చేయించి రోడ్లను క్లియర్ చేయడం ఇందుకు వారాలు వారాలే పట్టడం 1996 నాటి పరిస్ధితి. అడ్డదిడ్డంగా పడిపోయిన స్ధంభాలు చెట్లను ఎత్తి పక్కన పెట్టడానికి క్రెయిన్లు అందుబాటులోకి రావడం 2014 నాటి పరిస్ధితి. ఈ పద్దెనిమేళ్ళలోనూ టెక్నాలజీ అనూహ్యంగా పెరిగింది .

11 ఏళ్ళు గడచిపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) అనూహ్యంగా వికసించింది. టెక్నాలజీ రియల్ టైమ్ గవర్నెన్స్ ను సాధ్యం చేస్తుంది. దీనికి ఫైబర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలు వచ్చాయి. లార్జర్ కనెక్టివిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విస్తరిస్తోంది.

రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు వారి వారి డాష్ బోర్డుల మీద మొంథా తుపాన్ ని గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్త ప్రభుత్వ యంత్రాంగమూ ఇదే పనిలో వుంది. ఇందువల్ల ప్రాణ నష్టాన్ని జీరో శాతానికి తెచ్చే అవకాశం వుంది.

టెక్నాలజీ నివినియోగించుకోవడంతో పాటు సమస్యని గుర్తించడం (Identification) పరిష్కారానికి వనరుల్ని సమీకృతం చేయడం(Integration) అన్ని శక్తుల్ని భాగస్వామ్యం చేయడం(Involvement) చిత్తశుద్ధితో పని చేయడం (Integrity) – ఈ “I 4” సూత్రాన్ని పాటించడం వల్లే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు నాయుడికి మించిన రాజకీయ నాయకుడు లేరన్న గౌరవాన్ని పేరు ప్రఖ్యాతుల్ని అయన గడించుకున్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డేటా మెదడు అయితే, కనెక్టివిటీ గుండె. విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్ రావడమంటే

అది భారత్ కు మాత్రమే కాక కనీసం 12 దేశాల కనెక్టివిటీకి పెద్ద బ్యాక్ బోన్ గా నిలబడుతుందని చెప్పడం అతిశయోక్తికాదు .

టాటా సియెర్రా’ వస్తోంది- లాంఛ్ ఎప్పుడో తెలుసా?

టాటా సియెర్రా’ వస్తోంది- లాంఛ్ ఎప్పుడో తెలుసా?

”2025 టాటా సియెర్రా” లాంఛ్ డేట్ ఫిక్స్- వివరాలు ఇవిగో !

సరికొత్త వాహనాలపై మోజు ఉండే  వాహన ప్రియులకు అదిరే అప్డేట్ ఇది .. దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త SUV “టాటా సియెర్రా”ను త్వరలో విడుదల చేయబోతోంది. నవంబర్ 25న భారతదేశంలో లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ కారు కాన్సెప్ట్ మోడల్‌ను మొదటిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత కంపెనీ ఇప్పుడు దీనిని విడుదల చేసేందుకు రెడీ అయింది.

టాటా “సియెర్రా” నేమ్‌ప్లేట్ పాత, ప్రతిష్టాత్మకమైనది. 2020 ఆటో ఎక్స్‌పో తర్వాత 2023లో అప్డేటెడ్ “సియెర్రా EV” కాన్సెప్ట్ వెల్లడైంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో దాదాపు పూర్తిగా నిర్మించిన అంతర్గత SUV ఉత్పత్తిని ఆవిష్కరించారు.

దీని ఫైనల్ ప్రొడక్షన్-స్పెక్ మోడల్ గతంలో ప్రదర్శించిన చివరి నియర్-ప్రొడక్షన్ కాన్సెప్ట్‌కు దగ్గరగా పోలి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ICE, EVల మధ్య కొన్ని స్టైలింగ్ తేడాలు కనిపించవచ్చు, వాటిలో గ్రిల్‌లో మార్పులు కూడా ఉన్నాయి. ICE మోడల్ బ్లాక్ గ్రిల్‌ను కలిగి ఉంది .

టాటా సియెర్రా ఇంటీరియర్: టాటా సియెర్రా ఇంటీరియర్‌ విషయానికి వస్తే డాష్‌బోర్డ్‌లో 3 డిస్‌ప్లేలతో పాటు అనేక సాంకేతిక ఫీచర్లు ఉంటాయి. ఇందులో ఎంపిక చేసిన వేరియంట్‌లలో డెడికేటెడ్ కో-డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది లెవల్ 2 ADAS ఫంక్షన్‌లు, 360-డిగ్రీ కెమెరాలతో పాటు అనేక ఫీచర్లు ఇందులో స్పెషల్ .

టాటా సియెర్రా ఇంజిన్: పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, ఇది టాటా కొత్త హైపెరియన్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. అదనంగా ఈ SUV డీజిల్ ఇంజిన్ ఎంపికనూ అందించవచ్చు. ఇది టాటా హారియర్‌లో కనిపించే సుపరిచితమైన 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్. “టాటా సియెర్రా EV” పవర్‌ట్రెయిన్​కు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రివీల్ కాలేదు. అయినప్పటికీ ఇది “టాటా కర్వ్ EV”, “టాటా హారియర్ EV” వంటి కార్లతో పవర్‌ట్రెయిన్ భాగాలు ఇందులో ప్రత్యేకంగా నిలుస్తాయి .

తుపాన్ మంథా … ఆంధ్రాలో రైలు ప్రయాణాలు గందరగోళం . ..

తుపాన్ మంథా … ఆంధ్రాలో రైలు ప్రయాణాలు గందరగోళం . ..

తుఫాను మంథా: ఆంధ్రప్రదేశ్‌లో రైలు, విమాన మరియు బస్సు సర్వీసులు ప్రభావితమయ్యాయి
తుఫాను కారణంగా విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి విమానాశ్రయాల నుండి విమాన కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి.

మొంథా తుపాను ముంచుకొస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా, దాదాపు 18గంటల పాటు ప్రభావం చూపనుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.

తుఫాను మంథా దృష్ట్యా, దక్షిణ మధ్య రైల్వే మరియు తూర్పు తీర రైల్వే అక్టోబర్ 28, మంగళవారం భద్రతా కారణాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి విశాఖపట్నం వరకు మరియు దాని గుండా వెళ్ళే అనేక రైలు సర్వీసులను రద్దు చేశాయి,

దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయబడిన లేదా తిరిగి షెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితాలను విడుదల చేసింది. తుఫాను కారణంగా విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి విమానాశ్రయాల నుండి విమాన కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి.

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఉత్తర-వాయువ్య దిశలో కదులుతున్న తుఫాను మంథా త్వరలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది, మంగళవారం రాత్రి నాటికి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.


రియల్ టైమ్ వాయిస్ అలర్ట్‌లు
అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మోంతా తుఫాను హెచ్చరికల కోసం రియల్ టైమ్ వాయిస్ అలర్ట్‌లను తీరప్రాంత జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాలకు ప్రయోగాత్మకంగా అందజేస్తున్నట్లు తెలిపింది.

“విద్యుత్తు అంతరాయం సమయంలో కూడా, 360° హార్న్ స్పీకర్ సిస్టమ్ ఒక కిలోమీటరు వ్యాసార్థంలో స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది. ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాలకు విస్తరించనుంది” అని APSDMA తెలిపింది.

తూర్పు తీర రైల్వే రైలు యొక్క స్వల్పకాలిక ముగింపు/ స్వల్పకాలిక ప్రారంభాన్ని ప్రకటించింది.

అక్టోబర్ 27న హౌరా నుండి బయలుదేరిన రైలు నంబర్ 18005 హౌరా-జగ్దల్‌పూర్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ రాయగడ వద్ద స్వల్పకాలిక ముగింపును పొందుతుంది మరియు అక్టోబర్ 29న రాయగడ నుండి హౌరాకు 18006గా తిరిగి వస్తుంది. అందువల్ల, అక్టోబర్ 29న రాయగడ మరియు జగదల్‌పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు.
రైలు నంబర్ 18448 హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28న జగదల్‌పూర్‌కు బదులుగా రాయగడ నుండి భువనేశ్వర్‌కు బయలుదేరుతుంది. అందువల్ల, అక్టోబర్ 28న రాయగడ మరియు జగదల్‌పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు.

రైలు నంబర్ 18108 ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 28న జగదల్‌పూర్‌కు బదులుగా రాయగడ నుండి రూర్కెలాకు ప్రారంభమవుతుంది. అందువల్ల, అక్టోబర్ 28న రాయగడ మరియు జగదల్‌పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు విమాన స్థితిని తనిఖీ చేయాలని ఆదేశించింది.

“ప్రస్తుత తుఫాను పరిస్థితులు మరియు #విజయవాడ, #విశాఖపట్నం మరియు #రాజమండ్రి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షపాతం కారణంగా, ఈ నగరాలకు మరియు వాటి నుండి విమాన కార్యకలాపాలు ప్రభావితమవుతాయి” అని X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.

“విమానాశ్రయానికి వెళ్లే ముందు అన్ని వినియోగదారులు https://t.co/4fxgr5orzK వద్ద వారి విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము. జలదిగ్బంధనం మరియు ట్రాఫిక్ రద్దీని అంచనా వేస్తున్నందున, దయచేసి అదనపు ప్రయాణ సమయంతో మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. మీ భద్రత మరియు సౌకర్యం మా ప్రధాన ప్రాధాన్యత, దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి” అని అది జోడించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభావిత ప్రాంతాలలో అవసరమైన బస్సు సర్వీసులు మాత్రమే నడపాలని APSRTC మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు .

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ మరియు కాకినాడ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని IMD గుర్తించింది. ఇంతలో, రాబోయే తుఫాను దృష్ట్యా పొరుగున ఉన్న ఒడిశా కూడా హై అలర్ట్‌లో ఉంది.

సోషల్ మీడియా పుకార్లపై అధికారుల అలెర్ట్ . .. హుద్ . .హుద్ సమయంలో తీసిన వీడియోలను యు ట్యూబ్ లో పెడుతూ . .. కాకినాడలో అల్లకల్లోలం నెలకొందంటు కొందరు చేస్తున్న ప్రచారంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . తప్పుడు ప్రచారం చేసేవారిపై కేసులు పెడతామని పోలీసు అధికారులు వెల్లడించడంతో తప్పుడు ప్రచారాలకు కాస్త బ్రేక్ పడింది .

ఈదురుగాలులకు పలుచోట్ల కూలుతున్న చెట్లు

  • ఈదురుగాలులకు ఉమ్మడి తూ.గో. జిల్లాలో పలుచోట్ల కూలుతున్న చెట్లు
  • కాకినాడ కలెక్టరేట్‌, సురేష్‌నగర్, బాలాజీ చెరువు వద్ద కూలిన చెట్లు
  • కాకినాడ సురేష్‌నగర్‌లో విరిగిపడిన రెండు విద్యుత్‌ స్తంభాలు
  • తుని పార్కు సెంటర్, రౌతులపూడి మం. ఎ.మల్లవరంలో కూలిన చెట్లు
  • కోనసీమ: అల్లవరం మం. బోడసకుర్రులో రోడ్డుపై కూలిన భారీ చెట్టు
  • క్రేన్లతో చెట్లు తొలగించి రాకపోకలు పునరుద్ధరిస్తున్న పోలీసులు
  • కోనసీమ: అంబాజీపేట మం. వక్కలంక పుల్లేటికుర్రులో ఈదురుగాలులు
  • ఈదురుగాలులకు కొబ్బరి చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు ధ్వంసం
మోదీ-లోకేష్ బంధం.. వ్యూహం ఏమిటి ?

మోదీ-లోకేష్ బంధం.. వ్యూహం ఏమిటి ?

నారా లోకేష్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న శ్రద్ధ, అభిమానం, ఆత్మీయతల వెనుక కారణం ఏమై ఉండొచ్చు . దీని వెనుక విస్తృతమైన వ్యూహం కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా ఏ మేరకు వాస్తవికతకు తగ్గారగా ఉంది . . మిత్రపక్షాల్లో తర్వాతి తరం నాయకులను ప్రోత్సహించడం ద్వారా కూటమిని బలోపేతం చేసుకోవడం దీని లక్ష్యం. ఈ నమూనాకు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ ఒక ఉదాహరణ. ఆయన మోదీ పట్ల పూర్తి విధేయత ప్రదర్శించారు. ప్రధాని పాదాలకు నమస్కరించారు. బదులుగా మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. ఫలితంగా చిరాగ్‌కు కీలకమైన కేంద్ర మంత్రి పదవి లభించింది. ఆయన పార్టీకి 5 ఎంపీలు ఉన్నారు.

మరోవైపు రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించారు. దీంతో జయంత్ ఎన్డీఏకు మద్దతు పలికారు. ఆయన పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇది రాజకీయ వారసత్వాలను గౌరవిస్తూ, వారిని కలుపుకుపోయే ఎత్తుగడ.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కును అందుకోలేకపోయింది. దీంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పలేదు. 16 మంది ఎంపీలతో తెలుగుదేశం పార్టీ కూటమిలో రెండో అతిపెద్ద పక్షంగా అవతరించింది. ఈ పరిణామం వల్ల చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో (మరోసారి) కింగ్‌మేకర్‌ అయ్యారు. ప్రభుత్వ మనుగడకు టీడీపీ మద్దతు ఇప్పుడు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో టీడీపీతో సంబంధాలను పటిష్టం చేసుకోవడం బీజేపీకి తప్పనిసరి. అందుకే ఆ పార్టీ భవిష్యత్ నాయకుడైన లోకేష్‌కు మోదీ అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు.

లోకేష్ తన రాజకీయ బ్రాండ్‌ను సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణపై నిర్మించుకున్నారు. విశాఖపట్నంలో ₹1500 కోట్లతో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల కోసం లండన్, సింగపూర్ వంటి నగరాల్లో సమావేశాలు నిర్వహించారు. ఆయన అభివృద్ధి మంత్రం, మోదీ ‘వికసిత భారత్’ ఆశయానికి దగ్గరగా ఉంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనను “డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్” అని లోకేష్ అభివర్ణించారు. మోదీ నాయకత్వాన్ని, ఆయన దార్శనికతను బహిరంగంగా ప్రశంసించారు. ఈ విధేయత, విధాన సారూప్యత మోదీకి నచ్చింది. అందుకే కర్నూలు సభలో లోకేష్ దూరంగా నిలబడితే, “ఇక్కడికి రా” అని ఆత్మీయంగా పిలిచారు. ఈ బహిరంగ ఆమోదం లోకేష్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలున్న టీడీపీ అత్యంత కీలకం. అందుకే లోకేష్‌కు ప్రాధాన్యం ఎక్కువ. చిరాగ్ బంధం వ్యక్తిగత విధేయతపై ఆధారపడితే, లోకేష్‌తో బంధం విధానాల ఏకీభావనపై కూడా నిలిచింది.లోకేష్‌ను ప్రశంసించడం ద్వారా, అభివృద్ధి రాజకీయాలు చేసే వారసులకు తన మద్దతు ఉంటుందని మోదీ ఇతర ప్రాంతీయ పార్టీలకు సందేశం పంపుతున్నారు. ఇది సంకీర్ణ రాజకీయాల కొత్త నమూనా. వ్యక్తిగత ఆభిమానం వెనుక పక్కా రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

మోదీ-లోకేష్ బంధం వెనుక స్పష్టమైన రాజకీయ లెక్కలున్నాయి. ఇది ఒక సహజీవన సంబంధం. ప్రభుత్వ స్థిరత్వం కోసం మోదీకి లోకేష్ అవసరం. జాతీయ స్థాయిలో గుర్తింపు, కేంద్రం మద్దతు కోసం లోకేష్‌కు మోదీ ఆశీస్సులు అవసరం. లోకేష్ తదుపరి ముఖ్యమంత్రి కావచ్చనే సంకేతాలను ప్రధాని పరోక్షంగా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పుత్రోత్సాహానికి మించిన విజయం ఏ తండ్రకీ వుండదు. మోదీ అపురూపమైన ఈ మానవ సంబందపు ఆనందాన్ని చంద్రబాబు నాయుడికి ఇస్తున్నారు, మోడీ చేస్తున్న ఈ లాజిక్కు గురించి ఎవరు ఏమి చర్చుకున్నా … దేశరాజకీయ పరిస్తుతులలో పెను మార్పునకు కారణం అవుతుందా > అనేదానిపై కూడా అనేక అంచనాలు నెలకొన్నాయి .