by Abhi Correspondent | May 7, 2025 | జనరల్
10 మంది కుటుంబసభ్యులు, అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడి
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబసభ్యులు కూడా మరణించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బహావల్పూర్లో జరిగిన దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించిన మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబసభ్యులు బాంబు ధాటికి మరణించారు.
భారత్ చేపట్టిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు హతమయ్యారు. 10 మంది కుటుంబసభ్యులు, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడించాడు. భారత్ దాడుల్లో మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతని భార్యతో పాటు మరో ఐదుగురు మరణించినట్లు చెప్పాడు. జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం బహవల్పుర్లోని జామియా మస్జీద్ సుబాన్ అల్లాహ్ ప్రాంతంలో జరిగిన దాడిలో మరణించినట్లు తెలిపాడు.
ఉగ్ర స్థావరాలే టార్గెట్ :
భారత దళాలు పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లోగల ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్, లష్కరే తోయిబాప్రధాన కార్యాలయాలున్న ప్రాంతాల్లోనే ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాదుల స్థావరాలనే తాము టార్గెట్ చేసుకున్నామని భారత్ స్పష్టం చేసింది. సామాన్యులకు అపాయం కలుగకుండా ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించింది.
ఈ దాడిలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ 25 నిమిషాలపాటు బాంబుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అత్యంత కచ్చితత్వంతో జరిపిన ఈ దాడుల్లో సుమారు 70 మంది ఉగ్రవాదులు అంతమయ్యారు. పీఓకే ఉగ్రస్థావరాలతోపాటు పాక్లోని ఐదు ఉగ్రక్యాంపులను కూడా భారత్ ధ్వంసం చేసింది.
భారత్ చర్యలపై స్పందించిన పాక్..
ఈ ఆపరేషన్ను యుద్ధ చర్యగా అభివర్ణించింది. అయితే, భారత్ తన చర్యలను కట్టిపెడితే తాము ప్రతి దాడికి దిగబోమని కాళ్లబేరానికి వచ్చింది. ఇదిలా ఉంటే భారత్ కూడా పాక్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి మరింత దిగజార్చేలా దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామనని వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్కు అండగా నిలిచాయి. స్వీయ రక్షణ భారత దేశ హక్కు అని ముక్తకంఠంతో పేర్కొన్నాయి.
by Rama Chandra P | May 6, 2025 | జాతీయం
సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ గురించి తెలుసుకుందాం… పాకిస్తాన్ పై యుద్ధం ఖాయమేనా?
దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ నిర్వహణ 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి.
2025 మే 7న భారత్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే . ఈ డ్రిల్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, 2025 మేలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత, పౌరుల భద్రతను నిర్ధారించడానికి, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధతను పెంచడానికి చేపడతారు.
ఎలా జరుగుతుంది?
భారత్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ యుద్ధం లేదా వైమానిక దాడుల వంటి అత్యవసర పరిస్థితులను అనుకరించి పౌరులు, సైనిక బలగాలు, పోలీసులు, అగ్నిమాపక దళాలు, స్థానిక పరిపాలన సమన్వయంతో చేస్తారు. ఈ డ్రిల్స్లో సాధారణంగా ఈ క్రింది అంశాలు ఉంటాయి:
1. వైమానిక దాడి సైరన్లు:
• శత్రు వైమానిక దాడి జరిగినట్లు సూచించే సైరన్లను మోగిస్తారు. ఈ సైరన్లు వినిపించగానే పౌరులు సురక్షిత ప్రాంతాలకు (బాంబు షెల్టర్లు లేదా నిర్దేశిత భవనాలు) తరలివెళ్లేలా శిక్షణ ఇస్తారు.
• ఉదాహరణకు, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ సైరన్లను పరీక్షిస్తారు.
2. తరలింపు ప్రణాళికలు:
• ప్రజలను రద్దీ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను అభ్యసిస్తారు. ఇందుకోసం స్థానిక పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు (NDRF), సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు సమన్వయం చేస్తారు.
• కశ్మీర్, గుజరాత్, హరియాణా, అస్సాం వంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఈ తరలింపు ప్రక్రియలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
3. బ్లాక్అవుట్ చర్యలు:
• రాత్రి సమయంలో శత్రు విమానాలు గుర్తించకుండా ఉండేందుకు లైట్లను ఆర్పడం లేదా కిటికీలను మూసివేయడం వంటి చర్యలను అభ్యసిస్తారు.
• ఇది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో అమలు చేస్తారు.
4. ప్రథమ చికిత్స, వైద్య సహాయం:
• గాయపడిన వారికి తక్షణ సహాయం అందించేందుకు ప్రథమ చికిత్స శిక్షణ ఇస్తారు. ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అత్యవసర సేవలకు సిద్ధంగా ఉంటారు.
• మాక్ డ్రిల్లో గాయాలను అనుకరించి, వైద్య బృందాలు ఎలా స్పందించాలో పరీక్షిస్తారు.
5. ముఖ్యమైన స్థాపనల రక్షణ:
• విద్యుత్ కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రక్షణ సంస్థలు వంటి కీలక స్థాపనల రక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పరీక్షిస్తారు.
• ఉదాహరణకు, విశాఖపట్నంలోని నౌకాదళ కేంద్రాలు లేదా హైదరాబాద్లోని రక్షణ పరిశోధన సంస్థల వద్ద ఈ చర్యలు దృష్టి సారిస్తారు.
6. పౌరులకు శిక్షణ, అవగాహన:
• పౌరులకు యుద్ధ సమయంలో ఎలా స్పందించాలి, ఎక్కడ ఆశ్రయం పొందాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు.
• స్థానిక స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమాలను చేస్తారు.
7. సమాచార ప్రసారం:
• రేడియో, టెలివిజన్, సోషల్ మీడియా, SMS అలర్ట్ల ద్వారా ప్రజలకు సమాచారం, సూచనలను అందిస్తారు.
• ఉదాహరణకు, ఢిల్లీలో ఈ డ్రిల్స్ సమయంలో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వం సోషల్ మీడియాను ఉపయోగిస్తుంది.
ఎక్కడ జరుగుతాయి?
• దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ చేస్తారు.
• తెలుగు రాష్ట్రాలు: హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ డ్రిల్స్ జరుగుతాయి.
• సరిహద్దు రాష్ట్రాలు: కశ్మీర్, గుజరాత్, హరియాణా, అస్సాం వంటి రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో డ్రిల్స్ చేస్తారు, ఎందుకంటే ఇవి యుద్ధ సమయంలో లక్ష్యంగా మారే అవకాశం ఉంది.
• పెద్ద నగరాలు: ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఈ డ్రిల్స్ జరుగుతాయి.
నిర్వహణ విధానం
• సమన్వయం: ఈ డ్రిల్స్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలన, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA), సైన్యం, పోలీసులు, సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు భాగస్వామ్యం వహిస్తారు.
• స్వచ్ఛంద సంస్థలు: బీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ డ్రిల్స్లో పాల్గొనమని పిలుపునిచ్చారు.
• పర్యవేక్షణ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర సివిల్ డిఫెన్స్ విభాగాలు ఈ డ్రిల్స్ను పర్యవేక్షిస్తాయి.
ప్రజల పాత్ర
• ప్రజలు సైరన్లు వినగానే నిర్దేశిత సురక్షిత ప్రాంతాలకు వెళతారు.
• బ్లాక్అవుట్ సూచనలను పాటిస్తారు, భయపడకుండా శిక్షణలో పాల్గొంటారు.
• స్థానిక అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని శ్రద్ధగా అనుసరిస్తారు.
2025 మే 6 నాటికి, రాష్ట్రాలు ఈ డ్రిల్స్ కోసం సన్నాహాలు చేస్తున్నాయి. ఢిల్లీలో, ఈ డ్రిల్స్కు ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని మంత్రి అశిష్ సూద్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో స్థానిక అధికారులు సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు.
భారత్లో 2025 మే 7న జరగనున్న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ యుద్ధవాతావరణంలో పౌరుల భద్రతను నిర్ధారించడానికి, అత్యవసర సన్నద్ధతను పెంచడానికి కీలకమైనవి. ఈ డ్రిల్స్ సైరన్లు, తరలింపు, బ్లాక్అవుట్ చర్యలు, ప్రథమ చికిత్స, ముఖ్యమైన స్థాపనల రక్షణపై దృష్టి సారిస్తాయి.
( ఈ ఆర్టికల్ లో సమాచారం సీనియర్ జర్నలిస్ట్ నవీన్ పెద్దాడ గారి FB వాల్ నుంచి తీసుకోవడమైనది)
by Rama Chandra P | May 6, 2025 | ఆంధ్రప్రదేశ్
గాలి జనార్దన్రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష
అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో (OMC) సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఏ2 గాలి జనార్దన్రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. దోషులు అందరికీ ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.
ఏ3 వీడీ రాజగోపాల్ను, ఏ4 ఓఎంసీ కంపెనీని, ఏ7 మెఫజ్ అలీఖాన్ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. వీడీ రాజగోపాల్కు అవినీతి నిరోధక చట్టం కింద నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. ఏ4 ఓఎంసీ కంపెనీని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు, రూ.లక్ష, రూ.లక్ష చొప్పున రూ.2 లక్షల జరిమానా విధించింది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే వీరు పైకోర్టులకు అప్పీలుకు వెళ్లే ఛాన్స్ ఉంది . అక్కడ వీరికి ఇదే శిక్ష ఖరారవుతుందా ? లేదా తప్పుకుంటారా ? అనేది వేచి చూడాలి .
నిర్దోషులు: సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా తేల్చింది. 2004-09 మధ్య గనులశాఖ మంత్రిగా సబిత పనిచేశారు. సబితతో పాటు విశ్రాంత ఐఏఎస్ కృపానందంను నిర్దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. 2022లో ఏ6 శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు కేసు నుంచి డిశ్చార్జి చేసింది.
తుది తీర్పు దశాబ్దంన్నర తర్వాత . . : ఓబుళాపురం మైనింగ్ కేసులో 15 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది. ఈ మధ్యలో ఎన్నో జరిగాయి . ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెలలో వాదనలు ముగిసాయి. విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. 2022లో తెలంగాణ హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్ఛార్జి చేసింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది.
by Rama Chandra P | May 6, 2025 | సినిమా
మేడమ్ టూస్సాడ్స్లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ – అరుదైన ఘనత దక్కించుకున్న స్టార్ హీరో
టాలీవుడ్ హీరోగా తెరంగేట్రం చేసి… గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడం టుస్సాడ్స్ (లండన్ ) లో చెర్రీ మైనపు బొమ్మ ఆవిష్కరిస్తున్నారు .
” వరల్డ్ ఫెమస్ టుస్సాడ్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను . చిన్నప్పుడు మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియం చూసినప్పుడు ఎంతో ఆనంద0గా లెజెండ్స్ విగ్రహాలతో ఫొటోలు తీసుకోవడానికి ఉత్సాహం చూపేవాడిని . అలంటి అరుదైన మ్యూజియంలో నా విగ్రహం ఏర్పాట్లు చేయడం, తన కెరీర్ తొలి నాళ్లలోనే ఇలా జరగడం ఊహించలేదు . . ఇది ఎంతో ఆనందాన్ని ఇస్తోంది . …” – రామ్ చరణ్ భావోద్వేగ ప్రకటన
రామ్ చరణ్తో ‘రైమ్’ స్పెషల్!
సినిమా రంగ0లో విశేష కృషి చేసిన వారిని గౌరవిస్తూ మేడమ్ టూస్సాడ్స్ వారి మైనపు విగ్రహాలను తయారుచేసి మ్యూజియంలో ఏర్పాటు చేస్తుంది . అయితే, సెలబ్రిటీల విగ్రహాలు మాత్రమే ఆవిష్కరిస్తుంది. కానీ ప్రస్తుతం రామ్ చరణ్తో పాటు ఆయన పెంపుడు శునకం రైమ్ కూడా ఇందులో భాగం కాబోతోంది. రామ్ చరణ్తో పాటు రైమ్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించోతున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా సెలబ్రిటీల పెంపుడు జంతువులకు ఇలా చేయలేదు. గతంలో క్వీన్ ఎలిజబెత్ 2 మాత్రమే తన పెంపుడు జంతువుతో కనిపించారు. కాగా, ఆవిష్కరణ తర్వాత విగ్రహాన్ని మేడమ్ టూస్సాడ్స్ సింగపూర్కు తరలిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం మెగా ఫ్యామిలీ మే 11న ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆర్ఆర్ఆర్ లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనలో పాల్గొననున్నారు.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు రామ్ చరణ్. ఇప్పుడు ఈ స్టార్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని మే9 ఆవిష్కరించనున్నారు. రామ్చరణ్కు దక్కిన ఈ గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగా ఫ్యామిలీ లండన్కు పయనం అయినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీన్ కారా, పెంపుడు శునకం రైమ్ లండన్కు బయలుదేరి వెళ్లారు .
by Rama Chandra P | May 5, 2025 | ఆరోగ్యం
మీ చిన్నారులకు కు కంటి అద్దాలు అవసరం కావడానికి ముందు ‘’ స్క్రీన్ సమయం ఎంత ?’’ అనేది పరిశీలిస్తే… ఈ అధ్యయనం సమాధానాలను అందిస్తుంది
స్క్రీన్లు ఇప్పుడు రోజువారీ జీవితంలో అనివార్యమైన భాగం కావడంతో పేరెంట్స్ కి దీనికి పరిస్కారం దొరకడం అంత సులభం కాదు. ఎందుకంటే వారు కూడా చిన్నారుల కంటే ఎక్కవ సమయం స్క్రీన్ పైనే గడుపుతున్నారు కనుక.
పెరిగిన స్క్రీన్ సమయం మరియు మయోపియా మధ్య సంబంధం అందరికీ తెలుసు. కానీ ప్రపంచవ్యాప్తంగా 45 అధ్యయనాలు మరియు 335,000 కంటే ఎక్కువ మందిని కవర్ చేసిన కొత్త మెటా-విశ్లేషణ, ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా వివరిస్తుంది.
రీసెంట్ గా ఒక ఇంటర్నేషనల్ స్టడీ జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం, రోజువారీ స్క్రీన్ సమయం యొక్క ప్రతి అదనపు గంట పిల్లలలో మయోపియా పెరిగే ప్రమాదాన్ని 21 శాతం పెంచుతుంది.
- పరిశోధకులు 335,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి డేటాను సమీక్షించారు. చిన్నారుల కంటి చూపును కాపాడటానికి మొబైల్, టాబ్, టీవీ, ల్యాప్ టాప్ స్క్రీన్ వాడకాన్ని రోజుకు ఒక గంట కంటే తక్కువగా ఉండేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పెరుగుతున్న ధోరణి 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మందికి కంటి అద్దాలు అవసరమయ్యే ప్రమాదం తెస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టాబ్లెట్కు అతుక్కుపోయిన పిల్లవాడు, సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తున్న టీనేజర్ లేదా ల్యాప్టాప్ని గంటల తరబడి చూస్తున్న పెద్దవాడు – ఇవన్నీ నేడు మన జీవితాల్లో మనం ఎదుర్కొనే సాధారణ దృశ్యాలు.
ఈ సరి కొత్త అధ్యయనం ఈ ధోరణి త్వరలో ‘’ఒక అంటువ్యాధికి దారితీయవచ్చు ;; అని మానసిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ జనాభాలో సగం మంది దూరదృష్టి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
పెరిగిన స్క్రీన్ సమయం మరియు మయోపియా మధ్య సంబంధం అందరికీ తెలుసు. కానీ ప్రపంచవ్యాప్తంగా 45 అధ్యయనాలు మరియు 335,000 కంటే ఎక్కువ మందిని కవర్ చేసిన కొత్త మెటా-విశ్లేషణ, ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో పరిశీలిస్తే ఇట్టే అర్ధం అవుతుంది.
దృష్టి సంక్షోభం..
జామా నెట్వర్క్ ఓపెన్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, డిజిటల్ స్క్రీన్ సమయం మరియు మయోపియా ప్రమాదం మధ్య సంబంధాన్ని పరిశీలించే క్రమబద్ధమైన సమీక్ష మరియు మోతాదు-ప్రతిస్పందన యొక్క విశ్లేషణ.
మొత్తం 335,524 మంది పాల్గొనేవారితో కూడిన 45 అధ్యయనాల నుండి డేటాను పరిశోధకులు విశ్లేషించారు, పెరిగిన స్క్రీన్ సమయం మయోపియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అంచనా వేశారు.
రోజువారీ స్క్రీన్ సమయం యొక్క ప్రతి అదనపు గంటకు, మయోపియా అభివృద్ధి చెందే అవకాశాలు 21 శాతం పెరిగాయని వారు కనుగొన్నారు. రోజుకు ఒకటి మరియు నాలుగు గంటల స్క్రీన్ సమయం మధ్య ప్రమాదం బాగా పెరిగింది మరియు తరువాత క్రమంగా పెరుగుతూనే ఉంది. మయోపియా ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు ఒక గంట కంటే తక్కువ భద్రతా పరిమితిని పరిశోధనలు సూచిస్తున్నాయి.
“మా పరిశోధన స్పష్టమైన నమూనాను చూపిస్తుంది” అని అధ్యయనం యొక్క ప్రధాన రచయిత డాక్టర్ అహ్నుల్ హా చెప్పారు. “ప్రమాదం సంవత్సరాలుగా పెరగదు – ఇది రోజువారీ స్క్రీన్ వాడకం యొక్క ఒకటి మరియు నాలుగు గంటల మధ్య గణనీయంగా పెరుగుతుంది.”
డేటా ఏమి చెపుతుంది .
చెన్నైలోని గ్లెనీగల్స్ ఐ సెంటర్ డైరెక్టర్ మరియు త్రినేత్ర ఐ కేర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర మోహన్ పరిశోధన ఫలితాలతో ఏకీభవిస్తున్నారు.
“భారతదేశంలో కూడా, మయోపియా సంభవం గణనీయంగా పెరుగుతోందని చూపించడానికి తగినన్ని క్లినికల్ ఆధారాలు ఉన్నాయి.
స్క్రీన్లు ఇప్పుడు రోజువారీ జీవితంలో అనివార్యమైన భాగం కావడంతో, డిజిటల్ పరికరాలు మయోపియాకు దోహదం చేస్తాయా లేదా అనేది మాత్రమే కాదు – ఎంత ఎక్స్పోజర్ చాలా ఎక్కువ అనేది అని మాత్రమే నిపుణులు చెపుతున్నారు.
భారతీయ జనాభాకు, ముఖ్యంగా పిల్లలకు ఈ అధ్యయనం యొక్క ఔచిత్యాన్ని చర్చిస్తూ, మయోపియాతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నట్లు సూచించే విస్తృతమైన ప్రచురిత సాహిత్యం మరియు క్లినికల్ ఆధారాలను డాక్టర్ రవీంద్ర హైలైట్ చేశారు.
ఈ పరిస్థితి నల్లబల్లను స్పష్టంగా చూడగల వారి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది, దీని వలన చాలామంది నేత్ర వైద్యుడిని సందర్శించి చివరికి అద్దాలు అవసరం అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నారు.
“మన దేశంలో, అద్దాలు ఉపయోగించే పిల్లలలో, చాలా మందికి మయోపియా ఉంది. సగటున, పాఠశాలకు వెళ్లే ఐదుగురు పిల్లలలో ఒకరు అద్దాలు ధరిస్తారు, అయితే ఈ పద్ధతి అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండదు,” అని ఆయన చెప్పారు.
చారిత్రాత్మకంగా, సుదీర్ఘమైన దగ్గర పనిలో నిమగ్నమైన వ్యక్తులలో మయోపియా రేటు ఎక్కువగా ఉందని డాక్టర్ రవీంద్ర జతచేస్తున్నారు.
సహజమైన పగటి వెలుతురు మయోపియా పురోగతిని నెమ్మదిస్తుంది. రోజుకు కనీసం రెండు గంటలు బయట అడుగు పెట్టండి.
చిన్న ఫాంట్లను చదవడానికి కష్టపడటం వల్ల కంటి అలసట మరింత తీవ్రమవుతుంది కాబట్టి, స్క్రీన్ గ్లేర్ను తగ్గించండి మరియు టెక్స్ట్ పరిమాణాన్ని పెంచండి.
ముఖ్యంగా వినోద ప్రయోజనాల కోసం స్క్రీన్ వినియోగాన్ని రోజుకు ఒక గంటకు మాత్రమే పరిమితం చేయండి.
భారతీయ పిల్లలపై ప్రభావం
డిజిటల్ పరికరాల వినియోగం పెరుగుతున్న కొద్దీ, రెండు సంవత్సరాల వయస్సు ఉన్న పసిపిల్లలు కూడా స్క్రీన్లు ఇస్తున్నారు పేరెంట్స్. ఈ ధోరణి ఎంత ప్రమాదకరమో వారు గుర్తించడంలేదు.
2050 నాటికి జనాభాలో 50 శాతం వరకు మయోపిక్ ఉండవచ్చని అంచనాలు సూచిస్తున్నాయని డాక్టర్ రవీంద్ర చెప్పారు, ఇది ఒక ప్రధాన ప్రజారోగ్య ఆందోళనను హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా అధిక మయోపియా ఆరోగ్య సంరక్షణ వనరులపై గణనీయమైన భారాన్ని మోపుతుంది మరియు “రెటీనా డిటాచ్మెంట్ మరియు గ్లాకోమా, రెండూ అధిక స్థాయిల మయోపియాతో సంబంధం కలిగి ఉంటాయి” వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఈ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని, డాక్టర్ రవీంద్ర స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని సలహా ఇస్తున్నారు, ముఖ్యంగా వినోద ఉపయోగం కోసం. “నేడు, పరికరాలు బోధించడానికి మరియు నేర్చుకోవడానికి ఉపయోగించబడుతున్నాయి మరియు దానిని నివారించలేము, కానీ తల్లిదండ్రులు యువకులకు మరియు పెరుగుతున్న పిల్లలకు రోజుకు ఒకటి నుండి రెండు గంటలకు వినోద పరికర వినియోగాన్ని పరిమితం చేయాలి.”
ఆయన తల్లిదండ్రులకు ఆచరణాత్మక సలహా ఇస్తున్నారు: “బహిరంగ కార్యకలాపాల మొత్తాన్ని పెంచండి. బహిరంగ కార్యకలాపాలు సాధారణంగా వినోదభరితమైనవి మరియు సామాజిక బంధం మరియు ఫిట్నెస్తో సహా పిల్లల మొత్తం అభివృద్ధికి సహాయపడతాయి. వీటిని రోజుకు కనీసం రెండు గంటలకు పెంచాలి.”
బహిరంగ కార్యకలాపాలు మయోపియా పురోగతిని నెమ్మదింపజేయడమే కాకుండా దాని సంభవాన్ని కూడా తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు. “ఇది అనుకూల ఉద్దీపన లేకపోవడం వల్ల జరుగుతుంది – అంటే, బహిరంగ కార్యకలాపాల సమయంలో, కన్ను సమీప వస్తువులపై మాత్రమే దృష్టి పెట్టదు. ప్రకాశవంతమైన సహజ సూర్యకాంతి ఉంటుంది, అందువల్ల బహిరంగ ఆట సిఫార్సు చేయబడింది.”
స్క్రీన్ సమయాన్ని రోజుకు ఒక గంట కంటే తక్కువగా ఉంచడం సురక్షితమైన పరిమితి అని అధ్యయనం సూచిస్తుంది. ఎక్స్పోజర్ ఒక గంట మార్కును దాటిన తర్వాత, మయోపియా ప్రమాదం వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది, నాలుగు గంటల పాటు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది మరియు క్రమంగా పెరుగుతుంది.
అధ్యయనంలో పాల్గొనని నేత్ర వైద్యులు కూడా సరళమైన కానీ ప్రభావవంతమైన వ్యూహాలను సిఫార్సు చేస్తున్నారు. బెంగళూరు నేత్రాలయ, బెంగళూరులోని నేత్ర వైద్యుడు డాక్టర్ వీరభద్రయ్య ఈ క్రింది వ్యూహాలను సూచిస్తున్నారు:
20-20-20 నియమాన్ని అనుసరించండి: ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా 20 సెకన్ల పాటు చూడండి.
“పిల్లలు పనిలో ఉన్నప్పుడు ఏమి చేస్తున్నారో తల్లిదండ్రులకు ఎక్కువ పాత్ర ఉండాలి” అని ఆయన జతచేస్తున్నారు. “కేర్టేకర్లు బయట ఆటలను ప్రోత్సహించమని సూచించాలి. పరికరాల వినోద వినియోగాన్ని రోజుకు రెండు గంటల కంటే తక్కువకు పరిమితం చేయాలి. ఈ చర్యలు ప్రపంచం ఎదుర్కొంటున్నట్లుగా కనిపించే మయోపియా మహమ్మారి ప్రభావాన్ని నిరోధించడానికి లేదా కనీసం తగ్గించడానికి సహాయపడతాయి.”
by Srinivas Vedulla | May 4, 2025 | ఆంధ్రప్రదేశ్
జోరందుకున్న రాజధాని అభివృద్ధి పనులు
by Srinivas Vedulla | May 4, 2025 | అభిప్రాయం
Those who are spewing venom at Amaravati must be stopped
‘అమరావతి వల్ల ఒక సామాజిక వర్గం మాత్రమే లబ్ది పొందుతుంది. లక్ష కోట్లు ఇక్కడే పెట్టి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను వదిలేస్తారా ? ‘ ఇలాంటి విష ప్రచారాలతో 2014-2019 మధ్య కాలంలో రాజకీయంగా లబ్ది పొందడమే కాదు . . టీడీపీని , ఆ పార్టీ కీలక నేతలపై జనంలో అనుమానాలు క్రియేట్ చేయడంలో వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ అయింది.
జగన్ మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి జనం మూలన కూర్చోబెట్టినా.. కొందరు కీలక నేతలైతే కుదేలయ్యారు కానీ , ,ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. విష ప్రచారాలను చొప్పిస్తూనే ఉన్నారు . వీరిని కట్టడి చేయడం కూటమి సర్కార్ కి చేతకావడంలేదనే చెప్పాలి. ఒకటీ , ఆరా కేసులు పెట్టినా వాళ్లలో భయం పుట్టించలేకపోతున్నారన్న విమర్శలు కూటమి కేడర్ నుంచే బలంగా వినిపిస్తున్నాయి .
అమరావతిపై విషం చిమ్మడం ఆపలేరా ?
‘‘అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు అప్పులు చేసి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన సొమ్మును ఒకేచోట ఖర్చు చేయడం ఏమిటి?’’ అంటూ ప్రజలలో విష ప్రచారం చేస్తున్న వారికీ వాస్తవాలు తెలుసు . అయినా విషం చిమ్ముతున్నారు . అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయింది. హైదరాబాద్లో, అంటే సైబరాబాద్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నుంచి అందుతున్న ఫలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని గుర్తు చేసుకోవాలి .
రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు అవసరమా? అని వైసీపీ సోషల్ మీడియాతో పాటు , ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ గొంతు చించుకుంటూనే ఉన్నారు . ఇలాంటి వాళ్లు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది. హైదరాబాద్లో ఇప్పటికీ ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకొనే వారికి ఈ భూములను ఆకర్షణగా చూపుతున్నారు. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా ముందుకు రావాలి. ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా నిర్మాణాలు జరిగినప్పుడే రాజధానికి ఒక రూపు వస్తుంది. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నసుగుతున్నవారు ఈ విషయం తెలుసుకోవాలి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటానికి కారణం ??? చెన్నయ్, బెంగళూరు, ముంబై వంటి మహానగరాలు ఉండటం వల్లనే ఈ రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతుంది . ఇలాంటివన్నీ ప్రజలలోకి వెళ్లేలా కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలి .
మేధావుల ముసుగులో . ,
అమరావతిపై లేనిపోని విష ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా , మేధావుల ముసుగులో జనాన్ని రెచ్చగొడుతూ . . రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారి ప్రతి చర్యలను గమనించడానికి పోలీసు శాఖలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి . .. నిఘా ద్వారా విష బీజాలు నాటే వారిని ఆదిలోనే అడ్డుకోవాలి . లేకపోతె . .. అమరావతి అనే మహా యజ్ఞంలో విషం చిమ్మే వారు మరింత పెట్రేగిపోయే ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ గ్రహించి మేల్కోవాలి. మెతక వైఖరి వీడి , అరాచకవాదులపై కొరఢా ఝళిపించాలి .
by Rama Chandra P | May 3, 2025 | జనరల్
జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగానే కాకుండా . .. తెలుగింటి అల్లుడిగా సుపరిచుతులు. భారత్ తో వాణిజ్య ఒప్పందం బలపరచుకునేందుకు యుఎస్ ప్లాన్ ఏమిటి ? దీనికోసం జేడీ వాన్స్ ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లనున్నారు .
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్)పై చర్చలు జరుగుతున్న వేళ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్ కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, ఆయన చాలావ టఫ్ నెగోషియేటర్ అని, ఆయన చాలా బాగా బేరసారాలు చేస్తారని, అందుకే తాము ఆయనను గౌరవిస్తామని జేడీ వాన్స్ అన్నారు.
ట్రేడ్ డీల్పై పురోగతి
ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్- ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ఇరుదేశాల నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు, గ్యాస్ల దిగుమతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ సైతం భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. జేడీ వాన్స్ తాజా ప్రకటనతో త్వరలోనే ఒప్పందం ఖరారుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
అగ్రి ప్రొడక్ట్స్ పై ట్యాక్స్ తగ్గిస్తారా?
‘భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల, అమెరికా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే భారత్ మాత్రం తమ దేశం నుంచి ఎన్నో ఏళ్లుగా ప్రయోజనం పొందుతోంది’ అని వాన్స్ ఇటీవలే వ్యాఖ్యానించారు . వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్తో పాటుగా జపాన్, కొరియా తదితర దేశాలతోనూ చర్చలు జరుపుతున్నామని వాన్స్ చెప్పారు.
by Rama Chandra P | May 2, 2025 | ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హామీలు ప్రకటించని ప్రధాని
చంద్రబాబును పొగడం – ప్రసంగం తెలుగులో ప్రారంభించడం.. ఇవే మోడీ చేసినవి
ఆంధ్రుల రాజధాని అమరావతికి ఎన్నో వరాలు ప్రకటిస్తారు.. అని మోడీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. హామీల మాటల ఉన్నా.. ‘అమరావతికి చట్టబద్దత ‘ అంశంపై కూడా మోడీ పెదవి విప్పలేదు . కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ . … మోడీ సభకు ఒకరోజు ముందు అమరావతి చట్టబద్దత అంశం పరిశీలిస్తాం . . అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు . అమరావతి రైతులు చంద్రబాబుకు చేసిన విజ్ఞప్తి కూడా చట్టబద్దత . దీనిపై ప్రధానితో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు . అయితే మోడీ మాత్రం దీనిపై ప్రస్తావించకుండా దాటవేశారు .
పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని , అమరావతికి సహకారం అందిస్తామని మాత్రమే చెప్పారు మోడీ . ..
జగన్ భయం ఎలా పోగొడతారు బాబు గారూ.. టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు . 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి . .. అమరావతి రాజధాని కాదని , , మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చి గందరగోళంలో పడేసారు . అమరావతి కోసం భూములిచ్చిన 29 వేలమంది రైతులు రోడ్డెక్కారు . దేశంలోనే అత్యంత అరుదైన ఉద్యమం చేసారు .
మరోమారు జగన్ అధికారంలోకి రారన్న భరోసా ఇస్తారా ? అంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సైతం చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , లోకేష్ లను అడుగుతున్నారు . జగన్ వస్తే . .. భారీ పెట్టుబడులు పెట్టిన మాకు భరోసా ఏమిటి ? అంటూ ఇప్పటికే కీలకమైన పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరక్క వారు వేరే రాష్ట్రాల వైపు ద్రుష్టి సారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్ .
ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ
- తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
- దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్న ప్రధాని
- ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా: ప్రధాని
- ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ
- దాదాపు 60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా: ప్రధాని
- ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు బలమైన పునాదులు: ప్రధాని
- చంద్రబాబు, పవన్కల్యాణ్కు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
- అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
- రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
- రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
- రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన
- ప్రధాని సభకు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన లక్షలమంది ప్రజలు
- సరైన సమయంలో సరైన నేత … : సీఎం చంద్రబాబు
- ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు: సీఎం చంద్రబాబు
- గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు: సీఎం చంద్రబాబు
- గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి: సీఎం
- పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారు: సీఎం
- మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం: సీఎం
- గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు: సీఎం
- ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారు: సీఎం
- ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
- మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
- మోదీజీ మేమంతా మీకు అండగా ఉన్నాం: సీఎం
- ప్రజలతోనూ వందేమాతరం, భారత్మాతాకి జై నినాదాలు చేయించిన సీఎం
- సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారు: సీఎం
- ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు: సీఎం
- మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ: సీఎం
- ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి ఎదిగింది: సీఎం
- త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది: సీఎం
- 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది: సీఎం
- ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోదీ కృషిచేస్తున్నారు: సీఎం
- దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు
- మోదీ నాయకత్వంలో భారత్.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది: సీఎం
- కూటమిగా పోటీచేయడంతో 93 శాతం స్ట్రైక్రేట్తో విజయం సాధించాం: సీఎం
- వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం: సీఎం
- కేంద్ర సాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: సీఎం
- దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది: పవన్ కల్యాణ్
- ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు: పవన్ కల్యాణ్
- రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: పవన్ కల్యాణ్
- అమరావతి రైతుల త్యాగాలను మరచిపోము: పవన్ కల్యాణ్
- అమరావతి రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటాం: పవన్ కల్యాణ్
- రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం: పవన్ కల్యాణ్
నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్
- ఒక్క పాకిస్థాన్ కాదు వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీచేయలేరు: మంత్రి లోకేశ్
- భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు: మంత్రి లోకేశ్
- భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉంది: మంత్రి లోకేశ్
- నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్
- మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం: లోకేశ్
- ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారు : లోకేశ్
- మోదీ, బాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు: లోకేశ్
- 2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు: లోకేశ్
- రాజధాని కూడా లేకుండానే విడిపోయాం: లోకేశ్
- చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు: లోకేశ్
- చంద్రబాబుపై కోపంతో అమరావతిని పక్కనబెట్టారు: లోకేశ
by Rama Chandra P | May 1, 2025 | ఆంధ్రప్రదేశ్
రాజధాని మారకుండా పార్లమెంటులో చట్టబద్దత హామీ అయినా ఇస్తారా?
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంబించి . .. ఏయే వరాలు ప్రకటిస్తారు? 2015లో అమరావతి శంఖుస్థాపన చేసినపుడు నీళ్లు – మట్టి ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్న అప్పటి NDA సర్కార్ . .. 2025 లో ఏమి చేయబోతోంది. ఇప్పటి వరకు వరల్డ్ బాంక్ నుంచి, ఇతర సంస్థల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించారు . ఇంతవరకు బాగానే ఉంది . కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వబోయే పథకాలపై మోదీ క్లారిటీ ఇవ్వాలని ఆంధ్రప్రజలు కోరుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారు . దానిపై గట్టిగా అడిగే సత్తా ఉన్న నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కనిపించరు. 2019-2024 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ , ఈడీ కేసుల భయంతో స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రాన్ని అడదకుండా దొంగాట ఆడేసారు .
ఇపుడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2014-2019 మధ్య సీయంగా ఉన్నారు . చంద్రబాబుకు కేసుల భయం లేకపోయినా … మెతక వైఖరి అవలంబించి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు . ఇపుడు అడిగే పరిస్థితి ఉన్నా , , అమరావతి , పోలవరం పనులకు భారీగా నిధులు రాబట్టుకోవాలన్న కుతూహలంతో స్పెషల్ స్టేటస్ గురించి ఎలాగూ మోదీ ని అడగే పరిస్థితి ఉండదు .
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఆధారపడి ఉందన్న విషయం తెలిసిందే . రాజకేయగ మన అవసరం ఉన్నా . .. ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి.
అమరావతికి చట్టబద్దత హామీ ఇస్తారా ? రాజధాని ఏర్పాటు సమయంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సపోర్టుగా మాట్లాడారు. 33 వేల ఎకరాలు కూడా సరిపోదన్నారు . 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని సర్వనాశనం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు . అమరావతిపైనా , ఆ ప్రాంతంలో ఒక సామాజిక వర్గంపైనా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు . రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై రాక్షసత్వం చూపారు . దేవుడు కరుణించి వారి ఉద్యమం సక్సెస్ అయింది . వారి మనోభీష్టం మేరకు జగన్ ని ఆంధ్రప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు . ఇంతవరకు బాగానే ఉంది . చంద్రబాబు నాయుడు , కూటమి నేతలు తామే ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా అధికారంలో ఉంటామన్న భ్రమలలో తేలియాడుతున్నారు . అయితే ప్రజలు మాత్రం కొన్ని అనుమానాలలోనే ఉంటారు . ఆంధ్రప్రదేశ్ గ్రహపాటు బాగోక మరోమారు జగన్ అధికారంలోకి వస్తే . . పరిస్థితి ఏమిటి ? అన్న భయంలో మాత్రం కొందరు ఉన్నారు . వీరికి కూటమి ఎటువంటి భరోసా ఇస్తుంది . అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీతో ‘అమరావతి చట్టబద్దత ‘ హామీ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు . చంద్రబాబు ఈ పని చేయగలిగితే సక్సెస్ అయినట్లే . అమరావతి చట్టబద్దత అంశంపై మోదీ ఎటువంటి హామీ ఇవ్వకపోతే మాత్రం అమరావతి భవితవ్యంపై నీలినీడలు అలుముకునే ప్రమాదం పొంచి ఉంటుంది .
ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తారు. అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభిస్తుండటంతో ఈ పర్యటన కీలకంగా మారింది. ఈ సందర్భంగా మోదీ.. లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ….. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2.55కి కేరళలోని తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకి వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3.15కి అమరావతి హెలిప్యాడ్కి చేరతారు. తర్వాత 3.25కి సభా వేదిక దగ్గరకు వెళ్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4.45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అప్పుడే అమరావతి పెవిలియన్ను పరిశీలిస్తారు .