‘బెంగాల్​ బీజేపీ’ భారీ విజయం

‘బెంగాల్​ బీజేపీ’ భారీ విజయం

ఈ భారీ సక్సెస్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ వీరే!

కేంద్ర నాయకత్వం నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అనేక మంది నేతల కృషి-

– అత్యధికంగా 66 ర్యాలీలు, 63 ప్రాంతాల్లో రోడ్​ షోలు నిర్వహించిన అమిత్ షా

15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు పశ్చిమ బెంగాల్ లో .. బీజేపీ చెక్ పెట్టగలిగింది . చరిత్రలో తొలిసారిగా బంగాల్​లో కమలం పార్టీ పాగా వేయడం రికార్డ్ . కాషాయదళానికి దక్కిన ఈ విజయం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు > అనేది రాజకేయన్గా ఆసక్తికరం . ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పక్కా వ్యూహంతో అడుగులు వేయడం బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని దక్కించుకుంది . ఈ క్రమంలోనే బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన బంగాల్ మాస్టర్ మైండ్స్​ ఎవరనేది ఇపుడు హాట్ టాపిక్ .

ప్రధాని మోదీ

బెంగాల్ లో అధికారం చేపట్టాలని మోడీ ముందు నుంచీ బలంగా ప్రయత్నించారు . బీజేపీ గెలుపు బాధ్యతలను ప్రధాని మోదీ తన భుజాలపై వేసుకుని విస్తృత ప్రచారం చేశారు. బంగాల్ సంప్రదాయంలో భాగమైన ఝాల్​మురి తినడంతో పాటు కాలీ మాత ఆలయాలను సందర్శించి ప్రజలను ఆకర్షించారు. మమతా బెనర్జీ లక్ష్యంగా మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగాలు కాషాయ క్యాడర్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అభివృద్ధి పనులతో పాటు డబుల్ ఇంజిన్​ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు .

అమిత్ షా చాణిక్యము . ..
బంగాల్​ గెలుపులో అమిత్ షా చాణక్య వ్యూహాలు ఎక్కువ ఫలితాలు నిచ్చాయి . బంగాల్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అత్యధికంగా 65 ర్యాలీలు, 63 ప్రాంతాల్లో రోడ్​ షోలు నిర్వహించారు. ‘మిషన్ బంగాల్​’తో పార్టీ బూత్​ స్థాయి నుంచి బలోపేతం కోసం పనిచేశారు. స్థానిక నేతలను సమంవ్యం చేయగలిగారు . అమిత్‌షానే స్వయంగా 152కు పైగా నియోజకవర్గాల్లోని 44,000 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో జరిగిన సమావేశాలను పర్యవేక్షించారంటే బీజేపీ ఏ స్థాయిలో దృష్టిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

శాంతిభద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో తనదైన శైలిలో ప్రచారం చేశారు అమిత్ షా. పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 100% కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఇస్తామని తెలిపారు.

భూపేంద్ర యాదవ్​ ఇంచార్జ్ బాధ్యతలు . ..
బంగాల్​ గెలుపులో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్​. ఎన్నికల నేపథ్యంలో గతేడాది బంగాల్​ ఇంఛార్జ్​గా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్​ను నియమించింది అధిష్ఠానం. సంస్థాగత వ్యవహరాలు, సమన్వయం చేయడంలో తెర వెనుక ఎంతో కష్టపడ్డారు. అభ్యర్థుల ఎంపిక నుంచి కూటమి ఏర్పాటు వరకు పాలుపంచుకున్నారు. ముఖ్యంగా గెలుపు గుర్రాలను గుర్తించి, తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేశారు. నెలరోజులపాటు బెంగాల్ లో ఎక్కువ సమయం గడిపి . .. ఎన్నికల నిర్వహణలో భూపేంద్ర యాదవ్​ కీలక పాత్ర పోషించారు.

శామిక్ భట్టాచార్య,, సువెందు అధికారి . ,
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శామిక్ భట్టాచార్య ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయంతో పాటు వ్యూహాలను అమలు చేశారు. అభ్యర్థుల ఎంపిక, బూత్​ స్థాయి సన్నద్ధత, పార్టీ సంస్థాగత వ్యవస్థ పనితీరు విషయంలో సాయం అందించారు. అటు అమిత్ షా లాంటి నేతల ప్రసంగాలను స్థానిక బంగాలీలోకి అనువాదం చేస్తూ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయుడిగా ఉన్న సువేందు అధికారి, బంగాల్​లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన దూకుడు ప్రచారం, అవినీతి, రాజకీయ హింస వంటి సమస్యలపై దృష్టి పెట్టడం, కీలక ఓటు బ్యాంకులను ఏకీకృతం చేయడానికి కృషి చేశారు.

సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రామ్‌ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్‌లో వేలాది ఎకరాల్లో సెజ్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. నందిగ్రామ్‌తోపాటు సింగూర్‌ ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి, 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి సహకరించాయి. తృణమూల్‌ సర్కారులో ఆయన వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. మమత ప్రధాన అనుచరుడిగా, పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా సువేందు అధికారి ఎదిగారు. ఆ తర్వాత కాలక్రమేణా మమతతో సువేందుకు విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పెత్తనం పెరగడం వంటి కారణాలతో ఆయన 2020లో టీఎంసీతో 22 ఏళ్ల అనుబంధాన్ని వదులుకున్నారు . ఇవన్నీ బిజెపి గెలుపులో కీలకంగా ఉపయోగపడ్డాయి .

తమిళ రాజకీయాల్లో కొత్తశకం- విజయ్ సునామీ

తమిళ రాజకీయాల్లో కొత్తశకం- విజయ్ సునామీ

విజయ్ దెబ్బకు ‘ద్రవిడ’ పార్టీల విలవిలా — TVK గెలుపునకు కారణాలు ఇవే!

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది .. సుమారు ఐదు దశాబ్దాలుగా డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే దోబూచులాడిన రాజకీయం . .. ఇప్పుడు కొత్త నాయకుడి చేతికి చిక్కింది . తమిళ తెరపై విశేష ప్రజాదరణ పొందిన దళపతి విజయ్ స్థాపించిన ”తమిళగ వెట్రి కళగం” (టీవీకే) తొలి ఎన్నికల్లోనే చారిత్రక విజయాన్ని దక్కించుకుని చరిత్రను తిరగరాసింది . ఈ అప్రతిహత విజయానికి దారి తీసిన ప్రధాన కారణాలపై ”అభి న్యూస్ ‘ ‘ ప్రత్యేక కథనం.

తమిళనాటలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది . 1967 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే అధికారంలో ఉండటం, విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన వంటి అంశాలు తమిళ ఓటర్లలో తీవ్ర విసుగు కలిగించాయి . మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న తమిళులకు టీవీకే ఆశాకిరణంగా కనిపించింది.

స్పష్టమైన సిద్ధాంతపరంగా
విజయ్ వ్యక్తిగత నిర్ణయాలు కూడా పార్టీ విజయానికి కీలకంగా మారాయి. తన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయడం ఆయనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తున్నానని ఇచ్చిన సందేశం ఓటర్లను బలంగా ఆకట్టుకుంది. ఇక సిద్ధాంతపరంగా కూడా టీవీకే స్పష్టమైన దిశను చూపించింది. మత, కుల విభజనలకు దూరంగా ఉండే సెక్యులర్ భావజాలం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లింది. పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఆలోచనలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

ఫ్యాన్ బేస్​ మరింత బలంగా . …
విజయ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ ఈ ఎన్నికల్లో ప్రధాన బలం అయింది. సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ మక్కల్ ఇయక్కం క్రమంగా శక్తిమంతమైన రాజకీయ క్యాడర్‌గా మారింది. రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. యువత మద్దతు టీవీకే విజయానికి కీలకం. మొదటిసారి ఓటు వేసిన యువత పెద్దఎత్తున విజయ్‌కు మద్దతు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్కరణలు, పారదర్శక పరీక్షా విధానం వంటి హామీలు వారికి ఆకర్షణీయంగా మారాయి. మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు కూడా సైలెంట్ ఓటును టీవీకే వైపు మళ్లించాయి.

విజయ్ వ్యక్తిత్వం కలసివచ్చింది . ..
డిజిటల్ ప్రచారం కూడా పార్టీకి బలంగా పనిచేసింది. సోషల్ మీడియా వేదికల్లో విజయ్ అభిమానులు ముందుండి ప్రచారం నిర్వహించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రజలకు చేరేలా చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపింది. విజయ్ వ్యక్తిత్వం కూడా ఓటర్లను ఆకట్టుకుంది. సాధారణ జీవనశైలి, ప్రజల్లోకి వెళ్లి మమేకం కావడం, అభిమానులతో దగ్గర సంబంధం పెట్టుకోవడం వంటి లక్షణాలు ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. అన్నాగా పిలిచే ఈ అనుబంధం ఓట్ల రూపంలో ప్రతిఫలించింది.

వర్షాలు తక్కువే!  నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం

వర్షాలు తక్కువే! నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం

ఈ ఏడాది  సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడుతాయని ఐఎండీ అంచనా – సాధారణ సగటులో 92 శాతం వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడి – ఎల్‌నినో వల్ల వర్షాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా

ఎల్ నినో… ఇపుడు ఈ పేరు మన రైతాంగానికి నిద్రలేకుండా చేస్తోంది . తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తబోతున్నాయని ఇటీవల జరిగిన పరిశోధనలను ఐఎండీ నిర్ధారించడంతో మరింత అలజడి రేగింది .

దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీర్ఘకాలిక వర్షపాత అంచనాల ప్రకారం ఈ సీజన్‌లో వర్షపాతం సాధారణ సగటులో 92 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. దీనికి అదనంగా లోటుగా 5 శాతం మార్పు ఉండవచ్చని తెలిపింది. ఐఎండీ అంచనాల ప్రకారం వర్షపాత అంచనా 1971-2020 మధ్య కాలంలో దేశ సగటు వర్షపాతం 87 సెం.మీ.గా ఉంది. ఈ ఏడాది వర్షపాతం ఇందులో 90 నుంచి 95 శాతం మధ్య (సాధారణం కంటే తక్కువ) నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని IMD అంచనా వేసింది.

ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీన ఎల్​నినో పరిస్థితులు తటస్థ స్థితికి మారుతున్నాయని అయితే రుతుపవన కాలంలో ఎల్​నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది సాధారణంగా వర్షాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నప్పటికీ, సీజన్ ముగిసే సమయానికి ‘పాజిటివ్ ఐఓడీ’ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ మోడల్స్ సూచిస్తున్నాయి.

మన దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఈశాన్య, వాయువ్య ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల గమనానికి సంబంధించి మరిన్ని ఖచ్చితమైన వివరాలతో కూడిన రెండో విడత అంచనాలను మే చివరి వారంలో విడుదల చేస్తామని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడు ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలను వెల్లడించనున్నారు.

ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాడ్పులు:  రాష్ట్రంలో రోజురోజుకీ ఎండలు, వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 11 గంటలు దాటిందంటే ప్రజల ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడతున్నారు. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఎల్ నినో దెబ్బ . .. జూన్ , జులై నెలల్లో వర్షాలు బాగా తక్కువ కురుస్తాయని చెపుతున్నారు . అంతేకాకుండా . . వర్షానికి , వర్షానికి మధ్య 40-50 రోజుల గ్యాప్ ఉంటుందని వేస్తున్న అంచనాలు ముక్యంగా మెట్ట ప్రాంత రైతాంగాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది .

బ్యాంకు లాకర్లు..  సురక్షితమేనా ?

బ్యాంకు లాకర్లు.. సురక్షితమేనా ?

బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానంతో పెరుగుతున్న అనుమానాలు

బ్యాంకు లాకర్లలో దాచుకున్న విలువైన వస్తువులకి ఉన్న బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన ప్రశ్నకి ఇలా సమాచారం ఇచ్చారు.

లాకర్లలో దాచిన వస్తువులను బ్యాంకు అధికారులు చూడరు (చూడడం బ్యాంకు రూల్స్ కి విరుద్ధం) కాబట్టి, వాటిని రికార్డు చేయరు, అంచేత వాటి విలువ రిజిస్టర్ కాదు. సో.. విలువ ఆధారంగా బీమా కవరేజీ ఇవ్వబడదు.

దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంకుల్లో మోసాలు వంటివి జరిగిన సందర్భాల్లో లాకర్లకు నష్టం వాటిల్లితే లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సొమ్ముని బ్యాంకులు పరిహారంగా చెల్లిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు .

బ్యాంకు లాకర్ చార్జీలవిషయానికొస్తే.. భారతదేశంలో అనేక రేంజ్ లు ఉన్నాయి. ముఖ్యమైన జాతీయ బ్యాంకుల్లో పరిశీలిస్తే ఏరియా లొకేషన్, లాకర్ సైజు ని బట్టి ఏడాదికి 1000 రూపాయలనుంచి 12000 వరకూ లాకర్ అద్దె ఉంటుంది. కొన్ని ఇతర బ్యాంకుల్లో అత్యధికంగా 25000 నుంచి 40000 వరకూ కూడా వార్షిక లాకర్ చార్జీలు ఉన్నాయి.

దీన్ని బట్టి గరిష్టంగా లక్ష రూపాయల నుంచి 40 లక్షల వరకూ మాత్రమే లాకర్ నష్టానికి వినియోగదారులు పరిహారం పొందగలరన్నమాట.

బ్యాంక్ లాకర్లు సర్వ సురక్షితం అని భావిస్తారు, కానీ అవి 100% భద్రతను హామీ ఇవ్వవు. ఇంట్లో విలువైన వస్తువులను ఉంచడం ప్రమాదం కాబట్టి లాకర్లు అంతకంటే సురక్షితమైనవి. అయినప్పటికీ, పెద్ద స్థాయి దొంగతనాలు, సిబ్బంది ప్రమేయంతో జరిగే మోసాలు, అలాగే చెదలు, తేనెటీగలు, ఎలుకలు, నీటి లీకేజీ వంటి ఘటనల కారణంగా లాకర్లకు నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం.

బ్యాంక్ లాకర్లు బలమైన స్ట్రాంగ్ రూమ్స్ లోనే ఉంటాయి. అలారమ్‌లు, సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. అయినప్పటికీ, దొంగతనం, అగ్ని ప్రమాదం, వరదలు వంటి ఘటనల్లో నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది.

RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంక్ నిర్లక్ష్యం లేదా సిబ్బంది మోసం వల్ల లాకర్ దెబ్బతిన్నాకూడా బ్యాంక్ చెల్లించే పరిహారం వార్షిక అద్దెకి 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు, ఒక లాకర్ అద్దె ₹2,000 అయితే, గరిష్ట పరిహారం ₹2,00,000 మాత్రమే. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదం వంటి సహజ విపత్తుల వల్ల నష్టం జరిగితే, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు నిరూపిస్తే బ్యాంక్ నష్టానికి పైసా పరిహారం కూడా ఇవ్వక్కర్లేదు.

లాకర్ ఎంత చిన్నదైనా అందులో కుక్కి కుక్కి మరీ బంగారం, నగదు విలువైన పత్రాలను దాచడం కొందరు వినియోగదారుల అలవాటు. ప్రధానంగా అక్రమార్జనపరులు కొందరు లాకర్లను తమ రహస్య సంపదని దాచడం కోసం తీసుకుంటూ ఉంటారు.

కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది లాకర్‌లను దెబ్బతీయడం లేదా వాటిలో సొమ్ముని దొంగతనం చేయడం జరిగిన ఘటనలు కూడా పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. ఒక లాకర్‌ను 7 సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే, అద్దె చెల్లించినా కూడా బ్యాంక్ కి దాన్ని తెరిచే అధికారం ఉంది. వస్తువుల జాబితా ఉండదు కాబట్టి దొంగతనం జరిగితే నిరూపించడం కష్టం. అక్రమ సంపద అయితే.. కొందరు వినియోగదారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా కూడా మారుతుంది.

సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు లాకర్‌ను ఓపెన్ చేసి తనిఖీ చేయాలనీ బ్యాంకులు చెబుతాయి. లాకర్లలో భద్రపరచిన వస్తువుల జాబితా, ఫోటోలు, బిల్లులు ఇంట్లో భద్రపరచుకోవాలి. అలాగే

నామినీ రికార్డు పర్ఫెక్ట్ గా ఉంటే వినియోగదారుడు మరణించిన సందర్భంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తవు . దీనిపై స్పష్టంగా ఉండాలి .

గ్యాస్ కొరతలేనేలేదు . .. నో టెన్షన్ . ..

గ్యాస్ కొరతలేనేలేదు . .. నో టెన్షన్ . ..

గృహావసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఇవేవీ ప్రస్తుతానికి దేశంలో ఏమాత్రం కొరత లేదు. జనం ఆందోళన చెందక్కర్లేదు

యుద్ధం ఇలాగే కొనసాగినా కూడా కనీసం మరో రెండు మాసాలు మనకి ఇంధనకొరత భయం లేదని కేంద్ర ప్రభుత్వపు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే కొరత వస్తుందనే భయంతో ప్రతి వాళ్ళూ ముందుజాగ్రత్తగా, స్వార్థంతో స్టోరేజ్ చేసుకునే ప్రయత్నాలు చేయడమే అసలైన సమస్య. బ్యాంకు నష్టాల్లో ఉందనే ప్రచారం జరిగిందంటే.. ఒక్కసారిగా డిపాజిటర్లు తమ సొమ్ము తీసేసుకోవడానికి లైన్లలో నిలబడతారు. అప్పటివరకూ బ్యాంకు బాగానే ఉన్నా.. ఈ లైన్ల దెబ్బకి నిజంగానే కుదేలైపోతుంది. అలాగే ఒకేసారి వందలు, వేలమంది వినియోగదారులు గ్యాస్ రీఫిల్ బుకింగ్ లు చేయడం, వందలాది వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం బ్యాంకులకు పోటెత్తడం వలన స్వతహాగానే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ క్యూ లు సైకలాజికల్ గా సమాజ స్టెబిలిటీని దెబ్బతీస్తాయి. ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దేశ రక్షణ, ఇంధన భద్రతకి చేపట్టాల్సిన అంతర్జాతీయ చర్యలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన భారం పాలకులపై ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి అనవసర ఒత్తిడి వారిపై పెంచకుండా, బాధ్యతగా వ్యవహరించడం పౌరుల విధి.

ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రం కొంత రిస్ట్రిక్షన్ వచ్చిందనేది నిజం. వచ్చిన కొరత కంటే ఆయా సంస్థలు, అసోసియేషన్లు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి బాగా ఎక్కువగా ఉంది. తినడానికి హోటల్ తప్ప మరోదారి లేనివాళ్లు కొంత ఇబ్బంది పడతారు తప్ప, అందరికీ ఇదేమీ సమస్యకాదు. చిన్న కాకా హోటళ్లు, ఇళ్లవద్ద ఆహారం తయారు చేసి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్రియాశీలకం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.

హర్ముజ్ జలసంధినుంచి ఇరాన్ మన దేశపు నౌకలను అనుమతించడం, రష్యా కోరినంత చమురుని భారత్ కి విక్రయించడం.. అలాగే క్లిష్ట సమయంలో ఒత్తిడి తగ్గించే ధోరణితో అమెరికా వ్యవహరించడం.. ఇవన్నీ భారత దౌత్య విజయాలే.. లేదా మనదేశంపై చిరకాలంగా ప్రపంచానికి ఉన్న గుడ్ విల్ కి ప్రతిగా లభించిన అవకాశాలే!

ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఎంతో కొంత ప్రభావితం అయ్యే దేశాల్లో భారత్ ముందుంటుంది. అలాగని మనమీద బాంబులు ఎప్పుడూ పడవు. స్వరాజ్యం తర్వాత (చైనా, పాకిస్థాన్ లతో మనం ప్రత్యక్షంగా చేసిన యుద్ధాల్లో మినహా) ఎప్పుడూ మనదేశంపై బాంబు పడలేదు. కానీ ప్రపంచపు ప్రతి సంక్షోభమూ పరోక్ష ప్రభావాన్ని చూపడంచేత భారత్ పై ధరల బాంబులు పడుతూ ఉంటాయి.

గతంలో గల్ఫ్ యుద్ధం సమయంలో మనం గల్ఫ్ సర్చార్జిలు కట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాలిబన్ యుద్ధం సమయంలో, ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకున్న సమయంలో కూడా భారత్ లో ధరలు పెరిగాయి. దిగుమతులపై ఎక్కువ ఆధారపడడం, ఎగుమతి దిగుమతులు జరిగే రవాణా మార్గాల్లోని దేశాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం వంటివే భారత్ ధరలపరంగా ప్రభావితం కావడానికి అసలు కారణాలు. కొరత వలన సమస్య రాదు.. కొరత వచ్చే అవకాశాలపై ప్రచారంతో భయపెట్టి… కృత్రిమ కొరత సృష్టించే అవినీతి పరులతోనే సమస్య వస్తుంది.

ప్రపంచం యుద్ధమేఘాలకింద అవస్థలు పడుతున్న ఈ కష్టసమయంలో ప్రకృతి, పరిస్థితులు, ఘనమైన మన వారసత్వం, ప్రస్తుత నాయకత్వం కలసి రాబట్టే మనం ఈమాత్రమైనా ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధం త్వరగా ముగిసిపోతే భారతదేశంలో వారం రోజుల్లోనే అంతా యథాతథ పరిస్థితికి వచ్చేస్తుంది. పరిస్థితి మరీ దిగజారిపోయి.. యుద్ధం మరింతకాలం, మరిన్ని దేశాలకు విస్తరించినా కూడా భారత్ కి ప్రత్యక్ష భయం అయితే లేదు. స్వరాజ్య భారతం సుమారుగా గత 77 సంవత్సరాల్లో అనుసరించిన విదేశాంగ విధానం, ఎన్నడూ దురాక్రమణకు, ముందస్తు యుద్ధానికి పాల్పడని మన వారసత్వపు మంచితనం ఇందుకు ప్రబల కారణాలు. నాటి నెహ్రూగారి అలీన విధానం మొదలు నేటి మోదీ గారి స్వతంత్ర విదేశాంగ విధానం వరకూ కూడా భారత్ సంప్రదాయబద్ధమైన లక్ష్మణరేఖను పాటిస్తూనే వస్తోంది…. అదే మన దేశానికి శ్రీరామరక్ష.

అగ్రభాగాన దక్షిణాది … ఆదాయంలో ముందంజ

అగ్రభాగాన దక్షిణాది … ఆదాయంలో ముందంజ

భారతదేశ తలసరి ఆదాయ ర్యాంకింగ్స్‌లో దక్షిణ రాష్ట్రాలు మరోసారి అగ్రస్థానంలో నిలబడ్డాయి . ఈ విషయాన్ని ఆర్‌బిఐ గణాంకాలు చూపుతున్నాయి.
ప్రస్తుత ధరల ప్రకారం తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ₹3,87,623తో తెలంగాణ, దేశంలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉంది.

జాతీయ స్థాయిలో మొదటి 10 స్థానాల్లో ఐదు దక్షిణ రాష్ట్రాలుఈ ర్యా0కింగ్ లో చోటు దక్కించుకున్నాయి . ప్రస్తుత ధరల ప్రకారం తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి (NSDP) ₹3,87,623తో తెలంగాణ, ఢిల్లీ తర్వాత దేశంలో రెండో స్థానంలో ఉంది.

ఆ తర్వాత కర్ణాటక ₹3,80,906, తమిళనాడు ₹3,61,619, కేరళ ₹3,08,338 మరియు ఆంధ్రప్రదేశ్ వరుసగా ఉన్నాయి.

దీనికి విరుద్ధంగా, పెద్ద ఉత్తర రాష్ట్రాలు చాలా దిగువ స్థానాల్లో ఉన్నాయి. ఉత్పత్తి పరంగా భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మహారాష్ట్ర, తలసరి NSDP ₹3,09,340తో ఆరో స్థానంలో ఉంది.

మధ్యప్రదేశ్ ₹1,52,615తో 22వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ ₹1,08,572తో 24వ స్థానంలో మరియు బీహార్ ₹69,321తో అన్ని రాష్ట్రాలలో చివరి స్థానంలో ఉన్నాయి. అత్యధిక ర్యాంకు పొందిన దక్షిణ రాష్ట్రానికి మరియు బీహార్‌కు మధ్య వ్యత్యాసం ఐదు రెట్లకు పైగా ఉంది.

తమిళనాడు మరియు కర్ణాటక దక్షిణ భారతదేశ ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం తమిళనాడు నికర రాష్ట్ర దేశీయోత్పత్తి (NSDP) ₹27,92,49,598 లక్షలుగా ఉంది, కర్ణాటక ₹26,03,94,756 లక్షలతో దానికి దగ్గరగా ఉంది.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి, వాటి NSDPలు వరుసగా ₹14,87,03,908 లక్షలు మరియు ₹14,22,99,773 లక్షలు. కేరళ ₹11,11,22,940 లక్షలతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా, దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయిన మహారాష్ట్ర, ₹39,57,31,855 లక్షల నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (NSDP)తో, తలసరి NSDP ₹3,09,340గా ఉంది, ఇది కేరళ కంటే కొద్దిగా మాత్రమే ఎక్కువగా ఉంది.

తమిళనాడు మరియు కర్ణాటకతో పోల్చదగిన ₹26,00,00,416 లక్షల NSDP ఉన్న ఉత్తరప్రదేశ్, తలసరి ఆదాయం కేవలం ₹1,08,572గా నమోదు చేసింది, ఇది దేశంలోనే అత్యల్పంగా నమోదుకావడం గమనార్హం . .

మధ్యప్రదేశ్ యొక్క NSDP ₹13,46,24,492 లక్షలుగా ఉంది, ఇది స్థూలంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సమానంగా ఉన్నప్పటికీ, దాని తలసరి ఆదాయం ₹1,52,615 వద్ద గణనీయంగా తక్కువగా ఉంది.

బీహార్ ఆర్థిక వ్యవస్థ ₹8,99,02,050 లక్షలతో చిన్నదిగా ఉంది మరియు ఇది దేశవ్యాప్తంగా అత్యల్ప తలసరి NSDP అయిన ₹69,321కి దారితీసింది.
ఆర్థిక ఆరోగ్యం మరియు రాబడి
దక్షిణ రాష్ట్రాలలో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు మరియు కర్ణాటక సొంత పన్ను వసూళ్లు వరుసగా ₹1,95,173 కోట్లు మరియు ₹1,89,893 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ ₹1,38,181 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ₹1,09,789 కోట్లు మరియు కేరళ ₹84,884 కోట్లతో ఉన్నాయి.

ఈ సంవత్సరానికి తమిళనాడు ఆర్థిక లోటు ₹1,08,690 కోట్లుగా ఉంది, ఇది ఐదు దక్షిణ రాష్ట్రాలలోకెల్లా అత్యధికం. కర్ణాటక లోటు ₹82,981 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ₹68,743 కోట్లు, తెలంగాణ ₹49,255 కోట్లు మరియు కేరళ ₹44,529 కోట్లుగా ఉంది.

ఈ లోటులో కొంత భాగాన్ని పూడ్చడానికి, తమిళనాడు ఈ కాలంలో మార్కెట్ నుండి ₹50,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ₹44,000 కోట్లు, తెలంగాణ ₹31,500 కోట్లు మరియు కేరళ ₹24,253 కోట్లు సమీకరించాయి. కర్ణాటక ₹3,000 కోట్లు సమీకరించింది.

ఉత్తరాదిలో, మహారాష్ట్ర పన్ను వసూళ్లు మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం రూ. 3,42,919 కోట్ల సొంత పన్ను ఆదాయాన్ని మరియు రూ. 1,10,355 కోట్ల ద్రవ్య లోటును నివేదించింది. ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య కాలంలో ఇది మార్కెట్ నుండి రూ. 64,000 కోట్లు సమీకరించింది.

ఉత్తరప్రదేశ్ రూ. 2,70,432 కోట్ల సొంత పన్ను ఆదాయాన్ని మరియు రూ. 86,531 కోట్ల ద్రవ్య లోటును నివేదించగా, ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఎలాంటి మార్కెట్ రుణాలను తీసుకోలేదు.

మధ్యప్రదేశ్ పన్ను వసూళ్లు రూ. 1,02,097 కోట్లుగా ఉండగా, ద్రవ్య లోటు రూ. 62,564 కోట్లు మరియు మార్కెట్ రుణాలు రూ. 15,000 కోట్లుగా ఉన్నాయి.

బీహార్ రూ. 54,300 కోట్ల సొంత పన్ను ఆదాయాన్ని నివేదించింది, రూ. 29,095 కోట్ల ద్రవ్య లోటును ఎదుర్కొంది మరియు మార్కెట్ నుండి రూ. 12,000 కోట్లు సమీకరించింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం చాలా దక్షిణ రాష్ట్రాలలో సాపేక్షంగా అదుపులోనే ఉంది. దక్షిణ రాష్ట్రాలలో తెలంగాణ అత్యల్ప సగటు ద్రవ్యోల్బణం 3.7 శాతంగా నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రెండూ 4.4 శాతంగా, తమిళనాడు 4.7 శాతంగా మరియు కర్ణాటక 4.9 శాతంగా ఉన్నాయి. కేరళలో దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా 5.9 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.

ఉత్తర భారతదేశంలో, బీహార్‌లో అత్యధికంగా 6.0 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 5.3 శాతం, మహారాష్ట్రలో 4.1 శాతం మరియు మధ్యప్రదేశ్‌లో 4.7 శాతం నమోదైంది.

పేదరికం విషయంలో కేరళ ప్రత్యేకంగా నిలుస్తుంది. NFHS-5 (2019–21) ఆధారంగా దాని బహుమితీయ పేదరిక తలసరి నిష్పత్తి కేవలం 0.55 శాతం, ఇది జాబితా చేయబడిన అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యల్పం.

తమిళనాడు 2.20 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పేదరిక స్థాయిలు వరుసగా 6.06 శాతం మరియు 5.88 శాతంగా నమోదయ్యాయి, అయితే కర్ణాటకలో ఇది 7.58 శాతంగా ఉంది. అయినప్పటికీ, ఈ ఐదు దక్షిణ రాష్ట్రాలలో పేదరిక స్థాయిలు చాలా రాష్ట్రాలలో కనిపించే స్థాయిల కంటే చాలా తక్కువగా ఉన్నాయి.

ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 22.93 శాతంతో, మధ్యప్రదేశ్ 20.63 శాతంతో మరియు గుజరాత్ 11.66 శాతంతో ఉన్నాయి. మహారాష్ట్ర 7.81 శాతంతో ఉత్తరాది రాష్ట్రాలలో చాలా వాటి కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, కేరళ మరియు తమిళనాడు కంటే వెనుకబడి ఉంది.

2019–20 ఆర్థిక సంవత్సరానికి అందుబాటులో ఉన్న తాజా డేటాను ఉపయోగించి చూస్తే, ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయంలో స్పష్టమైన ప్రాంతీయ వ్యత్యాసం కనిపించడం లేదు. తమిళనాడు ఆరోగ్యంపై ₹13,012 కోట్లు ఖర్చు చేసింది, ఇది దక్షిణ రాష్ట్రాలలోకెల్లా అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక ₹9,474 కోట్లతో, ఆంధ్రప్రదేశ్ ₹7,941 కోట్లతో, కేరళ ₹7,539 కోట్లతో మరియు తెలంగాణ ₹7,304 కోట్లతో ఉన్నాయి.

ఉత్తరాదిలో, ఉత్తరప్రదేశ్ ఆరోగ్యంపై ₹20,250 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది, ఇది జనాభా పరిమాణాన్ని ప్రతిబింబిస్తూ, ఈ 10 రాష్ట్రాలలోకెల్లా అత్యధికం. మహారాష్ట్ర ₹14,756 కోట్లు, గుజరాత్ ₹10,396 కోట్లు, మధ్యప్రదేశ్ ₹9,673 కోట్లు మరియు బీహార్ ₹8,079 కోట్లు ఖర్చు చేశాయి.