కేంద్ర నాయకత్వం నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అనేక మంది నేతల కృషి-
– అత్యధికంగా 66 ర్యాలీలు, 63 ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించిన అమిత్ షా
15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు పశ్చిమ బెంగాల్ లో .. బీజేపీ చెక్ పెట్టగలిగింది . చరిత్రలో తొలిసారిగా బంగాల్లో కమలం పార్టీ పాగా వేయడం రికార్డ్ . కాషాయదళానికి దక్కిన ఈ విజయం వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు > అనేది రాజకేయన్గా ఆసక్తికరం . ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పక్కా వ్యూహంతో అడుగులు వేయడం బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని దక్కించుకుంది . ఈ క్రమంలోనే బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన బంగాల్ మాస్టర్ మైండ్స్ ఎవరనేది ఇపుడు హాట్ టాపిక్ .
ప్రధాని మోదీ
బెంగాల్ లో అధికారం చేపట్టాలని మోడీ ముందు నుంచీ బలంగా ప్రయత్నించారు . బీజేపీ గెలుపు బాధ్యతలను ప్రధాని మోదీ తన భుజాలపై వేసుకుని విస్తృత ప్రచారం చేశారు. బంగాల్ సంప్రదాయంలో భాగమైన ఝాల్మురి తినడంతో పాటు కాలీ మాత ఆలయాలను సందర్శించి ప్రజలను ఆకర్షించారు. మమతా బెనర్జీ లక్ష్యంగా మోదీ చేసిన భావోద్వేగ ప్రసంగాలు కాషాయ క్యాడర్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. అభివృద్ధి పనులతో పాటు డబుల్ ఇంజిన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు .
అమిత్ షా చాణిక్యము . .. బంగాల్ గెలుపులో అమిత్ షా చాణక్య వ్యూహాలు ఎక్కువ ఫలితాలు నిచ్చాయి . బంగాల్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అత్యధికంగా 65 ర్యాలీలు, 63 ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ‘మిషన్ బంగాల్’తో పార్టీ బూత్ స్థాయి నుంచి బలోపేతం కోసం పనిచేశారు. స్థానిక నేతలను సమంవ్యం చేయగలిగారు . అమిత్షానే స్వయంగా 152కు పైగా నియోజకవర్గాల్లోని 44,000 పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగిన సమావేశాలను పర్యవేక్షించారంటే బీజేపీ ఏ స్థాయిలో దృష్టిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
శాంతిభద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో తనదైన శైలిలో ప్రచారం చేశారు అమిత్ షా. పార్టీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 100% కంచె నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఇస్తామని తెలిపారు.
భూపేంద్ర యాదవ్ ఇంచార్జ్ బాధ్యతలు . .. బంగాల్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మరో వ్యక్తి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్. ఎన్నికల నేపథ్యంలో గతేడాది బంగాల్ ఇంఛార్జ్గా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను నియమించింది అధిష్ఠానం. సంస్థాగత వ్యవహరాలు, సమన్వయం చేయడంలో తెర వెనుక ఎంతో కష్టపడ్డారు. అభ్యర్థుల ఎంపిక నుంచి కూటమి ఏర్పాటు వరకు పాలుపంచుకున్నారు. ముఖ్యంగా గెలుపు గుర్రాలను గుర్తించి, తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేశారు. నెలరోజులపాటు బెంగాల్ లో ఎక్కువ సమయం గడిపి . .. ఎన్నికల నిర్వహణలో భూపేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించారు.
శామిక్ భట్టాచార్య,, సువెందు అధికారి . , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శామిక్ భట్టాచార్య ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయంతో పాటు వ్యూహాలను అమలు చేశారు. అభ్యర్థుల ఎంపిక, బూత్ స్థాయి సన్నద్ధత, పార్టీ సంస్థాగత వ్యవస్థ పనితీరు విషయంలో సాయం అందించారు. అటు అమిత్ షా లాంటి నేతల ప్రసంగాలను స్థానిక బంగాలీలోకి అనువాదం చేస్తూ పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయుడిగా ఉన్న సువేందు అధికారి, బంగాల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన దూకుడు ప్రచారం, అవినీతి, రాజకీయ హింస వంటి సమస్యలపై దృష్టి పెట్టడం, కీలక ఓటు బ్యాంకులను ఏకీకృతం చేయడానికి కృషి చేశారు.
సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్లో వేలాది ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. నందిగ్రామ్తోపాటు సింగూర్ ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి, 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి సహకరించాయి. తృణమూల్ సర్కారులో ఆయన వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. మమత ప్రధాన అనుచరుడిగా, పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా సువేందు అధికారి ఎదిగారు. ఆ తర్వాత కాలక్రమేణా మమతతో సువేందుకు విభేదాలు తీవ్రమయ్యాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వంటి కారణాలతో ఆయన 2020లో టీఎంసీతో 22 ఏళ్ల అనుబంధాన్ని వదులుకున్నారు . ఇవన్నీ బిజెపి గెలుపులో కీలకంగా ఉపయోగపడ్డాయి .
విజయ్ దెబ్బకు ‘ద్రవిడ’ పార్టీల విలవిలా — TVK గెలుపునకు కారణాలు ఇవే!
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది .. సుమారు ఐదు దశాబ్దాలుగా డీఎంకే–అన్నాడీఎంకే మధ్యే దోబూచులాడిన రాజకీయం . .. ఇప్పుడు కొత్త నాయకుడి చేతికి చిక్కింది . తమిళ తెరపై విశేష ప్రజాదరణ పొందిన దళపతి విజయ్ స్థాపించిన ”తమిళగ వెట్రి కళగం” (టీవీకే) తొలి ఎన్నికల్లోనే చారిత్రక విజయాన్ని దక్కించుకుని చరిత్రను తిరగరాసింది . ఈ అప్రతిహత విజయానికి దారి తీసిన ప్రధాన కారణాలపై ”అభి న్యూస్ ‘ ‘ ప్రత్యేక కథనం.
తమిళనాటలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్విపార్టీ వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది . 1967 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే అధికారంలో ఉండటం, విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన వంటి అంశాలు తమిళ ఓటర్లలో తీవ్ర విసుగు కలిగించాయి . మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న తమిళులకు టీవీకే ఆశాకిరణంగా కనిపించింది.
స్పష్టమైన సిద్ధాంతపరంగా విజయ్ వ్యక్తిగత నిర్ణయాలు కూడా పార్టీ విజయానికి కీలకంగా మారాయి. తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వచ్చే సినిమాలను పూర్తిగా వదిలేయడం ఆయనపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తున్నానని ఇచ్చిన సందేశం ఓటర్లను బలంగా ఆకట్టుకుంది. ఇక సిద్ధాంతపరంగా కూడా టీవీకే స్పష్టమైన దిశను చూపించింది. మత, కుల విభజనలకు దూరంగా ఉండే సెక్యులర్ భావజాలం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లింది. పెరియార్, కామరాజర్, అంబేద్కర్ ఆలోచనలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.
ఫ్యాన్ బేస్ మరింత బలంగా . … విజయ్కు ఉన్న ఫ్యాన్ బేస్ ఈ ఎన్నికల్లో ప్రధాన బలం అయింది. సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ మక్కల్ ఇయక్కం క్రమంగా శక్తిమంతమైన రాజకీయ క్యాడర్గా మారింది. రక్తదాన శిబిరాలు, విద్యా సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి. యువత మద్దతు టీవీకే విజయానికి కీలకం. మొదటిసారి ఓటు వేసిన యువత పెద్దఎత్తున విజయ్కు మద్దతు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, విద్యా సంస్కరణలు, పారదర్శక పరీక్షా విధానం వంటి హామీలు వారికి ఆకర్షణీయంగా మారాయి. మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు కూడా సైలెంట్ ఓటును టీవీకే వైపు మళ్లించాయి.
విజయ్ వ్యక్తిత్వం కలసివచ్చింది . .. డిజిటల్ ప్రచారం కూడా పార్టీకి బలంగా పనిచేసింది. సోషల్ మీడియా వేదికల్లో విజయ్ అభిమానులు ముందుండి ప్రచారం నిర్వహించారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో ప్రజలకు చేరేలా చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభావం చూపింది. విజయ్ వ్యక్తిత్వం కూడా ఓటర్లను ఆకట్టుకుంది. సాధారణ జీవనశైలి, ప్రజల్లోకి వెళ్లి మమేకం కావడం, అభిమానులతో దగ్గర సంబంధం పెట్టుకోవడం వంటి లక్షణాలు ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశాయి. అన్నాగా పిలిచే ఈ అనుబంధం ఓట్ల రూపంలో ప్రతిఫలించింది.
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడుతాయని ఐఎండీ అంచనా – సాధారణ సగటులో 92 శాతం వర్షపాతం నమోదుకావచ్చని వెల్లడి – ఎల్నినో వల్ల వర్షాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా
ఎల్ నినో… ఇపుడు ఈ పేరు మన రైతాంగానికి నిద్రలేకుండా చేస్తోంది . తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తబోతున్నాయని ఇటీవల జరిగిన పరిశోధనలను ఐఎండీ నిర్ధారించడంతో మరింత అలజడి రేగింది .
దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. దీర్ఘకాలిక వర్షపాత అంచనాల ప్రకారం ఈ సీజన్లో వర్షపాతం సాధారణ సగటులో 92 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. దీనికి అదనంగా లోటుగా 5 శాతం మార్పు ఉండవచ్చని తెలిపింది. ఐఎండీ అంచనాల ప్రకారం వర్షపాత అంచనా 1971-2020 మధ్య కాలంలో దేశ సగటు వర్షపాతం 87 సెం.మీ.గా ఉంది. ఈ ఏడాది వర్షపాతం ఇందులో 90 నుంచి 95 శాతం మధ్య (సాధారణం కంటే తక్కువ) నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని IMD అంచనా వేసింది.
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలహీన ఎల్నినో పరిస్థితులు తటస్థ స్థితికి మారుతున్నాయని అయితే రుతుపవన కాలంలో ఎల్నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది సాధారణంగా వర్షాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నప్పటికీ, సీజన్ ముగిసే సమయానికి ‘పాజిటివ్ ఐఓడీ’ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ మోడల్స్ సూచిస్తున్నాయి.
మన దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఈశాన్య, వాయువ్య ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల గమనానికి సంబంధించి మరిన్ని ఖచ్చితమైన వివరాలతో కూడిన రెండో విడత అంచనాలను మే చివరి వారంలో విడుదల చేస్తామని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడు ప్రాంతాల వారీగా వర్షపాత వివరాలను వెల్లడించనున్నారు.
ఠారెత్తిస్తున్న ఎండలు, వడగాడ్పులు: రాష్ట్రంలో రోజురోజుకీ ఎండలు, వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 11 గంటలు దాటిందంటే ప్రజల ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడతున్నారు. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఎల్ నినో దెబ్బ . .. జూన్ , జులై నెలల్లో వర్షాలు బాగా తక్కువ కురుస్తాయని చెపుతున్నారు . అంతేకాకుండా . . వర్షానికి , వర్షానికి మధ్య 40-50 రోజుల గ్యాప్ ఉంటుందని వేస్తున్న అంచనాలు ముక్యంగా మెట్ట ప్రాంత రైతాంగాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది .
సైకత శిల్పం….. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఫైనల్ చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించిన సందర్భంగా ”అమరావతి మన రాజధాని ‘ ‘ అన్న నినాదంతో రూపొందించిన సైకత శిల్పం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ , అతని కుమార్తెలు సోహిత, ధన్యత కలసి రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంది . ఆలోచింపచేస్తుంది .
స్వర్ణాంధ్రప్రదేశ్ కు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ పటం, ఆంధ్రప్రదేశ్ పచ్చగా ప్రకృతితో ఉండాలన్నట్టుగా చుట్టూ మొక్కలు, అభివృద్ధికి సూచికగా బుల్లెట్ ట్రైన్, ఆకాశ హార్మ్యాలు,విమానం, అమరావతికి గుర్తుగా బుద్ధుడు, ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం 35 వేల ఎకరాలను ఇచ్చిన రైతులకు గుర్తుగా ఒక రైతును ఈ సైకత శిల్పంలోరూపొందించడం జరిగింది…
సత్తాంకుళం లాకప్డెత్ కేసు- ఒక ఇన్స్పెక్టర్ సహా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన మధురై సెషన్స్ కోర్టు
Sathankulam Father-Son Murder Case
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాంకుళం లాకప్ డెత్ కేసులో మధురైలోని ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమ్ సృష్టించింది . వ్యాపారి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేయగా, విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కొవిడ్ కారణంగా మృతిచెందారు.
ఏమి జరిగింది . .. నిర్దేశించిన సమయం కంటే అదనపు సమయం మొబైల్ షాప్ తెరచి ఉంచారని కోవిద్ సమయంలో పోలీసులు జయరాజ్ ను, అతడి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు .
2020 జూన్ 19న జయరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి కుమారుడు బెనిక్స్ పోలీసు స్టేషన్కు చేరుకొని తన తండ్రిని కొట్టడాన్ని అడ్డుకున్నాడు. కోపోద్రికులైన పోలీసులు రెచ్చిపోయారు . విచక్షణ మరిచారు . ”పోలీసులతో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాం . .మీకు తగిన బుద్ధి చెబుతాం” అంటూ ఇద్దరినీ రాత్రంతా పోలీస్ స్టేటషన్ లోనే విచక్షణారహితంగా చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికుడితో రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ వాంగ్మూలం, మెడికల్ రిపోర్ట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం సుమోటోగా స్పందించి, పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించారు . అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. సెప్టెంబర్ 2020లో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా, సోమవారం న్యాయస్థానం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది.
అయితే ఈ కేసులో మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం కీలక0గా మారింది . స్టేషన్ లో రక్తపు మరకలను కూడా పోలీసులు తుడిపించేసారు . ప్రధాన సాక్షిగా ఉన్న సదరు మహిళా కానిస్టేబుల్ కి అత్యంత భారీ భద్రత కల్పించాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి .
బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానంతో పెరుగుతున్న అనుమానాలు
బ్యాంకు లాకర్లలో దాచుకున్న విలువైన వస్తువులకి ఉన్న బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన ప్రశ్నకి ఇలా సమాచారం ఇచ్చారు.
లాకర్లలో దాచిన వస్తువులను బ్యాంకు అధికారులు చూడరు (చూడడం బ్యాంకు రూల్స్ కి విరుద్ధం) కాబట్టి, వాటిని రికార్డు చేయరు, అంచేత వాటి విలువ రిజిస్టర్ కాదు. సో.. విలువ ఆధారంగా బీమా కవరేజీ ఇవ్వబడదు.
దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంకుల్లో మోసాలు వంటివి జరిగిన సందర్భాల్లో లాకర్లకు నష్టం వాటిల్లితే లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సొమ్ముని బ్యాంకులు పరిహారంగా చెల్లిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు .
బ్యాంకు లాకర్ చార్జీలవిషయానికొస్తే.. భారతదేశంలో అనేక రేంజ్ లు ఉన్నాయి. ముఖ్యమైన జాతీయ బ్యాంకుల్లో పరిశీలిస్తే ఏరియా లొకేషన్, లాకర్ సైజు ని బట్టి ఏడాదికి 1000 రూపాయలనుంచి 12000 వరకూ లాకర్ అద్దె ఉంటుంది. కొన్ని ఇతర బ్యాంకుల్లో అత్యధికంగా 25000 నుంచి 40000 వరకూ కూడా వార్షిక లాకర్ చార్జీలు ఉన్నాయి.
దీన్ని బట్టి గరిష్టంగా లక్ష రూపాయల నుంచి 40 లక్షల వరకూ మాత్రమే లాకర్ నష్టానికి వినియోగదారులు పరిహారం పొందగలరన్నమాట.
బ్యాంక్ లాకర్లు సర్వ సురక్షితం అని భావిస్తారు, కానీ అవి 100% భద్రతను హామీ ఇవ్వవు. ఇంట్లో విలువైన వస్తువులను ఉంచడం ప్రమాదం కాబట్టి లాకర్లు అంతకంటే సురక్షితమైనవి. అయినప్పటికీ, పెద్ద స్థాయి దొంగతనాలు, సిబ్బంది ప్రమేయంతో జరిగే మోసాలు, అలాగే చెదలు, తేనెటీగలు, ఎలుకలు, నీటి లీకేజీ వంటి ఘటనల కారణంగా లాకర్లకు నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం.
బ్యాంక్ లాకర్లు బలమైన స్ట్రాంగ్ రూమ్స్ లోనే ఉంటాయి. అలారమ్లు, సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. అయినప్పటికీ, దొంగతనం, అగ్ని ప్రమాదం, వరదలు వంటి ఘటనల్లో నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది.
RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంక్ నిర్లక్ష్యం లేదా సిబ్బంది మోసం వల్ల లాకర్ దెబ్బతిన్నాకూడా బ్యాంక్ చెల్లించే పరిహారం వార్షిక అద్దెకి 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు, ఒక లాకర్ అద్దె ₹2,000 అయితే, గరిష్ట పరిహారం ₹2,00,000 మాత్రమే. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదం వంటి సహజ విపత్తుల వల్ల నష్టం జరిగితే, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు నిరూపిస్తే బ్యాంక్ నష్టానికి పైసా పరిహారం కూడా ఇవ్వక్కర్లేదు.
లాకర్ ఎంత చిన్నదైనా అందులో కుక్కి కుక్కి మరీ బంగారం, నగదు విలువైన పత్రాలను దాచడం కొందరు వినియోగదారుల అలవాటు. ప్రధానంగా అక్రమార్జనపరులు కొందరు లాకర్లను తమ రహస్య సంపదని దాచడం కోసం తీసుకుంటూ ఉంటారు.
కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది లాకర్లను దెబ్బతీయడం లేదా వాటిలో సొమ్ముని దొంగతనం చేయడం జరిగిన ఘటనలు కూడా పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. ఒక లాకర్ను 7 సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే, అద్దె చెల్లించినా కూడా బ్యాంక్ కి దాన్ని తెరిచే అధికారం ఉంది. వస్తువుల జాబితా ఉండదు కాబట్టి దొంగతనం జరిగితే నిరూపించడం కష్టం. అక్రమ సంపద అయితే.. కొందరు వినియోగదారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా కూడా మారుతుంది.
సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు లాకర్ను ఓపెన్ చేసి తనిఖీ చేయాలనీ బ్యాంకులు చెబుతాయి. లాకర్లలో భద్రపరచిన వస్తువుల జాబితా, ఫోటోలు, బిల్లులు ఇంట్లో భద్రపరచుకోవాలి. అలాగే
నామినీ రికార్డు పర్ఫెక్ట్ గా ఉంటే వినియోగదారుడు మరణించిన సందర్భంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తవు . దీనిపై స్పష్టంగా ఉండాలి .
భూతలదాడులకు దిగితే అమెరికా సైనికులు సొరచేపలకు ఆహారం అవుతారు: ఇరాన్ డెడ్లీ వార్నింగ్
ఇరాన్ – అమెరికా యుద్ధం ఎటుదారితీస్తుందోనన్న ఆందోళన ఎక్కువవుతోంది . ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఇరాన్ సైన్యం చేసిన క్షిపణిదాడిలో సౌదీఅరేబియాలోని ప్రిన్స్సుల్తాన్ ఎయిర్బేస్లో ఉన్న అమెరికా నిఘా విమానం E3-సెంట్రీ ధ్వంసమైంది. బోయింగ్-707 మోడల్లో మార్పులు చేసి గగనతలంలో ఓ కమాండ్ సెంటర్లా రూపొందించిన ఈ3-సెంట్రీ అవాక్స్ చాలా శక్తిమంతమైంది. 250 మైళ్ల పరిధిలో గగనతలంలో ఏం జరిగినా ఈ విమానం అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదు.
పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులతో యుద్ధం భీకరంగా మారుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుగా హూతీ రెబెల్స్ దాడులు మొదలుపెట్టగా, భూతల దాడుల ప్రచారం మధ్య అమెరికాకు చెందిన మెరైన్లు పశ్చిమాసియాకు చేరుకోవటం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎటాక్ చేస్తుండగా, మరోవైపు టెహ్రాన్ సహా ఇతర ప్రాంతాల్లో ఐడీఎఫ్ దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా భూతల దాడులు ప్రారంభిస్తే వారి సైన్యం పర్షియన్ గల్ఫ్ సొర చేపలకు ఆహారం అవుతారని ఇరాన్ హెచ్చరించిడాం చర్చకు దారితీసింది . యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో 216 మంది చిన్నారులు సహా 2076 మంది మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు ఇంతవరకు ససేమిరా అన్న ఇరాన్, కాస్త బెట్టువీడినట్లు తెలుస్తోంది. షరతులతో కూడిన చర్చలకు అంగీకరించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్లో ఆదివారం మధ్యవర్తిత్వ ప్రక్రియపై జరిగే ప్రతిపాదిత చర్చలు యుద్ధ విరమణ లేదా తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా కీలక పరిణామంగా భావిస్తున్నారు. చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. తక్షణమే దాడులు ఆపాలని, భవిష్యత్తులో దాడులు చేయబోమని విశ్వసనీయమైన గ్యారంటీ ఇవ్వాలనే షరతులు పెట్టినట్లు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చలకు ఇరాన్ 5 షరతులు పెట్టినట్లు దౌత్యవర్గాలు తెలిపాయి.
ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు గల్ఫ్దేశాలు ప్రకటించాయి. గల్ఫ్ దేశాలకు డ్రోన్లతో రక్షణ కల్పించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హామీ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళ ఆయుధ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) పేర్కొంది. ముఖ్యమైన ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై దాడులను కొన్నిరోజుల్లో పూర్తిచేస్తామని తెలిపింది.
హర్మూజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై మోదీ, ట్రంప్ మధ్య చర్చ
మోదీకి ట్రంప్ ఫోన్ చేసినట్లు చెప్పిన అమెరికా రాయబారి సెర్గియా గోర్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో . .. కీలక పరిణామం చోటుచేసుకుంది . భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసారు . ఈ సందర్బంగా ట్రంప్ మోదీ మధ్య కీలక చర్చ నడిచింది . ఇరు దేశాధినేతలు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిని తెరిపించాల్సిన అవసరం గురించి చర్చించినట్లు సమాచారం . ఈ విషయాన్ని భారత్లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
అమెరికా – ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య చోటుచేసుకున్న యుద్ధం ప్రభావం యావత్ ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ… మోడీ – ట్రంప్ చర్చలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది .
ఇరాన్పై దాడులను ముగించే యోచనలో తాను ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు . ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను ఇటీవలే అమెరికా తాత్కాలికంగా తొలగించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాకు ఎదురవుతున్న ఆటంకాలు సంక్షోభ స్థాయికి చేరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
మధ్య ప్రాచ్య ఉద్రిక్తతలపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఈ కామెంట్స్ చేశారు. అమెరికా తన లక్ష్యాలకు చేరవ అయ్యిందని ట్రంప్ చెప్పారు. మధ్య ప్రాచ్యంలో మిలిటరీ చర్యలకు ముగింపు పలికే యోచనలో ఉన్నామని అన్నారు.
శ్వేత సౌధం ప్రెస్ సెక్రెటరీ కెరొలైన్ లెవిట్ కూడా ఈ విషయమై కీలక ప్రకటన విడుదల చేశారు. నాలుగు నుంచి ఆరు వారాల్లో తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పెంటగాన్ అంచనా వేసినట్టు పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పోస్టు అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘అమెరికా సాయుధ దళాలు తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నాయి. రోజులు గడిచేకొద్దీ ఇరాన్ పాలకులు బలహీనమవుతున్నారు. అమెరికాపై వారు ఇక బెదిరింపులకు దిగలేరు.
ఇటీవలే అమెరికా ట్రెజరీ శాఖ ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలు తొలగించింది. మార్చ్ 20కి ముందే రవాణా నౌకల్లోకి చేర్చిన ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. ఏప్రిల్ 19 వరకూ ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని యూఎస్ ట్రెజరీ పేర్కొంది. ఈ చర్యలతో 140 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం బ్రెంట్ క్రూడ్ ధర 112.19 డాలర్లకు చేరింది . ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే క్రుడ్ ఆయిల్ మరింత పెరిగే ప్రమాదం ఉంది .
సైకత శిల్ప కళద్వారా జనంలో అవగాహన కల్పిస్తున్నందుకు దక్కిన ఛాన్స్ . .
తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన సోహిత , దేవిన ధన్యత సోదరీమణులు . వీరు పదేళ్లుగా సైకత శిల్ప కళ ద్వారా జనంలో అవగాహనా తీసుకువస్తున్నారు . వ్యవసాయ సంక్షోభం , ఆడపిల్లల పట్ల వివక్షత , వంటి సామాజిక వివక్షతలపై అవగాహన కల్పిస్తున్న వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది . ఈ అమ్మాయిల తండ్రి దేవిన శ్రీనివాస్ సైకత శిల్పి . ఆర్టిస్ట్ . జాతీయ , అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలలో శ్రీనివాస్ పాల్తొన్నారు .