గ్యాస్ కొరతలేనేలేదు . .. నో టెన్షన్ . ..

గ్యాస్ కొరతలేనేలేదు . .. నో టెన్షన్ . ..

గృహావసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఇవేవీ ప్రస్తుతానికి దేశంలో ఏమాత్రం కొరత లేదు. జనం ఆందోళన చెందక్కర్లేదు

యుద్ధం ఇలాగే కొనసాగినా కూడా కనీసం మరో రెండు మాసాలు మనకి ఇంధనకొరత భయం లేదని కేంద్ర ప్రభుత్వపు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే కొరత వస్తుందనే భయంతో ప్రతి వాళ్ళూ ముందుజాగ్రత్తగా, స్వార్థంతో స్టోరేజ్ చేసుకునే ప్రయత్నాలు చేయడమే అసలైన సమస్య. బ్యాంకు నష్టాల్లో ఉందనే ప్రచారం జరిగిందంటే.. ఒక్కసారిగా డిపాజిటర్లు తమ సొమ్ము తీసేసుకోవడానికి లైన్లలో నిలబడతారు. అప్పటివరకూ బ్యాంకు బాగానే ఉన్నా.. ఈ లైన్ల దెబ్బకి నిజంగానే కుదేలైపోతుంది. అలాగే ఒకేసారి వందలు, వేలమంది వినియోగదారులు గ్యాస్ రీఫిల్ బుకింగ్ లు చేయడం, వందలాది వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం బ్యాంకులకు పోటెత్తడం వలన స్వతహాగానే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ క్యూ లు సైకలాజికల్ గా సమాజ స్టెబిలిటీని దెబ్బతీస్తాయి. ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దేశ రక్షణ, ఇంధన భద్రతకి చేపట్టాల్సిన అంతర్జాతీయ చర్యలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన భారం పాలకులపై ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి అనవసర ఒత్తిడి వారిపై పెంచకుండా, బాధ్యతగా వ్యవహరించడం పౌరుల విధి.

ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రం కొంత రిస్ట్రిక్షన్ వచ్చిందనేది నిజం. వచ్చిన కొరత కంటే ఆయా సంస్థలు, అసోసియేషన్లు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి బాగా ఎక్కువగా ఉంది. తినడానికి హోటల్ తప్ప మరోదారి లేనివాళ్లు కొంత ఇబ్బంది పడతారు తప్ప, అందరికీ ఇదేమీ సమస్యకాదు. చిన్న కాకా హోటళ్లు, ఇళ్లవద్ద ఆహారం తయారు చేసి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్రియాశీలకం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.

హర్ముజ్ జలసంధినుంచి ఇరాన్ మన దేశపు నౌకలను అనుమతించడం, రష్యా కోరినంత చమురుని భారత్ కి విక్రయించడం.. అలాగే క్లిష్ట సమయంలో ఒత్తిడి తగ్గించే ధోరణితో అమెరికా వ్యవహరించడం.. ఇవన్నీ భారత దౌత్య విజయాలే.. లేదా మనదేశంపై చిరకాలంగా ప్రపంచానికి ఉన్న గుడ్ విల్ కి ప్రతిగా లభించిన అవకాశాలే!

ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఎంతో కొంత ప్రభావితం అయ్యే దేశాల్లో భారత్ ముందుంటుంది. అలాగని మనమీద బాంబులు ఎప్పుడూ పడవు. స్వరాజ్యం తర్వాత (చైనా, పాకిస్థాన్ లతో మనం ప్రత్యక్షంగా చేసిన యుద్ధాల్లో మినహా) ఎప్పుడూ మనదేశంపై బాంబు పడలేదు. కానీ ప్రపంచపు ప్రతి సంక్షోభమూ పరోక్ష ప్రభావాన్ని చూపడంచేత భారత్ పై ధరల బాంబులు పడుతూ ఉంటాయి.

గతంలో గల్ఫ్ యుద్ధం సమయంలో మనం గల్ఫ్ సర్చార్జిలు కట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాలిబన్ యుద్ధం సమయంలో, ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకున్న సమయంలో కూడా భారత్ లో ధరలు పెరిగాయి. దిగుమతులపై ఎక్కువ ఆధారపడడం, ఎగుమతి దిగుమతులు జరిగే రవాణా మార్గాల్లోని దేశాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం వంటివే భారత్ ధరలపరంగా ప్రభావితం కావడానికి అసలు కారణాలు. కొరత వలన సమస్య రాదు.. కొరత వచ్చే అవకాశాలపై ప్రచారంతో భయపెట్టి… కృత్రిమ కొరత సృష్టించే అవినీతి పరులతోనే సమస్య వస్తుంది.

ప్రపంచం యుద్ధమేఘాలకింద అవస్థలు పడుతున్న ఈ కష్టసమయంలో ప్రకృతి, పరిస్థితులు, ఘనమైన మన వారసత్వం, ప్రస్తుత నాయకత్వం కలసి రాబట్టే మనం ఈమాత్రమైనా ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధం త్వరగా ముగిసిపోతే భారతదేశంలో వారం రోజుల్లోనే అంతా యథాతథ పరిస్థితికి వచ్చేస్తుంది. పరిస్థితి మరీ దిగజారిపోయి.. యుద్ధం మరింతకాలం, మరిన్ని దేశాలకు విస్తరించినా కూడా భారత్ కి ప్రత్యక్ష భయం అయితే లేదు. స్వరాజ్య భారతం సుమారుగా గత 77 సంవత్సరాల్లో అనుసరించిన విదేశాంగ విధానం, ఎన్నడూ దురాక్రమణకు, ముందస్తు యుద్ధానికి పాల్పడని మన వారసత్వపు మంచితనం ఇందుకు ప్రబల కారణాలు. నాటి నెహ్రూగారి అలీన విధానం మొదలు నేటి మోదీ గారి స్వతంత్ర విదేశాంగ విధానం వరకూ కూడా భారత్ సంప్రదాయబద్ధమైన లక్ష్మణరేఖను పాటిస్తూనే వస్తోంది…. అదే మన దేశానికి శ్రీరామరక్ష.

నేపాల్ లో ఒక ‘రాపర్’ రాజకీయ గర్జన!

నేపాల్ లో ఒక ‘రాపర్’ రాజకీయ గర్జన!

పాటలతో జనంలో చైతన్యం నింపిన యువకుడు ప్రధాని . ..

—————————————-

నేపాల్.. హిమాలయాల ఒడిలో ఒదిగిపోయిన అందమైన దేశం. కానీ అక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ రణరంగమే. ఒకప్పుడు రాజుల ఏలుబడి, ఆ తర్వాత కుర్చీలాటలో మునిగిపోయిన నేతలు. సరిగ్గా ఇలాంటి టైంలోనే సీన్ లోకి వచ్చాడు బాలెన్ షా.

”చేతిలో మైక్ పట్టుకుని పాటలు పాడే ఒక రాపర్, ఇవాళ దేశ గమనాన్నే మార్చేస్తున్నాడు. ఇది కేవలం ఒక గెలుపు కాదు, హిమాలయాల్లో పుట్టిన నిప్పుకణిక…” అంటూ యావత్ నేపాల్ కీర్తిస్తోంది .

మార్చి 2026. ఫలితాలు వస్తుంటే పాత తరం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 18 ఏళ్లలో 15 ప్రభుత్వాలను మార్చిన నేపాల్ ప్రజలు..

ఈసారి విసిగిపోయి ఒక కొత్త దారి వెతుక్కున్నారు. యువత ఐక్యమై బాలెన్ షా వెనుక నడిచింది. కాట్మండు మేయర్‌గా అక్రమ కట్టడాలను కూల్చినప్పుడే అర్థమైంది, ఇతను మామూలోడు కాదని!

ఆ రాత్రి.. కాట్మండు వీధుల్లో..

చలి గాలులు వీస్తున్నాయి. ఫలితాలు దాదాపు ఖాయమైపోయాయి. పాత పార్టీ ఆఫీసుల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంటే, బాలెన్ అనుచరులు మాత్రం వీధుల్లో సందడి చేస్తున్నారు.

ఒక ముసలాయన అంటున్నాడు:

“ఒరేయ్.. రాజులు పోయారు, రౌడీలు వచ్చారు. ఇన్నాళ్లకు కష్టాలు తెలిసిన కుర్రాడు వస్తున్నాడురా!”

బాలెన్ షా మేడ మీద నుంచి జనాలను చూస్తూ నవ్వాడు. పక్కనే ఉన్న మిత్రుడు అడిగాడు, “ఏంటి బాలెన్.. గెలిచేశాం కదా? నెక్స్ట్ ఏంటి?”

“ఇది గెలుపు కాదు దోస్త్.. ఒక పెద్ద బాధ్యత. పాటల్లో విమర్శించడం ఈజీ, కానీ పాలనలో చేసి చూపించడం కష్టం. నేపాల్ ఇన్నాళ్లు చీకట్లో ఉంది, ఇక వెలుగు చూడాలి.”

ట్విస్ట్ ఏంటంటే..

నేపాల్ రాజకీయాల్లో ఎప్పుడూ భారత్, చైనాల ప్రమేయం ఉంటుంది. కానీ బాలెన్ షా మాత్రం ‘నేపాల్ ఫస్ట్’ అంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలా ఇతను కూడా ఒక ఎంటర్ టైనర్ నుంచి లీడర్ గా మారాడు. అయితే అధికారం అంటే పదునైన కత్తి. బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా తప్పులు చేస్తే ప్రజలు క్షమించరు.

హిమాలయాల్లో మంచు కరుగుతోంది.. పాత రాజకీయాల మకిలి కూడా వదులుతోంది. కానీ ఈ కొత్త కెరటం ఎంత కాలం నిలబడుతుంది? అప్పుడే కథ అయిపోలేదు.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! వెనుకబాటుతనంతో అల్లాడుతున్న నేపాలీలకు దారిదీపం దొరికింది .

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే  లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

ఇరాన్​ భూగర్భ క్షిపణి నగరాలే లక్ష్యం.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు!

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తన ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న భూగర్భ క్షిపణి వ్యవస్థ ప్రమాదకరంగా మారింది . సదరు నగరాలు ఇప్పుడు ఆ దేశానికే ప్రతికూలంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్ష యుద్ధం ప్రకటించిన కొన్ని రోజులకే ఇరాన్ వ్యూహం బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. భారీ భూగర్భ బంకర్ల నుంచి బయటకు వస్తున్న క్షిపణి లాంచర్లనే లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అత్యంత పకడ్బందీగా నిర్మించుకున్న క్షిపణి నగరాల్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? టెహ్రాన్ వ్యూహం ఎందుకు విఫలమైంది? 

తాజాగా ఇరాన్‌లోని డజన్ల కొద్దీ భారీ స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. క్షిపణులను ప్రయోగించేందుకు భూగర్భం నుంచి లాంచర్లు బయటకు రాగానే వాటిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. అమెరికా భారీ బాంబర్ల దాడులతో ఇరాన్ ఆయుధాలు కొన్ని చోట్ల భూగర్భంలోనే చిక్కుకుపోయినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ దక్షిణ నగరమైన షిరాజ్ సమీపంలోని స్థావరాలతో పాటు ఇస్ఫహాన్, తబ్రిజ్, కెర్మాన్‌షా సమీపంలోని స్థావరాలపై దాడులు జరిగినట్లు ఇటీవల తీసిన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. దాడికి గురైన స్థావరాలన్నీ భూగర్భంలో ఉన్నప్పటికీ, వాటి పైభాగంలో ఉన్న భవనాలు, ప్రవేశ ద్వారాలు, రోడ్ల ద్వారా వాటిని సులభంగా గుర్తించి దాడులు చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇరాన్ అంచనాలకు భిన్నంగా ఉన్నాయి. లాంచర్లను బయటకు తీసుకురాకుండా నేరుగా భూగర్భ బంకర్ల నుంచే క్షిపణులను ప్రయోగించేందుకు కొన్ని స్థావరాల వద్ద ఇరాన్ సైన్యం భూగర్భ గోతులను నిర్మించింది. దక్షిణ ఇరాన్‌లోని ఖోర్ముజ్ పట్టణం సమీపంలో ఉన్న ఒక స్థావరంలో ఇటువంటి సామర్థ్యాలున్న తొమ్మిది భూగర్భ గోతులు ఉన్నట్లు అమెరికా సైనిక మాజీ నిపుణుడు కాలిన్ డేవిడ్ వెల్లడించారు. ఇవి పర్షియన్ గల్ఫ్ వైపు చూసేలా పర్వతాల వాలులో తవ్విన లోతైన గుంతలు. పదే పదే ఈ గోతులను వినియోగించడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల వల్ల భూగర్భ ప్రయోగ కేంద్రాల ఆలోచనను ఇరాన్ దాదాపుగా విరమించుకుందని వాషింగ్టన్‌కు చెందిన సీఎన్ఏ కార్పొరేషన్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్​ను తక్కువ అంచనా వేయడంలేదా ?
ఇజ్రాయెల్, అమెరికా దాడుల నుంచి రక్షించుకునేందుకు యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ అప్రమత్తమైంది. కొన్ని క్షిపణులను, లాంచర్లను బంకర్ల నుంచి బయటకు తరలించి ఉండవచ్చని, తద్వారా వాటిని చెదరగొట్టి దాడుల నుంచి రక్షించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు ఉన్న భారీ భూగర్భ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసే బంకర్-బస్టింగ్ బాంబులు అమెరికా ఆయుధాగారంలో పరిమితంగానే ఉన్నాయి. అందుకే, లాంచర్లు బయటకు రాగానే ప్రవేశ ద్వారాల వద్దే ధ్వంసం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. క్షిపణులను అడ్డుకునే ఎయిర్-డిఫెన్స్ ఇంటర్‌సెప్టార్ల నిల్వలు అయిపోకముందే, టెహ్రాన్ ప్రయోగ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని వాషింగ్టన్ భావిస్తోంది.

తాజా దాడుల ప్రభావంతో ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల ప్రయోగాలు తగ్గుముఖం పట్టాయని ఇజ్రాయెల్, అమెరికా అధికారులు ధ్రువీకరిస్తున్నారు. సుదీర్ఘకాలం సాగే యుద్ధం కోసం ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే తన ఆయుధ నిల్వలను ఆదా చేసుకుంటున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ క్షిపణి నిల్వలపై భిన్నమైన అంచనాలున్నాయి. యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద 2,500 క్షిపణులు ఉండొచ్చని ఇజ్రాయెల్ అంచనా వేయగా, సుమారు 6,000 వరకు ఉంటాయని అంతర్జాతీయ నిపుణులు అంచనావేస్తున్నారు .

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోతున్నాయా? ఇరాన్‌తో మరో 10రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇక్కట్లేనా ?

తరిగిపోతున్న ఆయుధాలు – ఇరాన్​తో మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికా క్షిపణి నిల్వలు తగ్గే అవకాశం – పెంటగాన్ హెచ్చరిక

ఇరాన్‌తో సైనిక ఘర్షణ వేళ అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు కీలక హెచ్చరిక చేసాయ ? అంతర్జాతీయ మీడియా సంస్థలు ఔవుననే చెపుతున్నాయి . ఇరాన్‌పై దాడులు ఇదేరీతిలో 10 రోజులకుపైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అమెరికా ఇప్పటికే టోమాహాక్ ల్యాండ్ ఎటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోందని ఆ అధికారి చెప్పారని కథనంలో సదరు మీడియా పేర్కొనడం గమనార్హం .

ఏ నిల్వలు తగ్గిపోతాయి ?
సీఎన్ఎస్, ఖతర్ ప్రభుత్వ మీడియా సంస్థ అల్ జజీరా, అమెరికా మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ అంశంపై కథనాలను ప్రచురించాయి. దీర్ఘకాలం పాటు ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికా కీలక ఆయుధ నిల్వలన్నీ తగ్గిపోయే ముప్పు ఉంటుందని దేశాధ్యక్షుడు ట్రంప్‌‌ను హెచ్చరించామని పెంటగాన్ అధికార వర్గాలు, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డ్యాన్ కైనీ చెప్పారంటూ ఆ కథనాలు పేర్కొన్నాయి. 2025 జూన్‌లో ఇరాన్ – ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ వేళ అమెరికా తన దగ్గరున్న థాడ్ గగనతల రక్షణ వ్యవస్థ ఇంటర్‌సెప్టర్లలో 25 శాతాన్ని వాడేసిందని పేర్కొన్నాయి. ఆ టైంలో ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ సంధించిన డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకొని నిర్వీర్యం చేయడానికి దాదాపు 150 థాడ్ ఇంటర్‌సెప్టర్లను అమెరికా వినియోగించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.

ఖరీదైన యుద్ధం . ..
ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం ఖర్చు తడిపిమోపెడు అవుతోంది . అత్యు0త భారీగా ఉందని . . అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఉదయం ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి మొదటి 24 గంటల్లోగా అమెరికాకు దాదాపు రూ.7186 కోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది . గల్ఫ్ సముద్ర జలాల్లో యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ లాంటి ఒక విమాన వాహక యుద్ధ నౌకను, అందులోని సైనికులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఒకరోజుకు రూ.59 కోట్ల దాకా ఖర్చు వస్తుందని అంచనా వేశారు. వాస్తవానికి ఇరాన్‌పై దాడులు చేయడానికి, దాదాపు నెల రోజుల ముందు నుంచే గల్ఫ్ సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకల మోహరింపును అమెరికా మొదలుపెట్టింది.

యుద్ధం 4 వారాలు ఉంటే.. లక్షల కోట్ల ఖర్చు . ..

ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్‌తో సైనిక ఘర్షణ నాలుగైదు వారాల పాటు కొనసాగితే, అమెరికా యుద్ధం మొత్తం ఖర్చు రూ.19.37 లక్షల కోట్లకు చేరుతుందని అమెరికా రక్షణ రంగ అధ్యయన సంస్థ పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్‌కు చెందిన నిపుణుడు కెంట్ స్మెట్టర్స్ తెలిపారు. 2023 అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు రూ.2 లక్షల కోట్ల సైనిక సహాయాన్ని అమెరికా అందించింది. ఈ వ్యవధిలో యెమన్, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడటానికి అమెరికా సొంతంగా దాదాపు రూ.1 లక్ష కోట్ల సైనిక వ్యయాన్ని చేసింది. అంటే గత రెండున్నర ఏళ్లలో ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా దాదాపు రూ.3 లక్షల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా . .

ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు : ట్రంప్
‘‘అమెరికా ఆయుధ సప్లైలు బలమైన స్థితిలో ఉన్నాయి. మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు అమెరికా దగ్గర ఆయుధ నిల్వలు ఉన్నాయి. అన్ లిమిటెడ్‌గా ఆయుధాలను సప్లై చేసే సత్తా అమెరికాకు ఉంది. ఏకకాలంలో ఎన్ని యుద్ధాలనైనా అమెరికా చేయగలదు’’ అని పేర్కొంటూ ఇటీవలే ట్రూత్ సోషల్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇలాంటి పోస్టులు చేయడం ట్రంప్ కి ముందు నుంచీ అలవాటే . . అని ప్రముఖులు చెపుతున్నారు .

భారత్  ఆర్థిక వ్యవస్థ భేష్ – ఏఐ సదస్సుకు అదే సరైన చోటు : ఐరాస చీఫ్

భారత్ ఆర్థిక వ్యవస్థ భేష్ – ఏఐ సదస్సుకు అదే సరైన చోటు : ఐరాస చీఫ్

”భవిష్యత్తు భారత్ దే . ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ రాబోయే రోజులలో దూసుకుపోతుంది . ..” ఇది మన దేశంలో ఎదో ఒక నాయకుడు చేసిన కామెంట్స్ కాదు . . ఐక్యరాజ్య సమితి ( చీఫ్) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఇచ్చిన కితాబు .

భారత్ చాలా విజయవంతంగా వికసిస్తున్న ఆర్థిక వ్యవస్థ.. అని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అభివర్ణించారు. అంతర్జాతీయ వ్యవహారాలపై పెద్ద ప్రభావాన్ని చూపగల సత్తా భారత ఆర్థిక వ్యవస్థకు ఉందన్నారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026 లాంటి అంతర్జాతీయ స్థాయి కీలక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారతే సరైన చోటు అని తాను అభిప్రాయపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనియో గుటెరెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూదిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026 జరగబోతోందనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.

బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను
‘ యావత్ ప్రపంచ వ్యవహారాలపై పెత్తనం ఒకే దేశం చేతిలో అస్సలు ఉండకూడదు. యావత్ ప్రపంచం రెండు సూపర్ పవర్‌‌ల మధ్య విభజితమై కూడా ఉండకూడదు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలంగా కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడాలంటే అభివృద్ధిచెందుతున్న దేశాలకు వాణిజ్యం, టెక్నాలజీ, అంతర్జాతీయ సంబంధాలలో చాలాచాలా కీలకమైన పాత్రలను పోషించే అవకాశాలు లభించాలి. ఇటీవలే భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందమే అందుకు మంచి ఉదాహరణ. భారత్ వికాసాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యేక సమూహాలుగా ఏర్పడుతున్నాయి. ఈ సమూహాల వల్లే నిజమైన బహుళ ధ్రువ ప్రపంచం దిశగా బాటలు పడుతున్నాయి. దీనివల్ల ఏదో ఒక దేశం పెత్తనానికి అవకాశం లేకుండా పోతోంది’ అని ఐరాస చీఫ్ చెప్పారు.

రెండు సూపర్ పవర్‌లకె కాదు . ..
ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) అనేది యావత్ ప్రపంచానికి ప్రయోజనాన్ని చేకూర్చాలి. కేవలం అభివృద్ధి చెందిన దేశాలకో, రెండు సూపర్ పవర్‌లకో(అమెరికా, చైనా) అది పరిమితం కాకూడదు. ఏఐ ఎవరో కొందరి సొత్తు కాదు. అది యావత్ ప్రపంచానిది. ప్రపంచంలో ప్రతీచోటా, ప్రతీ ఒక్కరికీ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడాలి. ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు భారత్‌కు నా అభినందనలు. ఇందులో పాల్గొనేందుకు నేను కూడా దిల్లీకి వెళ్తున్నాను. భారత్‌లో జరగనున్న సదస్సులో ఏఐ వినియోగంపై కూలంకషమైన చర్చలు జరుగుతాయి. ఏఐను వినియోగించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ముప్పులపైనా డిస్కషన్ జరుగుతుంది’ అని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తెలిపారు.

ఆ అంశంపై ప్రధాని మోదీతో చర్చిస్తా

రోమన్ సామ్రాజ్య కాలంలోనూ మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలతో భారత్‌కు బలమైన వాణిజ్య అనుబంధం ఉండేది’ అని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ తెలిపార
‘పారదర్శకంగా అన్ని దేశాలకు సమ ప్రాధాన్యత లభించాలంటే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అభివృద్ధిచెందుతున్న దేశాలకు బలంగా వాణిని వినిపించే అవకాశం లభించాలి. ప్రపంచంలో అభివృద్ధిచెందుతున్న దేశాలకు కేంద్ర బిందువుగా భారత్ కనిపిస్తోంది. ఈ అంశంపై నేను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చిస్తాను. బహుళ ధ్రువ ప్రపంచం సాకారంలో భారత్ కీలక పాత్రను పోషిస్తుందనే ఆశాభావంలో నేను ఉన్నాను. భారత్‌కు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. భారీ వైవిధ్యం, అద్భుత నాగరికత, సంస్కృతిలకు భారత్ నెలవు. అని తెలిపారు .

ఆంత్రోపిక్స్  .. ఓ బిగ్ ఛాలెంజ్

ఆంత్రోపిక్స్ .. ఓ బిగ్ ఛాలెంజ్

ఏదైనా కొత్త సాంకేతికత వస్తుందంటే భయపడక్కర్లేదు . చాలెంజింగ్ గా తీసుకోవాలి . శరవేగంగా చొచ్చుకొస్తున్న పెనుమార్పులను తట్టుకుని నిలబడాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిందే .

ఫ్లాగ్‌షిప్ ఆఫర్ అయిన క్లాడ్, సహాయకారిగా, హానిచేయనిదిగా మరియు నిజాయితీగా ఉండేలా ఆప్టిమైజ్ చేయబడిన పెద్ద-భాషా నమూనాల (LLMలు) కుటుంబానికి చెందినది. క్లాడ్ 4 రెండు వేరియంట్‌లలో వస్తుంది – ఓపస్ (హెవీ కోడ్‌ను అమలు చేయడానికి ప్రోగ్రామ్ చేయబడింది) మరియు సోనెట్ (విస్తృత సాధారణ పని కోసం) ఆంత్రోపిక్ ఓపస్ 4 బెంచ్‌మార్క్‌లపై ‘ప్రపంచంలోని ఉత్తమ కోడింగ్ మోడల్’ అని పేర్కొంది.

లాజిక్, గణితం మరియు కోడ్‌పై క్లాడ్ పనితీరు ‘కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుంది’ మరియు పరిశ్రమ పరీక్షలలో ఓపెన్‌ఏఐ యొక్క GPT-4ను వదిలివేస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, క్లాడ్‌ను కంపెనీలు మరియు సృష్టికర్తలు ఇద్దరికీ సమర్థవంతమైన, భద్రతపై అవగాహన ఉన్న AI వ్యాపార సహాయకుడిగా రూపొందించారు.

క్లాడ్‌ను అన్ని-ప్రయోజన సహాయకుడిగా రూపొందించారు. ఉదాహరణకు, ఇది ఇప్పుడు ‘చట్టపరమైన’ భాషను మాట్లాడుతుంది: ఆంత్రోపిక్ దాని క్లాడ్ కోవర్క్ ప్లాట్‌ఫామ్ యొక్క లీగల్ ఆటోమేషన్ ప్లగిన్‌ను విడుదల చేసింది, ఇది ఒప్పందాల ద్వారా స్కాన్ చేయగలదు, ప్రమాదకర నిబంధనలను గుర్తించగలదు మరియు స్కేల్‌లో సాధారణ ప్రతిస్పందనలను కూడా డ్రాఫ్ట్ చేయగలదు. వాస్తవానికి, క్లాడ్ సృష్టించిన చట్టపరమైన ప్లగిన్ డజన్ల కొద్దీ NDAలను రాత్రిపూట స్కాన్ చేయగలదు మరియు సాధ్యమయ్యే సమస్యలను, గతంలో జూనియర్ న్యాయవాదుల రోజులను ఆక్రమించిన ఉద్యోగాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదే విధంగా, ఇతర అమ్మకాలు, మార్కెటింగ్ మరియు డేటా విశ్లేషణ ప్లగ్‌లు కూడా ఉన్నాయి.

చట్టపరమైన సౌలభ్యం : చట్టం వెలుపల, ఆంత్రోపిక్ క్లాడ్‌ను ఆరోగ్య సంరక్షణలోకి విస్తరిస్తోంది: దాని ‘క్లాడ్ ఫర్ హెల్త్‌కేర్’ సూట్ ముందస్తు అధికారం లేదా ఔషధ-నియంత్రణ ఫైలింగ్‌ల వంటి కార్యకలాపాలను వేగవంతం చేయడానికి వైద్య డేటాబేస్‌లకు (CMS క్లెయిమ్‌లు, ICD-10 కోడ్‌లు, రోగి రికార్డులు మొదలైనవి) HIPAA-సిద్ధంగా ఉన్న కనెక్టర్‌లను అందిస్తుంది. క్లాడ్ టూల్‌బాక్స్ యొక్క ఉదాహరణలు: ఇది చదవగలదు, నివేదికలను ఉత్పత్తి చేయగలదు, కోడ్‌ను వ్రాయగలదు లేదా డేటాను సంగ్రహించగలదు మరియు ఇది ఆంత్రోపిక్ యొక్క భద్రతా నియమాల ప్రకారం శిక్షణ పొందింది.

పెట్టుబడిదారులకు, క్లాడ్ యొక్క సాంకేతికత యొక్క ఆకర్షణకు రెండు వైపులా ఉన్నాయి. సానుకూలంగా: ఆవిష్కరణ మరియు ఉత్పాదకత. క్లాడ్ మెరుపు వేగంతో భారీ మొత్తంలో పునరావృతమయ్యే పనిని కంప్యూటరీకరించగలడు. ఆంత్రోపిక్ తన క్లాడ్ 4 మోడల్ బహుళ-గంటల సెషన్‌లలో కోడ్‌ను జీర్ణించుకోగలదని మరియు ఉత్పత్తి చేయగలదని, డెవలపర్‌ల బృందాన్ని త్వరిత AI-సహాయక పనిగా మారుస్తుందని పేర్కొంది.

కోడ్‌ను చేతితో వ్రాసే భారతీయ సాఫ్ట్‌వేర్ బృందం విషయాన్నే తీసుకోండి, ఇప్పుడు క్లాడ్ కేవలం నిమిషాల్లో కోడ్‌ను వ్రాయగలడు. ఇది మీ ప్రాజెక్ట్‌లోకి అలసిపోని రోబోట్ కార్మికుల సమూహాన్ని తీసుకురావడం, ఉత్పత్తి మరియు అవుట్‌పుట్‌ను మెరుగుపరచడం మరియు సంక్లిష్ట సమస్యలపై మానవ నిపుణులను పని చేయడానికి అనుమతించడం వంటిది. పెద్ద టెక్నాలజీ కంపెనీలు గమనికలు తీసుకుంటున్నాయి: మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్‌హబ్, కోడ్ యొక్క ఆటో-జనరేషన్‌ను ప్రారంభించడానికి క్లాడ్ సోనెట్ 4ను కోపైలట్‌కు జోడిస్తామని ప్రకటించింది మరియు క్లాడ్ యొక్క API డెవలపర్‌లకు వారి ఉత్పాదకతను పెంచడానికి అధునాతన కోడ్ సూచనలను ఇస్తుందని AWS ప్రచారం చేస్తుంది. మరో విధంగా చెప్పాలంటే, క్లాడ్ భారతీయ ఐటీ యొక్క కోడింగ్ మరియు డేటా ప్రాజెక్టులను టర్బోచార్జ్ చేయగలడు.

రెండవ బలం స్కేలబిలిటీ మరియు పరిధి. క్లాడ్ ఒక ఏజెంట్‌గా రూపొందించబడింది – ఇది చర్యల శ్రేణిని ప్లాన్ చేయగలదు మరియు బహుళ-మలుపు వర్క్‌ఫ్లోలను నిర్వహించగలదు. సూచించినట్లుగా, ఆంత్రోపిక్ క్లాడ్1 సంక్లిష్టమైన పనులపై ‘ఒక ప్రణాళికను రూపొందించగలడు, ఫలితాలను అమలు చేయగలడు మరియు ధృవీకరించగలడు’ అని వివరిస్తుంది. భారతీయ ఐటీ కంపెనీలు క్లాడ్‌ను కొత్త సేవల ఎంపికలలో చేర్చగలవు – క్లయింట్ తరపున కొన్ని ప్రామాణిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించే 24/7 AI కన్సల్టెన్సీ లాంటిది. క్లాడ్ సహాయంతో, చిన్న టెక్ కంపెనీ కూడా తనను తాను AI-ఆధారితమైనదిగా ఉంచుకోగలదు, దాని ప్రేక్షకులను విస్తరిస్తుంది.

రాయిటర్స్ ప్రకారం, ఆంత్రోపిక్ ప్రస్తుతం 300,000 వ్యాపార క్లయింట్‌లను కలిగి ఉంది మరియు పెద్ద సంస్థలతో ఒప్పందాల సంఖ్య అధిక రేటుతో పెరుగుతోంది. మొత్తంమీద, పనితీరు ప్రకటనలు (ఉదా., ఉత్తమ కోడింగ్ మోడల్) మరియు ఎంటర్‌ప్రైజ్ ద్వారా వినియోగం నిజమైన పెరుగుదలకు, వేగవంతమైన డెలివరీ సమయం, కొత్త AI-ఆధారిత ఉత్పత్తులు మరియు పెరిగిన ఆవిష్కరణలకు దారితీస్తుంది.

వ్యాపారంగా, క్లాడ్ సాంప్రదాయ సేవా నమూనాలకు ముప్పు. విశ్లేషకులు దీనిని వివరించడానికి ‘SaaSpocalypse’ లేదా ‘AI-pocalypse’ అనే పదాలను కూడా రూపొందించారు.

ఆందోళన: ఇటువంటి ఏజెంట్ AIలు అనేక సాఫ్ట్‌వేర్ పనులను కలిపి ఉంచడానికి సమర్థవంతమైన మార్గం. ఒక అభిప్రాయ భాగంలో, క్లాడ్ లాంటి AI సాఫ్ట్‌వేర్‌ను ఒక యుటిలిటీగా మారుస్తుందని, ఇక్కడ వ్యక్తిగత సాధనాల విలువ ఉనికిలో ఉండదు మరియు బదులుగా, అది అత్యంత శక్తివంతమైన మోడల్ ఉన్నవారికి చెందుతుందని హెచ్చరించబడింది.

ఖచ్చితంగా, క్లాడ్ కాంట్రాక్ట్-మేనేజ్‌మెంట్ యాప్, డేటా-ఎంట్రీ క్లర్క్ మరియు జూనియర్ కోడర్‌ను ఒకదానిలో ఒకటిగా భర్తీ చేయగలిగితే, ప్రతి సేవను విడిగా ఎందుకు కొనుగోలు చేయవచ్చు? రాయిటర్స్ విశ్లేషకుల ప్రకారం, భారతీయ కంపెనీలు ‘వారి కోడింగ్ ప్రక్రియలలో క్లాడ్‌ను ఉపయోగించడం ప్రారంభించడంతో, పెద్ద విక్రేత బృందాలపై ఆధారపడటం తగ్గుతుంది, బిల్ చేయదగిన సమయం మరియు లాభాల మార్జిన్‌లను తగ్గిస్తుంది’. ఆందోళన ఏమిటంటే, ‘చట్టపరమైన పరిశోధన, సమ్మతి తనిఖీలు, తగిన శ్రద్ధ మరియు ఆర్థిక విశ్లేషణ’ వంటి కార్యకలాపాలే అవుట్‌సోర్సింగ్ యొక్క బ్రెడ్ మరియు వెన్నను పొడిగిస్తాయి, AI ఇప్పుడు ప్రత్యేకంగా మంచిది.

క్లుప్తంగా చెప్పాలంటే, పునరావృతమయ్యే పని ఉద్యోగాలు మరియు ఆదాయ నమూనాలు ప్రమాదంలో ఉన్నాయి. స్టాక్‌లు ఇప్ప

భారతీయ ఐటీ ప్రభావం (3–5 సంవత్సరాల అంచనా)
రాబోయే 3-5 సంవత్సరాలలో క్లాడ్ ప్రాబల్యం భారతీయ టెక్ కంపెనీలకు అవకాశం మరియు సవాలుగా మారుతుంది.

  • అవకాశం: భారతీయ ఐటీ కంపెనీలు కొత్త ఆఫర్లను సృష్టించడానికి క్లాడ్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఉదాహరణకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) AWS సహకారంతో క్లౌడ్-జెన్‌ఏఐ ప్రాక్టీస్‌ను ప్రవేశపెట్టింది, AI సాధనాల రంగంలో 100,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇస్తుంది. డెవలపర్‌లకు AI-ఆధారిత కోడ్ సూచనలను అందించే AWS యొక్క కోడెక్స్ లాంటి సాధనాన్ని TCS ఏకీకృతం చేస్తుంది. ఈ రకమైన అప్‌స్కిల్లింగ్ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌లో ఉత్పాదకతను పెంచడానికి వీలు కల్పిస్తుంది. ఇతర కంపెనీలు స్పెషలైజేషన్ చేయవచ్చు: ఈ సందర్భంలో, హెల్త్‌కేర్ క్లెయిమ్‌ల కోసం ‘క్లాడ్ ఏజెంట్’ రూపకల్పన లేదా స్థానిక నైపుణ్యాన్ని జోడించడం. క్లాడ్‌ను అమెజాన్ బెడ్‌రాక్ మరియు గూగుల్ ద్వారా వెర్టెక్స్ AI ద్వారా అందిస్తున్నందున భారతీయ ఇంటిగ్రేటర్లు అమలు భాగస్వాములుగా మారవచ్చు.

ఆచరణాత్మకంగా, వారు ప్రపంచ మరియు స్థానిక కస్టమర్లకు AI పని చేయడానికి సహాయం చేస్తారు: లెగసీ సిస్టమ్‌లను క్లాడ్-ఆధారిత వర్క్‌ఫ్లోలలోకి మార్చడం లేదా భారతీయ భాష మరియు నిబంధనల-నిర్దిష్ట AI సహాయకులను సృష్టించడం. అటువంటి నిలువు AI పరిష్కారాలపై (ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఫార్మా, మొదలైనవి) దృష్టి పెట్టడం వలన భారతీయ సంస్థలను బలోపేతం చేయడానికి మరియు సాధారణ పనుల రంగంలో అట్టడుగు స్థాయికి పోటీని నివారించడానికి సహాయపడుతుంది.

  • సవాలు: మరోవైపు, కొన్ని సేవలు కుంచించుకుపోవచ్చు

3-5 సంవత్సరాలలో, ప్రాథమిక డేటా విశ్లేషణ, ఆటోమేటెడ్ డాక్యుమెంటేషన్ లేదా మొదటి స్థాయి కస్టమర్ మద్దతు వంటి కొన్ని కార్యకలాపాలు అధిక ఆటోమేటెడ్ కావచ్చు. దీని అర్థం సాంప్రదాయ అవుట్‌సోర్సింగ్ విభాగాలలో ఒత్తిడి. క్లయింట్లు AI-అగ్మెంటెడ్ రేట్లను అభ్యర్థించినప్పుడు లేదా విదేశీ ప్రత్యర్థులు అదే సాంకేతికతను అమలు చేసినప్పుడు మార్జిన్‌ల కుదింపు సంభవించవచ్చు. మధ్యస్థ శ్రేణిలోని చిన్న కంపెనీల విషయంలో, ఇవి చాలా ప్రత్యేకత లేని సందర్భంలో, ఇది సవాలుగా ఉండవచ్చు. IT స్టాక్ సర్దుబాట్లు నిర్మాణాత్మక మార్పును నిర్ధారిస్తున్నాయని మింట్ విశ్లేషణ హెచ్చరిస్తుంది – AI వాల్యూమ్-ఆధారిత ఉద్యోగాలను ప్రాసెస్ చేస్తున్నందున హెడ్‌కౌంట్‌పై స్థాపించబడిన సాధారణ సేవా నమూనా సవాలు చేయబడుతోంది ¹. క్లయింట్లు 100 మంది జూనియర్ డెవలపర్లకు AI 80% పని చేయగలిగినప్పుడు ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు, భారతీయ కంపెనీలు విలువను జోడించడానికి అనుమతించే వ్యూహాన్ని కలిగి ఉండాలి.

సాధారణంగా, 5వ సంవత్సరం నాటికి, విభజన మరింత స్పష్టంగా కనిపించవచ్చు: AI సేవలు మరియు ప్రతిభలో భారీగా పెట్టుబడి పెట్టే కంపెనీలు (AI లబ్ధిదారులు) వేగంగా వృద్ధిని అనుభవించవచ్చు, అయితే పాత మోడళ్లకు కట్టుబడి ఉన్నవి స్తబ్దుగా మారవచ్చు. విశ్లేషకులలో ఒకరి ప్రకారం, పెట్టుబడిదారులు పడిపోయిన దిగ్గజాలను దాటి AIని సరైన మార్గంలో స్వీకరించే కంపెనీలపై దృష్టి పెట్టాలి.

సంక్షిప్తంగా, కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను మించి విభిన్నంగా ఉండాలి. వారు నిర్వహించబడే AI ప్లాట్‌ఫారమ్‌లు, ఫలితాల ఆధారిత ఒప్పందాలు లేదా కొత్త ఉత్పత్తులను (AI-ఆధారిత SaaS వంటివి) అందించగలరు. మరోవైపు, ప్రతి ప్రాజెక్ట్‌కు మార్కెటింగ్ సంస్థలు అమ్మడం సులభం కాదు. క్లాడ్ యుగం నుండి బయటకు వచ్చే కంపెనీలు ఈ కొత్త టెక్నాలజీని ఖర్చు తగ్గింపు సాధనాలకు విరుద్ధంగా కొత్త ఆదాయ వనరులుగా మారుస్తాయి.

ముగింపు: AI విప్లవాన్ని చూడటం
ఆంత్రోపిక్ ఆవిర్భావం భారతదేశ సాఫ్ట్‌వేర్ కథనానికి రెండు వైపుల కత్తి. ఒక వైపు, క్లాడ్ మరియు అతని AI బంధువులు ఉత్పాదకత పురోగతులకు హామీ ఇస్తారు – ప్రతి బృందానికి అసాధారణమైన తెలివైన, అలసిపోని సహోద్యోగిని శక్తివంతం చేస్తారు. ఇది పైని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది: ఒకే పని నుండి పెరిగిన విలువ, కొత్త ఉత్పత్తులు మరియు దానిని తయారు చేసే కంపెనీలకు పోటీ ప్రయోజనం.

ప్రత్యామ్నాయంగా, ఇది వాస్తవ అంతరాయానికి కారణం కావచ్చు: AI దానిని భర్తీ చేస్తున్నప్పుడు సాధారణ పని సంఖ్య మరియు బిల్ చేయబడిన సమయం తగ్గవచ్చు. ఇది హైప్ కాదు, స్టాక్ మార్కెట్ దాని అర్థంతో పెట్టుబడిదారులను భయపెట్టడం ద్వారా స్పందించింది. అయితే, వాటా ధరలో పతనం అంతిమ నిర్ణయం కాదు. ఇది ఒక సందేశం- వ్యాపారాలు వేగంగా మారడం నేర్చుకోవాల్సిన పాఠం. రిటైల్ పెట్టుబడిదారుడి వైపు, ప్రధాన విషయం సమతుల్యత. నెమ్మదిగా స్వీకరించే వాటిపై AI ప్రయత్నాలను చేపట్టే భారతీయ కంపెనీల పురోగతిని ట్రాక్ చేయండి

క్వాంటమ్ హబ్ . . అమరావతి ఎక్కడికో . ..

క్వాంటమ్ హబ్ . . అమరావతి ఎక్కడికో . ..

/. భారత్ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మరో మలుపు తిప్పబోయే చారిత్రక ఘట్టానికి అమరావతి వేదిక అయింది . సాంకేతిక సునామీ..

ప్రపంచం మారుతోంది.. మనమూ మారాలి! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఇప్పుడు కేవలం ఒక టెక్నాలజీ కాదు, అదొక మహా విప్లవం. డార్విన్ సిద్ధాంతంలాగే, కాలంతో పాటు అప్‌డేట్ అవ్వకపోతే టెక్ ప్రపంచంలో కనుమరుగవ్వడం ఖాయం.

ముంచుకొస్తున్న మార్పు – మనమెక్కడ ఉన్నాం?

అమెరికా స్టాక్ మార్కెట్‌లో టెక్ షేర్లు కుప్పకూలుతున్నాయి. Anthropic వంటి ఏఐ టూల్స్ నెలల పనిని గంటల్లోనే పూర్తి చేస్తున్నాయి. నిన్నటి దాకా ఉన్న ‘మ్యాన్-అవర్స్’ బిజినెస్ మోడల్ కనుమరుగవుతోంది. కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు.. బిజినెస్ లాజిక్ మరియు డొమైన్ నాలెడ్జ్ ఉంటేనే భవిష్యత్తు!

⚡ అమరావతి.. ఇక దక్షిణాసియా ‘క్వాంటం వ్యాలీ’!

ఈ సాంకేతిక సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది:

🔹 క్వాంటం హబ్: అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, రాయపూడిలో 50 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్.

🔹 పెట్టుబడులు: ₹9,000 కోట్ల పెట్టుబడులు.. రాష్ట్ర GSDP లో 3-5% వృద్ధి లక్ష్యం.

🔹 అత్యంత శక్తివంతమైన కంప్యూటర్: దక్షిణాసియాలోనే అతిపెద్ద 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ అమరావతికి రాబోతోంది. ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS) వంటి దిగ్గజాలు ఇందులో భాగస్వాములు.

🔹 గ్లోబల్ లీడర్: బోస్టన్, సింగపూర్ సరసన ఇప్పుడు మన అమరావతి నిలవబోతోంది!

🎓 విద్యార్థుల కోసం సువర్ణావకాశం:

డిగ్రీలు మాత్రమే సరిపోవు.. నైపుణ్యం ముఖ్యం! ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో 50,000 మందికి క్వాంటం శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

✅ దశ 1: 4 వారాల కోర్సు (ఫీజు కేవలం ₹500/- మాత్రమే).

✅ దశ 2: ప్రతిభ కనబరిచిన 3,000 మందికి ఉచిత అడ్వాన్స్‌డ్ శిక్షణ.

✅ దశ 3: టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ సౌకర్యం.

ఇకపై ఇంజనీరింగ్ అంటే పాత సిలబస్ కాదు.. ఏఐ ఇంజనీర్లుగా, డేటా ఆర్కిటెక్టులుగా ఎదగాల్సిన సమయం.

యువతకు పిలుపు: సర్టిఫికెట్ల వెనక కాదు.. నాలెడ్జ్ వెనక పరిగెత్తండి. ఆంధ్రప్రదేశ్ క్వాంటం విప్లవంలో భాగస్వాములు అవ్వడానికి తెలుగు యువత సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమయింది .

జీవితాన్ని మార్చే అంతర్గత ప్రయాణం..

జీవితాన్ని మార్చే అంతర్గత ప్రయాణం..

రాజమండ్రిలో బ్రహ్మకుమారీస్ ఇంటర్నేషనల్ మోటివేటర్ శివాని

” మనల్ని ఎవరైనా ఒకరు పొగిడితే పొంగిపోవడం, ఒకరు విమర్శిస్తే కుంగిపోవడం.. ఇదేనా జీవితం? అంటే మీ మనశ్శాంతిని ఎవరో నిర్ణయిస్తున్నారా?” ఒక మెంటల్ వెల్‌నెస్ స్ట్రాటజిస్ట్‌గా నేను మీకు చెప్పే నిజం ఒకటి ఉంది: మీ ఆనందానికి మీరే ‘మాస్టర్’. బికె శివానీ రాజమహేంద్రవరం చేసిన ప్రసంగంలో ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం . ..

1. మనసుపై నియంత్రణ: ఒక వ్యూహాత్మక ఆవశ్యకత

ప్రస్తుత గందరగోళ ప్రపంచంలో శాంతిగా ఉండటం అనేది ఒక విలాసం కాదు, అది ఒక వ్యూహాత్మక అవసరం (Strategic Necessity). మనసు అదుపులో లేకపోతే ఎంతటి విజయమైనా వ్యర్థమే.

ఇప్పుడే ఒక చిన్న మానసిక వ్యాయామం చేద్దాం: మీరు ఉన్న చోటే వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి. మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ ధ్యాసను నుదిటి మధ్య భాగంలో కేంద్రీకరించి, అక్కడ ఒక ప్రకాశించే నక్షత్రాన్ని ఊహించుకోండి. 🌟

ఆ నక్షత్రమే మీరు — ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి (Master of the body). మిమ్మల్ని మీరు ఒక శక్తిశాలి ఆత్మగా గుర్తించిన క్షణమే, బాహ్య ప్రపంచంలోని ఒత్తిడి మీ దరి చేరదు. ఈ అంతర్గత శక్తిని గుర్తించడం వల్ల కలిగే వ్యూహాత్మక ప్రయోజనం ఏంటంటే, మీరు పరిస్థితులకు బాధితులుగా (Victims) కాక, విజేతలుగా నిలుస్తారు.

2. భౌతిక సౌకర్యాలు vs ఆత్మిక ఆనందం: మీ రిమోట్ ఎక్కడ?

మనం ఒక ప్రమాదకరమైన భ్రమలో ఉన్నాం. భౌతిక వస్తువులు ఇచ్చే సౌకర్యాన్ని (Comfort) ఆనందం (Happiness) అని పొరబడుతున్నాం.

డబ్బుతో ఖరీదైన సోఫా కొనగలం, అది శరీరానికి హాయినిస్తుంది. కానీ ఆ సోఫాపై కూర్చున్న వ్యక్తి మనసు ప్రశాంతంగా ఉండాలంటే అది ఆలోచనల ద్వారా మాత్రమే సాధ్యం.

ఆ ‘చీర’ ఉదాహరణే తీసుకోండి: — మీరు ఒక కొత్త చీర కట్టుకున్నప్పుడు ఎవరో వచ్చి “చాలా బాగుంది” అంటే ఆనందిస్తారు, అదే వ్యక్తి “బాలేదు” అంటే వెంటనే మీ మూడ్ పాడవుతుంది. ఇక్కడ చీర మారలేదు, మీ పరిస్థితి మారలేదు.. కానీ ఇతరుల మెప్పు (Validation) మీద ఆధారపడటం వల్ల మీ ఆనందం అనే రిమోట్ కంట్రోల్‌ను వారి చేతిలో పెట్టారు. వస్తువుల కంటే మీ ఆలోచనలే మీ ఆనందానికి మూలమని గుర్తించండి.

3. జీవిత నిర్మాణం: మీ అంతర్గత తోటను పట్టించుకుంటున్నారా?

మీ జీవితాన్ని ఒక ఇల్లులా భావిస్తే, దానికి రెండు తోటలు ఉంటాయి:

* ముందు తోట (Front Garden): మీ ఉద్యోగం, హోదా, సామాజిక జీవితం. మనం 24 గంటల్లో 23.5 గంటలు దీని కోసమే తపిస్తున్నాం.

* వెనుక తోట (Inner Garden): ఇది మీ మనసు. దీని కోసం మీరు కనీసం 30 నిమిషాలైనా కేటాయిస్తున్నారా?

ఇల్లు అందంగా కనిపించడానికి పెయింటింగ్ వేస్తాం, కానీ ఇల్లు నిలబడాలంటే పునాది (Foundation) ముఖ్యం. విత్తనం బాగుంటేనే ఫలాలు అందుతాయి. మీ అంతర్గత తోటను ధ్యానం ద్వారా శుభ్రం చేసుకోండి, అప్పుడు బయటి ప్రపంచం ఆటోమేటిక్గా అందంగా మారుతుంది.

4. జీవిత నియంత్రణ గది (The Control Room of Life)

జీవితం ఒక స్టేజ్ లాంటిది. అక్కడ లైటింగ్ లేదా సౌండ్ సరిగ్గా లేకపోతే మనం స్టేజ్ మీద పరుగెత్తం, వెనుక ఉన్న ‘కంట్రోల్ రూమ్’ కి వెళ్తాం. మన జీవితంలో ఆ కంట్రోల్ రూమ్ మన “మనసే”.

ఎమోషనల్ వైరస్ పట్ల జాగ్రత్త! కోపం, అసూయ, ఒత్తిడి అనేవి కోవిడ్ కంటే ప్రమాదకరమైన ‘ఎమోషనల్ వైరస్‌లు’. కోవిడ్ వస్తే మాస్క్ ధరించి ఎలా దూరం ఉంటామో, ఈ నెగటివ్ ఎమోషన్స్ నుంచి ‘మౌనం’ అనే మాస్క్ ద్వారా డిస్టెన్స్ పాటించాలి.

గుర్తుంచుకోండి: “పరిస్థితి నా కంట్రోల్‌లో లేదు, కానీ నా ఆలోచన (Switch) నా కంట్రోల్‌లో ఉంది.”

5. కర్మ సిద్ధాంతం: మీరు విసిరే బంతి ఏ రంగులో ఉంది?

కర్మ అనేది మనం గోడకు విసిరే బంతి లాంటిది. మీరు ఏ వేగంతో, ఏ దిశలో విసిరితే అదే విధంగా అది మీ వద్దకు తిరిగి వస్తుంది.

ఎదుటివారు మీపైకి కోపం అనే ‘నల్లని బంతిని’ (Black Ball) విసిరినా, మీరు మాత్రం ప్రతిస్పందనగా ‘వైట్ బాల్’ (White Ball – ప్రేమ, శాంతి) మాత్రమే విసరండి. ⚪ మీరు మీ కర్మల బాధ్యతను తీసుకున్నప్పుడే మీరే మీ భాగ్య విధాతగా (Creator of Destiny) మారుతారు. ఇతరులను నిందించడం మానేసి, మీ కర్మలను సరిదిద్దుకోండి.

6. మీ ‘బేబీ’ని పడేశారా? ప్రాధాన్యతను గుర్తించండి

ఒక స్త్రీ తల మీద నాలుగు కుండలు, చేతిలో ఒక కుండ, చంకలో చంటి బిడ్డతో వెళ్తుందనుకుందాం. అకస్మాత్తుగా ఏదైనా అడ్డంకి వస్తే ఆమె దేనిని వదులుకుంటుంది? ఖచ్చితంగా మట్టి కుండలనే! బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటుంది.

కానీ మన జీవితంలో:

* మనశ్శాంతి అనేది ‘బేబీ’

* ట్రాఫిక్ గొడవలు, సోషల్ మీడియా లైక్స్, ఇతరుల మాటలు ‘మట్టి కుండలు’

మనం ఒక చిన్న కుండ (అహంకారం లేదా కోపం) కోసం మనశ్శాంతి అనే బిడ్డను కింద పడేస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? ఏ పరిస్థితిలోనూ మీ అంతర్గత శాంతిని వదులుకోవద్దు.

7. దైనందిన సాధన: 9 శక్తివంతమైన సంకల్పాలు (Affirmations)

మన ‘సబ్కాన్షియస్ మైండ్’ (Subconscious Mind) నిద్రపోయే ముందు మరియు నిద్రలేవగానే పూర్తిగా తెరిచి ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఇచ్చే సంకల్పాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ప్రతిరోజూ ఈ 9 వాక్యాలను దృఢంగా అనుకోండి:

* నేను ఒక శక్తిశాలి ఆత్మను.

* నేను సదా శాంతంగా, ఆనందంగా ఉన్నాను.

* నేను నా కుటుంబానికి శక్తినిచ్చే పవర్ హౌస్ ని.

* నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది.

* నా బ్లడ్ ప్రెషర్ సాధారణంగా (120/80) ఉంది.

* నా షుగర్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి.

* నా సంబంధాలు అన్నీ మధురంగా ఉన్నాయి.

* నా ఇల్లు ఒక స్వర్గం.

* పరమాత్మ రక్షణ కవచం సదా నా చుట్టూ ఉంది.

ఆహార శుద్ధి: భోజనం వండేటప్పుడు శాంతంగా, భజనలు లేదా మంత్రాలు వింటూ వండండి. ఆ ఆహారం ‘ప్రసాదం’లా మారి మీ కుటుంబ ఆరోగ్యాన్ని మారుస్తుంది. ‘జైసా అన్, వైసా మన్’ (ఆహారం ఎలా ఉంటే, మనసు అలా ఉంటుంది).

8. మీకోసం ఒక ఛాలెంజ్: 24-గంటల మెంటల్ డిటాక్స్!

ఈ రోజు నుండి ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

* ఛాలెంజ్: ఈ రోజు నుండి 24 గంటల పాటు ‘మౌనాన్ని’ (Mental Silence) ప్రాక్టీస్ చేయండి. ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టినా ‘వైట్ బాల్’ మాత్రమే విసరండి.

రాజయోగ మెడిటేషన్: మనసును గెలిచే ఈ అద్భుత కళను నేర్చుకోవడానికి మీ సమీపంలోని బ్రహ్మకుమారీస్ కేంద్రాన్ని సంప్రదించండి. కేవలం 3 రోజుల ఉచిత కోర్సు (ఉదయం 7-8 లేదా సాయంత్రం 7-8) మీ జీవితాన్ని మారుస్తుంది.

మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఇతరులకు అప్పగించకండి!

దావోస్.. ఒప్పందాలు అమలైతే.. ఎంత బాగుంటుందో..

దావోస్.. ఒప్పందాలు అమలైతే.. ఎంత బాగుంటుందో..

దావోస్ దౌత్యం: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడులు, ఆవిష్కరణల కేంద్రంగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు, లోకేష్
డబ్ల్యూఈఎఫ్ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ పాల్గొనడం వల్ల ఇప్పటికే సుమారు ₹2.5 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు లభించాయని చంద్రబాబు నాయుడు చెపుతున్నారు . నిజంగా ఇవన్నీ కాకపోయినా , , కొన్నయినా అమలులోకి రావాలని కోరుకుందాం . ..

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు , విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్, గ్రీన్ ఎనర్జీ, అధునాతన సాంకేతికతలు, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, క్వాంటం కంప్యూటింగ్ మరియు నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు . .

మీడియాతో మాట్లాడుతూ, వేగంగా మారుతున్న ప్రపంచ పారిశ్రామిక ధోరణులు మరియు పెట్టుబడిదారుల మనోభావాలను అర్థం చేసుకోవడానికి దావోస్ వేదిక అమూల్యమైనదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు . WEF సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం ఇప్పటికే దాదాపు ₹2.5 లక్షల కోట్ల పెట్టుబడి నిబద్ధతలుగా మారిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .

“యువశక్తి, నిర్ణయాత్మక నాయకత్వం మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల కారణంగా ప్రపంచ పరిశ్రమ నాయకులు భారతదేశం వైపు ఎక్కువగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బలాలను సమర్థవంతంగా ప్రదర్శించడానికి దావోస్ మాకు సహాయపడింది” అని ఆయన అన్నారు.రాష్ట్ర ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్డు మరియు రైలు కనెక్టివిటీ మరియు జాతీయ పారిశ్రామిక కారిడార్‌లతో దాని ఏకీకరణను హైలైట్ చేస్తూ, ముఖ్యమంత్రి డిపి వరల్డ్, ఎడి పోర్ట్స్, షరాఫ్ గ్రూప్ మరియు ఎడిఎన్‌ఓసి వంటి యుఎఇ కంపెనీలను పారిశ్రామిక పార్కులు మరియు లాజిస్టిక్స్ పెట్టుబడులను అన్వేషించడానికి ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్ 160 GW సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకున్న పునరుత్పాదక ఇంధన రంగంలో, అలాగే అంతరిక్ష మరియు డ్రోన్ నగరాల్లో భాగస్వామ్యాలను కూడా ఆయన ప్రతిపాదించారు
నాలుగు రోజుల పర్యటనలో, ముఖ్యమంత్రి 36 సమావేశాలకు హాజరయ్యారు, వాటిలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మరియు ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ వంటి 16 మంది ప్రపంచ వ్యాపార ప్రముఖులతో సంభాషణలు జరిగాయి .

గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ, వ్యవసాయం మరియు పర్యాటక రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని ఈ నిశ్చితార్థాలలో పదునైన దృష్టికి తీసుకువచ్చినట్లు నాయుడు చెప్పారు. ఇజ్రాయెల్, యుఏఈ మరియు స్విట్జర్లాండ్ ప్రతినిధులతో సమావేశాలలో కూడా ఆయన పాల్గొన్నారు మరియు బహుళ WEF సెషన్‌లకు హాజరయ్యారు.

వైజాగ్ TCS అభివృద్ధి కేంద్రం, అమరావతిలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ మరియు కర్నూలులో సౌర విద్యుత్ ప్రాజెక్టులపై నాయుడు చంద్రశేఖరన్‌తో చర్చలు జరిపారు. పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని మరియు రాష్ట్రంలోని మూడు ప్రతిపాదిత క్రీడా నగరాల్లో పెట్టుబడులను అన్వేషించాలని ఆయన టాటా గ్రూప్‌ను కోరారు.

చంద్రశేఖరన్ సహకారానికి హామీ ఇచ్చారు మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద చొరవలపై టాటా ట్రస్ట్ అధికారులు వివరణాత్మక చర్చలు నిర్వహిస్తారని చెప్పారు.

వ్యవసాయం మరియు ఎగుమతుల విషయంలో, నాయుడు యుఎఇ విదేశీ వాణిజ్య సహాయ మంత్రి థాని బిన్ అహ్మద్ అల్ జెయుదీని కలిసి, ఆంధ్రప్రదేశ్‌ను ఉద్యానవనాలు, ఆక్వా మరియు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు మరియు దుబాయ్‌తో అనుసంధానించబడిన ఆహార క్లస్టర్‌కు కేంద్రంగా ప్రతిపాదించారు.

.సహజ వ్యవసాయం మరియు ప్రత్యామ్నాయ పంటలు
సహజ వ్యవసాయం మరియు ప్రత్యామ్నాయ పంటలపై WEF నిర్వహించిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధమవుతోందని, ఇప్పటికే రెండు మిలియన్ ఎకరాల్లో 1.8 మిలియన్ల మంది రైతులు రసాయన రహిత పద్ధతులను అనుసరిస్తున్నారని నాయుడు అన్నారు.

తక్కువ ఇన్‌పుట్ ఖర్చులు, మొదటి సంవత్సరం నుండి అధిక నికర ఆదాయాలు, మెరుగైన నేల కార్బన్ నిల్వ, నీటి సామర్థ్యం మరియు జీవవైవిధ్యం వంటి ప్రయోజనాలను ఆయన నొక్కిచెప్పారు, అదే సమయంలో ప్రపంచ మార్కెట్లు, ధృవీకరణ వ్యవస్థలు మరియు సహజ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి ప్రైవేట్ రంగ మద్దతు అవసరాన్ని నొక్కి చెప్పారు.

ముఖ్యమంత్రి చేరువకు సాంకేతికత మరియు పాలనపై ప్రత్యేక దృష్టి సారించి మంత్రి లోకేష్ ముఖ్యమంత్రి చేరువయ్యారు. బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిషేధించే ఆస్ట్రేలియా చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, మైనర్ల మానసిక ఆరోగ్యంపై ఆందోళనలు మరియు అలాంటి విధానాన్ని అవలంబిస్తే బలమైన చట్టపరమైన చట్రం అవసరమని ఆయన వెల్లడించారు.

ప్రపంచ సాంకేతికత మరియు సంస్థాగత నాయకులతో లోకేష్ వరుస సమావేశాలు నిర్వహించారు. విశాఖపట్నంలో AI, క్లౌడ్ మరియు డిజిటల్ సేవలపై దృష్టి సారించిన గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని మరియు అమరావతి క్వాంటం వ్యాలీ మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నైపుణ్యం, క్వాంటం కంప్యూటింగ్ మరియు స్టార్టప్ ఇన్నోవేషన్‌లో భాగస్వామి కావాలని ఆయన యాక్సెంచర్‌ను ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఉమ్మడి పరిశోధన, పాఠ్యాంశాల అభివృద్ధి, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజీలు మరియు వాతావరణ మార్పు మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సర్టిఫైడ్ ఆన్‌లైన్ కోర్సులపై సహకారం కోరుతూ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ డెబోరా ప్రెంటిస్‌ను కూడా ఆయన కలిశారు.

దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్‌ను నిర్వహించడానికి
WEF క్వాంటం కంప్యూటింగ్ సెషన్‌లో, ఆంధ్రప్రదేశ్ జూలై 2026 నాటికి అమరావతిలో IBM మరియు TCS భాగస్వామ్యంతో దక్షిణాసియాలో అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ – 133-క్విట్ ప్రాసెసర్‌తో IBM క్వాంటం సిస్టమ్ టూను నిర్వహిస్తుందని లోకేష్ ప్రకటించారు.

భారతదేశం యొక్క జాతీయ క్వాంటం మిషన్‌తో అనుసంధానించబడిన నైపుణ్యాలు మరియు పరిశోధన నుండి హార్డ్‌వేర్ తయారీ మరియు ఎగుమతుల వరకు పూర్తి క్వాంటం విలువ గొలుసును నిర్మించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.

ఇంధన పరివర్తన, సైబర్ భద్రత మరియు సరిహద్దు సాంకేతిక పాలనపై దృష్టి సారించి, ఒక సంవత్సరంలోపు నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం WEF–AP కేంద్రాన్ని ప్రారంభించేందుకు లోకేష్ WEF ప్రభుత్వ వ్యవహారాల అధిపతి మారౌన్ ఖైరోజ్‌ను కలిశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రౌండ్‌టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రం ‘వ్యాపారం చేయడంలో సౌలభ్యం’ నుండి ‘వ్యాపారం చేయడంలో వేగం’ వైపు మారుతోందని, గత 18 నెలల్లో 50కి పైగా నియంత్రణల సరళీకరణ సంస్కరణలను చేపట్టి, 2035 నాటికి ‘డే-జీరో రెడీ స్టేట్’గా గుర్తింపు పొందడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

పెట్టుబడుల కోసం దావోస్‌కు చంద్రబాబు

పెట్టుబడుల కోసం దావోస్‌కు చంద్రబాబు

జనవరి 18 నుంచి 4 రోజుల పాటు దావోస్​లో పర్యటన – ప్రపంచ ఆర్థిక సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దావోస్​కు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహిస్తారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏఐ మోలర్ మేర్క్స్ సంస్థల సీఈవో లతో చర్చలు జరుపుతారు. స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. ఏపీ లాంజ్‌ దీనికోసం వేదిక కానుంది. సీఎంతో పాటు మంత్రి లోకేశ్​ కూడా పర్యటనకు వెళ్లనున్నారు.
ఈనెల 19 నుంచి జరగనున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం నేడు దావోస్ బయల్దేరి వెళ్లనుంది. ఈ రాత్రి విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి దిల్లీ వెళ్లనున్న సీఎం, అక్కడి నుంచి జ్యూరిచ్‌కు వెళ్తారు. జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో చంద్రబాబుతో స్విట్జర్లాండ్‌లో భారతీయ రాయబారి మృదుల్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ కిషోర్​ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లు కూడా సీఎంతో సమావేశం అవుతారు. అనంతరం భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి హాజరవుతారు.

పొలిటికోకు ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్యూ: ప్రపంచం నలుమూలల 20 దేశాల నుంచి వచ్చే ఎన్​ఆర్​టీలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. అనంతరం జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ వెళ్తారు. దావోస్‌లో తొలిరోజు యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల మధ్య జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తర్వాత టాటాసన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కూడా దావోస్ వేదికగా సీఎంతో సమావేశం అవుతారు.

సీఈఓలతో భేటీ: దావోస్ రెండో రోజు పర్యటనలో భాగంగా హోటల్ మోరోసాని ప్రోమెనేడ్‌లో “ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ – ఏపీ అడ్వాంటేజ్” పేరిట సీఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో సీఎం పాల్గొంటారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం ఛైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అవుతారు. ఈ భేటీలో లోకేశ్​ కూడా పాల్గొంటారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తోనూ సీఎం సమావేశం కానున్నారు. ముఖాముఖి భేటీల అనంతరం ఏపీ లాంజ్‌లో నిర్వహించనున్న “వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్‌ప్రెన్యూర్” ప్యానల్ డిస్కషన్‌కు హాజరవుతారు.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్​బీసీ ఇంటర్నేషనల్‌కు కూడా ప్రత్యేక ఇంటర్వూ ఇస్తారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తిలతో సీఎం కొద్దిసేపు సమావేశం అవుతారు. ప్రపంచ ఆర్ధిక సదస్సు సెషన్‌లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్ధిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లిజెర్ అర్టెడా, రాయబారి ఆండ్రియా రౌబర్‌తో సీఎం చర్చలు జరుపుతారు. అలాగే స్విట్జర్లాండ్ పార్లమెంటు సభ్యుడు, భారత- స్విస్ ఫ్రెండ్‌ షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్ సహా ఇతరులతో సమావేశం కానున్నారు. అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్‌తో సీఎం భేటీ అవుతారు.

దావోస్‌లో మూడో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హొరైసిస్ ఛైర్మన్‌ ఫ్రాంక్‌ రిచర్‌తో భేటీ కానున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఈఓ కుష్భు అవస్థి, కాలిబో ఏఐ అకాడెమీ సీఈఓ రాజ్‌ వట్టికుట్టి, స్కాట్ శాండ్స్చెఫర్‌లు సమావేశం ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతారు. దీని తర్వాత ఏపీ సీఎన్​ఎఫ్​ నిర్వహించే “హీలింగ్ ప్లానెట్​ త్రో రీజెనరేటివ్‌ ఫుడ్ సిస్టమ్స్” పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి హాజరుకానున్నారు. “ట్రిలియన్ డాలర్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్‌ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్” అనే అంశంపై చర్చలోనూ సీఎం పాల్గోంటారు.