రంగరాయ ప్రిన్సిపల్ గా డాక్టర్ విష్ణువర్ధన్

Srinivas Vedulla

తెలుగు రాష్ట్రాలలో అత్యున్నతమైన మెడికల్ కాలేజ్ రంగరాయ ప్రిన్సిపాల్ గా డాక్టర్ అత్తలూరి విష్ణ వర్ధన్ నియమితులయ్యారు . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధ0గా ఉన్న మెడికల్ కాలేజీలో అనస్తీసియా విభాగం HOD గా విధులు నిర్వహిస్తున్న విష్ణు రెండేళ్లుగా ఇదే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు . డాక్టర్ విష్ణు వర్ధన్ కు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ గుర్తింపుతోపాటు , పేషేంట్స్ పట్ల సేవాభావం చూపుతారని మంచి పేరుంది . 1997లో కాకినాడ జీజీహెచ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన విష్ణు తర్వాత 2006లో అసోసియేట్ ప్రొఫెస్సర్ గా పదోన్నటి పొందారు . 2015 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు . 2018 లో విష్ణు సేవలకు గాను , ప్రభుత్వం నుంచి ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్నారు .

You May Also Like…