తెలుగు రాష్ట్రాలలో అత్యున్నతమైన మెడికల్ కాలేజ్ రంగరాయ ప్రిన్సిపాల్ గా డాక్టర్ అత్తలూరి విష్ణ వర్ధన్ నియమితులయ్యారు . ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధ0గా ఉన్న మెడికల్ కాలేజీలో అనస్తీసియా విభాగం HOD గా విధులు నిర్వహిస్తున్న విష్ణు రెండేళ్లుగా ఇదే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నారు . డాక్టర్ విష్ణు వర్ధన్ కు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ గుర్తింపుతోపాటు , పేషేంట్స్ పట్ల సేవాభావం చూపుతారని మంచి పేరుంది . 1997లో కాకినాడ జీజీహెచ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన విష్ణు తర్వాత 2006లో అసోసియేట్ ప్రొఫెస్సర్ గా పదోన్నటి పొందారు . 2015 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు . 2018 లో విష్ణు సేవలకు గాను , ప్రభుత్వం నుంచి ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్నారు .
నాసిరకం మద్యం స్కామ్ లో బాద్యులపై హత్యానేరం కింద క్రిమినల్ కేసులు సిద్ధం చేస్తున్నారా?
2019లో అధికారం చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధనదాహానికి ఆంధ్రప్రదేశ్ లో వందలమంది మందుబాబులు బలయ్యారు . వేలమంది అనారోగ్యంపాలై , రోగాలతో కునారిల్లడానికి నాసిరకం , కల్తీ మద్యం కారణమని చెప్పవచ్చు .
అప్పట్లో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి సర్కార్ ‘సిట్ ‘ వేసింది . ఈ కేసులో ఇప్పటివరకు పదిమంది వరకు అరెస్టయ్యారు . కీలక సూత్రధారులైన రాజ్ కసిరెడ్డి , సజ్జల రెడ్డి వంటి వారు అరెస్టయ్యారు . మరికొందరు అరెస్టవ్వడానికి సిద్ధంగా ఉన్నారు . ఇంతవరకు ఓకె . అయితే ఈ కేసును కేవలం ఆర్ధిక దోపిడీ వరకు చూసి వదిలేయడానికి లేదు . జగన్ సర్కార్ చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరి తరపున మద్యం కుంభకోణంలో సూత్రదారులు , పాత్రదారులపై హత్య నేరం కింద కేసులు పెట్టాలన్న డిమాండ్ రోజురోజుకీ ఎక్కువవుతోంది .
హత్య నేరం కేసులు
సీఎంగా అధికార పీఠం ఎక్కిన వెంటనే జగన్మోహన్రెడ్డి మద్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని సమూలంగా మార్చి తనకు, తన వారికి పాడి ఆవుగా చేసుకున్నారు. అప్పటి వరకు ఉన్న పాపులర్ బ్రాండ్లను పక్కనబెట్టి, కమీషన్లు ముట్టజెప్పిన కంపెనీల మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేసే విధానాన్ని తీసుకువచ్చారు. ఊరూ పేరూ లేని కంపెనీలను సృష్టించి, వాటి ద్వారా నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించి ప్రభుత్వం తరపున కొనుగోలు చేశారు. ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోగా, మరెందరో రోగాలు పాలయ్యారు. కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులో వేసుకోవడంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ కారణంగా దీన్నొక ఆర్థిక నేరంగానే కాకుండా ప్రజల చావుకు కారకులుగా గుర్తించి కేసు కట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి.
ఇసుకలో తిన్నారు . . లిక్కర్ లోనూ బొక్కేయలా ?
ఇసుక, మద్యంను సొంత ఆదాయ వనరులుగా మార్చుకోవడంలో జగన్ అండ్ కో ఆరితేరారు . అంతకు ముందు 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకలో మాత్రం బాగానే దండుకున్నారు . దీనిని గమనించిన జగన్ ఇసుక అక్రమాలలో మరో అడుగు ముందుకేసి వేల కోట్ల సమకూర్చుకోగలిగారన్న ఆరోపణలు ఉన్నాయి . ఇసుక వంటి వాటిలో దోపిడీని ప్రజలు సైతం పెద్దగా పట్టించుకోరు . అవసరమైన వాళ్ళు మాత్రం డబ్బు ఎక్కువ పెట్టాల్సిన వస్తుందని ఆ కాసేపు తిట్టుకుని వదిలేస్తారు . మద్యం విషయం అలా కాదు . . నాసిరకం మద్యం సరఫరా ద్వారా బోలెడంత డబ్బుతో పాటు . . అంతకు అనేకరెట్లు పాపం కూడా మూటకట్టుకున్న జగన్ అండ్ కో మాత్రం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే . చంద్రబాబు సర్కార్ వదిలిపెట్టిన పైవాడు మాత్రం వదిలిపెడతాడా ? అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయ్ .
లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన వారితో పాటు విచారణకు హాజరైన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం… ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అమానవీయంగా వ్యవహరించారు. తమ ధనదాహం పేదల ఉసురు తీస్తుందన్న విషయాన్ని విస్మరించిన అధికారులు , అత్యున్నత పదవులు నిర్వహించిన వారు నాసిరకం మద్యంతో మరణించిన , అనారోగ్యంపాలైన కుటుంబాల ఆర్తనాదాలు తగలకుండా ఉంటాయా ? కర్మ ఫలం అనుభవించక తప్పదని మరువకండి .
జమ్మూ కాశ్మీర్ సమీపంలో పహల్గాంలో జరిగిన మారణహోమం తరువాత భారతదేశానికి ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతోంది. పాకిస్థాన్ ఏకాకి అయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ పై క్రమంగా ఒత్తడి పెరుగుతోంది. దీనితో ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నోరు మెదిపారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
“జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల ఓ విషాదకర ఘటన జరిగింది. దీంతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతికే మేము ప్రాధాన్యత ఇస్తాం” అని షరీఫ్ పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.
చర్చల ద్వారానే పరిష్కారం! ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పరోక్షంగా స్పందించారు. “మా దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో ఎన్నటికీ రాజీపడం. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘ఇండియా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఇలాంటి చర్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మేము చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలువురు పాక్ మంత్రులు భారత్పై తమ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను బలితీసుకుని నరమేధం సృష్టించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న పాకిస్థాన్కు భారత్ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు ఆంక్షలు విధించింది. పాక్ పౌరులు తక్షణమే భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని లోలోపల భయంగానే ఉన్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు .
ఏప్రిల్ 25 శుక్రవారం, హైదరాబాద్లోని ‘’హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’’ (HICC) భారత్ సమ్మిట్ 2025లో భాగంగా డైనమిక్ యువత-కేంద్రీకృత రాజకీయ చర్చకు ఆతిథ్యం ఇచ్చింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రగతిశీల పార్టీల సంఘంగా ప్రచారం చేయబడిన కార్యక్రమం. .. భారతదేశం, న్యూజిలాండ్ మరియు మలేషియా నుండి వచ్చిన ప్యానెలిస్టులు వ్యక్తిగత కథలను పంచుకున్నారు, సమ్మిళిత సంస్కరణలు, విద్యార్థుల ఎన్నికలు మరియు వాతావరణ చర్యల అవసరాన్ని హైలైట్ చేశారు. వారు ముందస్తు రాజకీయ భాగస్వామ్యం, పౌర బాధ్యత మరియు ఓటింగ్ వయస్సు తగ్గింపును నొక్కి చెప్పారు.
న్యూజిలాండ్లోని అతి చిన్న పార్లమెంటేరియన్లు మెరీనా హే మరియు అరీనా విలియమ్స్ నుండి మలేషియా తమిళ ప్రతినిధి లినేష్ సెల్యుండన్ మరియు పొన్నం ప్రభాకర్, బల్మూరి వెంకట్ మరియు వరుణ్ చౌదరి వంటి భారతీయ నాయకుల వరకు, ప్యానెల్ బలవంతపు వ్యక్తిగత ప్రయాణాలు మరియు పాలన యొక్క భవిష్యత్తు కోసం ధైర్యమైన ఆలోచనలను పంచుకుంది.
విద్యార్థి రాజకీయాలు, సమ్మిళిత సంస్కరణలు, వాతావరణ న్యాయం, రాజకీయ స్థలాల ప్రజాస్వామ్యీకరణ వంటి అంశాలను నొక్కి చెబుతూ, యువతరం పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించాలని ఈ సెషన్ పిలుపునిచ్చింది.
ఈ భావనను ప్రతిధ్వనిస్తూ, ప్రపంచం మారడాన్ని చూడాలనుకుంటే యువత తిరుగుబాటు చేయాలి, అధికారాన్ని ప్రశ్నించాలి మరియు కొత్త ఆలోచనలను తీసుకురావాలి అని అరీనా విలియమ్స్ నొక్కిచెప్పారు.
“రేపటి యువత మరియు రాజకీయాలు” అనే శీర్షికతో జరిగిన ఈ ప్రసంగానికి యూత్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ అల్లవారు మోడరేటర్గా వ్యవహరించారు మరియు వారు ఇలా అన్నారు: కార్యక్రమంలో వీరు పాల్గొని స్ఫూర్తివంతమైన ప్రసంగం చేశారు .
ఈ సందేశానికి బలం చేకూరుస్తూ, బల్మూరి వెంకట్ నాయకత్వానికి తనదైన మార్గాన్ని పంచుకున్నారు. “నేను రాజకీయ కుటుంబం నుండి రాలేదు. విద్యార్థిగా, నేను NSUIలో చేరి నన్ను నేను నిరూపించుకున్నాను. అది నన్ను దేశంలోనే అతి పిన్న వయస్కుడైన MLCగా మార్చడానికి దారితీసింది” అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థి ఎన్నికలను తిరిగి ప్రవేశపెట్టాలని వెంకట్ గట్టిగా వాదించారు, కొత్త రాజకీయ ప్రతిభను పెంపొందించడానికి ఇది చాలా అవసరమని అన్నారు. “కొత్త రక్తం అలా వస్తుంది. కొత్త నాయకులు అలా పుడతారు.”
అరీనా విలియమ్స్, MP, న్యూజిలాండ్
వరుణ్ చౌదరి, NSUI అధ్యక్షుడు
మెరీనా హే, MP, న్యూజిలాండ్
లీనేష్ సెల్లువాండన్, వైస్ చైర్మన్, DAPSY, మలేషియా
పొన్నం ప్రభాకర్, రవాణా మంత్రి, తెలంగాణ
బల్మూరి వెంకట్, MLC, తెలంగాణ
వంశీ కృష్ణ గడ్డం, MP, పెద్దపల్లి, తెలంగాణ
యువతరం గొంతుల అవసరం
యువత రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్యానెల్లోని సభ్యులందరూ తమ రాజకీయ ప్రయాణాలను ముందుగానే ప్రారంభించారు మరియు ఇప్పుడు తదుపరి తరం కూడా అదే చేయాలని కోరుతున్నారు.యువతపై దృష్టి సారించిన రాజకీయ ప్యానెల్ అంతటా ఒక శక్తివంతమైన సందేశం ప్రతిధ్వనించింది –
“రాజకీయాలకు అనేక ప్రతికూల అర్థాలు జతచేయబడ్డాయి. అయితే, ఇది చాలా సానుకూల పనులు చేయడానికి ఒక మార్గం” అని పెద్దపల్లి ఎంపీ వంశీ గడ్డం అన్నారు. యువత నడిచే మార్పు యొక్క సామర్థ్యాన్ని ఆయన నొక్కిచెప్పినప్పటికీ, సోషల్ మీడియా దుర్వినియోగానికి వ్యతిరేకంగా కూడా ఆయన హెచ్చరించారు, దీనిని పెరుగుతున్న ముప్పుగా అభివర్ణించారు. “రాజకీయాలకు యువ గొంతులు అవసరం” అని లీనేష్ సెల్లువాండన్ పునరుద్ఘాటించారు.
ప్రత్యామ్నాయంగా ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
స్వీట్ల0టే చచ్చేంత ఇష్టమా? మీరు ప్రత్యేకంగా స్వీట్స్ తినకుండానే రోజూ మీ శరీరానికి అవసరమైనదానికంటే ఎక్కువే షుగర్ తింటున్నారు. ఔను మీరు విన్నది నిజమే… కూల్ డ్రింకులు, కాఫీ, టీ లు, జ్యుస్ లు, బ్రెడ్, కేకులు వంటి వాటిని రెగ్యులర్ గా తినడం ద్వారా అనేక కేలరీలు చక్కెర అదనంగా మీ ఒంట్లో చేరుతోంది.. గమనించండి..
తియ్యదనం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ రోజులో ఏదో రకంగా తీపిని తమ బాడీలోకి పంపిస్తూనే ఉంటారు. అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా సరే.. తీపి పదార్థం అనగానే ఎక్కువమందికి నోరూరడం సహజం. అయితే, దీని వల్ల బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువై . . అనేక ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుంది .
రోజులో ఎంత చక్కెర తీసుకోవాలి? ఎంత పరిమాణంలో తీసుకోవాలి? అనేది పరిశీలిద్దాం… అధికంగా చక్కెర తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, రోజుకు ఎంత పరిమితి మోతాదులో చక్కర తీసుకోవాలి? అంతకంటే ఎక్కువ తీసుకుంటే డేంజరేనా? చక్కెర శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది కానీ, అది అధికమైతే ఒబెసిటీ, డయాబెటిస్, కేన్సర్ , గుండె జబ్బులతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
అనారోగ్య సమస్యలెన్నో!
ఒక మనిషి సగటున రోజుకు 25-32 గ్రాముల చక్కెర తీసుకోవచ్చన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు. కానీ, ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న భారతీయలు వినియోగంలో మాత్రం ముందున్నారు. బిస్కెట్లు, కూల్డ్రింకులు, చాక్లెట్లు, స్వీట్లు, కేక్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. శరీరానికి పెద్దగా అవసరం లేకున్నా అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, ఒబేసిటీ బారిన పడుతున్నారు.
‘’షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందుగా బరువు పెరుగుతాం. ఇది గుండెపోటుకు దారి తీస్తుండి. దీనిపై చాలామంది అశ్రద్దగా, నిర్లక్షయంగా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు… ‘’ అని డాక్టర్ ఆదిత్య చౌతి చెబుతారు. ఆదిత్య బెంగళూరులోని ఇంటర్నల్ మెడిసిన్ ఫోర్టిస్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. షుగర్ ఫుడ్స్ తినడం వల్ల దంత సమస్యలు, క్యావిటీస్ వంటివి కూడా పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలో మంట పెరగడానికి షుగర్ కారణమవుతుంది. అందుకే చక్కెరతో నిండిన ఆహారానికి బదులు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ శక్తితో పాటు ఆరోగ్యం బావుంటుందని ఈ డాక్టర్ గారు సూచిస్తున్నారు. .
రోజువారీ జీవనశైలి, ఆహార మార్పుల కారణంగా మన దేశంలో సగటున 11-12 శాతం మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నట్లు “ఐసీఎంఆర్-ఇండియా” అధ్యయనం వెల్లడించింది. పట్టణాల్లో 16శాతం, పల్లెల్లో 9శాతం మంది మధుమేహం బారిన పడుతున్నారని గణాంకాలు ప్రకటించింది. ఫలితంగా పక్షవాతం, గుండెజబ్బులు, పెరలాసిస్, కేన్సర్ , అధిక రక్తపోటు జబ్బులెన్నో తరుముకొస్తున్నాయని చక్కెర వెనుకున్న చేదు నిజాలను వెల్లడింది.
15 ఏళ్ల లోపు పిల్లలు రోజుకి 30 గ్రాముల లోపు చక్కర తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ ఏజ్ గ్రూప్ చిన్నారులలో ఎక్కువమంది రోజుకి సరాసరి.. 50-75 గ్రాముల షుగర్ తినేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
తాజా పండ్లు మేలు . . చక్కరెకు ఆల్టర్ నేటివ్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ మేలని చెపుతున్నారు . మోతాదులో షుగర్ న్ని ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన మొత్తంలో నియంత్రణ ముఖ్యమని సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు తగ్గించాలని, రోజూ సమతుల్య ఆహారంతో పాటు పోషకాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా అరటి , బొప్పాయి , దానిమ్మ , జామ , సీతాఫలం , రామాఫలం , లక్షణ ఫలం , వంటి దేశీయ పండ్లు మేలని ఇటీవల అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి .