చంద్రబాబు ఆహ్వానంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తారా?

చంద్రబాబు ఆహ్వానంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తారా?

జగన్ భయం ఇంకా వీడలేదంటున్న పరిశ్రమ వర్గాలు.

దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనం – ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వెల్లడించిన చంద్రబాబు

– సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని పిలుపు

”సంపద సృష్టి , ,, సంపద సృష్టి . .. అంటూ పదేపదే చెప్పే చంద్రబాబు మాటలను పరిశ్రమ వర్గాలు నమ్ముతాయి . అయితే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా కొంత భయం పారిశ్రామికవేత్తలతో కనిపిస్తూనే ఉంది . 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు , అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది . .. అంటూ టీడీపీ చేసిన ప్రచారం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది . ఈ ప్రచారం ఇపుడు ఏపీకి పరిశ్రమలు రావడానికి అడ్డుపడేలా ఉంది .

సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తానూ ఒకడినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ను భారత్‌ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు.

“ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా, చాలా మంది నాయకులను చూశాను. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ప్రధానిగా ఉన్నారు. మోదీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలం. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అన్నాను, ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటున్నాను. విశాఖలో టీసీఎస్‌ మొదలవుతోంది, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. అలాగే విశాఖకు గూగుల్‌ రాబోతోంది” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్‌ చేయడానికి శ్రమిస్తున్నాం. హైదరాబాద్‌ బ్రౌన్‌ఫీల్డ్‌ సిటీ, అమరావతి గ్రీన్‌ఫ్లీడ్‌ సిటీ. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా. భవిష్యత్తులో ఉత్తమ నగరంగా అమరావతి ఎదుగుతుంది. 2047 విజన్‌గా 15 శాతం వృద్ధిరేటుతో సాగాలనేది లక్ష్యం. క్వాంటం వ్యాలీ, ఏఐ నినాదంతో ముందుకు సాగుతున్నాం. దేశంలో తొలిసారి క్వాంటం కంప్యూటింగ్‌ భారత్‌కు వస్తోంది. టీసీఎస్‌, ఐబీఎం, ఎల్‌ అండ్‌ టీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మారాం” అని చంద్రబాబు వివరించారు.

కిడ్నీలో రాళ్లు.. సమ్మర్ లోనే ఎక్కువ,, ఎందుకు ?

కిడ్నీలో రాళ్లు.. సమ్మర్ లోనే ఎక్కువ,, ఎందుకు ?

డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్ల కేసులు పెరగడంతో వైద్యులు వేసవిని “స్టోన్ సీజన్” అని పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రతలలో అధిక చెమట ద్రవం నష్టానికి దారితీస్తుంది, రాళ్లను ఏర్పరిచే ఖనిజాలను కేంద్రీకరిస్తుంది.

మండే వేసవి ప్రజలను చెమట పట్టించడమే కాదు – ఇది వారి మూత్రపిండాలను కూడా ఒత్తిడికి గురిచేస్తోంది. తెలంగాణలోని ప్రధాన కిడ్నీ సంబంధిత ఆసుపత్రి అయిన ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు తెలంగాణ అంతటా కిడ్నీలో రాళ్ల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, రోజువారీ రోగుల సంఖ్య ఆందోళనకరంగా 300 నుండి 400 వరకు పెరుగుతుందని చెప్పారు.

చల్లని నెలలతో పోలిస్తే ఇది 2 నుండి 2.5 రెట్లు పెరుగుదల. దీనికి కారణం తీవ్రమైన వేసవి వేడి, ఇది నిర్జలీకరణానికి కారణమవుతుందని, పేలవమైన ఆహారపు అలవాట్లు మరియు నీరు తీసుకోకపోవడం అని నిపుణులు అంటున్నారు.

“ముఖ్యంగా యువకులు మరియు పిల్లలలో మూత్రపిండాల్లో రాళ్ల కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయని మేము చూస్తున్నాము” అని AINU సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ తైఫ్ బెండెగేరి ఒక ప్రకటనలో తెలిపారు. “పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు తగినంత హైడ్రేషన్ లేకపోవడం ప్రధాన కారణాలు. ఎంత మంది పాఠశాలకు వెళ్లే పిల్లలు దీని బారిన పడుతున్నారనేది ఆందోళన కలిగించే విషయం – ఎక్కువగా జంక్ ఫుడ్ మరియు చక్కెర పానీయాల కారణంగా.”

కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది కాబట్టి వైద్యులు తరచుగా వేడి సీజన్‌ను “స్టోన్ సీజన్” అని పిలుస్తారు.

వేసవిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం పెరిగిన ఉష్ణోగ్రతలు మరియు అధిక చెమట వల్ల కలిగే నిర్జలీకరణం. ప్రజలు వేడిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల, వారు గణనీయమైన మొత్తంలో శరీర ద్రవాలను కోల్పోతారు.

ఈ ద్రవాలను తగినంత నీరు త్రాగడం ద్వారా భర్తీ చేయకపోతే, మూత్రం కాల్షియం, ఆక్సలేట్ మరియు యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలతో మరింత కేంద్రీకృతమవుతుంది, ఇవి మూత్రపిండాల్లో రాళ్ల యొక్క ప్రధాన భాగాలు. ఈ సాంద్రీకృత మూత్ర వాతావరణం ఈ పదార్ధాల స్ఫటికీకరణ మరియు సముదాయాన్ని ప్రోత్సహిస్తుంది, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువసేపు గురికావడం వల్ల ద్రవ నష్టం పెరగడమే కాకుండా తరచుగా జీవనశైలి మార్పులతో కూడా ఇది జరుగుతుంది. ప్రజలు ఫాస్ట్ ఫుడ్ మరియు ఉప్పగా ఉండే స్నాక్స్ ఎక్కువగా తీసుకోవచ్చు, ఈ ఆహారాలలో అధిక ఉప్పు మరియు ఆక్సలేట్ కంటెంట్ కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం మరింత పెరుగుతుంది.

అదనంగా, ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా చురుగ్గా ఉండే యువకులు మరియు పిల్లలలో, బహిరంగ కార్యకలాపాలు లేదా పని సమయంలో వ్యక్తులు తమ హైడ్రేషన్ అవసరాలను తక్కువగా గుర్తుంచుకోవచ్చు.

కొన్ని అధ్యయనాలు శీతాకాలంలో ప్రజలు తక్కువ చురుగ్గా ఉన్నప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ప్రారంభించవచ్చని మరియు వారి మూత్రంలో కాల్షియం స్థాయిలు ఎక్కువగా అభివృద్ధి చెందవచ్చని సూచిస్తున్నాయి. అయితే, వేసవిలో, పెరిగిన చురుగ్గా ఉండే కార్యకలాపాలు మరియు వేడి-ప్రేరిత నిర్జలీకరణంతో, ఈ రాళ్లు కదిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు లక్షణాలను కలిగిస్తాయి, ఇది నివేదించబడిన కేసులలో పెరుగుదలకు దారితీస్తుంది.

ఇతర దోహదపడే అంశాలు:

అధిక ఉప్పు తీసుకోవడం

తక్కువ నీటి వినియోగం

ప్రాసెస్ చేసిన లేదా జంతు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం

జంక్ ఫుడ్ మరియు శీతల పానీయాల వినియోగం పెరిగింది

సాంప్రదాయకంగా మధ్య వయస్కులైన పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ఈ సీజన్ ఆందోళనకరమైన మార్పును చూసింది. ఎక్కువగా నిశ్చల జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ మరియు తక్కువ నీరు తీసుకోవడం కారణంగా కౌమారదశలో ఉన్నవారు మరియు యువకుల సంఖ్య పెరుగుతోంది.

టీనేజ్ మరియు యువకుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి, వైద్యులు దీనికి నిశ్చల జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారం కారణమని చెబుతున్నారు.

10–17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఇప్పుడు సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ల సంకేతాలను చూపిస్తున్నారు – ఇది దశాబ్దం క్రితం కనిపించని ధోరణి.

పురుషుల కంటే మహిళలు తక్కువ కేసులను నివేదిస్తున్నారు (సుమారు 40 శాతం తక్కువ), కానీ గర్భధారణ సమయంలో నిర్ధారణ కాని రాళ్లు తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.

చిన్నారుల కేసులు ఆందోళనకు కారణమవుతున్నాయి, ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండాల ఆరోగ్యానికి.

“రాళ్లు ఇకపై పెద్దల సమస్య మాత్రమే కాదు. దీనికి తల్లిదండ్రులు మరియు పాఠశాలల్లో తక్షణ అవగాహన అవసరం. హైడ్రేషన్, ఆహారం మరియు ముందస్తు స్క్రీనింగ్ ద్వారా నివారణ సంరక్షణ గణనీయమైన తేడాను కలిగిస్తుంది, ముఖ్యంగా వేసవి వంటి అధిక-ప్రమాదకర నెలల్లో, ”అని డాక్టర్ తైఫ్ బెండెగేరి అన్నారు.

రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన ఏకైక మార్గం బాగా హైడ్రేటెడ్ గా ఉండటమేనని వైద్యులు అంటున్నారు. మీ మూత్రం స్పష్టంగా లేదా లేత పసుపు రంగులో ఉంటే, మీరు తగినంతగా తాగుతున్నట్లు అనిపిస్తుంది. అది ముదురు పసుపు లేదా కాషాయం రంగులో ఉంటే, అది ఎక్కువ ద్రవాలు తాగడానికి సంకేతం.

ఈ వేసవిలో మీ మూత్రపిండాలను రక్షించుకోవడానికి AINU నిపుణులు కొన్ని సాధారణ దశలను సూచిస్తున్నారు:

రోజంతా తగినంత నీరు త్రాగండి – మీరు ఎండలో ఉంటే 2.5 నుండి 3 లీటర్లు త్రాగండి.

ఉప్పు స్నాక్స్, ప్యాక్ చేసిన ఆహారాలు మరియు ఎర్ర మాంసం (రెడ్ మీట్ ) గణనీయంగా తగ్గించడం , మానుకోవడం

ముఖ్యంగా పిల్లలకు చక్కెర పానీయాలు మరియు సోడాలను పరిమితం చేయండి.

పాఠశాలలో మరియు ఇంట్లో క్రమం తప్పకుండా నీటి విరామాలను ప్రోత్సహించండి.

ముఖ్యంగా పిల్లలలో కడుపు నొప్పి, తరచుగా మూత్ర విసర్జన లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట వంటి సంకేతాలను విస్మరించవద్దు.

కుటుంబంలో రాళ్ల చరిత్ర ఉన్న పిల్లలు లేదా పెద్దలకు ముందస్తు స్క్రీనింగ్ మరియు చెక్-అప్‌లను కూడా వైద్యులు సిఫార్సు చేస్తారు.

హనుమంతుడే ఆదర్శం.. అని రాజ్ నాధ్ ఎందుకన్నారు ?

హనుమంతుడే ఆదర్శం.. అని రాజ్ నాధ్ ఎందుకన్నారు ?

”లంకా దహనం చేసిన హనుమంతుడే మాకు ఆదర్శం. మనపైకి వచ్చే శత్రుమూకలను వదిలిపెట్టకూడదు . గట్టిగ బుద్ధి చెప్పాలి . . అన్న ఉద్దేశ్యంతోనే పాక్ పై మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ . .. ” అని రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పుకొచ్చారు . మన అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టామని, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత జాగరూకతతో ఈ దాడులు నిర్వహించామని చెప్పారు. మన సైనికులు అద్భుత పరాక్రమం ప్రదర్శించారని కొనియాడారు.

హనుమంతుడే ఆదర్శం!
అంతేకాకుండా, సైన్యం మానవత్వంతో వ్యవహరించిందని, పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవడంలో భారత సాయుధ దళాలు జాగ్రత్త ఉన్నాయన్నారు. యావత్ దేశం తరపున సైనికులు, అధికారులను అభినందిస్తున్నట్లు చెప్పారు. సాయుధ దళాలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అశోక వనానికి వెళ్ళేటప్పుడు హనుమంతుడు అనుసరించిన సూత్రాన్ని ఈ దాడిలో తాము అనుసరించినట్లు రాజ్​నాథ్ చెప్పారు. తమ అమాయక ప్రజలను చంపిన వారిని మాత్రమే తాము లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రి అన్నారు. తన గడ్డపై జరిగిన దాడికి ప్రతిస్పందించే హక్కును భారత్​కు ఉందని రాజ్​నాథ్ చెప్పారు.

. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ‘ఆపరేషన్ సిందూర్’​కు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో భారత సాయుధ దళాలు అందరినీ గర్వపడేలా చేశాయని రక్షణ మంత్రి అన్నారు. నిన్న రాత్రి భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి కొత్త చరిత్రను సృష్టించాయన్నారు. భారత సాయుధ దళాలు కచ్చితత్వం, అప్రమత్తతతో వ్యవహరించాయని నిర్దేశించిన లక్ష్యాలను సరైన సమయంలో కచ్చితత్వంతో నాశనం చేశాయన్నారు.

‘ఇండియా వెడ్స్ లండన్’  ఇది కపుల్ లవ్​ స్టోరీ

‘ఇండియా వెడ్స్ లండన్’ ఇది కపుల్ లవ్​ స్టోరీ

సినిమాగా రూపుదిద్దుకోనున్న నిజజీవిత కధ

ఒకరిది ఇండియా , ఇంకొకరు బ్రిటన్ . వారిద్దరివి రెండు వేరు వేరు దేశాలు. విభిన్న పరిస్థితులు. అయినా సరే ఏకం అయ్యారు. వారి అభిరుచులే వారు ఇద్దరిని కలిపాయి . లండన్​కు చెందిన ఓ యువతి కర్ణాటకలోని గంగావతికి చెందిన యువకుడిని పెళ్లాడింది . వారి ప్రేమ కథేంటో మనమూ ఓ లుక్కేద్దాం . .

విరూపపుర గద్దే ప్రాంతానికి చెందిన మురళి స్థానికంగా ఓ గెస్ట్​ హౌస్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అలాగే టూరిస్ట్​ గైడ్​గానూ పనిచేస్తున్నాడు. అయితే అతడికి సినిమాలు తీయాలనే కల కూడా ఉంది. ఇదిలా ఉండగా, వృత్తి రీత్యా ఫిల్మ్​ మేకర్ అయిన చార్లెట్ మేరీ ఫ్రాంక్లేయిర్ రెండేళ్ల క్రితం భారత్ పర్యటనకు వచ్చింది. మురళి నిర్మాతగా వ్యవహరించిన ‘ఐ లవ్ మై కంట్రీ ‘ అనే సినిమాకు డైరెక్టర్​గా వ్యవహరించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది.
ఈ క్రమంలోనే ఇరు వర్గాల అంగీకారంతో మురళి, చార్లెట్ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కింది . ఆడంబరాలకు పోకుండా గంగావతి రిజిస్టర్ ఆఫీస్​లో పెళ్లి సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి తర్వాత స్వీట్లు పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే మరో ప్రత్యేక విషయం ఏంటంటే – వీరిద్దరూ కలిసి రూపొందించిన ‘ఇండియా వెడ్స్​ లండన్’ అనే షార్ట్​ ఫిల్మ్​ – మే 9న లండన్​లో జరిగే వీరి రిసెప్షన్ రోజునే విడుదల కానుంది. అంతేకాకుండా లోట్టీ ఫ్రాంక్లేర్ ఎంటర్​టైన్​మెంట్స్ అనే సంస్థను కూడా ప్రారంభిస్తున్నట్లు వీరు ప్రకటించారు .