
గోదావరి కుర్రాడు ,,కెన్సింగ్టన్ డిప్యూటీ మేయర్
యూకేలోని రాయల్ బరో కెన్సింగ్టన్, చెల్సియా డిప్యూటీ మేయర్గా ఎన్నికైన ఆర్యన్ ఉదయ్
భీమవరం రురల్ తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి వీరాస్వామి, గొబ్బెళ్లమ్మ మనవడు ఆర్యన్ ఉదయ్. ఇతని తండ్రి వెంకటసత్యనారాయణ భీమవరంలో హెడ్మాస్టర్ గా పని చేశారు. ఉదయ్ సెయింట్మెరీ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. టెన్నిస్పై ఆసక్తితో హైదరాబాద్ వెళ్లి అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తరువాత భీమవరంలో డిగ్రీ, నరసాపురంలో ఎంబీఏ విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం లండన్లో ఎంఎస్ పూర్తి చేసి, యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం కార్యదర్శిగానూ ఆర్యన్ ఉదయ్ పని చేశారు.
రాయల్ బరో కెన్సింగ్టన్, చెల్సియా కౌన్సిలర్గా పదవి నిర్వహిస్తూనే డిప్యూటీ మేయర్గానూ ఎన్నికై య్యారు . ప్రస్తుతం బ్రిటన్లో కన్సర్వేటివ్ పార్టీ ఇండియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, యూరోప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి ఉపాధ్యక్షుడిగానూ ఉదయ్ పని చేస్తున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్కు నమ్మకస్థుడిగా ఉదయ్ ఉన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడుని లండన్లో కలిశారు. హైదరాబాద్లో ఏర్పడిన టెన్నిస్ పరిచయాలే తనను లండన్ దిశగా నడిపించాయని ఉదయ్ అంటున్నారు.
పట్టుదలతో , ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే మన గోల్స్ సాధించడం ఎంతో సులభం అంటారు భీమవరానికి చెందిన ఆర్యన్ ఉదయ్ని. యూకేలోని రాయల్ బరో కెన్సింగ్టన్, చెల్సియా డిప్యూటీ మేయర్గా ఎన్నికైన తెలుగు వ్యక్తిగా నిలిచారు. గోదావరి జిల్లాల ప్రాంతానికి చెందిన యువకుడు బ్రిటన్లో ఉన్నత పదవి చేపట్టడంపై ఈ ప్రాంతవాసులు , ఉదయ్ స్నేహితులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.