సాక్షిటివిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జర్నలిస్ట్ ని అని చెప్పుకునే కృష్ణంరాజు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలపై నమోదైన కేసులో జుడీషియల్ రిమాండ్ ఖైదీగా జైలు కి వెళ్లిన కొమ్మినేని శ్రీనివాసరావు కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినంత మాత్రాన జనం నోళ్ళ నుంచి తప్పించుకోలేరు . ..
మీడియామీద సామాన్యుల్లో జనరల్ గా వున్న కోపం, జగన్ అప్రజాస్వామిక, కక్షసాధింపు, నియంతృత్వాల మీదా, ఓడిపోయాక కూడా రాజధాని అమరావతిని వ్యతిరేకించి ద్వేషాన్ని వెళ్లగక్కే పైశాచికత్వాల మీద మధ్యతరగతి విద్యావంతుల్లో వున్న ఆగ్రహం- కృష్ణంరాజు మాటలతో బాంబులా పేలింది. ఇది కృష్ణంరాజుకు , కొమ్మినేని శ్రీనివాస్ కో నష్టం తెచ్చే అంశంకాకపోవచ్చు . కృష్ణంరాజు అంతగా తెలియని వ్యక్తి . ఈ ఎఫెక్ట్ జగన్ పైనా , అయన పార్టీ YSRCP పైనా … తీవ్ర ప్రభావం పడుతోంది .
మురికి వ్యాఖ్యలను నివారించగలిగి వుండి కూడా, కృష్ణంరాజుపై సోషల్ మీడియా ట్రోలింగ్ పెరిగిపోతుందని తెలిసి కూడా, ఆమేరకు హెచ్చరించి ఓ నవ్వు నవ్వేసి మౌనం పాటించిన కెఎస్ఆర్ దొరికిపోయారు. రిమాండ్ కు పంపడం శిక్షకాదు. ఆయన నేరంచేశాడు కాబట్టి శిక్షింపచేయడానికి మొదలైన పోలీసు ప్రక్రియలో ఒక భాగం మాత్రమే!
ఏ పార్టీ అధికారంలో వున్నా పోలీసు చర్య వెనుక రాజకీయ నిర్ణయాలే వుంటాయనేది కాదనలేని విషయం . పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించే పరిణతి మన సమాజానికి ఇంకా వచ్చినట్లు లేదు .
ఎమో షన్స్ ను రెచ్చగొట్టడంలో న్యూస్ టివిల పాత్ర అంతా ఇంతా కాదు. వార్తలకోసం సమాచారం కోసం 30 శాతం మంది వార్తా పత్రికలు చదువుతున్నారు. 65-70 శాతం వరకూ ప్రజలు న్యూస్ టివిలను చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల విస్తృతి పెరుగు తున్న ప్రస్తుత దశలో పేపర్లు చదివేవారు, టివిలు చూసేవారూ కలిసి 40 శాతం మందివరకూ యూ ట్యూబ్ చానళ్ళను, న్యూ యాప్ లనూ చూస్తున్నారు. వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
పాఠకుల కంటే ప్రేక్షకులే ఎక్కువ మంది వున్న ఈ పరిస్ధితుల్లో టివిలు రేటింగ్ కోసం ఎమోషన్లను రెచ్చగొట్టి వార్తల్ని కల్తీ చేయడంలో మునిగిపోయాయి.
ఇతర టివిలు కనీసం కొంత తటస్ధతను నటిస్తున్నా సాక్షి టివి పూర్తిగా ఏకపక్ష0గానే వ్యవహరిస్తోంది . వాళ్ళు పెట్టుకున్నదే అందుకు . టివిల్లో డిబేట్లు, పానల్ డిస్కషన్లకు మరో పార్టీవారిని పిలవడం మానేశారు. ఈ ధోరణి కి కెఎస్ఆర్ కేంద్రబిందువు అయ్యారు. ఇతర టివిలు కూడా జగన్ వార్టీని వెలివేశాయి. ఈ బాధ్యత జగన్ దే తప్ప కెఎస్ఆర్ ది కాదు. అయినా సీనియర్ హోదాలో తప్పొప్పుల్ని ఆయనే మోయక తప్పలేదు.
ఏకపక్ష టివిలో డిబేట్ ని బ్యాలెన్స్ చేసే కెఎస్ఆర్ ను చూసిచూసి విసుగొచ్చేది. చివరికి నటనాత్మకమైన బేలెన్స్ చేయడంలో కూడా విఫలమైపోయారు. ఆయన జైలుకి వెళ్ళే వరకూ దారితీసిన పరిస్ధితులను గుర్తుచేసుకుంటే అమరావతి పై వ్యాఖ్యలు కేవలం ట్రిగ్రర్ నొక్కడం మాత్రమేనని అర్ధమైపోతుంది.
ఈ కేసులో చట్టం, న్యాయం ఒక ఫ్రేములో తమపని తాము చేసుకుపోతాయి. అది ధర్మబద్ధంగా లేకపోతే ప్రజలు గుర్తుంచుకుంటారు. సమయం వచ్చినపుడు తమ ఇంగిత జ్ఞానం (కామన్ సెన్స్) మేరకు ప్రతిస్పందిస్తారు. ప్రజల నిర్ణయాలు, రాగద్వేషాలు వారి ఇంగిత జ్ఞానం నుంచే వస్తాయి. చట్టం, న్యాయం, ధర్మం కంటే ఇంగితజ్ఞానమే బలీయమైనది.
సీజన్ లో తప్పక తినాలని సూచిస్తున్న వైద్య , పోషకాహార నిపుణులు
నేరేడు పండ్లలో పోషకాలూ మెండుగా ఉంటాయి. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నేరేడు పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు ఫాస్ఫరస్, క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. నేరేడు పండ్లు తింటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
వర్షాకాలంలో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎన్నో రోగాలకు సహజ నివారిణిగా పనిచేస్తాయని అంటున్నారు. ఇందులో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
డయాబెటిస్ కంట్రోల్ : నేరేడు పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదని నిపుణులు సూచిస్తారు . దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో గ్లూకోజ్ లెవల్ను నియంత్రించడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. నేరేడు పండ్ల విత్తనాలలో ఉండే జాంబోలిన్, జాంబుసిన్ వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయని, నేరేడు పండ్లలోని ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు స్టార్చ్ను చక్కెరగా మారకుండా నిరోధించే సామర్థ్యం ఉంటుందని, తద్వారా ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తుందని ”National Library Of Medicine ” పేర్కొంది .
కంటి ఆరోగ్యం : నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా రెటీనాను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతుందని, కళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి దోహదం చేస్తుందని వివరిస్తున్నారు.
నేరేడు పండ్లు తినడం వల్ల .. చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను తొలగిపోతాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కానీ వీటిని సరైన కాంబినేషన్తో తినకపోతే.. ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు.కానీ వీటిని సరైన కాంబినేషన్తో తినకపోతే.. ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. నేరేడు పండ్లు కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. నేరేడు పండ్లు కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లు టేస్ట్లో పుల్లగా ఉంటాయి. ఇవి ఖాళీ కడుపుతో తింటే.. ఎసిడిటీ, కడుపు నొప్పి, చికాకు వంచి సమస్యలు వస్తాయి. నేరుడు పండు తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాబట్టి ఆహారం తిన్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.
రికార్డ్ దిగుబడి సాధించి చూపించిన ఉపాధ్యాయురాలు –
ఎకరాకు 43 బస్తాల దిగుబడి అంటేనే కొన్ని ప్రాంతాలలో గొప్ప. అలాంటిది ఏకంగా అర ఎకరంలోనే ఈ దిగుబడి సాధించి రైతు లోకం నుంచే ఔరా అనిపించుకుంటున్నారు ఓ ఉపాధ్యాయురాలు . …
తమిళనాడుకు చెందిన ఆ మహిళా రైతు ఏకంగా అర ఎకరానికే 43 బస్తాల వరి పండించి రికార్డు సృష్టించింది. ఓ మహిళే ఈ ఘనతను సాధించింది.
అది కూడా ఆమె ఓ ఉపాధ్యాయురాలు కావడం విశేషం. ఆమె పేరు ప్రసన్న. తమిళనాడులో నివాసం. ఓ ప్రైవేటు కళాశాలలో లో సైన్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది.
అయితే చిన్నప్పటి నుంచి ప్రసన్నకు వ్యవసాయం అంటే ఎంతగానో ఇష్టం. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని గమనించి నిత్యం పొలానికి తీసుకెళ్లేవాడు.
అంతేకాదు ఆమె కళాశాలలో చేరినా రోజూ పొలానికి వెళ్లి వచ్చాకే కాలేజీకి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె ఎమ్మెస్సీ బీఈడీ కూడా పూర్తి చేసి టీచర్గా ఉద్యోగం చేయడం ప్రారంభించింది.
అయితే వ్యవసాయం మీద మక్కువ ఉండడంతో ఓ రైతునే పెళ్లి కూడా చేసుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్తగా శ్రీవరి అనే వంగడాన్ని కనిపెట్టడంతో సదరు విత్తనం గురించి తెలుసుకుని దాన్ని పండించాలని నిర్ణయం తీసుకుంది.
అలా ప్రసన్న అనుకున్నదే తడవుగా సంబంధిత అధికారులను కలిసి విత్తనాలను తీసుకుని పంటలు వేసింది. కానీ మొదటి రెండు సార్లు విఫలమైంది.
అయితే ఈ సారి ఎలాగైనా సదరు విత్తనంతో మంచి దిగుబడి రాబట్టాలనుకుంది. ఈ క్రమంలో కృత్రిమ ఎరువుల జోలికి పోకుండా పూర్తి స్థాయిలో సేంద్రీయ పద్ధతిలో తయారు చేసిన ఎరువులను వాడింది.
అయితే ఈ సారి ఆమె అనుకున్నట్టుగానే అత్యంత ఎక్కువగా దిగుబడి సాధించింది. సాధారణంగా ఒక ఎకరా వరి పొలానికి దాదాపుగా 40 బస్తాలు పండుతాయి, కానీ ప్రసన్న చేసిన సాగుతో, శ్రీవరి విత్తనం కారణంగా ఆమె అర ఎకరం పొలంలోనే ఏకంగా 43 బస్తాలు (3223 కిలోలు) వరి పండింది.ఇప్పుడు ప్రసన్న దృష్టి బిందు సేద్యంపై పడింది. ఈ విధానంలో పంటలను పండిస్తూ పేరు తెచ్చుకోవాలన్నది ఆమె కోరిక. ఆమె ఆశ నెరవేరాలని మనమూ ఆశిద్దాం.
ఈ క్రమంలో మొదట్నుంచీ ప్రసన్న చేస్తున్న సాగును, ఆమె వ్యవసాయ పద్ధతులను అధికారులు రిజిస్టర్లలో నమోదు కూడా చేశారు.
దీంతో చివరికి ఆమె సాధించిన దిగుబడి రికార్డు స్థాయిలో ఉండడంతో ఆమెకు రూ.5 లక్షల నగదు కూడా ఈమెకు గిఫ్ట్ గా ఇచ్చారు . అందించారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తున్నారు . బోయింగ్ 787 కి ఇటువంటి దుర్ఘటన జరగడం ఇదే ప్రధమం అని చెపుతున్నారు . ..
-విమానం టేకాఫ్ అయిన నిమిషంలోనే కూలిపోయింది . .. ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేష్
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయలు ప్రకటించిన టాటా గ్రూప్ . .
అహ్మదాబాద్ లో ఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా . .. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్
మృతులలో 169 మంది భారతీయులు . .53 మంది బ్రిటీషర్లు – ఏడుగురు పోర్చుగల్ దేశీయులు . ఒక కెనడియన్ .. మొత్తం 230 మంది . ఇద్దరు పైలెట్స్ , పదిమంది విమాన సిబ్బంది ఉన్నారు .
విమాన ప్రమాదం నుంచి 11ఏ నంబర్ సీటులోని ప్రయాణికుడు బయటపడ్డారు
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ బోయింగ్ 787 విమానంలో 12 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
‘ఏఏఐబీ డెరెక్టర్ జనరల్, ఏజెన్సీలోని ఇన్వెస్టిగేషన్ డైరెక్టరర్ సహా ఇతర అధికారులు ఇప్పుడు అహ్మదాబాద్ బయలుదేరుతారు’ అని సదరు అధికారి తెలిపారు.
పౌర విమానయాన మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఏఏఐబీ – భారత గగనతలంలో ప్రయాణించే విమానాల భద్రతకు, అలాగే ఇండియన్ ఎయిర్ స్పేస్లో జరిగే విమాన ప్రమాదాలకు, తీవ్రమైన ఘటనలకు బాధ్యత వహిస్తుంది. వాటిపై సమగ్ర దర్యాప్తు చేస్తుంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను మెరుగుపరిచేందుకు తగిన చర్యలను సూచిస్తుంది.
ఇనీషియల్ రిపోర్ట్! ‘విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు మాకు అందాయి. మరింత సమాచారం సేకరించడానికి మేము కృషి చేస్తున్నాం’ అని బోయింగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రమాద స్థలంలో ….
విమాన ప్రమాదం నుంచి ఒకరు మృత్యుంజయులైనట్టు అహ్మదాబాద్ CP జీఎస్ మాలిక్ తెలిపారు. 11ఏ నంబర్ సీటులోని ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. విమాన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న అహ్మదాబాద్ CP, నివాస ప్రాంతంలో కూలినందువల్ల సంఖ్య ఎక్కువే ఉండే అవకాశముందన్నారు. విమానం కూలిన సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికుడు బయటికొచ్చినట్టు తెలుస్తోంది
హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన మాటల్లో చెప్పలేని హృదయ విదారకఎం . .” అని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు . బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని, బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్న మంత్రులు అధికారులతో మాట్లాడినట్లు మోదీ చెప్పారు.
పాకిస్తాన్ దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ, బ్రహ్మోస్ క్షిపణులను విరివిగా ఎందుకు తయారు చేయలేము ?
ఏ దేశానికి మనం బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించాలన్నా . .. రష్యా అనుమతి తీసుకోవాల్సిందే . అనుమతి అంటే కండిషన్ లాగా కాకుండా . .. మిత్రత్వంతో కూడినదిగా… అని కూడా చెప్పుకోవచ్చు . ..
”ఆపరేషన్ సిందూర్” సందర్భంగా భారత వైమానిక దళం పాకిస్తాన్లోని తొమ్మిది వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసినప్పుడు, ఆ ప్రభావం ఉపఖండం దాటి చాలా దూరం ప్రతిధ్వనించింది. ఈ సూపర్సోనిక్ క్షిపణుల వల్ల కలిగే ఖచ్చితత్వం, వేగం మరియు విధ్వంసం బిగ్గరగా మరియు స్పష్టమైన సందేశాన్ని పంపాయి. భారతదేశం ఇక ముందు ప్రపంచ స్థాయి భారీ ఆయుధాల కొనుగోలుదారు మాత్రమే కాదు, అది ఉత్పత్తిదారు కూడా అయింది .
అత్యంత ఖచ్చితమైన, అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులలో పేరొందిన బ్రహ్మోస్, సైనిక వర్గాలలో రాత్రికి రాత్రే సెలబ్రిటీ హోదాను పొందింది. దీనిని భూమి, గాలి లేదా సముద్రం నుండి ప్రయోగించవచ్చు, మాక్ 3 వేగంతో (ధ్వని వేగం కంటే మూడు రెట్లు) ప్రయాణిస్తుంది మరియు దాని లక్ష్యం నుండి ఒక మీటర్ లోపల దాడి చేయగలదు. రఫీకి మరియు మురీద్ వంటి పాకిస్తాన్ స్థావరాలపై దాని భీకర దాడి వారి వైమానిక రక్షణలను నిస్సహాయంగా చేసింది. పాకిస్తాన్ ఒక్క బ్రహ్మోస్ను కూడా ఎగురవేయకుండా ఆపగలదు.
2022లో మొదటి అధికారిక కొనుగోలుదారుగా మారిన ఫిలిప్పీన్స్ వంటి దేశాలు త్వరలోనే వియత్నాం, ఇండోనేషియా, ఈజిప్ట్, యుఎఇ, సౌదీ అరేబియా మరియు బ్రెజిల్లను అనుసరించాయి – ఇవన్నీ పాకిస్తాన్ రక్షణలను దెబ్బతీసిన క్షిపణిని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి.అయితే, ఒక ముఖ్యమైన అడ్డంకి ఉంది. క్షిపణి పూర్తిగా భారతీయమైనది కానందున భారతదేశం బ్రహ్మోస్ను స్వేచ్ఛగా అమ్మకూడదు.
భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) మరియు రష్యా యొక్క NPO మాషినోస్ట్రోయేనియా మధ్య జాయింట్ వెంచర్ ఫలితంగా బ్రహ్మోస్ ఏర్పడింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ క్షిపణి ఉత్పత్తిని పర్యవేక్షిస్తుంది, కానీ మూడవ దేశానికి ప్రతి అమ్మకానికి రష్యా ఆమోదం అవసరం. రెండు దేశాలకు క్షిపణి సాంకేతికతలో 50-50 వాటా ఉంది. అందువల్ల, రష్యా అధికారిక అనుమతి లేకుండా భారతదేశం దానిని ఎగుమతి చేయదు.
ఈ వీటో అధికారం ప్రధాన వ్యూహాత్మక చిక్కులను కలిగి ఉంది. ఉదాహరణకు, ఇండోనేషియా వంటి దేశం ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రష్యా దాని భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు లేదా ఇప్పటికే ఉన్న పొత్తుల కారణంగా సంకోచిస్తే చర్చలు నిలిచిపోవచ్చు. సౌదీ అరేబియా లేదా UAE వంటి మధ్యప్రాచ్య దేశాలు, మాస్కోతో సన్నిహిత US సంబంధాలు మరియు సంక్లిష్ట సంబంధాలు కలిగిన దేశాల విషయంలో, రష్యాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉండవచ్చు. మరియు దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాలలో, ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, రష్యా బ్రహ్మోస్ అమ్మకాల ద్వారా పరోక్షంగా ఒక వైపు ఆయుధాలు సమకూర్చుకోవడం ద్వారా ఘర్షణలు పెరగకుండా ఉండటానికి ఇష్టపడవచ్చు.
భారతదేశం కీలక రక్షణ భాగస్వాములుగా భావించే దేశాలు కూడా క్రెమ్లిన్ ఆమోదం కోసం వేచి ఉండాలి.
ఈ సంక్లిష్టతకు తోడుగా, భారతదేశం క్షిపణి సాంకేతిక నియంత్రణ పాలన (MTCR) పట్ల నిబద్ధత ఉంది, ఇది సభ్య దేశాలు కాని దేశాలకు 300 కిలోమీటర్లకు మించి పరిధి కలిగిన క్షిపణులను ఎగుమతి చేయడాన్ని నిరోధించే ప్రపంచ ఒప్పందం. కట్టుబడి ఉండటానికి, బ్రహ్మోస్ ఎగుమతి వెర్షన్ 290 కి.మీ పరిమిత పరిధిని కలిగి ఉంది – భారతదేశం ఇప్పుడు ఉపయోగించే విస్తరించిన-శ్రేణి వేరియంట్ల కంటే చాలా తక్కువ, వీటిలో కొన్ని 800 కి.మీ వరకు చేరుకోగలవని నివేదించబడింది.
కాబట్టి, భారతదేశానికి రష్యన్ ఆమోదం అవసరం మాత్రమే కాదు, అంతర్జాతీయ కొనుగోలుదారులకు క్షిపణి సామర్థ్యాలను కూడా పరిమితం చేయాలి.
ఈ ద్వంద్వ పరిమితి, రష్యా సహ-యాజమాన్యం మరియు MTCR నియమాలు, భారతదేశ రక్షణ ఆశయాలలోని వైరుధ్యాన్ని బహిర్గతం చేశాయి. ఒక వైపు, భారతదేశం ప్రపంచ ఆయుధ ఎగుమతిదారుగా మారాలని మరియు విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటుంది.
వ్యంగ్యం ఇంతకంటే పదునుగా ఉండదు. పాకిస్తాన్పై భారతదేశం యొక్క సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించిన అదే క్షిపణి ఇప్పుడు దాని ఆధారపడటాన్ని గుర్తు చేస్తుంది. న్యూఢిల్లీ దౌత్యం మరియు నిరోధ సాధనంగా బ్రహ్మోస్ను ఉపయోగించాలనుకుంటే, అది మాస్కోతో ఎగుమతి నిబంధనలను తిరిగి చర్చించుకోవాలి లేదా ఎటువంటి షరతులు లేకుండా పూర్తిగా స్వదేశీ ప్రత్యామ్నాయ అభివృద్ధిని వేగవంతం చేయాలి.అప్పటి వరకు, బ్రహ్మోస్ భారతదేశం యొక్క అత్యంత ప్రాణాంతక ఆయుధంగా ఉంటుంది, కానీ అది ప్రపంచ వేదికపై పూర్తిగా విడుదల చేయలేనిది.
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తి ముక్కామల శ్రీనివాస్
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) అధ్యక్షుడిగా (ప్రెసిడెంట్( భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కమల శ్రీనివాస్(బాబీ) ఎన్నికయ్యారు. 178 సంవత్సరాల AMA చరిత్రలో ఈ సంస్థకు నాయకత్వం వహించిన తొలి భారతీయుడిగా శ్రీనివాస్ రికార్డ్ క్రియేట్ చేశారు . ఇటీవ చికాగోలో జరిగిన ఏఎంఏ వార్షిక సమావేశంలో కుటుంబ సభ్యులు, సహచరులు, మాజీ నాయకుల సమక్షంలో ముక్కామల శ్రీనివాస్ ఈ బాధ్యతలు చేపట్టారు
ముక్కామలకు 8 సెం.మీ. మెదడు కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స జరిగిన కొన్ని నెలల తర్వాత ఆయన నియామకం జరిగింది. “నేను మాయో క్లినిక్లో మెదడు శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నప్పుడు, ట్యూబ్లు మరియు వైర్లు నా ప్రతి కదలికను పర్యవేక్షిస్తుండగా, ఈ రాత్రి – ఈ గౌరవం – ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఈ అవకాశం చాలా సుదూర కలగా అనిపించింది” అని ఆయన గుర్తు చేసుకున్నారు.
“మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మన శ్రద్ధ అవసరమయ్యే అపారమైన అంతరాలు ఉన్నాయి” అని పేర్కొంటూ, అమెరికా ఆరోగ్య సంరక్షణ సంస్కరణల అవసరాన్ని ముక్కామలకు నొక్కి చెప్పారు. “అందుకే మన రోగులకు తగినంత ఆరోగ్య కవరేజ్ కోసం పోరాటం కొనసాగించడం చాలా ముఖ్యం… మరియు స్థిరమైన, సమానమైన ఆరోగ్య సంరక్షణ నమూనా కోసం పోరాటం ఎందుకు చాలా ముఖ్యం” అని ఆయన జోడించారు.
అమెరికా ఆరోగ్య వ్యవస్థలో దీర్ఘకాలంగా నెలకొన్న సవాళ్లను పరిష్కరించడంపై తాను దృష్టి సారిస్తానని డాక్టర్ ముక్కామల స్పష్టం చేశారు. వైద్యులపై పనిభారం, సిబ్బంది కొరత, వైద్య సేవలు అందరికీ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జిటల్ హెల్త్ టెక్నాలజీని ప్రోత్సహించాలని అన్నారు. రానున్న రోజుల్లో ముక్కామల నాయకత్వం ఏఎంఎఏ ఆరోగ్య సంరక్షణ సంస్కరణలు, వైద్యుల సంక్షేమంపై దృష్టి సారించనుంది. అంతేకాకండా వైద్యులు, రోగుల కోసం సంస్థ తన వాణిని బలంగా వినిపిస్తుందని ఆశిస్తున్నారు.
డాక్టర్ ముక్కామల వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒక పెను సవాలు కూడా ఉంది. గతేడాది నవంబర్లో ఆయన మెదడులో 8 సెంటీమీటర్ల కణితి (ట్యూమర్) ఉన్నట్లు తెలిసింది. మూడు వారాల తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇప్పడు దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచారు శ్రీనివాస్. తన వైద్య బృందం నైపుణ్యం, కుటుంబ సభ్యుల మద్దతు, వైద్య విజ్ఞాన శాస్త్రంలో పురోగతి వల్లే ఇప్పుడు తాను బతికి ఉన్నాని ఆయన తెలిపారు. వైద్యుడి నుంచి రోగిగా మారిన తన అనుభవం ఆరోగ్య సంరక్షణపై తన దృక్పథాన్ని మరింత మార్చిందని పేర్కొన్నారు. .
ముక్కామల శ్రీనివాస్ ఒక ప్రముఖ రేడియాలజిస్ట్, మిచిగాన్లోని ఫ్లింట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన భారతదేశంలో జన్మించిన ఆయన అమెరికాలో వైద్య విద్యను అభ్యసించారు. గతంలోనూ ఏఎంఏలో వివిధ కీలక పదవుల బాధ్యతలు చేపట్టారు.
తెలుగు రైతాంగానికి ఉగాదే కాకుండా . .. ఏరువాక పౌర్ణమి కూడా చెప్పుకోదగ్గ పండగే. అయితే ఇటీవల దీని ప్రాధాన్యత క్రమంగా రైతాంగం తగ్గిస్తూ వస్తున్నారు . కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు .
ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని జరుపుకుంటారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్ష బుుతువు ప్రారంభం కాగానే, రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కట్టేకాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. అనంతరం కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపిస్తారు. పొలానికి వెళ్లి భూమాతకు ఆరాధిస్తారు. అలాగే ఏరువాక పున్నమి రోజున సాయంకాలం వేళ రంగు రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి, డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. అనంతరం ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.
సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుంటూ ఉంటాము. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ ఉంది. ‘ఏరువాక పున్నమి’ పేరిట జరుపుకునే ఈ పండుగ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏరువాక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన జరుపుకోనున్న ఏరువాక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.
ఏరువాక పౌర్ణమి అంటే? రోళ్ళు పగిలే రోహిణి కార్తె వెళ్లి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు.
కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.
ఏరువాక పూజ ఏరువాక పున్నమి రోజున మట్టిని నమ్మి కష్టించి పని చేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ తమకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అనంతరం పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు.
క్వాంటం టెక్నాలజీకి భారతదేశంలోని ప్రధాన కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న దార్శనికతతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఉన్నారు . .
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ నిపుణులు, ఏఐ నిపుణులతో సంప్రదింపులు జరిపిన చంద్రబాబు . .. అమరావతిలోని క్వాంటం వ్యాలీ కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు, ఈ పరివర్తన రంగంలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ లీడర్ షిప్ కి కేరాఫ్ గా నిలబెట్టాలని కలలు కంటున్నారు . ..
ఈ చొరవ కోసం వ్యూహాత్మక రోడ్మ్యాప్ను రూపొందించడానికి జూన్ 30న అమరావతిలో క్వాంటం మిషన్పై కీలకమైన వర్క్షాప్ జరుగుతుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
జాతీయ క్వాంటం మిషన్కు అనుగుణంగా.. క్వాంటం వ్యాలీ అభివృద్ధి యొక్క ప్రతి వివరాలపై నిశితమైన శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ప్రాజెక్ట్ ఆశయాన్ని సూచించడానికి ఒక ఐకానిక్ ఆర్కిటెక్చరల్ నిర్మాణాన్ని సృష్టించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
“హైదరాబాద్ హైటెక్ సిటీ 1990లలో పురోగతికి చిహ్నంగా మారినట్లే, క్వాంటం వ్యాలీ భవనం ఆవిష్కరణకు ప్రపంచ చిహ్నంగా నిలబడాలి” అని చంద్రబాబు నాయుడు అన్నారు, సౌందర్య మరియు క్రియాత్మక శ్రేష్ఠత అవసరాన్ని నొక్కి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటం మిషన్ భారతదేశ జాతీయ క్వాంటం మిషన్ (NQM)కి అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ను క్వాంటం పరిశోధన మరియు అప్లికేషన్లో మార్గదర్శకుడిగా స్థాపించింది. సమీక్ష సందర్భంగా, అధికారులు మిషన్ లక్ష్యాలను వివరించే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించారు:
ఈ మిషన్ నాలుగు కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది: క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ & మెట్రాలజీ, మరియు క్వాంటం మెటీరియల్స్ & పరికరాలు.
రాబోయే ఐదు సంవత్సరాలలో ₹4,000 కోట్ల అంచనా పెట్టుబడితో, ఈ చొరవ క్వాంటం ఆధారిత ప్రజా మౌలిక సదుపాయాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఆంధ్రప్రదేశ్ను అటువంటి పురోగతికి పైలట్ రాష్ట్రంగా నిలబడింది .
ఈ మిషన్ రెండు దశల్లో విప్పుతుంది:
దశ I (2025–2027): ఈ దశ అమరావతిలో 50 ఎకరాల క్యాంపస్లో క్వాంటం వ్యాలీ స్థాపనతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. క్వాంటం ఆవిష్కరణకు బలమైన పునాదిని నిర్మించడానికి విద్య, పరిశోధన మరియు పైలట్ కార్యక్రమాలపై కూడా ఇది దృష్టి పెడుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ వంటి విద్యాసంస్థలు మరియు ఐబిఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మరియు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) వంటి పరిశ్రమ దిగ్గజాలతో భాగస్వామ్యాలు ఈ దశను నడిపిస్తాయి. రెండవ దశ (2027–2030): రెండవ దశ ఆంధ్రప్రదేశ్ను క్వాంటం టెక్నాలజీలో ప్రపంచ నాయకత్వానికి నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది, వాణిజ్యీకరణ, ఎగుమతి సామర్థ్యాలు మరియు పరిశ్రమలలో పెద్ద ఎత్తున స్వీకరణపై దృష్టి పెడుతుంది.
క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ ఈ మిషన్కు ముఖ్యమంత్రి నాయుడు నాయకత్వం వహిస్తారు, ఐటీ మంత్రి, ముఖ్య కార్యదర్శి, ఐటీ కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, అంకితమైన మిషన్ డైరెక్టర్ మరియు నిపుణుల కమిటీ కీలక పర్యవేక్షణ ఉంటుంది. క్రమబద్ధీకరించబడిన అమలును నిర్ధారించడానికి రాబోయే వారాల్లో క్వాంటం మిషన్ కోసం ఒక డైరెక్టర్ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. IBM ఈ మిషన్కు ఎంకరేజ్ చేస్తుంది.
మే 2024లో IBM, TCS మరియు L&Tతో కుదుర్చుకున్న వ్యూహాత్మక అవగాహన ఒప్పందాల (MoUలు) ద్వారా క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ ఇప్పటికే గణనీయమైన ఊపును పొందింది. ఈ భాగస్వామ్యాలు 18 జనవరి 2026న ప్రారంభించనున్న క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ అభివృద్ధికి కీలకమైనవి.
TCS క్వాంటం సాఫ్ట్వేర్ సేవలను అందిస్తుంది మరియు 17 రాష్ట్రాలలో 43 పరిశోధనా కేంద్రాలకు ప్రాప్యతను అందిస్తుంది, అయితే L&T క్వాంటం వ్యాలీ టెక్ పార్క్తో సహా ఐకానిక్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆమోదించిన ప్రాజెక్ట్ యొక్క వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR)తో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 54 ఎకరాల భూమిని కేటాయించింది.
క్వాంటం వ్యాలీ భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటుందని భావిస్తున్నారు, ఇది విద్యావేత్తలు, స్టార్టప్లు మరియు పరిశ్రమ నాయకుల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. హైదరాబాద్లోని HITEC సిటీ నుండి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్, క్వాంటం టెక్నాలజీలు, AI, సైబర్ సెక్యూరిటీ మరియు డ్రగ్ డిస్కవరీపై దృష్టి సారించడం ద్వారా దాని విజయాన్ని ప్రతిబింబించడం మరియు అధిగమించడం లక్ష్యంగా పెట్టుకుంది.
జూన్ 30, 2025న జరగనున్న క్వాంటం సమ్మిట్ IT, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్టార్టప్లు మరియు ఆవిష్కర్తలు వంటి విభిన్న రంగాల నుండి ప్రతినిధులను ఒకచోట చేర్చుతుంది.
క్వాంటం కంప్యూటింగ్, AI మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు సామాజిక ఫాబ్రిక్లో అనుసంధానించడానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సమ్మిట్ లక్ష్యం. ఈ మిషన్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మరియు ప్రపంచ ప్రతిభ మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ నిపుణులు పాల్గొంటారు.
రామజన్మభూమి ఆలయానికి సమీపంలో 10 కిలోమీటర్ల మేర భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి.
అధ్ధ్యాత్మికతకు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదల సహజ ప్రక్రియ. అయితే ఇటీవల కాలంలో జనంలో పాపభీతి పెరిగి . .. పుణ్యక్షేత్రాలలో నివాసం ఉండాలని భావించేవారు సంఖ్య పెరుగుతోంది . ఈ ప్రభావం కూడా అయోధ్య వంటి చోట్ల భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి .
అయోధ్యలో భవ్యరామాలయ నిర్మాణంతో భూముల లావాదేవీలు, మార్కెట్ విలువ అమాతం పెరిగింది. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు అక్కడి భూముల సర్కిల్ రేట్లకు తాజాగా రెక్కలు వచ్చాయి. భూముల సర్కిల్ రేట్లను 30 నుంచి 200 శాతం వరకూ పెంచారు. గత ఎనిమిదేళ్లలో భూముల రేట్లను పెంచడం ఇదే మొదటిసారి. కొత్త రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు.
రామజన్మభూమి ఆలయానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ కొత్త రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి. 2004 సెప్టెంబర్లో భూముల ధరల పెంపు కోరుతూ ఒక ప్రతిపాదన తమకు రావడంతో సవరించిన రేట్లను అమల్లోకి తెచ్చినట్టు సదర్ (ఫైజాబాద్) సబ్ రిజిస్ట్రార్ శాంతి భూషణ్ చౌబే తెలిపారు. కొత్త సర్కిల్ రేట్లకు జిల్లా మెజిస్ట్రేట్ ఆమోదం తెలుపడంతో ఇప్పుడు అమల్లోకి తెచ్చామని చెప్పారు. కొత్త రేట్ల ప్రకారం జిల్లాలోని రాకాబ్గంజ్, దేవ్కాళి ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరుగుతాయన్నారు. అయోధ్య ఆధ్యాత్మక పర్యటనా కేంద్రంగా అందరినీ ఆకర్షిస్తుండటం, మౌలిక వసతు కల్పన కారణంగా రామాలయం చుట్టూ ఉన్న సర్కిల్ రేట్లు చదరపు మీటరుకు రూ.26,660 నుంచి రూ.27,900 వరకూ పెరుగుతుందని చెప్పారు. గతంలో ఈ రేటు రూ.6,650 నుంచి రూ.6,975 వరకూ ఉండేది. ల్యాండ్ రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ అనే కేటిగిరిల కింద వివిధ రేట్లలో భూముల పెరుగుదల ఉంటుందని చౌబే వివరించారు. రానున్న రోజులలో ఈ పెరుగుదల మరింత ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు .
ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనను విశ్లేషించిన డాక్టర్ డ్రూ
అతి ఉత్సాహం, తక్కువ నిద్ర, వేగంగా మాట్లాడటం ‘హైపోమేనియా’ లక్షణాలు
జన్యుపరమైన కారణాలు, రసాయనాల అసమతుల్యత, ఒత్తిడి ప్రధాన హేతువులు
మానసిక వైద్యుల పర్యవేక్షణలో నిర్ధారణ, చికిత్స అవసరం
నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలని నిపుణుల హెచ్చరిక
కొన్ని సందర్భాలలో ఆత్మహత్యకు పూనుకునే ప్రమాదం
”రోజుకి ఐదారు గంటలు మాత్రమే నిద్రపోతాను . ..” అని తరచూ చెప్పే ఎలాన్ మస్క్ మానసిక పరిస్థితి తేడా కొడుతోంది . టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరాలింక్ వంటి ప్రఖ్యాత సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి తెలియని వారుండరు. ఆయన సాధించిన విజయాలు ఎంత గొప్పవో, కొన్నిసార్లు ఆయన ప్రవర్తించే తీరు కూడా అంతే వివాదంగా , చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా, ప్రముఖ సైకాలజిస్ట్, ఎడిక్షన్స్ వైద్య నిపుణుడు డాక్టర్ డ్రూ పిన్స్కీ, మస్క్ ప్రవర్తనపై హాట్ కామెంట్స్ చేశారు. మస్క్ ప్రవర్తన ‘హైపోమేనియా’ అనే మానసిక స్థితికి దగ్గరగా ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. గతంలో మస్క్ తనకు ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ ఉందని స్వయంగా వెల్లడించినప్పటికీ, ఆయన బహిరంగ ప్రవర్తన వెనుక మరో కారణం ఉండొచ్చని డాక్టర్ డ్రూ సూచిస్తున్నారు.
తాజాగా ఓ న్యూస్మ్యాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ డ్రూ పిన్స్కీ, ఎలాన్ మస్క్ మేధస్సును, ఆయన సాధించిన విజయాలను ప్రశంసించారు. అయితే, “మస్క్ విజయం వెనుక మరో కోణం కూడా ఉంది. ఆయన బహుశా హైపోమేనియాతో బాధపడుతుండవచ్చు” అని వ్యాఖ్యానించారు. మస్క్ ప్రదర్శించే అపారమైన శక్తి, నిరంతరం చేసే ట్వీట్లు, కొన్నిసార్లు అదుపుతప్పిన వ్యాఖ్యలు, మాజీ అధ్యక్షుడు ట్రంప్తో వివాదాలు వంటివి కేవలం ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ పరిధిలోకి రావని, ఇవి హైపోమేనిక్ ఎపిసోడ్లకు సంబంధించిన మూడ్ డిజార్డర్ను సూచిస్తున్నాయని డాక్టర్ డ్రూ అభిప్రాయపడ్డారు.
హైపోమేనియా అంటే ఏమిటి?
హైపోమేనియా అనేది ఒక రకమైన మానసిక రుగ్మత. ఈ స్థితిలో వ్యక్తి మానసిక స్థితి అసాధారణంగా ఉత్సాహంగా లేదా చిరాకుగా ఉంటుంది. శక్తి స్థాయిలు అమాంతం పెరిగి, కనీసం నాలుగు రోజుల పాటు విపరీతమైన చురుకుదనం కనిపిస్తుంది. ఇది పూర్తిస్థాయి మేనియా కన్నా తీవ్రతలో తక్కువగా ఉంటుంది. హైపోమేనియాలో సాధారణంగా వాస్తవికతతో సంబంధం కోల్పోవడం (సైకోసిస్) లేదా ఆసుపత్రిలో చేర్పించాల్సినంత తీవ్రమైన లక్షణాలు ఉండవు. అయినప్పటికీ, ఇది వ్యక్తి సాధారణ మానసిక పనితీరులో గణనీయమైన మార్పును సూచిస్తుంది. మానసిక రుగ్మతల విశ్లేషణ మార్గదర్శిని అయిన డీఎస్ఎమ్-5 ప్రకారం, ఇది బైపోలార్ II డిజార్డర్లోని ఒక దశగా పరిగణిస్తారు.
క్రియేటివిటీతోపాటు . ..
కొన్నిసార్లు హైపోమేనియా అద్భుతమైన సృజనాత్మకతకు లేదా ఉత్పాదకతకు దారితీయవచ్చని, అందుకే కొందరు దీనిని “జీనియస్ జోన్” అని కూడా అంటారని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో, హఠాత్తు నిర్ణయాలు తీసుకోవడం, ప్రమాదకర ప్రవర్తనలకు పాల్పడటం వంటివి కూడా దీనివల్ల జరగవచ్చు. కుటుంబంలో ఎవరికైనా బైపోలార్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉండటం, మెదడులోని రసాయనాల అసమతుల్యత, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, కొన్ని రకాల మందుల వాడకం వంటివి హైపోమేనియాకు కారణాలు కావచ్చని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.