గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తున్నారు . బోయింగ్ 787 కి ఇటువంటి దుర్ఘటన జరగడం ఇదే ప్రధమం అని చెపుతున్నారు . ..
-విమానం టేకాఫ్ అయిన నిమిషంలోనే కూలిపోయింది . .. ప్రమాదం నుంచి బయటపడ్డ మృత్యుంజయుడు రమేష్
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయలు ప్రకటించిన టాటా గ్రూప్ . .
- అహ్మదాబాద్ లో ఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా . .. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్
- మృతులలో 169 మంది భారతీయులు . .53 మంది బ్రిటీషర్లు – ఏడుగురు పోర్చుగల్ దేశీయులు . ఒక కెనడియన్ .. మొత్తం 230 మంది . ఇద్దరు పైలెట్స్ , పదిమంది విమాన సిబ్బంది ఉన్నారు .
విమాన ప్రమాదం నుంచి 11ఏ నంబర్ సీటులోని ప్రయాణికుడు బయటపడ్డారు
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ బోయింగ్ 787 విమానంలో 12 మంది సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
‘ఏఏఐబీ డెరెక్టర్ జనరల్, ఏజెన్సీలోని ఇన్వెస్టిగేషన్ డైరెక్టరర్ సహా ఇతర అధికారులు ఇప్పుడు అహ్మదాబాద్ బయలుదేరుతారు’ అని సదరు అధికారి తెలిపారు.
పౌర విమానయాన మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఏఏఐబీ – భారత గగనతలంలో ప్రయాణించే విమానాల భద్రతకు, అలాగే ఇండియన్ ఎయిర్ స్పేస్లో జరిగే విమాన ప్రమాదాలకు, తీవ్రమైన ఘటనలకు బాధ్యత వహిస్తుంది. వాటిపై సమగ్ర దర్యాప్తు చేస్తుంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతను మెరుగుపరిచేందుకు తగిన చర్యలను సూచిస్తుంది.
ఇనీషియల్ రిపోర్ట్!
‘విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికలు మాకు అందాయి. మరింత సమాచారం సేకరించడానికి మేము కృషి చేస్తున్నాం’ అని బోయింగ్ ఒక ప్రకటనలో తెలిపింది.

విమాన ప్రమాదం నుంచి ఒకరు మృత్యుంజయులైనట్టు అహ్మదాబాద్ CP జీఎస్ మాలిక్ తెలిపారు. 11ఏ నంబర్ సీటులోని ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. విమాన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న అహ్మదాబాద్ CP, నివాస ప్రాంతంలో కూలినందువల్ల సంఖ్య ఎక్కువే ఉండే అవకాశముందన్నారు. విమానం కూలిన సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికుడు బయటికొచ్చినట్టు తెలుస్తోంది
హృదయ విదారక ఘటన: ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన మాటల్లో చెప్పలేని హృదయ విదారకఎం . .” అని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు . బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని, బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్న మంత్రులు అధికారులతో మాట్లాడినట్లు మోదీ చెప్పారు.