కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో పున‌ర్వైభ‌వం సాధ్య‌మేనా..?

కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో పున‌ర్వైభ‌వం సాధ్య‌మేనా..?

విభజన తర్వాత చ‌ట్ట స‌భ‌ల్లో ఉనికి కోల్పోయిన జాతీయ పార్టీ– భ‌విష్య‌త్తుపైనే నాయ‌కుల ఆశ‌లు

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ద‌శాబ్దాల‌పాటు శాసించిన ఘ‌న‌ చ‌రిత్ర‌ కాంగ్రెస్ పార్టీది. అయితే కేంద్రంలో తాను అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాష్ట్ర‌ విభజన చేసిన‌ త‌ర్వాత ఆ పార్టీ ఆశించిన రాజ‌కీయ ప్రయోజ‌నాలు తెలంగాణ‌లో సైతం ద‌క్కించుకోలేక‌పోయింద‌న్న‌ది నిజం. ప‌దేళ్ల త‌ర్వాత రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఆయ‌న పోరాటంతోపాటు ప‌లు అంశాలు క‌లిసివ‌చ్చి అధికారం ద‌క్కించుకోవ‌డం వేరే సంగ‌తి. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర రాజకీయ పటంలో ఆ పార్టీ దాదాపు క‌నుమ‌రుగైన‌ స్థాయికి క్షీణించిందని చెప్పాలి. 2004, 2009 ఎన్నిక‌ల్లో వరుసగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి స్వ‌యంకృత‌మే. గ‌తంలో దేశ‌మంతా కాంగ్రెస్ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచిన స‌మ‌యంలోనూ ఆ పార్టీకి అండ‌గా నిలిచింది తెలుగు ప్ర‌జ‌లే. తిరిగి ఆ పార్టీ ఢిల్లీ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డంలో ప్ర‌ధాన పాత్ర ఉమ్మ‌డి ఏపీది. అయితే ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల ప్రాతినిధ్యంలో కూడా ఏపీలో ఆ పార్టీ నామ‌మాత్రంగా మిగిలింది.

విభజన గాయ‌మా.. ప్ర‌త్య‌ర్థుల వ్యూహ‌మా..?

2014లో తెలంగాణ‌లో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం తీవ్రం కావ‌డం, ప్ర‌జ‌ల‌ను రాజ‌కీయంగా ప్ర‌భావితం చేసే అంశంగా మార‌డంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని నాటి కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్ర విభ‌జ‌న‌కు పూనుకుంది. అయితే సీమాంధ్ర ప్ర‌జ‌ల అభ్యంత‌రాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోపాటు పార్ల‌మెంటులో విభ‌జ‌న బిల్లు ఆమోదించిన తీరు ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. దాంతో కాంగ్రెస్ పార్టీని చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విధంగా ఇక్క‌డి ప్ర‌జ‌లు శిక్షించారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగి ద‌శాబ్ద‌కాలం గ‌డ‌చినా ఆ పార్టీ ఇక్క‌డ ఒక మోస్త‌రు స్థాయిలోనైనా కోలుకోలేక‌పోవ‌డానికి కార‌ణం మాత్రం ఆ పార్టీ అధిష్ఠానం నిర్ల‌క్ష్యమేన‌ని చెప్పాలి. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా తెలంగాణ‌లో నాటి టీఆర్ఎస్ పార్టీ, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గ‌రిష్ట ప్ర‌యోజ‌నం ద‌క్కించుకున్నాయి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అనుస‌రించిన‌ త‌ప్పుడు వ్యూహాలే కార‌ణం. విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలే కాంగ్రెస్‌కి ఘోర పరాభవాన్ని తేటతెల్లం చేశాయి.

కాంగ్రెస్ పార్టీ త‌ప్పిదాలే వైసీపీ పునాదులు

కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు తాను ఏంచేసినా చెల్లుతుంద‌ని, భ‌విష్య‌త్తు రాజ‌కీయ ప‌రిణామాలు తాను ఆశించిన‌ట్టే ఉంటాయ‌ని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. మ‌రోప‌క్క బీజేపీ నుంచి దేశ‌వ్యాప్తంగా ఎదుర‌య్యే ముప్పును కూడా చాలా త‌క్కువ‌గా అంచ‌నా వేసింది. తెలంగాణ ఇచ్చింది తానే కాబ‌ట్టి అక్క‌డి ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉంటార‌ని భావించింది. కేసీఆర్ త‌న‌ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన‌న్నా తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల మాట‌లు విని చేతులారా వ‌దుల‌కుంది. ఇక ఏపీలో తాత్కాలికంగా న‌ష్ట‌పోయినా సంప్ర‌దాయ ఓటు బ్యాంకు భ‌విష్య‌త్తులో తిరిగి త‌న నీడ‌కే చేరుతుంద‌ని భావించింది. వైఎస్సార్ త‌న‌యుడైన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పార్టీ ఈ ప‌రిణామం ద్వారా బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వానికి తెలుసు. తాను అమ‌లు చేసే వ్యూహం ప్రకారం జ‌గ‌న్ తిరిగి త‌న‌గూటికే చేర‌క త‌ప్ప‌ద‌ని అనుకుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యాల‌న్నీ ఘోర త‌ప్పిదాలుగా మారి పార్టీ దుస్థితికి కార‌ణ‌మ‌య్యాయి.

కాంగ్రెస్ పార్టీ సంప్ర‌దాయ ఓటుబ్యాంకే వైసీపీకి పునాది

వైసీపీ పేరుతో సొంత కుంప‌టి పెట్టుకున్న జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ ప‌రిణామాల‌ను, అవ‌కాశాన్ని తెలివిగా వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును, క్యాడ‌ర్‌ను గంప‌గుత్త‌గా సొంతం చేసుకుని ఏపీలో బ‌ల‌మైన రాజ‌కీయ‌నేత‌గా ఆవిర్భ‌వించారు.2014 అసెంబ్లీ ఎన్నికలు: 175 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఓటు షేర్ 2% కంటే తక్కువ. 2019 అసెంబ్లీ ఎన్నికలు: ఓటింగ్‌లో పార్టీ ఉనికే కన్పించలేదు – రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ 1% లోపే. 2024 ఎన్నికలు: కాంగ్రెస్ పోటీ చేసినా, ఫలితాలు నామమాత్రమే. టీవీ చర్చల్లోనైనా పేరు వినిపించనంత స్థాయిలో వెనుకబడిపోయింది.

నాయకత్వ లోపం – నిస్సత్తువగా పునర్నిర్మాణం

విభజన తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు మిగల్లేదు. పార్టీ క్యాడ‌ర్ నిస్తేజంగా మారింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వచ్చిన లోటును పార్టీ ఇప్ప‌టికీ పూడ్చుకోలేక‌పోయింది. అంతేకాదు.. వైఎస్సార్ హ‌యాంలో ఆయ‌న‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఇత‌ర నాయ‌కుల‌ను ఎద‌గ‌నివ్వ‌క‌పోవ‌డం తాలూకు దుష్ప‌రిణామాల‌ను ఇప్పుడు అనుభ‌విస్తోంది. ఆయన వారసుడైన జగన్‌ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ రూపంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి, రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. వైఎస్ ష‌ర్మిల‌ను పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా నియ‌మించినా పార్టీ కోలుకుంటున్న సూచ‌న‌లు ఏమాత్రం కాన‌రావ‌డం లేదు.

భవిష్యత్ లో పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలేవీ..?

కేంద్రంలో వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లో అధికారం ద‌క్కించుకోలేక‌పోవ‌డం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పెనుశాపంగా మారింది. గ‌తంలో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌ను నిర్వ‌హించిన స‌మ‌యంలోనూ ఏపీకి ఏమంత ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంలోని ఆంత‌ర్యం ఏమిటో అర్ధం కాదు. నిజానికి రాహుల్ గాంధీ, ప్రియాంక‌గాంధీల్లో ఒక‌రైనా కొన్నిరోజుల‌పాటు ఏపీలో ప‌ర్య‌టించి గ‌తంలో పార్టీ త‌ర‌పున రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం స‌రిదిద్దుకునే అవకాశం ఇవ్వ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను కోర‌క‌పోవ‌డం వారి రాజ‌కీయ అప‌రిప‌క్వ‌త‌గానే భావించాలి. ఏదేమైనా గ‌తంలో బ‌ల‌మైన క్యాడ‌ర్‌ను క‌లిగిఉన్నరాష్ట్రంలో పార్టీ తిరిగి పుంజుకోవాలంటే కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. యువతను ఆకర్షించే విధానాలు, స్థానిక నేతల ప్రోత్సాహం, ఓర్పుతో కేడర్ మళ్లీ తయారు చేయడం.. విభజనపై బాధ్యతను అంగీకరించి, ప్రజల్లో విశ్వాసం కలిగించగల సామర్థ్యం ఉన్న ఓ మానవీయమైన నాయకత్వం..ఇవన్నీ కలిస్తేనే పార్టీ పునర్నిర్మాణాన్ని ప్రారంభించగలదు. కానీ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ దిశ‌గా తొలి అడుగులు వేసే ప్ర‌య‌త్నం కూడా క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం వ‌హించిన పీసీసీ కార్యాలయాల్లో చురుకైన కార్యకలాపాలు లేవు. జిల్లాల్లో పాత నాయకులు పార్టీకి దూరమవుతున్నారు.

ముగింపు మాట

ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పగానే రాజకీయ విశ్లేషకులు హాస్పాస్ప‌దంగా స్పందించే ప‌రిస్థితి ఉంది. అయితే, రాజకీయాల్లో శాశ్వతంగా ఇదే ముఖ‌చిత్రం ఉంటుంద‌ని ఎవ‌రూ చెప్ప‌లేరు. ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు క‌మ్యూనిస్టు పార్టీల‌ను క‌లుపుకుని ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మార‌గ‌లిగే గొప్ప అవ‌కాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయం మార్చుకుంటే పార్టీల త‌ల‌రాతలు తిరిగి రాయ‌గ‌ల‌రు. ఆ దిశ‌గా పార్టీ చేసే కృషి మాత్ర‌మే ప్ర‌జాద‌ర‌ణ‌కు ద‌గ్గ‌ర చేయ‌గ‌ల‌దు అందుకు త‌గిన సంస్కరణలు, కొత్త దారులు అవసరం. లేకపోతే “ఒకప్పుడు ఏపీని పాలించిన అభ‌య‌ హస్తచిహ్నం… ఇప్పుడు జాడలు మిగలని జ్ఞాపకమే..”! అన్న‌ట్టుగా చరిత్రలో మిగిలిపోతుంది.

ఎన్ఆర్ఐ లు అమరావతి వైపు చూడటంలేదు.. ఎందుకు?

ఎన్ఆర్ఐ లు అమరావతి వైపు చూడటంలేదు.. ఎందుకు?

అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని కూటమి అదేపనిగా చెపుతున్నా … ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ఆర్ఐ లు సైతం అమరావతిలో భూములు , స్థలాలు కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.

వీడని జగన్ భయాలు: 175 అసెంబ్లీయే సీట్లకుగాను . . 164 చోట్ల కూటమి గెలుపొంది… జగన్ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసినా ఏపీలో రియల్ ఎస్టేట్ ఇంకా స్తబ్దన్గానే ఎందుకు ఉంది? కూటమి పాలనపై పెట్టుబడిదారులతో ఇంకా విశ్వాసం పెరగలేదా ? ”జగన్ అండ్ కో ఘోరంగా ఓటమిపాలైనా. రాష్ట్రంలో ఎక్కడ ఏ అరాచకాలకు పాల్పడతారోనన్న ఆందోళన ఇంకా కొన్ని వర్గాలలో ఉంది. దీనికి చంద్రబాబు జనంలో బలమైన నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. అమరావతిలో భూములు కొనుగోలు చేద్దామంటే . .. మళ్ళీ జగన్ వస్తే ఏమవుతుందోనన్న భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. కూటమి నేతలు మాటవరసకు భరోసా ఇస్తున్నా . .. జగన్ భయాలు మాత్రం మాలో ఇంకా పోవడంలేదు . ...” అని అమెరికాలో ఉన్నతోద్యోగం చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక NRI ‘అభిన్యూస్ ‘ ప్రతినిధితో తన అభిప్రాయం వెలిబుచ్చారు.

అమరావతిపై బాబు ఆటలు: 2014-2019 మధ్య అమరావతిని హంగులతో చూపించారు. కొంతవరకు పనులు చేసినా , ,, భారీ ప్రచారం దెబ్బకొట్టింది. చేసింది పావలా అయితే . ..రూపాయిన్నర పబ్లిసిటీ చేయడం అమరావతిపై నమ్మకంలేకుండా చేసింది. ఏపీ రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూ సమీకరణ చేశారు. అయితే ఇందులో అభివృద్ధి పనులు కనీసం 10-15 శాతం కూడా కాకుండానే . .. రెండో విడత విస్తరణ పేరుతో మరో 40 వేల ఎకరాల భూ సమీకరణకు సిద్ధమయ్యారు. దీంతో అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు , అమ్మకాలు లావాదేవీలలో స్తబ్దత ఏర్పడింది. కూటమి గెలుపుతో ఒక్కసారిగా జోరందుకున్న అమరావతి భూముల ధరలకు రెండోవిడత భూ సమీకరణ బ్రేక్ వేసింది.

పనులు అంతంతమాత్రం.. పబ్లిసిటీ మాత్రం.. చంద్రబాబుకు చేసిన దానికంటే ఎక్కువ చెప్పడం ముందు నుంచీ అలవాటు. ఇది కాస్త దెబ్బతీస్తుది.” కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది . . ఇంతవరకు గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన ప్లాట్స్ అప్పగించలేదు. ఏడాది కాలం సరిపోలేదా ? ఇంత జాప్యం చేస్తుంటే జనంలో నమ్మకం ఎలా కలుగుతుంది.. ఈ ధోరణి మార్చుకోవాలి . …లేకపోతె అమరావతి వైపు పెట్టుబడులు వచ్చే పరిస్థితులు ఉండవు . ..” అని తుళ్లూరు ప్రాంతానికి చెందిన మురళి అనే యువకుడు అభిప్రాయపడ్డారు.

NRI ల పెట్టుబడులు హైదరాబాద్ లోనే . .. అమెరికా , బ్రిటన్ , కెనడా, ఆస్ట్రేలియా , కువైట్ , అబుదాబి , మస్కట్ , జర్మనీ , వంటి దేశాల్లో నివసిస్తున్న నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRIలు)కు హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ మొదటి ఎంపికగా నిలుస్తోంది. ఇది కూడా అమరావతిలో పెట్టుబడులు రాకపోవడానికి ఒక ప్రధాన కారనంగా చెప్పవచ్చు . కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ పెట్టుబుడులు పెట్టేందుకు హైదరాబాద్ నే మొదట ఎంపికగా ఎంచుకున్నట్లు స్పష్టం అయింది. అయితే హైదరాబాద్ లో ఏడాదిన్నరగా రియల్ కుదేలైన కారణంగా అక్కడ కూడా పెట్టుబడులు ఆగాయి. కొంతమంది వారు పనిచేస్తున్న దేశాలలోనే ఇళ్ళు , భూములపై పెట్టుబడులు పెట్టడం ఇటీవల ఎక్కువయింది.

ఎన్ఆర్ఐ ల అనుమానాలను కూటమి సర్కార్ నివృత్తి చేయాలి. జగన్ వస్తే . . జగన్ వస్తే . … అనే స్లోగన్ కు మెజార్టీ ఎన్ ఆర్ ఐ లు భయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు , పవన్ వంటి నేతలు ఎన్ని చెప్పినా వాళ్లలో భరోసా కల్పించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోతున్నారని ఒక సర్వేలో తేలింది. జగన్ పర్యటనల సందర్బంగా చేస్తున్న అరాచకాలకు కూడా జనంలోనూ , విదేశాలలో ఉండే మనవాళ్లలోనూ అనుమానాలు బలపడుతున్నాయి . దీనిపై పూర్తిగా కూటమి సర్కార్ వైఫల్యం అనే చెప్పలేం . .. జగన్ ధోరణిలో మార్పు రానంతవరకు . ..ఈ అనుమానాలు ఇలాగే కొనసాగుతాయి. పొరుగు రాష్ట్రాలకు పెట్టుబడులు తరలిపోతాయ్ . దీనిపై ప్రజలు కూడా సీరియస్ గా ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది .

లిక్కర్ స్కాం లో జగన్ కి బీజేపీ  సహకారం

లిక్కర్ స్కాం లో జగన్ కి బీజేపీ సహకారం

జగన్ మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు కాంగ్రెస్ ఏపీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ సంచలన పోస్ట్

తెలంగాణలో కవిత , ఢిల్లీలో సీఎం , డిప్ట్యూటీ సీఎంల అరెస్ట్ . .. జగన్ ని వదిలేసినట్లు ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం లో వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఫోకస్ పెరిగింది. కూటమి సర్కార్ ఇప్పటికే మద్యం కుంభకోణంపై పలువురు కీలక నేతలపై కేసులు పెట్టడం , కొందరి అరెస్ట్ జరిగాయి. ఇప్పటి వరకు అరెస్టయిన నేతలు , అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా జగన్ పై కూడా మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది . అయితే కేంద్రం పెద్దల గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో జగన్ వరకు వచ్చి . .. ఈ కేసు ఆగింది.

మాణికం ఠాకూర్ సంచలన పోస్ట్

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం – జగన్‌ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ పోస్ట్

జగన్‌ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం చేశారని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాకూర్ ఆరోపించారు . వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణంపై మాణికం ఠాగూర్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జగన్ మద్యం కుంభకోణం శాస్త్రీయ అవినీతి మోడల్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ మద్యం కుంభకోణం, విదేశాల్లో పెట్టుబడులు, కుట్ర కోణాలు అంటూ పలు ఆరోపణలు చేశారు. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను జగన్‌ క్యాష్‌ క్యారియర్లుగా వాడుకున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడేపల్లి, అమరావతిలోని ఫ్లాట్లలో కరెన్సీని బాక్సుల్లో దాచారని మద్యం డబ్బుతో విదేశాల్లో లిక్కర్‌ ఫ్యాక్టరీలు నెలకొల్పారని అన్నారు. ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు దుబాయ్, టాంజానియా, దక్షిణాఫ్రికాలో భేటీ అయ్యేవారని తెలిపారు. దీనిపై కేంద్రం మౌనంగా ఉండి ఈ మద్యం కుంభకోణానికి సహకరించిందని మాణికం ఠాకూర్ విమర్శించారు . కేంద్ర బీజేపీ పెద్దల సహకారం లేకపోతె జగన్ ఎప్పుడో అరెస్టయ్యేవారని పేర్కొన్నారు .

గల్ఫ్ దేశాలలో మన వాళ్ళ ఆందోళన ఎందుకు ?

గల్ఫ్ దేశాలలో మన వాళ్ళ ఆందోళన ఎందుకు ?

ఇరాన్ పై అమెరికా బాంబు దాడి చేయడం పట్ల గల్ఫ్ లోని భారతీయుల ఆందోళన వెనుక కారణం ?


ఆరు గల్ఫ్ సహకార మండలి దేశాలలో, అలాగే జోర్డాన్ మరియు లెబనాన్ లలో తొంభై లక్షల మంది వరకు భారతీయులు పనిచేస్తున్నారు. ఈ పెరుగుదల ఈ కార్మికులకే కాకుండా, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి దక్షిణ భారత రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు – మరియు కొంతవరకు తమిళనాడు పై – కూడా కొంత ఇబ్బంది కలిగిస్తోంది .

ఏదైనా ఉద్రిక్తత మధ్యప్రాచ్యాన్ని అస్థిరపరచవచ్చు, హార్ముజ్ జలసంధి మరియు ఎర్ర సముద్ర కారిడార్ వంటి వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగించవచ్చు మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయవచ్చు. దీని వలన ధరలు పెరగడం, ఉద్యోగ నష్టాలు మరియు కఠినమైన వీసా లేదా వర్క్ పర్మిట్ నిబంధనలు ఏర్పడవచ్చు. దాదాపు 90 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు, చాలా మంది తక్కువ వేతన రంగాలలో నివసిస్తున్నారు, చిన్న అంతరాయాలు కూడా వారి జీవనోపాధికి మరియు స్వదేశానికి తిరిగి వచ్చే కుటుంబాలకు తీవ్రమైన ఇబ్బందికర పరిణామాలను కలిగిస్తాయి.

చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నాటకీయ పెరుగుదలలో, జూన్ 22 ఆదివారం తెల్లవారుజామున అమెరికా సమన్వయంతో కూడిన వైమానిక దాడులు జరిపింది . ఇరాన్ యొక్క నాటాంజ్, ఫోర్డో మరియు ఇస్ఫహాన్‌లోని కీలకమైన అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. B-2 స్టెల్త్ బాంబర్లు మరియు జలాంతర్గామి నుండి ప్రయోగించబడే క్రూయిజ్ క్షిపణులను కలిగి ఉన్న ఈ ఆపరేషన్, 2020లో జనరల్ ఖాసిం సోలైమాని హత్య తర్వాత ఇరాన్ భూభాగంపై అమెరికా చేసిన మొదటి ప్రత్యక్ష దాడిగా చెపుతున్నారు .

ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ దాడులను “అద్భుతమైన విజయం”గా అభివర్ణించారు, అవి “ఇరాన్ అణు ఆశయాలను నిర్వీర్యం చేశాయి” మరియు “సంకల్ప సందేశాన్ని” అందించాయని పేర్కొన్నారు.

ఇరాన్ దాడులను ధృవీకరించింది మరియు తక్కువ నష్టాన్ని నివేదించింది; ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా ఎటువంటి ప్రణాళికలను ప్రకటించలేదు.

“ట్రంప్ జోక్యం చేసుకోవడానికి 14 రోజుల సమయం కోరినప్పుడు, మేము ఉపశమనం పొందాము. అయితే, ఎప్పటిలాగే, అతను ఒక విషయం చెబుతాడు మరియు మరొకటి చేస్తాడు. మేము భయపడినది ఇప్పుడు జరిగింది. GCC దేశాలు ఇరాన్ యొక్క అడ్డదారిలో ఉంటాయి,” అని గత 30 సంవత్సరాలుగా UAEలో నివసిస్తున్న భారతీయుడు వర్గీస్ ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు .

ఆదివారం మధ్యాహ్నం నాటికి, బహ్రెయిన్ ప్రభుత్వం నివాసితులకు ప్రధాన రహదారులను మాత్రమే ఉపయోగించమని సూచించింది, 70 శాతం మంది ఉద్యోగులను రిమోట్ పనికి మార్చమని సూచించింది మరియు తదుపరి నోటీసు వచ్చేవరకు పాఠశాలలను ఆన్‌లైన్ విద్యకు మార్చమని ఆదేశించింది.


ఈ వారం ప్రారంభంలో, బహ్రెయిన్ అధికారులు అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉండటానికి జాతీయ ప్రణాళిక మరియు జాతీయ పౌర అత్యవసర కేంద్రాన్ని సక్రియం చేసినట్లు తెలిపారు మరియు దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్‌లను పరీక్షించడం ప్రారంభించారు.

ఇంతలో, కువైట్ దేశంలోని మంత్రిత్వ శాఖల సముదాయంలో ఆశ్రయాలను ఏర్పాటు చేసింది – ఇది న్యాయం మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖలతో సహా అనేక ప్రభుత్వ విభాగాలను కలిగి ఉన్న విస్తృతమైన ప్రాంగణం.

కువైట్‌లోని కేరళీయ ఆర్థిక నిపుణుడు ఖలీల్ రెహమాన్ మాట్లాడుతూ వలస సమాజంలో ఆందోళన పెరుగుతోందని అన్నారు.

“దౌత్యం గెలుస్తుందని మరియు శాంతి పునరుద్ధరించబడుతుందని మనమందరం ఆశిస్తున్నాము. కానీ ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ కొన్ని కంపెనీలు ఉద్యోగులను సెలవుపై వెళ్లమని బలవంతం చేస్తున్నట్లు మేము ఇప్పటికే వింటున్నాము, ”అని ఆయన ఒక మీడియా సంస్థతో అన్నారు.

ఇటీవలి US సైనిక దాడుల తరువాత, మధ్యప్రాచ్యంలోని US స్థావరాలను, ముఖ్యంగా GCC దేశాలలోని వాటిని లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ నైతిక సమర్థనను కలిగి ఉందని కొందరు ఇప్పుడు వాదిస్తున్నారు.

ఈ నెలలో ప్రచురించబడిన కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ నివేదిక ప్రకారం, 40,000 మంది US సైనికులు మధ్యప్రాచ్యంలో ఉన్నారు.

“మొత్తంగా, యునైటెడ్ స్టేట్స్ కనీసం 19 ప్రదేశాలలో సైనిక సౌకర్యాలను కలిగి ఉంది – వాటిలో ఎనిమిది ప్రాంతీయ విశ్లేషకులచే శాశ్వతమైనవిగా పరిగణించబడుతున్నాయి – బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలలో,” అని నివేదిక పేర్కొంది.

ఖతార్ US సెంట్రల్ కమాండ్ యొక్క ఫార్వర్డ్ ప్రధాన కార్యాలయాన్ని నిర్వహిస్తుంది. బహ్రెయిన్ అత్యంత శాశ్వతంగా కేటాయించబడిన US సిబ్బందిని కలిగి ఉంది మరియు US నేవీ యొక్క ఐదవ నౌకాదళానికి నిలయం.

“ఇటువంటి సంక్షోభం వలస కార్మికులపై, ముఖ్యంగా గల్ఫ్ శ్రామిక శక్తిలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్న భారతీయులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది 1990 గల్ఫ్ యుద్ధంలో జరిగినట్లుగా, లక్షలాది మంది భారతీయులు కువైట్ నుండి ఖాళీ చేతులతో పారిపోవాల్సి వచ్చినట్లుగా, విస్తృతమైన ఉద్యోగ నష్టాలు మరియు చెల్లించని వేతనాలకు దారితీయవచ్చు” అని ఆయన అన్నారు.

ఆరు GCC దేశాలలో, అలాగే జోర్డాన్ మరియు లెబనాన్లలో సుమారు 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో, దాదాపు 40 లక్షల మంది కేరళీయులు, ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారు.

ఆదివారం తెల్లవారుజామున, అమెరికా దాడి తర్వాత, యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన ఒక ప్రముఖ అధికారి సోషల్ మీడియా పోస్ట్‌లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు ట్రంప్‌ను బాధ్యులుగా చేస్తారని అన్నారు.

“ట్రంప్ పరిణామాలను భరించాలి” అని హౌతీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు హిజామ్ అల్-అసద్ X లో పోస్ట్ చేసారు.

హౌతీల దాడి తీవ్రతరం అయ్యే అవకాశం
ముందుగా, హౌతీ నియంత్రణలో ఉన్న యెమెన్ సాయుధ దళాల ప్రకటన ప్రకారం, “అమెరికా శత్రువు ఇజ్రాయెల్‌కు మద్దతుగా దురాక్రమణకు దిగితే” ఎర్ర సముద్రంలో యుఎస్ నేవీ యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ బృందం సిద్ధంగా ఉంది.

హౌతీ తిరుగుబాటుదారులు 2023 నవంబర్‌లో ఎర్ర సముద్రంలో ఓడలపై దాడి చేయడం ప్రారంభించారు, మొదట గాజాలో బాంబు దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. తరువాత, ఎర్ర సముద్రం షిప్పింగ్‌ను రక్షించడానికి వారు జోక్యం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతంలోని యుఎస్ యుద్ధనౌకలు హౌతీ లక్ష్యాలుగా మారాయి. ఈ సంవత్సరం వసంతకాలం వరకు కొనసాగిన యెమెన్‌లోని హౌతీ లక్ష్యాలపై వరుస వైమానిక దాడులతో అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. అయితే రానున్న రోజులలో ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయోనని పలు దేశాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

బనకచర్ల…. చంద్రబాబు తలకి రోకలి చుట్టుకున్నట్లే..

బనకచర్ల…. చంద్రబాబు తలకి రోకలి చుట్టుకున్నట్లే..

కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందా,,, ఏపీ – తెలంగాణ సమస్య పరిష్కరిస్తుందా?

“రెండు రాష్ట్రాలూ సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కట్టుకుని సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలి ‘ ‘ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు ఇచ్చారు. “బనకచర్ల” ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో రాజకీయ నాయకులు రాజేస్తున్న తగాదా రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉద్రిక్తతలు పెరగకముందే చంద్రబాబు నాయుడు, విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఈ సూచన లో వ్యూహాత్మకమైన, ఆచరణసాధ్యమైన దృక్పధాలు కనబడుతున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ఈ సూచనను పరిశీలించాలి. కేంద్రప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి

వాస్తవాలు సాంకేతికతల ప్రాతిపదికగా ఉభయ తారకంగా సమస్యకు ముగింపు ఇవ్వాలి.

బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన చంద్రబాబు నుంచే వచ్చింది. “అన్ని అనుమతులూ తీసుకున్నాకే” పని ప్రారంభమౌతుందని కూడా చెప్పారు. అయితే రాజకీయపార్టీలు ప్రజల సెంటిమెంటు కేంద్రంగా రెచ్చగొట్టే మాటలు విసరడం మొదలు పెట్టాయి.

దీనికంటే ముందు … ఆంధ్రప్రదేశ్ ఉన్న క్లిష్ట పరిస్తుతులలో బనకచర్ల వంటి భారీ ఎత్తిపోతలను తలపెట్టడమే . . చంద్రబాబు తన తలకి రోకలి చుట్టుకున్నట్లే కనిపిస్తోంది .

బనకచర్ల తగాదా: నీటి కోసం రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత

తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపకంపై కొనసాగుతున్న వివాదాల్లో తాజా చిచ్చు – బనకచర్ల ప్రాజెక్టు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రాణవాయువుగా భావిస్తున్న ఈ ప్రాజెక్టుపై తెలంగాణ మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. గోదావరి జలాల వినియోగంపై నానా రకాలుగా చర్చకు దారితీసిన ఈ అంశం, ఇప్పుడిప్పుడే రాజకీయ మలుపులు తిరుగుతోంది.

బనకచర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం – గోదావరి వరద నీటిని వృథా కాకుండా పట్టుకుని, శ్రీశైలం కుడికాలువ ద్వారా రాయలసీమలోకి తరలించడం. ప్రతి ఏటా వర్షాకాలంలో సముద్రంలో కలిసిపోయే సుమారు 200 టీఎంసీల వరద నీరు ఆంధ్రప్రదేశ్ ప్రకారం వృథా అవుతోంది. ఆ నీటిని కాలువల ద్వారా ప్రకాశం బ్యారేజీకి, అక్కడి నుంచి బొల్లపల్లిలో నిల్వ చేసి, చివరకు రాయలసీమకు తరలించాలన్నదే ప్రణాళిక.

ఈ పథకంతో 12 లక్షల ఎకరాల సాగు భూములకు నీరు అందుతుందని, 40 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెరపైకి వచ్చిన ఈ పథకాన్ని రాయలసీమలో శాశ్వత సాగునీటి ప్రణాళికగా అభివర్ణిస్తున్నారు. నిజమే . .. కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అస్తవ్యస్థ పరిస్తుతులలో సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించకుండా తెరపైకి తీసుకురావడం చంద్రబాబు దుందుడుకు స్వభావానికి సంకేతంగా కనిపిస్తోంది .

తెలంగాణ అభ్యంతరం: నీటి హక్కుల ఉల్లంఘన

తెలంగాణ మాత్రం ఈ పథకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గోదావరి జలాలపై తమకున్న హక్కులను కాలరాశి, కొత్తగా నీటిని మళ్లించడమంటే పునర్విభజన చట్టం ఉల్లంఘన అని వాదిస్తోంది. ముఖ్యంగా, ప్రాజెక్టు నిర్మాణానికి ముందు అపెక్స్ కౌన్సిల్ అనుమతి, ట్రైబ్యునల్ అంగీకారం అవసరమన్న నిబంధనలను ఉల్లంఘించిందని అభిప్రాయం.

తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2025 జనవరిలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాసి ఈ ప్రాజెక్టు నివేదికను తిరస్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం స్పందించకపోవడం వల్ల తెలంగాణలో అసంతృప్తి, అనిశ్చితి పెరిగింది.

కేంద్రం మౌనం: సమస్యకే దారి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తటస్థ ధోరణిలో వ్యవహరిస్తోంది. ఈ పథకంపై ప్రీ-ఫీజిబిలిటీ నివేదిక కేంద్ర జలశక్తి శాఖకు పంపబడినప్పటికీ, ఆమోదం లేదా తిరస్కరణ గురించి ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఇది రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగకుండా అడ్డుకుంటోంది. అపెక్స్ కౌన్సిల్‌ను సమావేశపర్చని కేంద్రం, జల వివాద పరిష్కార విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది.

పనులు ప్రారంభం కాకముందే వివాదం ముదురుతుండటంతో, నీటి రాజకీయం మళ్లీ తెరపైకి వచ్చింది.

టీడీపీ (ఆంధ్రప్రదేశ్): చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును రైతుల పాలిట దైవిక వరంగా చూపిస్తున్నారు. కేంద్రంతో కలిసికట్టుగా పనిచేస్తున్నామని, ఈ పథకం వల్ల రాష్ట్రానికి భారీ లాభం చేకూరుతుందని వాదిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ (ఆంధ్రప్రదేశ్): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ పథకానికి సిద్ధాంత పరంగా మద్దతు ఇవ్వడమే కాకుండా, టీడీపీ దీనిని ప్రచార తంతుగా వాడుతోందని విమర్శిస్తున్నారు. తమ పాలనలో అమలు చేసిన వెలిగొండ, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులతో పోల్చుతూ బనకచర్లను అతిశయోక్తిగా చూపిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్: అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ పథకాన్ని గోదావరి జల ఒప్పందాల ఉల్లంఘనగా భావిస్తూ, న్యాయపరంగా ఆపేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రంతో చర్చలు జరిపి, సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు.

బీఆర్ఎస్ (తెలంగాణ): ఈ పథకాన్ని గోదావరి నీటి దోపిడీగా చిత్రీకరిస్తూ, కేంద్రం, టీడీపీ మీద విమర్శలు గుప్పిస్తోంది. నేత విద్యాసాగర్ రావు, ఇది చట్టవిరుద్ధమని, తెలంగాణ రైతులకు నష్టం కలిగిస్తుందని వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనం పాటిస్తోందని ఆరోపిస్తూ, రహస్య ఒప్పందాలపై ఆరోపణలు చేస్తున్నారు.

బీజేపీ (కేంద్రం & తెలంగాణ): కేంద్ర బీజేపీ మౌనం కొనసాగిస్తుండగా, తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర రైతులకు మద్దతు పలుకుతున్నారు. అపెక్స్ కౌన్సిల్‌ జోక్యం కావాలన్న ముద్దుబొమ్మను ఉపయోగిస్తూనే, గడువు పెడుతున్నారు.

రాజకీయ పార్టీలకు ఇది ఓట్ల కోసం మంచి అవకాశంగా కనిపిస్తున్నా, రాయలసీమ రైతులకు ఇది ఆశ, తెలంగాణ రైతులకు ఆందోళన. నీటి కోసం సాగుతున్న ఈ పోరాటం రాజకీయ ప్రయోజనాలకు, సమర్థ నీటి పాలనకు మధ్య సమరంగా మారుతోంది.

ఇలాంటి స్థితిలో చంద్రబాబు సూచనలో రాజకీయం కాక, రాజనీతి కనపడుతోంది. గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు ఇప్పటికే వినియోగిస్తున్నాయని, పోలవరం ప్రాజెక్టు తప్ప మిగిలినవన్నీ అనుమతి లేని ప్రాజెక్టులని, తాను ఎప్పుడూ తెలంగాణపై వివాదం సృష్టించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తుచేశారు. ఆయన్ని విశ్వసించడానికి ఈ వాస్తవాలు చాలు. 

బనకచర్ల వివాదానికి శాశ్వత పరిష్కారం రావాలంటే:

1.కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.

2.అపెక్స్ కౌన్సిల్‌ను తక్షణం సమావేశపర్చాలి.

3.రెండు రాష్ట్రాల మధ్య పారదర్శక చర్చలు జరగాలి.

4.ప్రాజెక్టు నివేదికను నిష్పాక్షికంగా సమీక్షించాలి.

బనకచర్ల ఒక నీటి ప్రాజెక్టు మాత్రమే కాదు – అది రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి కల్పించాల్సిన అవసరాన్ని, హక్కుల పరిరక్షణకు లెక్కలు వేసే రాజకీయాలను, కేంద్ర ప్రభుత్వ పాత్రను ప్రతిబింబిస్తుంది. నీటి అంశాలు ఇక రాజకీయం కాకుండా సాంకేతికత, సమన్వయం, ఆధారంగా పరిష్కారమవ్వాలి. లేకపోతే తగాదాలు రాష్ట్రాల మధ్య విద్వేషాల్ని పెంచే ప్రమాదం వుంది.

అమెరికా వైభ‌వం ముగియ‌నుందా..?

అమెరికా వైభ‌వం ముగియ‌నుందా..?

అప్పుల ఊబిలో అగ్ర‌రాజ్యం.. ఏటా వ‌డ్డీల‌కే ట్రిలియ‌న్ డాల‌ర్ల ఖ‌ర్చు

రెండో ప్ర‌పంచ యుద్ధం త‌రువాత ఐరోపాలోని ప్ర‌ధాన దేశాలు బ‌ల‌హీన‌ప‌డ‌టంతో ప్ర‌పంచంలోనే ఆర్థికంగా సైనికంగా తిరుగులేని అగ్ర‌రాజ్యంగా ఆవిర్భ‌వించే అవ‌కాశం అమెరికాకు ద‌క్కింది. ఆ త‌రువాత దాదాపు నాలుగు ద‌శాబ్దాల‌పాటు సోవియ‌ట్ యూనియ‌న్ నుంచి రాజ‌కీయంగా సైనిక ఆయుధ‌శ‌క్తిప‌రంగా తీవ్ర‌మైన పోటీని ఎదుర్కొన్నా అంతిమంగా గెలిచింది అమెరికానే. సోవియ‌ట్ యూనియ‌న్ విచ్చిన్న‌మ‌య్యాక అమెరికా ఏకైక అగ్ర‌దేశంగా నిలిచి ప్ర‌పంచ‌దేశాల‌ను అన్నివిధాలుగా శాసిస్తూ వ‌చ్చింది. అయితే ఈ వైభ‌వం ఇంకెంతో కాలం కొన‌సాగ‌క‌పోవ‌చ్చ‌న్న విశ్లేష‌ణ‌లు కొంత‌కాలంగా ఆర్థిక రంగంలోని నిపుణుల నుంచి వెలువ‌డుతున్నాయి. విశ్వ‌వాణిజ్యంలో ఇప్ప‌టిదాకా ప్ర‌ధాన క‌రెన్సీగా ఆమెరికా డాల‌ర్ చ‌లామ‌ణిలో ఉంది. బంగారం వంటి విలువైన లోహాల నుంచి ముడి చ‌మురు వ్యాపారం దాకా అత్య‌ధిక శాతం మార‌కం డాల‌ర్ల‌లోనే సాగుతోంది. అయితే ఈ ప‌రిస్థితి భ‌విష్య‌త్తులో మారే అవ‌కాశాలు స్ప‌ష్టంగానే క‌నిపిస్తున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా చైనా దేశం నుంచి అమెరికాకు ఎదుర‌వుతున్న పోటీయేన‌ని చెప్పుకోవాలి. చైనాకు అమెరికా మధ్య సాగుతున్న ఆర్థిక పోటీ, వ్యూహాత్మక వేడి, డాలర్‌పై ఆధిపత్యాన్ని తగ్గించాలన్న చైనాకి ఉన్న ప్రణాళికల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంత‌రించుకుంటోంది.

ప్రపంచ తయారీ రంగంపై పెరిగిన చైనా ఆధిపత్యం..

ప్రపంచ తయారీ రంగంలో గ‌డ‌చిన రెండున్న‌ర ద‌శాబ్దాలుగా చైనా శ‌ర‌వేగంగా దూసుకెళుతోంది. 2023 నాటికి గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్‌లో చైనాకి ఉన్న వాటా దాదాపు 28.8 శాతంగా ఉంది, ఇది పెద్ద‌న్న‌ అమెరికా (15.5%) కంటే ఇంచుమించు రెట్టింపు. రెండు ద‌శాబ్దాల క్రితం ఇది కేవలం 8 శాతం మాత్రమే. చైనా తయారీ సామర్థ్యం ఏ స్థాయిలో పెరిగిందో దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు. చైనా దూకుడు ఉత్ప‌త్తి రంగంతో మాత్ర‌మే ఆగ‌లేదు. ‘Made in China 2025’ వంటి ప్రణాళికలతో దేశీయ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహిస్తూ నూతన సాంకేతిక రంగంలో సైతం ఆధిపత్యాన్నిసాధించేందుకు చైనా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అమెరికా టెక్ జెయింట్లు వేల కోట్ల డాల‌ర్లు వ్యయం చేసి త‌యారు చేసిన చాట్ జీపీటీ వంటి అద్భుత సాంకేతిక సాధ‌నాల‌కు పోటీగా త‌క్కువ వ్య‌యంతోనే డీప్‌సీక్ వంటి డిజిట‌ల్‌ ఉత్ప‌త్తుల‌తో ఆ రంగంలోనూ అమెరికాకు స‌వాల్ విసురుతోంది.

టెక్నాలజీ, పరిశోధనలో గణనీయ పెట్టుబడులు

చైనా తన జాతీయ ఆదాయంలో 2.6 శాతానికి పైగా నిధుల‌ను పరిశోధన & అభివృద్ధి రంగానికి ఖర్చు చేస్తోంది. 2024లో ఈ ఖర్చు దాదాపు $70 బిలియన్లకు చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G, చిప్ తయారీ వంటి కీలక రంగాల్లో చైనా స్వావలంబన వైపు వేగంగా కదులుతోంది. ఇది త‌న ఆధిపత్యాన్ని సవాల్ చేయగలదు అనే భయం అమెరికాలో నెల‌కొంది. అందుకే అక్కడ నుండి టెక్నాలజీ ఎగుమతులపై ఆంక్షలు పెడుతోంది.

డాలర్ కు ప్రత్యామ్నాయం కోసం ప్ర‌య‌త్నాలు ?

చైనా ప‌లు ద్వైపాక్షిక ఒప్పందాల్లో అమెరికన్ డాలర్‌కు బ‌దులుగా, తమ కరెన్సీ అయిన రెమ్మిన్బి (యువాన్)లో లావాదేవీలు జరిపేలా ప్రోత్సహిస్తోంది. 2024 నాటికి ట్రేడ్ ఫైనాన్స్‌లో రెమ్మిన్బి వాడకం స్విఫ్ట్ డేటా ప్రకారం రెండో స్థానానికి చేరింది. ఇది డాలర్‌ ఆధిపత్యానికి గండికొట్టే దిశగా బ‌ల‌మైన అడుగుగా పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా త‌ర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌గా ఇప్ప‌టికే చైనా ఎదిగింది. అమెరిక స‌హా అనేక దేశాలతో వాణిజ్యంలో చైనాకు మిగులు ఆదాయం ఉంది. అంటే ఆయా దేశాల‌నుంచి చైనాకు దిగుమ‌తి అయ్యే వ‌స్తువుల విలువ కంటే చైనా ఎగుమ‌తి చేసేవాటి విలువ ఎంతో ఎక్కువ‌. ఇదే స‌మ‌యంలో బ్రిక్స్ దేశాలు కూడా అమెరికా ప్రాబ‌ల్యాన్ని తగ్గించాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాయి.

అమెరికా రక్షణాత్మక చ‌ర్య‌లు

చైనా స‌హా ఇత‌ర దేశాలు సాధిస్తున్న వృద్ధి త‌న‌కు ప్ర‌తికూలంగా మారుతున్నందుకు ప్రతిస్పందనగా అమెరికా త‌న ప్ర‌యోజ‌నాలు కాపాడుకునేందుకు ప‌లు ర‌క్ష‌ణాత్మ‌క చర్యలు తీసుకుంటోంది. చైనా టెక్ సంస్థలపై ఆంక్షలు, హై-ఎండ్ చిప్స్ ఎగుమతులకు అడ్డుపడే విధంగా చర్యలు, మిత్ర దేశాల్లో చైనా దూకుడును తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాక స్థానికంగా తయారీని ప్రోత్సహిస్తూ చైనాపై ఆధారాన్ని తగ్గించుకునే ప్ర‌య‌త్నాలు అమెరికా చేస్తోంది. కానీ ఆ దేశంలో ఉత్ప‌త్తి వ్య‌యం ఎక్కువ కావ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు అంత‌గా స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌డం లేదు.

అమెరికాను భ‌య‌పెడుతున్న అప్పులు

అగ్ర‌రాజ్యం అమెరికాకు అప్పులు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ప్ర‌స్తుతం అవి సుమారు 37 ట్రిలియ‌న్ డాల‌ర్లకు చేరుకున్నాయి. ఏటా అమెరికా వీటిపై క‌డుతున్న వ‌డ్డీనే ఏటా 1 ట్రిలియన్ డాల‌ర్ల‌కు పైగా ఉంటోంది. ఇది అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు పెనుభారంగా మారింది. అమెరికాతో వాణిజ్య మిగులు ఆదాయంలో కొంత భాగాన్ని చైనా తిరిగి ఆదేశంలోనే బాండ్ల‌లో పెట్టుబ‌డి పెడుతూ వ‌చ్చింది. ప‌దేళ్ల‌క్రితం ఈ పెట్టుబ‌డులు దాదాపు 1.3 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉండేవి. ఆ త‌రువాత అమెరికాలో అత్య‌ధిక పెట్టుబ‌డులు ఉన్న దేశాలుగా జ‌పాన్‌, యూకే ఉండేవి. అయితే ఈ ద‌శాబ్ద కాలంలో చైనా అమెరికా బాండ్ల‌లో త‌న పెట్టుబ‌డులను క్ర‌మంగా ఉప‌సంహ‌రించుకుంటూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం అవి 785 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు త‌గ్గ‌డంతో చైనా అమెరికా పెట్టుబ‌డుల్లో 3వ స్థానానికి ప‌డిపోయింది. ఒక‌రకంగా ఇది అమెరికా డాల‌ర్‌పై వ‌త్తిడి పెంచేందుకు చైనా అనుస‌రించిన వ్యూహాత్మ‌క విధానమేన‌ని చెప్పాలి. ఆర్థికంగా బ‌లంగా ఉన్న చైనా త‌న పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుంటే అమెరికాకు రుణ సేక‌ర‌ణ భార‌మ‌వుతుంది. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఆంక్ష‌లంటూ చైనా స‌హా ప‌లు దేశాల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చేందుకు చేస్తున్న విన్యాసాల వెనుక నేప‌థ్య‌మిదే.

క‌మ్యూనిస్టు దేశం కావ‌డ‌మే చైనాకు అడ్డంకి..

అయితే ఇప్ప‌టికిప్పుడు చైనా పూర్తిగా అమెరికా స్థానాన్ని సొంతం చేసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే అమెరికా ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌. కానీ చైనా కొన్ని స‌ర‌ళ ఆర్థిక విధానాల‌ను అనుస‌రిస్తున్నా మౌళికంగా క‌మ్యూనిస్టు దేశం. ఇంకా పర్-క్యాపిటా ఆదాయం, బహుళరాజకీయ విధానాలు, ఫైనాన్షియల్ వ్యవస్థలు వంటి విషయాల్లోనూ అమెరికాతో పోలిస్తే చైనా వెనుకబడి ఉంది. అయితే దీర్ఘకాలంలో చూసినప్పుడు, చైనా ముందస్తు ప్రణాళికలతో, క్రమంగా అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న విష‌యం కాద‌న‌లేని వాస్త‌వం.

యోగాకు హద్దుల్లేవు :   ప్రధాని మోదీ

యోగాకు హద్దుల్లేవు : ప్రధాని మోదీ

యోగాంధ్రకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ – అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

” యోగాకు మతం లేదు . కులంలేదు . అందరు హ్యాపీగా చేయొచ్చు . . గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది . గ్రామగ్రామాల్లో యువకులు, మహిళలు , చిన్నారులు యోగాను అనుసరిస్తున్నారు.యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని భారత్ నిరూపించింది . యోగాదినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి . . 175 దేశాల్లో యోగా చేయడం అసాధారణ విషయం”   ” అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు . విశాఖలో యోగాంధ్ర లో ముఖ్య అతిధిగా పాలొన్న ప్రధాని ఈ సందర్బంగా యోగాసనాలు వేశారు . ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అని, చంద్రబాబు, పవన్‌ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారని కొనియాడారు.

నూనె తగ్గంపు ఛాలెంజ్ “ యోగాడే సందర్బంగా వంటల్లో 10 శాతం నూనె తగ్గించి వాడటం ప్రారంభిద్దాం . .. ఇది ఛాలెంజ్గా తీసుకుందాం . ..అని మోడీ ఇచ్చిన ఛాలెంజ్ ను యోగాంధ్రలో పాల్గొన్న వారంతా కరతాళ ధ్వనులతో స్వీకరించారు .

వ్యక్తిగత క్రమశిక్షణ  ప్రకృతిలో మనిషి భాగస్వామి అని, యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్న , యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని మోడీ స్పష్టం చేసారు. క్రమం తప్పకుండ యోగ చేసే వారిలో వ్యక్తిగత క్రమశిక్షణ అలవాడుతుందన్నారు. ఇది వ్యక్తి అనూహ్య విజయాలకు దారిదీపం చూపుతుందని పేర్కొన్నారు .

భారతీయ సంస్కృతి అందరి క్షేమం కాంక్షిస్తుందన్న ప్రధాని, యోగాపై దేశంలోని అనేక వైద్యసంస్థలు పరిశోధన చేస్తున్నాయని తెలిపారు. యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయని, గుండె, నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందని చెప్పారు. మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతుందన్న ప్రధాని, అంతర్జాతీయ చికిత్సా కేంద్రంగా భారత్‌ మారుతోందన్నారు.

ప్రధాని మోడీ చొరవతో యోగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ గా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు . యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని చెప్పారు . – యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించడం మోడీ వల్లే సాధ్యమైందన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ప్రధాని మోడీని అందరూ ప్రశంసించాలన్నారు .

గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..

 విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో విజయం సాధించింది . ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది . విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ సందడిగా మారింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేసి . .. రికార్డ్ క్రియేట్ చేశారు .

విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 25వేల మంది గిరిజన విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సాధనలో భాగంగా ఏయూ మైదానంలో 25వేల మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ విద్యార్థులను సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేశ్‌ అభినందించారు.

మీ చిన్నారుల   కాళ్లకు సాక్సులు, షూస్ లేకుండా నడిపిస్తే బెనిఫిట్స్ తెలుసా?

మీ చిన్నారుల   కాళ్లకు సాక్సులు, షూస్ లేకుండా నడిపిస్తే బెనిఫిట్స్ తెలుసా?

ఏమిటి మీరు చెప్పేది… అలా చేస్తే … అరి కాళ్ళు కందిపోవు . .. అని టెన్షన్ పడుతున్నారా? బెనిఫిట్స్ తెలుసుకుంటే నో టెన్షన్

చెప్పులు లేకుండా పార్కులలో వాకింగ్ చేసే జనాన్ని ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల వచ్చే లాభాలు తెలుసుకున్న వారే ఇలా చేస్తున్నారు. అయితే లేలేత పాదాల చిన్నారులనూ ఇలా నడిపిస్తే . .. అమ్మో .. వాళ్ళ పాదాలు కందిపోతాయ్/.. అన్న ఆందోళన వస్తుంది చిన్నారుల తల్లులకు. అయితే ఆ ఆందోళన వదిలి ఇలా చేయించండి ఎన్ని ప్రయోజనలో కలుగుతాయని సెలవిస్తున్నారు మానసిక, వైద్య నిపుణులు . ..

పిల్లలకు చెప్పులు లేనిదే బయటకెళ్లనివ్వరు పేరెంట్స్. లేలేత పాదాలు కందిపోతాయని లేదా కాళ్లకు మట్టి అంటుతుందని సాక్సులు, షూలు తొడిగేస్తుంటారు. అయితే ఈ అతి జాగ్రత్త అన్ని సందర్భాల్లో పనికిరాదని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు చెప్పుల్లేకుండా నేలపై, పచ్చటి గడ్డిపై నడవడం వల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా వారికి అనేక ప్రయోజనాలు కలుగుయని అనేక పరిశోధననలలో స్పష్టమయింది .

2. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించండి… మరియు బాగా నిద్రపోండి!

నొప్పి, అలసట, పేలవమైన నిద్ర, ఆటో-ఇమ్యూన్ డిజార్డర్స్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే వాపుకు సంబంధించినవిగా భావిస్తారు. ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రణలో ఉంచడానికి మన శరీరంలో ప్రతికూల ఎలక్ట్రాన్ల సంఖ్యను పెంచడం చాలా ముఖ్యం మరియు దీన్ని చేయడానికి సరళమైన మార్గం ఎర్తింగ్. భూమి యొక్క సహజ ఉపరితలాలపై అరగంట పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రతికూల ఎలక్ట్రాన్‌లను గ్రహించడానికి సమయం లభిస్తుంది – మీతో దీన్ని చేయమని పిల్లలను ప్రోత్సహించడం వల్ల ప్రతి ఒక్కరి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది!

3. పీడన బిందువులు & నాడీ వ్యవస్థను ఉత్తేజపరచండి

పిల్లలు బూట్లు ధరించినప్పుడు, వారు వాటిలో అన్నింటికంటే ప్రాథమిక ఇంద్రియ అనుభవాన్ని కోల్పోతారు – వారి పాదాల క్రింద ధూళి, రాళ్ళు, ఆకులు మరియు కొమ్మల అనుభూతి. మన పాదాలు బహుళ పీడన బిందువులు మరియు నరాల చివరలతో దృఢంగా అనుసంధానించబడి ఉంటాయి, ఇవి మన శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలను అందిస్తాయి. బూట్లు ధరించడం వల్ల ఈ నరాల చివరల ప్రభావం మందగిస్తుంది, అయితే చెప్పులు లేకుండా వెళ్లడం వల్ల వాటిని ప్రేరేపిస్తుంది మరియు క్రమంగా, మన మొత్తం నాడీ వ్యవస్థ. ఇది బహుశా ఇంద్రియ ఆట యొక్క సులభమైన మరియు అత్యంత ఖర్చుతో కూడుకున్న రూపం!

వారి కీళ్ళు & కండరాలను బలోపేతం చేయండి

చెప్పులతో నడవడం వల్ల పిల్లల పాదాలు మరియు చీలమండలలోని కండరాలు బలపడతాయి, సమతుల్యత మరియు భంగిమ మెరుగుపడతాయి. ఇది పాదాల తోరణాలను నిమగ్నం చేస్తుంది, వాటిని బలోపేతం చేస్తుంది మరియు కాళ్ళ అంతటా కండరాల అమరికను మెరుగుపరుస్తుంది. ఇది, తుంటి, మోకాలు మరియు చీలమండలు వంటి కీళ్లలో స్థిరత్వ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది, తరువాత జీవితంలో గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. ప్రకృతితో సంబంధాన్ని పెంపొందించుకోండి

తమ బూట్లు వెంటనే తీసివేయడం వల్ల పిల్లలు తమ పరిసరాల గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి – నేల ఎలా ఉంటుంది? ముందు పదునైన రాతి ఉందా? పొదల్లో ఆ శబ్దం ఏమిటి? వారి ఇంద్రియాలు పెరుగుతాయి – వారు శ్రద్ధ చూపుతున్నారు. ఆ శ్రద్ధ నుండి వారు నడుస్తున్న సహజ ప్రపంచం పట్ల ప్రశంస వస్తుంది. వారు కాళ్ళ కింద కాగితపు ఆకులు నలిగిపోతున్నట్లు భావిస్తారు. గడ్డి యొక్క మృదుత్వం. ముళ్ళ యొక్క పదును. ఐదు ఇంద్రియాలు పూర్తిగా నిమగ్నమైనప్పుడు, వారు పూర్తిగా ప్రకృతితో కనెక్ట్ అవుతారు మరియు అన్నింటికంటే, సహజ ప్రపంచంలో ఉండటానికి ప్రేమను పెంపొందించుకోవడానికి బాల్యం కంటే మంచి సమయం ఇంకేముంటుంది?

ప్రస్తుతం మెజార్టీ పిల్లలకు చిన్న వయసులోనే కళ్లద్దాలు రావడం మనం అందరం చూస్తునే ఉన్నాం. ఇందుకు గ్యాడ్జెట్లు ఒక కారణమైతే, పోషకహార లోపం, నడిచే విధానం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు నడక వచ్చినప్పట్నుంచే వారిని చెప్పుల్లేకుండా(barefoot) నేలపై, పచ్చటి గడ్డిపై నడిపించడం కంటి ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. ఎందుకంటే, కంటికి అనుసంధానమైన నాడులకు సంబంధించిన ప్రెస్సింగ్ పాయింట్స్ పాదాల్లో ఉంటాయని, నేలపై నడవడం వల్ల వాటిపై ఒత్తిడి పడుతుందని తద్వారా కళ్లకు సరైన రక్తప్రసరణ జరిగి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెపుతున్నారు పరిశోధకులు .

పచ్చటి గడ్డిని చూడడం వల్ల కంటిలోని కండరాలు రిలాక్సవుతాయని నిపుణులు అంటున్నారు. పెద్దైనా ఈ అలవాటును ఇలాగే కొనసాగించడం వల్ల ఇతర కంటి సంబంధిత సమస్యల్లేకుండా జాగ్రత్తపడచ్చు అని సూచిస్తున్నారు.

రోజూ కాసేపు పచ్చటి గడ్డిలో ఆడించడం, చెప్పుల్లేకుండా తిప్పడం వంటివి చేస్తే శరీరంలో హ్యాపీ హార్మోన్ గా పేర్కొనే ఎండార్ఫిన్లు విడుదలవుతాయని, తద్వారా మనసులోని టెన్షన్లన్నీ మాయమై, మానసిక ప్రశాంతత సొంతమవుతుందని పేర్కొంటున్నారు. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అభిజ్ఞా వేగం, ఏకాగ్రతలో గణనీయమైన పెరుగుదల, మెదడు ఒత్తిడిలో గణనీయమైన తగ్గుదల కూడా ఉంటాయని . .. నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ స్పష్టం చేస్తోంది .

Note: ఈ శీర్షికలో ‘అభిన్యూస్ ‘ , వ్యాసకర్తలు అందించే వ్యాసాలు , సూచనలు వివిధ పరిశోధకులు చెప్పినవి. నిపుణులైన వారి సలహాలు , సూచనలు . వీటిని పాటించే ముందు తప్పనిసరిగా . .. మీ వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకోవడం బెటర్.

మావోయిస్టులు ఉనికి కోల్పోయినట్లేనా ?

మావోయిస్టులు ఉనికి కోల్పోయినట్లేనా ?

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. వరుస ఎన్ కౌంటర్ల తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ వందల సంఖ్యలో సభ్యులను కోల్పోయింది. AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఎక్కువగా సంచరించే మావోలు . … దేవీపట్నం మండలంలోకి వచ్చేసారు. దశాబ్ద కాలంగా దేవీపట్నం మండల పరిసరాలలో మావోల కదలికలు లేవనే చెప్పాలి . అయితే AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో నిఘా పెరగడంతో ఆయా ప్రాంతాలలో సురక్షితం కాదని భావించిన మావోలు . …దేవీపట్నం ఏరియాపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది .

ఏపీలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అడ‌వుల్లో భ‌ద్ర‌తా ద‌ళాల గాలింపు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఒక మ‌హిళ స‌హా ముగ్గురు మావోయిస్టు కీల‌క నేత‌లు మ‌ర‌ణించారు. రంప‌చోడ‌వ‌రం, మారేడుమిల్లి ప్రాంతాల స‌మీపంలోని కొండ‌మొద‌లు, కొయ్య‌ల‌గూడెం, చింత‌కూరు వ‌ద్ద ఇరువ‌ర్గాల‌కు భీక‌ర కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌నలో చ‌నిపోయిన వారిని మావోయిస్టు అగ్ర‌నేత చ‌ల‌ప‌తిరావు భార్య అరుణ‌, గాజ‌ర్ల ర‌వి అలియాస్ ఉద‌య్‌, అంజు గా గుర్తించిట్టు తెలుస్తోంది. చ‌ల‌ప‌తిరావు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో చ‌త్తీస్‌గ‌ఢ్ ఒడిశా రాష్ట్రాల స‌రిహ‌ద్దులో జ‌రిగిన భ‌ద్ర‌తాద‌ళాల కూంబింగ్‌లో జ‌రిగిన కాల్పుల్లో మ‌ర‌ణించాడు.

కాగా ఘ‌ట‌నా స్థ‌లంలో మూడు ఏకే 47 రైఫిల్స్ స‌హా భారీగా ఆయుధాల‌ను భ‌ద్ర‌తాద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. హ‌తుల్లో అరుణ మావోయిస్టు స్పెష‌ల్ జోన్ క‌మిటీ స‌భ్యురాలు కాగా గాజ‌ర్ల ర‌వి కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా, అంజు ఆంధ్రా ఒరిస్సా బోర్డ‌ర్ స్పెష‌ల్ జోన్ క‌మిటీ ఏసీఎంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అరుణ 2018లో జ‌రిగిన నాటి టీడీపీ ఎమ్యెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హ‌త్య కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఆమెపై రూ. 20 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. చ‌నిపోయిన‌వారి మృత‌దేహాల‌ను రంప‌చోడ‌వ‌రం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇటీవ‌లికాలంలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఈ ప్రాంతమంతా ఉన్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు తాజా ప‌రిణామాల‌తో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఒక‌ప్పుడు ఏవోబీ తో పాటు విశాఖ‌, తూర్పుగోదావ‌రిజిల్లాల్లోని దండ‌కార‌ణ్య ప్రాంతం మావోయిస్టుల‌కు పెట్ట‌నికోట‌గా ఉండేది. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌నుంచి ప‌లువురు యువ‌కులు ఈ ఉద్య‌మం ప‌ట్ల ఆకర్షితులై చేర‌డంతోపాటు, గ్రామాల్లో ప‌లువురు సానుభూతిప‌రులు సైతం ఉండేవారు. అందుకే మావోయిస్టు ఉద్య‌మం బ‌లంగా విస్తరించింది. భ‌ద్ర‌తా ద‌ళాల‌కు.. మావోయిస్టుల‌కు త‌ర‌చుగా కాల్పులు జ‌రుగుతూ ఇరువైపులా ప్రాణ‌న‌ష్టం జ‌రిగేది. కూంబింగ్ భారీస్థాయిలో జ‌రుగుతున్న స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా తీవ్ర‌వాదులు స‌రిహ‌ద్దుల్లోని చ‌త్తీస్‌గ‌ఢ్ ఒడిశా ప్రాంతాల్లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో త‌ర‌లిపోయి షెల్ట‌ర్ తీసుకునేవారు. త‌మ‌కు అనువైన స‌మ‌యంలో ఒక్క‌సారిగా విరుచుకుప‌డి ఎదురుదాడి చేసేవారు. ఈ కార‌ణంగానే వారిని ఎదుర్కోవ‌డం పోలీసుల‌కు పెనుస‌వాల్‌గా ఉండేది.

కొన్నేళ్ల క్రితం తీవ్ర‌వాద ఉద్య‌మం బ‌లంగా ఉన్న స‌మ‌యంలో ఏవోబీలోను, బ‌స్త‌ర్ అడ‌వుల్లోనూ కూంబింగ్‌కు వెళ్లిన భ‌ద్ర‌తాద‌ళాల‌పై ఊహించ‌నివిధంగా చుట్టుముట్టి మావోలు భీక‌ర‌మైన దాడులు చేశారు. 2008 జూన్ 29న ఒడిశా రాష్ట్రంలోని బ‌లిమెల జ‌లాశ‌యంలో గ్రేహౌండ్స్ ద‌ళాలు ప్ర‌యాణిస్తున్న ప‌డ‌వ‌పై మావోయిస్టులు తూటాల వ‌ర్షం కురిపించ‌డంతో 32మంది గ్రేహౌండ్స్ సిబ్బంది, ఐదుగురు పోలీసులు స‌హా మొత్తం 38 మంది మ‌ర‌ణించారు. 2010 ఏప్రిల్‌లో చ‌త్తీస్‌గడ్ రాష్ట్రంలోని చింత‌ల్నార్ వ‌ద్ద కూంబింగ్‌కు వెళ్లిన 200 మంది భ‌ద్ర‌తాద‌ళాల‌ను దాదాపు వెయ్యిమంది మావోయిస్టులు చ‌క్ర‌వ్యూహంలో బంధించి జ‌రిపిన మార‌ణ‌హోమంలో 76మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జ‌రిగిన మావోయిస్టు దాడుల్లోనే ఇది అతిపెద్దది. 2023 ఏప్రిల్ నెల‌లో మ‌ళ్లీ దంతెవాడ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వ‌స్తున్న ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని మందుపాత‌ర‌తో పేల్చి 10మందిని బ‌లిగొన్నారు. మావోల దాడుల్లో ఇవి కొన్ని మాత్ర‌మే.

మావోయిస్టుల స‌మ‌స్యను బీజేపీ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. కేంద్ర హోం శాఖ‌.. మావోయిస్టు ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో అణ‌చివేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో సీఆర్‌పీఎఫ్ కోబ్రా ద‌ళాలు మావోల ప్రాబ‌ల్య‌మున్న రాష్ట్రాల పోలీసుల స‌హ‌కారం స‌మ‌న్వ‌యంతో వారున్న అట‌వీ ప్రాంతాల‌ను కొన్ని నెల‌లుగా ప్ర‌ణాళిక ప్రకారం జ‌ల్లెడ ప‌డుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ జ‌రుగ‌ని స్థాయిలో మావోల‌తో దాదాపు యుద్ధం చేస్తున్నాయి. గ‌త రెండు మూడు నెలల్లోనే మావోయిస్టు అగ్ర‌నాయ‌క‌త్వంతో స‌హా రెండువంద‌ల‌మందికి పైగా భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో హ‌త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఏం చేయాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితిని ఎదుర్కొంటున్న మావోయిస్టులు చెల్లాచెదురై షెల్ట‌ర్ తీసుకునేందుకు ఈ ప్రాంతానికి వ‌చ్చిన‌ట్టు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఆయుధాలు చేత‌బ‌ట్టి హింసావాదంతో వ్య‌వ‌స్థ‌ల‌ను మార్చవ‌చ్చ‌ని న‌మ్మే కాలం చెల్లిన ఆలోచ‌నావిధానం, మారిన సామాజిక ఆర్థిక అంశాల‌ను గుర్తించ‌లేని పిడివాదం.. సామాన్య ప్ర‌జ‌ల్లో ఉద్య‌మంపై ఒక‌నాటి సానుభూతి క్ర‌మేణా క‌రిగిపోవ‌డం మావోయిస్టు ఉద్య‌మం బ‌ల‌హీన‌ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పాలి. మారిన సామాజిక, ఆర్థిక‌ ప‌రిస్థితుల కార‌ణంగా యువ‌త‌కు అభివృద్ధి ఫ‌లాలు అంద‌డంతో కొత్త‌గా ఉద్య‌మం వైపు ఆక‌ర్షిత‌మ‌య్యేవారు క‌రువ‌య్యారు. ఇదే స‌మ‌యంలో కొంద‌రు మావోయిస్టు పార్టీ నేత‌లు తెలంగాణ‌లోనూ ఇటు ఏపీ, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోనూ కొన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి ఉద్య‌మాన్ని త‌మ స్వార్థం కోసం వాడుకున్నార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఒక‌ర‌కంగా వారి వెన్నుపోటు పార్టీని త‌ప్పుడు మార్గం ప‌ట్టించింది. మావోయిస్టుల‌ను త‌మ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు, రాజ్యాధికారం చేజిక్కించుకునేందుకు అత్యంత వ్యూహాత్మ‌కంగా వాడుకున్న ఆ నేత‌లు తమ‌కు అధికారం ద‌క్కాక ఉద్య‌మాన్ని అంతం చేసేందుకు త‌మ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు. ఉద్య‌మం బ‌ల‌హీనం కావ‌డం మొద‌లైంది ఆ కాలంలోనే. ప్ర‌జాస్వామ్య‌ వ్య‌వ‌స్థ‌లో లోపాల‌పై పోరాడాల్సింది పోయి వ్య‌వ‌స్థ‌పైనే పోరాటం సాగిస్తామ‌న‌డం అర్థ‌ర‌హితం అవివేకం. మావోయిస్టు ఉద్య‌మం ఉత్ధాన ప‌త‌నాలు చెప్పే పాఠ‌మ‌దే. అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించే ధైర్య‌మున్న అతికొద్దిమంది యువ‌త ప్ర‌జాస్వామ్యానికి అనుగుణంగా పోరాడిఉంటే జాతిని ముందుకు న‌డిపించే నాయ‌కులుగా ఎదిగేవారు. ఆవేశం, అతివాదంతో ఆయుధాలు ప‌ట్టి అడ‌విపాలై త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుకోత మిగిల్చారు.

ఫోన్ ట్యాపింగ్ లో ‘కెసిఆర్’ ఇరుక్కోవాల్సిందే…

ఫోన్ ట్యాపింగ్ లో ‘కెసిఆర్’ ఇరుక్కోవాల్సిందే…

ఫోన్ ట్యాపింగ్‌. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది . తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, BRS చీఫ్ కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో మొద‌లై ఆ త‌ర్వాత ఇటు ఏపీకి కూడా ఈ అరాచ‌కం విస్త‌రించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణలో ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ ద‌ర్యాప్తులో వెలుగుచూసిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అటు రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌తోపాటు ఇటు సామాన్య ప్ర‌జ‌ల‌ను కూడా నివ్వెర‌ప‌రచేవే. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తోపాటు ప‌లువురుపారిశ్రామికవేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు, వ్యాపారులు కూడా ఈ ఘ‌ట‌న‌లో బాధితులేన‌ని వార్త‌లు వెలువ‌డుతుండ‌టం వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో కొంద‌రు నేత‌ల కార‌ణంగా విలువ‌లు ఎంత‌గా దిగ‌జారిపోయాయో స్పష్టం అవుతోంది .

గ‌తంలో ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో నాడు టీడీపీ నేత‌గా ఉన్న రేవంత్‌రెడ్డిపై జ‌రిగిన స్టింగ్ ఆప‌రేష‌న్ ఓటుకు నోటు కేసు. రాజ‌కీయంగా అప్ప‌ట్లో అదో సంచ‌ల‌నం. తెలంగాణలో త‌మ పార్టీని శాశ్వ‌తంగా అంతం చేయాల‌ని జ‌రిగిన రాజ‌కీయ కుట్ర‌గా టీడీపీ ఆ ఘ‌ట‌న‌ను చెప్పుకున్నా.. టీడీపీకి రేవంత్‌రెడ్డికి అదో మ‌చ్చ‌గా మిగిలింద‌నే చెప్పాలి. ఈ కేసు కార‌ణంగానే గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన సంగ‌తి తెలుగు ప్ర‌జ‌లు అంత తేలిక‌గా మ‌ర‌చిపోలేరు. అంతేకాదు.. ఈ కేసులో నాటి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును నాడు కేసీఆర్ ప్ర‌భుత్వం టార్గెట్ చేయ‌డంతో ఫోన్ ట్యాపింగ్ అంశం అప్పట్లోనే తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఈ అనుమానంతోనే చంద్ర‌బాబునాయుడు ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్నా హైదరాబాద్ ను వ‌దిలి ఏపీ నుంచే పాల‌న సాగించేందుకు సిద్ధ‌ప‌డ్డారన్న విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ స‌హాయంతో చేసిన కుట్ర‌గా భావించిన రేవంత్‌రెడ్డి ఆ త‌ర్వాత కాలంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఆయ‌న సీఎం అయిన నాటినుంచి గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై గ‌ట్టిగా దృష్టి సారించారు. నాటి ప్ర‌భుత్వంలో దీనికి సంబంధించి ప‌నిచేసిన కీల‌క అధికారుల విచార‌ణ‌లో విస్తుగొలిపే అంశాలు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పోలీస్ అధికారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే . అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా కెసిఆర్ అండ్ కో కు కూడా ఉచ్చు బిగుస్తోంది .

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి. మించిదని చెప్పాలి . ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు . చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు . ఆ సమయంలో జగన్ కోరిక మేరకు కెసిఆర్ . .. చంద్రబాబు తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాయినట్లు బలమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి . దీనికి సంభిందించి ఇప్పటికే కొన్ని అధరాలు సేకరించినట్లు తెలుస్తోంది .