అప్పట్లో ఇవన్నీ లేవు . , కానీ . ,

అప్పట్లో ఇవన్నీ లేవు . , కానీ . ,

ఓ తండ్రి . . కొడుక్కి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు మీరూ చదవండి . ..

తండ్రిని ఒక కొడుకు అడిగిన ఒక సందేహం…. (పాతికేళ్ల క్రితం నాటి కధ . . అయినా కొత్తగానే ఉంటుంది . ..)

నాన్నా ! మీ కాలంలో;;;;

1. ఇంత టెక్నాలజీ లేదు..

2. ఆర్డర్ పెడితే పది నిమిషాలలో ఫుడ్ ఇంటికొచ్చే సౌకర్యంలేదు . ..

3. వేగవంతమైన ఇంటర్నెట్ లేదు..

4. ఆధునిక TV లు లేవు..

5.  కంప్యూటర్లు లేవు..

6. ఏసీ లు లేవు..

7. లగ్జరీ కార్ లు లేవు..

8. మొబైల్ ఫోన్ లు లేవు… మీరెలా బ్రతికేవారు? 

*దానికి ఆ తరము తండ్రి గారు ఇచ్చిన జవాబు అందరూ చదవవలసిందే*.

మీ తరమువారు ఈ రోజుల్లో  ఎలాగైతే

1. ప్రార్ధన లేకుండా..

2. మర్యాద లేకుండా

3. ప్లానింగ్ లేకుండా

4. క్రమశిక్షణ లేకుండా..

5. పెద్దల ఎడల గౌరవం లేకుండా..

6. మన చరిత్ర పై అవగాహన లేకుండా..

7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా.

8. ఏ మోరల్ వేల్యూస్ లేకుండా…   రోజులు ఎలా గడిపేస్తున్నారో!

మేము ఆ Morals అన్నీ పాటిస్తూ ఆనందముగా జీవించాము.

మేము మీలాగా…

1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..

2. పాఠశాల వేళలు అయిన

తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము. TV లు చూడలేదు…

3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము..

4. దాహము వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాము. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..

5. ఒకే గ్లాస్ లో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా

మాకెప్పుడూ జబ్బులు రాలేదు..

6. మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు…

7. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా

మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..

8. సొంత ఆట వస్తువులు తయారు చేసికొని ఆడుకున్నాము,, అష్టా చెమ్మా, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠ పాళీ ఆడుకున్నాము.

బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము,

9. పిలువక పోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..

10. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు…..

    బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే.

మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు…..

అయినప్పటికీ..

మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము…

మేము ఒక limited ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము…..

అందుకే మా విన్నపము ఏమంటే..

*భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాలనుండి,  ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి*.…….

మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు,

మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో,

ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతామేమో . …. ఈ కధ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటుంది . ఇలాంటి ఆలోచింపచేసే కధలు , వాస్తవాలను నేటి తరం పిల్లలకు ఏదోలా చేరవేయాలి . కనీసం ఒక్క్కసారైనా దీనిపై ఆలోచన చేస్తారు . అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఎప్పుడైనా అనిపిస్తే . .. అటుగా అడుగులు వేసే ప్రయత్నం అయినా మొదలెడతారు . . పాజిటివ్ గా ఆలోచిద్దాం . ..

రష్యా..ఇండియా..చైనా.. కలిస్తే ఏమవుతుంది ?

రష్యా..ఇండియా..చైనా.. కలిస్తే ఏమవుతుంది ?

ఐక్యమత్యంతోనే ఈ సాంకేతిక యుగంలో ముందుకెళ్లగలం

“ఆపరేషన్ సిందూర్” తో భారత్ …పాకిస్థాన్ ను గోడకుర్చీ వేయించింది/ అంతకు మించి ప్రపంచంలో శక్తివంతమైన “ఇండో పసిఫిక్” రాజకీయ, ఆర్ధిక డైనమిక్స్ ముందువరుసలో భారత్ ను తీసుకువెళ్తుంది. 

ఇండో పశిఫిక్ ప్రాంతం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం  పశ్చిమ, మధ్య భాగాలను ఇండో-పసిఫిక్ ప్రాంతం అంటారు. ఇందులో తూర్పు ఆఫ్రికా నుండి పశ్చిమ అమెరికా వరకు విస్తరించిన భూభాగం ఉంటుంది. ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలు రాజకీయ ఆర్థిక డైనమిక్స్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఇండో-పసిఫిక్ యొక్క భౌగోళిక రాజకీయ మరియు ఆర్థిక ముఖచిత్రం యొక్క కీలక భౌగోళిక అంశాలు ఉన్నాయి.

ప్రపంచ వాణిజ్యంలో 50% కంటే ఎక్కువ జరిగే సముద్ర మార్గాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వున్నాయి. మలక్కా జలసంధి ద్వారా సంవత్సరానికి 100,000 ఓడలు దాటుతాయి, ఇవి చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఇంధనాన్ని వస్తువులను రవాణా చేస్తాయి. సింగపూర్, హాంకాంగ్, మరియు షాంఘై వంటి ఓడరేవులు ఈ ప్రాంతంలో ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి.

ప్రపంచం “పెద్దన్న” గా భావించే అమెరికా నేతృత్వంలో జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ఇండో పశిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం వహిస్తోంది. అమెరికా ఉద్దేశ్యపూర్వకంగానే భారత్ ను ఇందులో కలపలేదు.

ఆపరేషన్ సిందూర్ తరువాత ప్రపంచదేశాల్లో భారత్ పట్ల ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. ఇది కేవలం సైనిక విజయం వల్ల మాత్రమే కాదు. ఆరు సంవత్సరాలుగా ఆర్ధిక రంగంలో వృద్ధి ప్రభావం. ఆర్ధికంగా 10 వస్ధానం నుంచి 4 వ స్థానానికి చేరుకున్న భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం కుతూహలంగా గమనిస్తోంది. ఆపరేషన్ సిందూర్ ఒక ట్రిగ్గర్ గా పనిచేసింది.

మరోవైపు ఇండో పశిఫిక్ ప్రాంతంలో అమెరికా పక్కనపెట్టిన భారత్ ఇదే ప్రాంతంలోని తైవాన్ తో వాణిజ్యం, ఫిలిప్పీన్స్ తో మిసైల్స్ సరఫరా, జపాన్ తో టెక్నాలజీ సప్లైస్, వియత్నాంతో సైనిక సహకారం, ఇండోనేషియాతో సముద్ర భద్రత ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఇదే అదనులో రష్యా ప్రతిపాదించిన రష్యా ఇండియా చైనా (RIC) ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది.

RIC ఒక త్రైపాక్షిక సహకార వేదికను సూచిస్తుంది. ఇది ఈ మూడు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక, మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటైన ఒక అనధికారిక ఏర్పాటు. RIC సమావేశాలు సాధారంణంగా ఈ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయిలో జరుగుతాయి.

వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగం, మరియు సాంకేతికతలో సహకారాన్ని పెంచడం RIC లక్ష్యం.

ప్రపంచ రాజకీయాలలో పాశ్చాత్య దేశాల ఏకపక్ష వ్యతిరేకించి, ప్రపంచ వ్యవస్థను ప్రోత్సహిస్తాయి. ఉగ్రవాదం, సైబర్ భద్రత, మరియు ప్రాంతీయ స్థిరత్వంపై సమిష్టి చర్యలపై చర్చలు జరుగుతాయి.ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం కోసం సహకారం. విద్య, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం.

ఆపరేషన్ సిందూర్ తరువాత RIC కూటమి బలోపేతం కాగల అవకాశాలు బాగా మెరుగయ్యాయి. ప్రపంచ జనాభాలో ఈ మూడుదేశాల జనాభా 36 శాతం. అలాగే ప్రపంచ వాణిజ్యంలో ఈ మూడుదేశాల వాటా 37 శాతం. RIC బలపడితే ఈ సహజ సామర్ధ్యమే!

ఈ కూటమి దేశాల సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకోగలిగి, ఏకాభిప్రాయంతో ముందుకి వెళ్ళగలిగితే సూపర్ పవర్ కాగలుగుతాయి.

ఆధిపత్యాన్ని నిలబెట్టుకోడానికి విభజించి పాలించడం ఒక కుటిలనీతి. అపుడు బ్రిటన్, ఇపుడు అమెరికా ఇదే దుర్నీతి పాటించాయి. ఫలితంగా పుట్టిన ద్వేషాగ్నితో ఇప్పటికీ ఇండియా, పాకిస్థాన్ – రష్యా, ఉక్రెయిన్ మండిపోతున్నాయి. వనరులను సద్వినియోగం చేసుకోగలిగిన సామర్థ్యమే శక్తిగా మారుతుంది. ఆ శక్తితో పాటు దౌత్యనీతి కూడా భారత్ ను పెద్ద ఇన్ ఫ్లుయెన్సర్ గా  నిలబెడుతోంది. ఇలాంటి ఇన్ ఫ్లుయెన్సే విద్వేషాల్ని చల్లార్చగలుగుతుంది.

మన స్వరం పెంచి ఐక్యరాజ్య సమితి ని నిలదీసే వరకూ భారత్ ఇన్ ఫ్లుయెన్స్ పెరిగింది. సమితిలో శాశ్వత సభ్యత్వం, వీటో అధికారాల కోసం ఇండియా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. సమితి భద్రతామండలి తాజాసమావేశంలో సెక్రెటరీ మేరీ జాన్సన్ ఈ అంశాన్ని ప్రస్తావించి “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే. అభివృద్ది చెందాక వీటో అధికారం కూడా వస్తుంది” అన్నారు. దీనిపై విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ భారత్ ఏ రంగంలో ఏమేమి  సాధించిందో వివరిస్తూ, భారత్ ఎక్కడ వెనుకబడిందో చెప్పాలని అడిగినపుడు సెక్రెటరీ మాట్లాడలేకపోయారు. అంటే పరిస్థితి ఏవిధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు .

ఎలాన్ మాస్క్ స్టార్ లింక్ తో భారత్ కి ఎంత ప్రయోజనం?

ఎలాన్ మాస్క్ స్టార్ లింక్ తో భారత్ కి ఎంత ప్రయోజనం?

ప్రపంచ కుబేరుడు , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన సాంకేతిక సామ్రాజ్యాన్ని భారత్ కి విస్తరిస్తున్నాడు

స్టార్‌లింక్‌కు తలుపులు తెరిచిన భారత్‌- ఇక మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు

శాటిలైట్ ఇంటర్నెట్ విప్లవానికి భారత్ కొన్నాళ్ల క్రితమే నాంది పలికింది. అడవులు, ఎడారులు, కొండలు, కోనలు, సముద్రాలు, పర్వతాలు, హిమానీనదాలు అని తేడా లేకుండా ఎక్కడైనా అంతర్జాలం సేవలను అందించే విఖ్యాత శాటిలైట్ ఇంటర్నెట్‌ సర్వీసుల కంపెనీ స్టార్‌లింక్‌కు భారత్ తలుపులు తెరిచింది. అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఈ కంపెనీకి లైసెన్సును భారత టెలికాం శాఖ మంజూరు చేసింది. స్టార్‌లింక్‌ రాకతో దేశీయ ఇంటర్నెట్ సేవల ముఖచిత్రం మారే అవకాశం ఉంది. ఫైబర్‌ కేబుల్స్‌తో క్షేత్రస్థాయి‌లో నెట్‌వర్క్‌ను నిర్మించాల్సిన అవసరం లేకుండానే దేశంలో ఎక్కడికైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే ‘స్టార్‌లింక్‌’‌ ఎలా పనిచేస్తుంది? స్పీడ్, డేటా వివరాలేంటి? ఇంటర్నెట్ ప్యాకేజీల రేట్లు ఎంత?స్టార్‌లింక్‌‌ రాకతో భారత్​కు చేకూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలు ఇపుడు భారత్ లో ఆసక్తికరంగా మారాయి .

బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌,,
2000 సంవసరానికి ముందే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రయత్నాలు మొదలైనప్పటికీ అవి విశ్వవ్యాప్తం కాలేకపోయాయి. మారుమూల ప్రాంతాలకు వాటిని చేర్చేందుకు ప్రత్యేక కసరత్తు జరగలేదు. దీంతో ఉన్నత వర్గాల వారికే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. స్టార్‌లింక్ ద్వారా ఈ పరిమితులను అధిగమించేలా ఆలోచన చేసిన ఘనుడు ఎలాన్ మస్క్ అని చెప్పొచ్చు. ఆయన ఇంటర్నెట్ కనెక్షన్‌కు కొత్త నిర్వచనం ఇచ్చారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు సముద్ర గర్భం, అండర్ గ్రౌండ్‌ మొదలుకొని ఇంటి కిటికీ వరకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అవసరం అవుతాయి. టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే మారుమూల ప్రాంతాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌తో నెట్‌వర్క్ నిర్మాణం అనేది భారీ వ్యయంతో కూడుకున్న పని.

42,000 శాటిలైట్స్ …
స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఎలాన్ మస్క్‌దే. ఈ కంపెనీ 2019 నుంచి స్టార్ లింక్ ఉపగ్రహాలను ప్రయోగించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం 7వేలకుపైగా స్టార్ లింక్ ఉపగ్రహాలు భూమి దిగువ కక్ష్య(LEO)లో తిరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్‌కు చెందిన ‘ఫాల్కన్- 9’ రాకెట్ ఒకేసారి 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. అందుకే కేవలం ఆరేళ్ల వ్యవధిలో 7వేలకుపైగా శాటిలైట్ల నెట్‌‌వర్క్‌ను స్టార్‌లింక్ తయారు చేసుకోగలిగింది. ఒక్కో ఉపగ్రహం 259 కేజీల బరువు ఉంటుంది. రాబోయే కొన్నేళ్లలో తమ శాటిలైట్ల సంఖ్యను 42వేలకు పెంచాలని ఎలాన్ మస్క్ టార్గెట్ల.

స్టార్‌లింక్ పని తీరు ఇలా ఉంటుంది…
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ప్రస్తుతం భూమి దిగువ కక్ష్యలో ఉన్న 7వేల ఉపగ్రహాలే ఆధారం. ఈ శాటిలైట్లతో కూడిన స్టార్‌లింక్ నెట్‌వర్క్ అంతరిక్షంలోని శూన్యత ద్వారా రేడియో సిగ్నల్‌లను ఉపయోగిస్తుంది. స్టార్‌లింక్ గ్రౌండ్ స్టేషన్లు తమ ఉపగ్రహాలకు రేడియో సిగ్నల్స్‌ను పంపుతాయి. ఈ రేడియో సిగ్నల్స్‌ను అందుకోగానే స్టార్‌లింక్ శాటిలైట్లు ఇంటర్నెట్ డేటాను భూమిపై వివిధ చోట్ల ఉన్న యూజర్ల డివైజ్‌లకు చేరవేస్తాయి.

సిందూరం.. మొక్క నాటిన ప్రధాని మోదీ

సిందూరం.. మొక్క నాటిన ప్రధాని మోదీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ సింధూరం మొక్కను నాటారు . ‘ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం ద్వారా 700 కి.మీ మేర విస్తరించి ఉన్న ఆరావళి పర్వతశ్రేణులను హరితభరితం చేయాలనేది మా లక్ష్యం. ప్రజలతో మొక్కలు నాటించి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును బలోపేతం చేయడమే మా సంకల్పం. ఆరావళి పర్వతశ్రేణులు ఈ భూమిపైనే అత్యంత ప్రాచీనమైనవి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హరియాణా, దిల్లీలలో విస్తరించి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పర్వతశ్రేణులు సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. పర్యావరణపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆయా సవాళ్లను అధిగమించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆరావళి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంచేందుకు మా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎక్కడికక్కడ స్థానిక అధికార యంత్రాంగాలతో కలిసి పనిచేయబోతున్నాం. జల వ్యవస్థల నిర్వహణను మెరుగుపర్చడం, ఇసుక తుఫానులకు నిరోధించడం, థార్ ఎడారి తూర్పు వైపుగా విస్తరించకుండా నిలువరించడం వంటివన్నీ చేయబోతున్నాం’’ అని పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు .

‘ఆపరేషన్ సిందూర్​’ను గుర్తు చేస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ సిందూరం మొక్కను నాటారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గురువారం తన అధికారిక నివాసానికి సమీపంలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్క నాటి ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలోని ప్రతీ ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడి, పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పేరు ‘ఆపరేషన్ సిందూర్’. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని మోదీ సిందూరం మొక్కను నాటడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రత్యేకంగా హాజరయ్యారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, దిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కూడా పాల్గొన్నారు.

క్రికిట్ పిచ్చికి బ్రేక్ వేయాలి… లేకపోతే??

క్రికిట్ పిచ్చికి బ్రేక్ వేయాలి… లేకపోతే??

క్రికిట్ విజయోత్సవం యూత్ కి కిక్ ఇచ్చేదే. అయితే ప్రాణం మీదకు తెచుకునేంత కాకూడదు . ఇటీవల కుర్రకారుతోపాటు . .. మధ్య వయస్కులు సైతం క్రికిట్ పిచ్చిని మరింత ముదరబెట్టుకుంటున్నారు. కొందరు బెట్టింగుల కోసం క్రికిట్ మ్యాచ్ ల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే క్రికిట్ సక్సెస్ టీమ్ కి సన్మాన సభలలో జనం కిక్కిరిసిపోతున్నారు . ఒకప్పుడు క్రేజ్ ఉన్న సినీ హీరోలకు సైతం ఇంత జనం వచ్చేవారు కాదు.

తాజాగా బెంగళూరులో జరిగిన దుర్ఘటనతోనైనా క్రికిట్ అభిమానులు , పేరెంట్స్ కళ్లుతెరవాలి .

10 మంది దుర్మరణం . ..

18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరిగి ఇంటికి చేరుకోవడంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరియు విధాన సౌధ వెలుపల జనసమూహం పెరగడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది . ఈ ఘటనలో కనీసం 10 మంది మరణించినట్లు నిర్ధారించబడింది.

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల బుధవారం జరిగిన తొక్కిసలాట లాంటి పరిస్థితిలో కనీసం 10 మంది మరణించగా, డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సన్మాన కార్యక్రమం ఇక్కడే జరిగింది.

బౌరింగ్ ఆసుపత్రిలో మరణించినట్లు నిర్ధారించబడిన వారిలో యలహంకకు చెందిన 13 ఏళ్ల బాలిక దివ్యాంషి బిఎస్; 35 ఏళ్ల మహిళ; దంత వైద్యురాలు దివ్య; 20 ఏళ్ల దంత విద్యార్థి శ్రావణ్; 25 ఏళ్ల మహిళ; మరియు 17 ఏళ్ల మహిళ ఉన్నారు.

తలకు తీవ్ర గాయంతో ఉన్న ఒకరిని నిమ్హాన్స్‌కు తరలించారు.

వైదేహి ఆసుపత్రి మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ హుమేరా మీడియాతో మాట్లాడుతూ నలుగురు వ్యక్తులు చనిపోయినట్లు చెప్పారు – ముగ్గురు పురుషులు మరియు ఒక మహిళ, వీరందరూ 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఆసుపత్రికి మొత్తం 16 మంది వచ్చారు.

ఆసుపత్రులు బహుళ మరణాలను నివేదించినప్పటికీ, అధికారుల నుండి అధికారిక ధృవీకరణ ఇంకా వేచి ఉంది.

బిజెపి ప్రభుత్వాన్ని నిందించింది
11 మంది మరణించారని బిజెపి అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర తరువాత అన్నారు. ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు .

“ఆర్‌సిబి విజయోత్సవాల కోసం విధానసౌధ ముందు జనసమూహాన్ని నియంత్రించలేమని ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వానికి చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు మరియు విధానసౌధ ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చింది” అని ఆయన అన్నారు.

“ప్రజల మరణాలకు మరియు తీవ్రంగా గాయపడిన వారి మరణాలకు వారు (ప్రభుత్వం) ప్రత్యక్ష బాధ్యత వహిస్తారు. ముందస్తు ఏర్పాట్లు లేవు. అంబులెన్స్‌లు లేదా స్వచ్ఛంద సేవకుల ఏర్పాట్లు లేవు. ఈ తీవ్రమైన సమస్యపై న్యాయ విచారణ జరపనివ్వండి. మొత్తంగా, ఇప్పటివరకు 11 మంది మరణించారు, ”అని ఆయన అన్నారు, మృతుల సంఖ్య పెరగవచ్చని అన్నారు.

రజత్ పాటిదార్ నేతృత్వంలోని బృందం HAL విమానాశ్రయం నుండి నేరుగా విధానసౌధకు చేరుకుంది, రోడ్డుపై ఆనందంతో నిండిన జనసమూహం ఉన్నప్పటికీ. భద్రతా కారణాల దృష్ట్యా ముందుగా ప్లాన్ చేసిన విజయోత్సవ కవాతును రద్దు చేశారు.

ఆర్‌సిబి జట్టును చూసేందుకు రాష్ట్ర శాసనసభ వెలుపల వేలాది మంది అభిమానులు గుమిగూడారు. తొలి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్టుకు రాష్ట్ర ప్రభుత్వం విధానసౌధలో గొప్ప సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది.

జనసమూహాన్ని నియంత్రించడంలో అధికారులు ఇబ్బంది పడ్డారు, దీని ఫలితంగా వేదిక వెలుపల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతలను కాపాడటానికి, జనాన్ని కంట్రోల్ చేయడానికి 5,000 మంది సిబ్బందిని నియమించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు .

పిల్లల స్క్రీన్ టైమ్ . .. పేరెంట్స్ టెన్షన్

పిల్లల స్క్రీన్ టైమ్ . .. పేరెంట్స్ టెన్షన్

మీ బిడ్డలు ఫోన్ , ట్యాబ్ ని అతుక్కుపోకుండా ఉండాలంటే మీరు వారితో ప్రేమగా మాట్లాడేందుకు సమయం కేటాయించాలి

సోషల్ మీడియా హ్యాబిట్ నుంచి పిల్లలను రక్షించుకోవాలంటే పేరెంట్స్ కి తలనొప్పిగా తయారయింది… ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల కంటే సెల్ , ట్యాబ్ వంటి వాటిని ఎక్కువగా వినియోగించడమే కారణం ….
పిల్లలు టెక్నాలజీ వ్యసనాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, తల్లిదండ్రులు తరచుగా వారికి ప్రధాన మద్దతుగా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల పెరుగుతున్న స్క్రీన్ సమయాన్ని అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి మరియు నిర్వహించడానికి ప్రభావవంతమైన వ్యూహాలను అలవర్చుకోవడం చాలా ముఖ్యం.

పిల్లల్లో టెక్ వ్యసనం గురించి ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో, బెంగళూరులోని నిమ్హాన్స్ షట్ క్లినిక్ నిపుణులు డిజిటల్ డిటాక్స్ ఇంట్లోనే ప్రారంభించాలని పేరెంట్స్ కి సూచిస్తున్నారు . డిజిటల్ ఉపవాసం పాటించడం ద్వారా తల్లిదండ్రులే ఆదర్శంగా నడిపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు . కుటుంబం అంతా కలసి .. రోజు 40-60 నిమిషాలు స్క్రీన్‌ల నుండి డిస్‌కనెక్ట్ చేయడం. ప్రారంభించి . .. దీనిని సెలవు దినాలలో . .. 4, 5 గంటలకు పెంచాలి . తల్లిదండ్రులు తరచుగా ఏకైక సహాయక వ్యవస్థగా ఉండటంతో, స్క్రీన్ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం.

”మీరు మీ చిన్నారి ని స్క్రీన్ చూడవద్దని తరచూ చెపుతున్నపుడు . .. మీరెంత సమయం స్క్రీన్ చూస్తున్నారో గమనించుకోవాలి. బిడ్డలు స్క్రీన్ చూస్తున్నపుడు క్లాస్ సంబందించినవి ఉన్నపుడు పరిశీలించాలి . అనవసరమైన వాటిని ఎంతసేపు చూస్తున్నారు . దానిని వ్యసనంగా మారుతున్నారా ? వంటి అంశాలు నిశితంగా పరిశీలించాలి . ..” అని చెపుతున్నారు .

అడిగినప్పుడు, బహుశా మీరు కూడా అలా చేయకూడదు. బెంగళూరులోని నిమ్హాన్స్ షట్ (సర్వీస్ ఫర్ హెల్తీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ) క్లినిక్ నిపుణుల నుండి వచ్చిన స్పష్టమైన సందేశం ఇది. డిజిటల్ ఉపవాసం ఇంట్లోనే ప్రారంభం కావాలని నమ్ముతారు – తల్లిదండ్రులు ఉదాహరణగా నిలుస్తారు. పిల్లలు మరియు టీనేజర్లలో పెరుగుతున్న టెక్నాలజీ వ్యసనానికి ప్రతిస్పందనగా, క్లినిక్ ఇప్పుడు పిల్లల జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల వైపు దృష్టి సారిస్తోంది: అవసరమైన వారికి కౌన్సిలింగ్ . నిర్వహిస్తున్నారు .

“తల్లిదండ్రులు తమ పిల్లలకు మాత్రమే కాకుండా, తమకు కూడా సోషల్ మీడియాలో నిబంధనలు విధించుకోవాలి . డిజిటల్ ఉపవాసం కోసం, మొత్తం కుటుంబం కలిసి ఒక నిర్దిష్ట వ్యవధిలో – 40 నిమిషాల వరకు – టెక్నాలజీ నుండి డిస్‌కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి మరియు కొంత నాణ్యమైన సమయాన్ని కలిసి గడపాలి. ముఖ్యంగా అందరూ పాల్గొన్నప్పుడు, ఇది రీసెట్ చేయడానికి ఒక శక్తివంతమైన మార్గం కావచ్చు, ”అని రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ కౌన్సలర్ దారపు నాగిరెడ్డి . .. అభిన్యూస్ తో తన అభిప్రాయాన్ని వెల్లడించారు .

తల్లిదండ్రులు – మద్దతు యొక్క ప్రాథమిక మూలం
ఒక పిల్లవాడు టెక్నాలజీ వ్యసనంతో పోరాడుతున్నప్పుడు, తల్లిదండ్రులు తరచుగా ప్రాథమికంగా – మరియు కొన్నిసార్లు ఏకైక – మద్దతు యొక్క మూలం. అందువల్ల, తల్లిదండ్రులు తమ పిల్లల పెరుగుతున్న స్క్రీన్ సమయాన్ని పరిష్కరించడానికి మరియు నిర్వహించడానికి సమర్థవంతమైన నిర్వహణ పద్ధతులను నేర్చుకోవడం చాలా అవసరం.

“ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, వారు ఏదో కోల్పోతున్నట్లు భావిస్తారు. వారి సామాజిక సర్కిల్‌లో ఏమి జరుగుతుందో కోల్పోతారనే భయం లేదా వారు ఆన్‌లైన్‌లో లేకుంటే, ప్రజలు వారితో స్నేహం చేయకపోవచ్చు లేదా ‘నా భావోద్వేగాలను ఎదుర్కోవడానికి ఇదే ఏకైక మార్గం’ వంటి ఆలోచనలు ఉంటాయి. వారు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు, వారు బాగా భావిస్తారు. భావోద్వేగాలను ఎదుర్కోవడానికి మరియు బాగా అనుభూతి చెందడానికి ఇదే మార్గం అని వారు భావిస్తారు. ” అని మరో శాస్త్రవేత్త సెలవిచ్చారు .

సాంకేతిక వ్యసనం యొక్క ప్రభావాలు బహుళ డొమైన్‌లలో విస్తరించి ఉంటాయి. శారీరకంగా, ఇది దృష్టి సమస్యలు, తలనొప్పి, కండరాల నొప్పి మరియు మెడ లేదా భుజం ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తుంది – తరచుగా ఎక్కువసేపు స్క్రీన్ ఉపయోగించడం మరియు పేలవమైన భంగిమ వల్ల వస్తుంది. భావోద్వేగ లేదా మానసిక డొమైన్‌లో, అధిక ఫోన్ వాడకం వల్ల చిరాకు మరియు పరికరాలపై ఆధారపడటం ప్రాథమిక కోపింగ్ మెకానిజంకు దారితీస్తుంది. సామాజికంగా, ఇది ఒంటరితనం, పెరిగిన సామాజిక ఆందోళన మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాల క్షీణతకు దోహదం చేస్తుంది.
తల్లిదండ్రుల ఆందోళనలు
తల్లిదండ్రులు లేవనెత్తే ఆందోళనలలో ఎక్కువ భాగం గేమింగ్‌కు సంబంధించినవని, తరువాత సోషల్ మీడియాకు సంబంధించినవని డాక్టర్ మనోజ్ పేర్కొన్నారు, కొన్ని సందర్భాల్లో అశ్లీలత, ఇది తరచుగా మూడవ స్థానంలో ఉంది. “చాలా మంది టీనేజర్లు రోజుకు దాదాపు 8 నుండి 10 గంటలు, కనీసం ఆటలు మరియు అన్నీ ఆడుతున్నారు. మరియు వారు 8 నుండి 10 గంటలు ఆడినప్పుడు- వారు స్క్రీన్‌తోనే ఉండి, వివిధ రోజువారీ ఉత్పాదక కార్యకలాపాలను కోల్పోతారు,” అని విజయవాడకు చెందిన డాక్టర్ శశికాంత్ శర్మ అన్నారు.

చాలా మంది విద్యార్థులు ఇకపై విద్యాపరంగా రాణించడానికి లేదా దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపించబడటం లేదని ఆయన గమనించారు. బదులుగా, వారు యూట్యూబర్‌లు, స్ట్రీమర్‌లు లేదా ప్రొఫెషనల్ గేమర్‌లుగా మారాలని కోరుకుంటారు. “ఇ-స్పోర్ట్స్ ఒక కెరీర్ కావచ్చని తల్లిదండ్రులకు తెలుసు, కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల పరంగా, ఇది చాలా ముఖ్యమైనది కాదని వారు తరచుగా భావిస్తారు. వారు తమ పిల్లలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో సమతుల్యతను కనుగొనాలని కోరుకుంటారు” అని ఆయన జోడించారు.

కొన్నిసార్లు, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య కమ్యూనికేషన్‌లో విచ్ఛిన్నం ఉంటుంది. పిల్లవాడు తప్పుగా అర్థం చేసుకున్నట్లు భావించవచ్చు లేదా అవిధేయత చూపడం ప్రారంభించవచ్చు. ఇది కుటుంబ విభేదాలకు దారితీయవచ్చు – టీనేజర్లు దూకుడుగా మారవచ్చు లేదా తల్లిదండ్రులు కఠినంగా స్పందించవచ్చు లేదా పిల్లవాడు ఇష్టపడని విధానాలను ఆశ్రయించవచ్చు. ఇవన్నీ కుటుంబంలో బాధను సృష్టిస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన సంభాషణను ప్రోత్సహించడం మరియు తల్లిదండ్రులు తమ పిల్లల సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని నిర్మాణాత్మకంగా నడిపించడానికి సరైన వ్యూహాలతో వారిని సన్నద్ధం చేయడం అవసరం.

NIMHANS పేరెంట్ గ్రూప్ సెషన్‌లు
పిల్లల టెక్నాలజీ వ్యసనంతో పోరాడుతున్న తల్లిదండ్రులకు మద్దతుగా, NIMHANS బెంగళూరులోని SHUT క్లినిక్, NIMHANS సెంటర్ ఫర్ వెల్-బీయింగ్ (NCWB) సహకారంతో, ఉచిత పేరెంట్ గ్రూప్ సెషన్‌లను ప్రారంభించింది. ఈ సెషన్‌లు తల్లిదండ్రుల మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడం మరియు భాగస్వామ్య అనుభవాలు మరియు ఆచరణాత్మక మార్గదర్శకత్వం కోసం ఒక వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

వ్యక్తిగత శ్రద్ధను నిర్ధారించడానికి మరియు గోప్యతను కాపాడుకోవడానికి సమూహాలను ఉద్దేశపూర్వకంగా చిన్నగా ఉంచుతారు. తల్లిదండ్రులు తరచుగా స్వల్ప స్థాయిలో విచారం, ఆందోళన మరియు ఒత్తిడిని అనుభవిస్తారు, ఇది వారి స్వంత ఉత్పాదకతను ప్రభావితం చేస్తుంది – ముఖ్యంగా వారి పిల్లలు విద్యా లేదా రోజువారీ పనితీరులో క్షీణతను చూపించినప్పుడు. వారికి మద్దతుగా, తల్లిదండ్రులను నిర్ధారించడానికి కౌన్సెలింగ్ కూడా అందించబడుతుంది; మానసిక శ్రేయస్సు, వారు తమ పిల్లలను మరింత సమర్థవంతంగా చూసుకునేలా చేస్తుంది.

తల్లిదండ్రుల గ్రూప్ సెషన్‌లు విస్తృత మార్గదర్శకాలు, కుటుంబ-స్థాయి వ్యూహాలు మరియు కమ్యూనిటీ-స్థాయి చర్యల ఆధారంగా అవగాహనను సృష్టించడానికి ఉద్దేశించబడ్డాయి, ఇవి తల్లిదండ్రులకు టెక్నాలజీ వ్యసనం గురించి బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. సైబర్ అక్షరాస్యత ద్వారా జ్ఞానాన్ని పెంచడంపై ప్రాథమిక దృష్టి ఉంది. రెండవ లక్ష్యం తల్లిదండ్రులు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడటం. మూడవది
సంఘర్షణ పరిష్కార సామర్థ్యాలను నిర్మించడం.

“మేము పనిచేసే మూడు కీలక రంగాలు ఇవే. అయితే, ఈ నైపుణ్యాలను నేర్చుకున్న తర్వాత కూడా, పునరావృతం ముఖ్యం. పదేపదే సెషన్‌లు జ్ఞానాన్ని ఏకీకృతం చేయడానికి, కమ్యూనికేషన్ వ్యూహాలను బలోపేతం చేయడానికి మరియు సంఘర్షణ పరిష్కార నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి సహాయపడతాయి” అని డాక్టర్ శశికాంత్ శర్మ స్పష్టం చేసారు .

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. లోకేష్ ని  ఆపిందెవరు?

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్.. లోకేష్ ని ఆపిందెవరు?

రాజకీయ నిర్ణయాలలో చంద్రబాబు తటపటాయింపులతో నష్టం – సీనియర్లను పక్కనపెట్టాలి

యువగళం పాదయాత్ర ద్వారా తన సత్తా ఏమిటో నిరూపించుకున్న నేత నారా లోకేష్. అంచలంచలుగా రాజకీయంగా తన సామర్ధ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రాటుదేలారు లోకేష్. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ కి ఈ మహానాడులోనే పట్టంకడతారని అంతా భావించారు . అయితే చంద్రబాబు ప్రతీ విషయంన్నీ పదేపదే ఆలోచిస్తారు. దీనివల్ల ఎక్కువ నష్టం వాటిల్లుతుంటుంది . పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి విషయంలో సైతం సీనియర్లు నూరిపోసి భయ0తో చంద్రబాబు వెనకడుగువేసినట్లు కనిపిస్తోంది .

మహానాడులో లోకేష్ సత్తా . …

మహానాడులో లోకేశ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడవ తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నిర్వహించగల శక్తియుక్తులు తనకు ఉన్నాయని ఆయన నమ్మకం కలిగించగలిగారు. మహానాడులో లోకేశ్‌ ప్రసంగాన్ని గమనిస్తే ఆయనలో మూర్తీభవించిన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమైంది . ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు నంబర్‌ 2గా ఉన్న చంద్రబాబును కూడా అప్పటి కాంగ్రెస్‌ నాయకులు టార్గెట్‌ చేశారు. ఆయనపై నిత్యం ఆరోపణలు చేసేవారు. చివరికి చర్మ సంబంధమైన సమస్య వచ్చి చికిత్స తీసుకున్నప్పుడు కూడా అవమానించారు. అయితే లోకేశ్‌కు ఎదురైనన్ని అవమానాలు చంద్రబాబుకు ఎదురవలేదు. తనపై వస్తున్న ఆరోపణలకు చంద్రబాబు వెరవకుండా కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉండటం ద్వారా ఎన్టీఆర్‌కు వారసుడిగా నిలిచారు. 1983లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు, ఆ తర్వాత సురక్షితమైన కుప్పం నియోజకవర్గానికి మారారు. లోకేశ్‌ అలా చేయలేదు. సంక్లిష్టమైన మంగళగిరి నుంచి మొట్టమొదటిసారి పోటీచేసిన ఆయన ఓడిపోయారు. మంగళగిరి నుంచి పోటీ చేసి ఉండాల్సింది కాదు అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, మంగళగిరిలో 1983 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ మూడు నాలుగు పర్యాయాలు మాత్రమే గెలిచింది. అయినప్పటికీ లోకేశ్‌ మరో సురక్షిత నియోజకవర్గం వెతుక్కోకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టుగా పట్టుదల ప్రదర్శించి గత ఎన్నికల్లో తాను ఓడిన మంగళగిరి నుంచే 91 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆయనలోని ధైర్యానికి, పట్టుదలకు ఇదొక నిదర్శనం. ఈ నేపథ్యంలో కడపలో జరిగిన మహానాడులో లోకేశ్‌కు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి అప్పగించాలని పలువురు ప్రతిపాదించారు. నిజానికి ఆయన ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నప్పటికీ పార్టీ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నందున పార్టీ బాధ్యతలను లోకేశ్‌ చూసుకుంటున్నారు. పార్టీలోని సీనియర్‌ నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. కార్యకర్తల్లో కూడా లోకేశ్‌ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతోంది. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు దారుణ హత్యకు గురైన చంద్రయ్య అనే పార్టీ కార్యకర్త కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడంలో లోకేశ్‌ పట్టుదలతో కృషి చేశారు. దీంతో ఆయనపై కార్యకర్తల్లో భరోసా ఏర్పడింది. ఇప్పుడు ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందడమే లోకేశ్‌ ముందున్న కర్తవ్యం. ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం, అంటే ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజామోదం పొందే ప్రయత్నాలను ఆయన ఇప్పటికే మొదలెట్టారు.

మోదీ సలహ . .. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లోకేశ్‌ కలుసుకోవడం, ప్రధాని వారితో రెండు గంటలపాటు గడపటం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేశ్‌కు కొన్ని సూచనలు చేయడంతో పాటు ఆయనలో తాను గమనించిన మార్పు గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘మీలో పరిణతి కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మీ ప్రసంగాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పును నేను గమనించాను. మొదట్లో తడబడిన మీరు ఇప్పుడు ఆసువుగా ఉపన్యసిస్తున్నారు’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు. అదే సమయంలో చంద్రబాబు నీడ నుంచి బయటపడి సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలని కూడా లోకేశ్‌కు ప్రధాని సూచించారు. ప్రధాని పరిశీలన నిజమే. గతంతో పోలిస్తే లోకేశ్‌ ఇప్పుడు రాటుదేలారు. నిజం చెప్పాలంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు ప్రజలను ఆకట్టుకొనే విధంగా ఉండవు. ఆయనకు అంతటి వాగ్ధాటి లేదు. 2019కి పూర్వం తెలుగులో మాట్లాడటానికి తొట్రుపడిన లోకేశ్‌, ఇప్పుడు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. లోకేశ్‌ భాష కూడా బాగా మెరుగైంది. అదే సమయంలో ఆయనలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్‌ కూడా అందుకు అనుగుణంగా మారింది. దీనికోసం లోకేష్ ఎంతో ప్రాక్ట్స్స్ చేసారు .

ఎదురైన అవమానాలు . .. వర్తమాన రాజకీయాలలో లోకేశ్‌కు ఎదురైనన్ని అవమానాలు మరే ఇతర నాయకుడికీ ఎదురవలేదు. జగన్‌ అండ్‌ కో ఒక పథకం ప్రకారం లోకేశ్‌ను కించపరిచే విధంగా ప్రచారం చేశారు. పప్పు అని అవమానించారు. ఆయన భాషను హేళన చేశారు. చివరికి ఆయన పుట్టుకపై కూడా జుగుప్సాకరంగా మాట్లాడారు. మామూలుగా అయితే ఇన్ని అవమానాలు ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోతాం. అయితే లోకేశ్‌ వాటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపు కదిలారు. తానేమిటో రుజువు చేసుకోవడానికి అహరహం కృషి చేశారు. బాడీ షేమింగ్‌కు గురైనప్పటికీ బాధపడకుండా ఆహార నియంత్రణ పాటించడం ద్వారా విమర్శకుల నోళ్లు కట్టేశారు. రాజకీయాలలో నంబర్‌ 2గా ఉన్న వారిని టార్గెట్‌ చేసుకోవడం సహజం.

లోకేష్ నడపగలరు . .. పార్టీని సమర్ధవంతంగా నడపగల సత్తా లోకేష్ సంపాదించుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఆయన సామర్ధ్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ దక్కుతుంది . చంద్రబాబు సీనియర్ల మాటాలకు కాస్త భయపడుతూ . .. తన నిర్ణయాన్ని వాయిదావేసుకోవడం పార్టీ రాజకీయాలకు ఎంతోకొంత నష్టం చేకూరుస్తుంది . దీనిపై చంద్రబాబు పునరాలోచుంచుకోవాలి .

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌కు రూట్

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌కు రూట్

హైదరాబాద్ కి హైటెక్ సిటీ ఎలాగో . … అమరావతికి క్వాంటం వ్యాలీ అలా అన్నమాట . …

రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ( Quantum Valley Technology Park) ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఈరోజు (శనివారం) ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది.

క్యాంటం కంప్యూటింగ్ సర్వీసెస్ , సొల్యూషన్స్ తో పాటు పరిశోధన, మరియు హైబ్రీడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను టీసీఎస్ అందించనుంది. అలాగే వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి, విద్యా రంగాలకు చెందిన వివిధ అప్లికేషన్లు, పరిశోధన సహకారాన్ని అందించేలా టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. క్లైంట్ నెట్వర్క్‌తో పాటు స్టార్టప్ , ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్ అండ్ టీ సంస్థ అందించనుంది. 2026 జనవరి 1 నాటికి అమరావతి రాజధానిలో అధునాతన క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది. ఇది పూర్తయితే . . ఒక్క అమరావతిలోనే 50 వేల మంది నిపుణులకు మంచి సాలరీతో ఉద్యోగాలు లభించనున్నాయి .

చంద్రబాబు ఆహ్వానంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తారా?

చంద్రబాబు ఆహ్వానంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తారా?

జగన్ భయం ఇంకా వీడలేదంటున్న పరిశ్రమ వర్గాలు.

దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనం – ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వెల్లడించిన చంద్రబాబు

– సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని పిలుపు

”సంపద సృష్టి , ,, సంపద సృష్టి . .. అంటూ పదేపదే చెప్పే చంద్రబాబు మాటలను పరిశ్రమ వర్గాలు నమ్ముతాయి . అయితే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా కొంత భయం పారిశ్రామికవేత్తలతో కనిపిస్తూనే ఉంది . 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు , అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది . .. అంటూ టీడీపీ చేసిన ప్రచారం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది . ఈ ప్రచారం ఇపుడు ఏపీకి పరిశ్రమలు రావడానికి అడ్డుపడేలా ఉంది .

సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తానూ ఒకడినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ను భారత్‌ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు.

“ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా, చాలా మంది నాయకులను చూశాను. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ప్రధానిగా ఉన్నారు. మోదీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలం. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అన్నాను, ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటున్నాను. విశాఖలో టీసీఎస్‌ మొదలవుతోంది, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. అలాగే విశాఖకు గూగుల్‌ రాబోతోంది” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్‌ చేయడానికి శ్రమిస్తున్నాం. హైదరాబాద్‌ బ్రౌన్‌ఫీల్డ్‌ సిటీ, అమరావతి గ్రీన్‌ఫ్లీడ్‌ సిటీ. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా. భవిష్యత్తులో ఉత్తమ నగరంగా అమరావతి ఎదుగుతుంది. 2047 విజన్‌గా 15 శాతం వృద్ధిరేటుతో సాగాలనేది లక్ష్యం. క్వాంటం వ్యాలీ, ఏఐ నినాదంతో ముందుకు సాగుతున్నాం. దేశంలో తొలిసారి క్వాంటం కంప్యూటింగ్‌ భారత్‌కు వస్తోంది. టీసీఎస్‌, ఐబీఎం, ఎల్‌ అండ్‌ టీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మారాం” అని చంద్రబాబు వివరించారు.

హైదరాబాద్‌‌లో  రియల్‌ ఎస్టేట్‌..మరో ఐదేళ్లు ఇంతే,,

హైదరాబాద్‌‌లో రియల్‌ ఎస్టేట్‌..మరో ఐదేళ్లు ఇంతే,,

వాస్తవ పరిస్థితులకు భిన్నంగా 200, 300 శాతం ధరలు కృత్తిమంగా పెంచేసి హైప్ చేసిన మార్కెట్లు ఎప్పటికైనా కిందకు దిగి వాస్తవ ధరలకు రావలిసి0దే కదా . …

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. అయితే గత పాలకులు కేసీఆర్, కెటిఆర్ వంటి వారి స్వార్ధ్య ప్రయోజనాల కోసం ఉన్న ధరలకు హెచ్చు చూపించడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మెడకు ఉరితాడు పడినట్లయింది .

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నాలుగైదేళ్లుగా నేల చూపులు చూస్తోంది. ఇటీవల వరకు దూసుకుపోయిన మార్కెట్ రానున్న రోజుల్లో ఎటువంటి పెరుగుదల చూపే అవకాశం లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఏళ్ళ తరబడి స్థిరమైన వృద్ధిని సాధించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దీర్ఘకాలిక మందగమన సంకేతాలను చూపుతోంది.ప్రస్తుతానికి ధరల పెరుగుదల రోజులు నగరంలో ముగిసిపోవచ్చని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.రాబోయే ఐదు నుండి ఆరు సంవత్సరాలలో, ధరల పెరుగుదల స్థిరంగా ఉంటుందని వార్షిక వృద్ధి కేవలం 3-7%గా ఉంటుందని అంచనా వేశాయి పరిశ్రమవర్గాలు.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం ఊపు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వాస్తవ ధరలతో పోలిస్తే మార్కెట్ ధర చాలా ఎక్కువ . . ఇప్పటికే అత్యధిక రేట్ల స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చేరుకుంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత విలువ ఉంటుందో ముందే అంచనా వేసుకున్న బిల్డర్లు ఇప్పుడే ఆ ధరకు విక్రయాలు ప్రారంభించారు. అందుకే హైదరాబాద్ నగరంలో రియల్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో ధరలు కొంత కాలం స్థిరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

మరొక కీలకమైన అంశం ఏంటంటే.. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో జాప్యం జరగడం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR), మెట్రో రైలు విస్తరణ – రెండూ నగరం యొక్క కనెక్టివిటీ, నివాసయోగ్యతకు గేమ్-ఛేంజర్‌లుగా ప్రచారం చేయడం ప్రభావం చూపుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకుంటే 2026 తర్వాత వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ఊపును కొనసాగించడానికి ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా, సమర్థవంతంగా అమలు చేయకపోతే, జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో గతేడాది 32,974 యూనిట్లు విక్రయించారని.. 1.56 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తాజా నివేదిక తెలిపింది . ప్రస్తుతం సిటీలో అపార్ట్‌మెంట్ల సగటు ధర చ.అ.కు రూ.6000 గా ఉంది. ఏడాదిలో అపార్ట్‌మెంట్ల ధరలు దాదాపు 9 శాతం మేర పెరిగాయి. గతేడాది సిటీలో 44,013 యూనిట్లు మొదలయ్యాయి . అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం తగ్గాయి. హైడ్రా దూకుడు వ్యవహారంతో కొత్త గృహాల ప్రారంభానికి డెవలపర్లు ఆచితూచి వ్యవహరించడంతో లాంచింగ్స్‌లో క్షీణత నమోదయినట్లుగా తెలుస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదారేళ్ళ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు .