సీజన్ లో తప్పక తినాలని సూచిస్తున్న వైద్య , పోషకాహార నిపుణులు
నేరేడు పండ్లలో పోషకాలూ మెండుగా ఉంటాయి. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నేరేడు పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు ఫాస్ఫరస్, క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. నేరేడు పండ్లు తింటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
వర్షాకాలంలో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎన్నో రోగాలకు సహజ నివారిణిగా పనిచేస్తాయని అంటున్నారు. ఇందులో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
డయాబెటిస్ కంట్రోల్ : నేరేడు పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదని నిపుణులు సూచిస్తారు . దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో గ్లూకోజ్ లెవల్ను నియంత్రించడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. నేరేడు పండ్ల విత్తనాలలో ఉండే జాంబోలిన్, జాంబుసిన్ వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయని, నేరేడు పండ్లలోని ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు స్టార్చ్ను చక్కెరగా మారకుండా నిరోధించే సామర్థ్యం ఉంటుందని, తద్వారా ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తుందని ”National Library Of Medicine ” పేర్కొంది .
కంటి ఆరోగ్యం : నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా రెటీనాను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతుందని, కళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి దోహదం చేస్తుందని వివరిస్తున్నారు.
నేరేడు పండ్లు తినడం వల్ల .. చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను తొలగిపోతాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కానీ వీటిని సరైన కాంబినేషన్తో తినకపోతే.. ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు.కానీ వీటిని సరైన కాంబినేషన్తో తినకపోతే.. ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. నేరేడు పండ్లు కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. నేరేడు పండ్లు కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లు టేస్ట్లో పుల్లగా ఉంటాయి. ఇవి ఖాళీ కడుపుతో తింటే.. ఎసిడిటీ, కడుపు నొప్పి, చికాకు వంచి సమస్యలు వస్తాయి. నేరుడు పండు తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాబట్టి ఆహారం తిన్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.