రాష్ట్రంలో పోలీసులకు పట్టుబడిన వెయ్యి కిలోల బంగారం కస్టమ్స్ చరిత్రలోనే అరుదైన ఘటనగా చెపుతున్నారు.
చెన్నై సమీప కుండ్రత్తూర్ వద్ద మినీ లారీలో తరలించిన 1,000 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. 425 కిలోల బంగారు కడ్డీలకు సంబంధించి రసీదులు, ఆధారపత్రాలు ఉండడంతో తిరిగి ఇచ్చేశారు. శ్రీ పెరుంబుదూర్ లోక్సభ నియోకవర్గ పరిధిలో కుండ్రత్తూర్ జంక్షన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కుండ్రత్తూర్ నుంచి శ్రీ పెరుంబుదూర్కు వెళ్తున్న మినీ లారీని ఆపి తనిఖీ చేసి బంగారు కడ్డీలు గుర్తించారు. లారీలో ప్రయాణిస్తున్న వారిని విచారించగా, చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీ పెరుంబుదూర్ సమీపం మాండూరు పంచాయతీ సమీపంలో ఉన్న ఓ గోడౌన్కు తరలిస్తున్నట్టు చెపుతున్నారు.