” పొత్తు ధర్మాన్ని టీడీపీ పాటించలేదు. మండపేటలాంటి చోట జనసేనకు గత ఎన్నికలలో 18 శాతం వచ్చినా.. అలాంటి చోట టీడీపీ టికెట్ ప్రకటించడం కరెక్ట్ కాదు..” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బల్లగుద్ది మరీ చెప్పారు.
పొత్తు అంటే మీరు చెప్పినట్లు కాదు. మీరు అనుకున్నట్లు కాదు. మా ఆలోచనలు కూడా ఉంటాయి. అంటూ పవన్ ఘాటుగా స్పందించారు. ‘‘ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు. 20 తీసుకోండి 30 తీసుకోండి.. అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు. నాకు ఏమి తెలియదని చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఇవేమీ తెలియకుండా నేను రాజకీయాలలోకి వచ్చాను అనుకుంటున్నారా? నేను ఒక్కడినే ఎందుకు వెళ్ళలేదు అనే విషయంలో నాకు అవగాహన ఉంది. 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో పోటీ చేసే వాళ్ళం. గత ఎన్నికలలో 18 లక్షల ఓట్లు సంపాదించాం. మనం సింగిల్గా వెళ్తే సీట్లు సాధిస్తాం కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము’’ అని పవన్ పేర్కొన్నారు. మూడోవంతు సీట్లు తీసుకుంటామని పవన్ చేసిన ప్రకటన జనసేన వర్గాలలో జోష్ ఇచ్చింది.
తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్న పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. మూడోవంతు సీట్లు తీసుకుంటామని పవన్ రిపబ్లిక్ డే సందర్బంగా ప్రకటించారు. ఈ సందర్బంగా రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పోటీ చేస్తు0దని ప్రకటించారు.
ఈ వ్యవహారంతో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లయింది. ఇదిలా ఉండగా పవన్ ఢిల్లీ ప్రయాణంతో రాజకీయ వర్గాలలో తీవ్ర టెన్షన్ నెలకొంది. టీడీపీ వర్గాలలో మాత్రం ఆందోళన కలిగిస్తోంది.