మన దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ఓ ముఖ్య అంశం. దీని కోసం పోటీ చేసే అభ్యర్థులు సైతం న్యాయవాదులను సంప్రదిస్తుంటారు. నామినేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన నియమ నిబంధనలు సేకరించి.. “అభి న్యూస్ ” పాఠకుల కోసం ఇస్తున్నా0,….
పార్లమెంటు స్థానాలకు పోటి చేసే అభ్యర్ధులు ఆయా కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాలి.
-ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయ వొచ్చు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్ధితో పాటు మరో నలుగురిని మాత్రమే రిటర్నంగ్ ఆఫీసర్ కార్యాలయం వరకు అనుమతి ఇస్తారు. ప్రతిపాదకులు తప్పకుండా హజరు కావలసి వుంటుంది. మద్దతుగా వచ్చిన మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపివేస్తారు.
-అభ్యర్ధితో మొత్తం మూడు వాహనాలకు మాత్రమే లోనికి అనుమతి వుంటుంది. పోటీ చేసే అభ్యర్ధులు పార్లమెంటుకు రూ.25,000, అసెంబ్లీకి రూ.10,000 ధరావతు చెల్లించాల్సి వుంటుంది. ఎస్సి, ఎస్టి అభ్యర్ధులు 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది.
-ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో, అభ్యర్ధులు ప్రవేశించే ద్వారాల వద్దా సిసి కెమేరాలను ఏర్పాటు చేశారు.
-మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్ధుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తా రు.
-అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకి 13 రకాల డాక్యుమెంట్లను తీసుకు వెళ్ళాలి.
-పార్లమెంటుకు పోటీచేసే అభ్యర్ధులు ఫారమ్ 2ఏ, అసెంబ్లీకి పోటీ చేసేవారు ఫారమ్ 2బి లో ధరఖాస్తు చేయాలి.
-నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది
-పబ్లిక్ హాలిడేస్సె లలో నామినేషన్ స్వీకరించబడదు.
-అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు.
-నామినేషన్లను ఆర్ఓ కు గానీ, సంబంధిత ఏఆర్ఓకు మాత్రమే సమర్పించాలి.
-అభ్యర్ది తన నామినేషన్ను నేరుగా గానీ, తన ప్రపోజర్ ద్వారా గానీ సమర్పించవచ్చు.
-అభ్యర్ధి నామినేషన్తో పాటు తమ పేరిట కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించాలి.
-2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు.
-నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయి.
-అభ్యర్ధితో సహా ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్లోకి ప్రవేశించవచ్చు.
-నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
-అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు.
-సువిధ యాప్ ద్వారా నామినేషన్లను దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, వాటి కాపీలను భౌతికంగా ఆర్ఓకు అందజేయాల్సి ఉంటుంది.
-ఫారమ్-26 ద్వారా తన అఫడవిట్ను సమర్పించాలి.
-ఫారమ్ 26 స్టాంప్ పేపర్ యొక్క విలువ రూ. 10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
-భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకుంటే “e స్టాంప్” కూడా ఉపయోగించవచ్చు.
-అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఎన్నికల ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
-పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుంది.
ఎన్నికల ప్రక్రియ షెడ్యూలులో ముఖ్యమైన తేదీలు:
-గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ: 18 ఏప్రిల్ 2024 (గురువారం)
-గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది.
– ఏప్రియల్ 21 ఆదివారం ప్రభుత్వ సెలవు రోజున నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండదు
-నామినేషన్లు వేయడానికి చివరి తేదీ : 25 ఏప్రిల్ 2024 (గురువారం)
-నామినేషన్ల పరిశీలన తేదీ: 26 ఏప్రిల్ 2024 (శుక్రవారం)
-అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: 29 ఏప్రిల్ 2024 (సోమవారం)
-పోల్ తేదీ: 13 మే 2024 (సోమవారం)
-కౌంటింగ్ తేదీ : 04 జూన్ 2024 (మంగళవారం)
-ఎన్నికలు ప్రక్రియ ముగిసే తేదీ : 06 జూన్ 2024 (గురువారం)