ప్రధాని మోదీ కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లో ప్రచారం సాగించారు. కేరళ లోని పాలక్కాడులో నిర్వహించిన భారీ రోడ్షోలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈసారి కేరళలో బీజేపీ బోణీ కొట్టడం ఖాయమన్నారు మోదీ. అనంతరం తమిళనాడులోని సేలంలో జరిగిన ఎన్డీఏ కూటమి సభకు హాజరయ్యారు మోదీ. ఈ సభలో మాజీ సీఎం పన్నీర్ సెల్వం , టీటీవీ దినకరన్, అన్బుమణి రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 130 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తమిళనాడులో 39, కర్ణాటక 28, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉండగా తెలంగాణలో 17, కేరళలో 20 ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో కనీసం 50 నుంచి 60 సీట్లు సాధించాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏకి 50-60 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల కోసం ఎన్డీఏ వ్యూహం, ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలు, బహిరంగ సభలను కూడా ఎంపిక చేశారు.