బీఆర్ఎస్ ఉద్యమం నుంచి వచ్చింది.. ఒక ఎమ్మెల్యే నో, ఎంపీనో పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదన్నారు. దళిత బంధు పథకం చాలా మంచిది అని కానీ దళితబంధు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది మనకు ఓట్లు వేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది అని.. వాటిని నమ్మి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలలకే గ్రామాల్లో ప్రజలు మూతి విరుస్తున్నారు.
మిషన్ భగీరథ, దళిత బంధు, రైతు బంధు లాంటి పథకాలు సరిగ్గా ప్రజలకు అందడం లేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయ్యాడని అతనికి భవిష్యత్లో కూడా పార్టీలో స్థానం ఉంటుంది అన్నారు. రెండు, మూడు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటిస్తాం అన్నారు. రాబోయే రోజుల్లో 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తిరుతుందని జోస్యం చెప్పారు కేసీఆర్.