ఎన్నికలలో సర్వేల పేర్లతో అనేక సంస్థలు పుట్టుకు వస్తాయ్. తగిన వనరులు లేకుండానే వేలాది మందిని సర్వే చేసినట్లు ప్రచారం చేసుకుంటూ.. ఆర్ధిక లబ్ది కోసం కొన్ని రాజకీయ పక్షాలకు కొమ్ము కాయడం సాధారణమైన అంశం. మెయిన్ స్ట్రీమ్ పత్రికలూ, ఛానల్స్ కూడా ఈ పని చేస్తున్నపుడు ఆయా మీడియా సంస్థలలో పనిచేసి బయటకు వచ్చి ఏవేవో సంస్థలు పెట్టుకుని సంపాదించుకోవడం తప్పేలా అవుతుంది? అన్న భావనతో కొందరు సంస్థలు పెట్టుకుంటున్నారు. ఈజీ మనీ కోసం ఎవరికీ వారు చేసుకునే పనులు ఎవరినీ తప్పుపట్టలేం..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలోను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలోను వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోతున్నారట….
రేస్ సంస్థ మూడో దఫా సర్వే లో ఈ సంచలన విషయాన్ని విడుదల చేశారట. నిజమే.. వీళ్లిద్దరు ఓడిపోతే RACE సంస్థ ఎక్కడికో వెళ్ళిపోతుంది..
రేస్ సర్వే ప్రకారం … వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందట. 50.8 శాతం ఓట్లతో వైసీపీ 132 నుంచి 138 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుదట.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి… 37-42 స్థానాలకే పరిమితం అవుతుందట. టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరూ ఓడిపోయే పరిస్థితి వస్తే… 37-42 సీట్లు కూడా కూటమికి వచ్చే పరిస్థితి ఉంటుందా? అనేది చర్చ.
రేస్. సంస్థ వైసీపీ కోసం పెట్టుకున్న సంస్థ. ఆ సంస్థ సర్వేలు, విశ్లేషణలు ఎన్నికల తర్వాత ఓ సారి బేరీజు వేసుకుంటా0.. అని టీడీపీకి చెందిన రాష్ట్ర స్థాయి కీలక నేత ఒకరు చెపుతున్నారు. మరికొందరు.. ఇలాంటి సర్వేలను పట్టించుకునే తీరిక తమకు లేదంటున్నారు. అయితే 2024 ఏప్రిల్ 17వ తేదీన విడుదల చేసిన సర్వ్ ప్రకారం.. కూటమి ఘోర పరాజయం చెందుతుందని రేస్ చెపుతోంది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రేస్ (RACE — Research Associates & Consultants of Electioneering ) అనే సంస్థ (చట్టప్రకారం రిజిస్ట్రేషన్స్ ఉన్నవో లేదో తెలియదు) ఇప్పటి వరకు మూడు దఫాలు సర్వేలు నిర్వహించినట్లు చెపుతున్నారు. ABN వంటి చానల్స్ లో పనిచేసిన వై నరసింహారావు ‘జర్నలిస్ట్ YNR’ పేరుతొ పెట్టిన యు ట్యూబ్ ఛానల్ లో ఈ రేస్ సర్వే నివేదికలు ఇస్తూ ఉంటారు. రేస్ సంస్థ కూడా YNR సోదరుడిదే అని మీడియా వర్గాల సమాచారం.