మలయాళ సినిమాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు అక్కడ స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే లభించే వసూళ్లు, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు రాబడుతున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో తాజాగా ‘మంజుమ్మెల్ బాయ్స్ ‘ చేరిపోయింది. ఫిబ్రవరి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సౌబిన్ షాహిర్ .. బాబు షాహిర్ .. షావన్ ఆంటోని నిర్మించిన ఈ సినిమాకి చిదంబరం దర్శకత్వం వహించాడు. 2006లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథ తెరకెక్కింది. 20కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 200 కోట్ల మార్క్ ను టచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మైత్రీ మూవీస్ వారు తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 29న ఇక్కడి థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.