తాజాగా ఇజ్రాయెల్.. ఇరాన్ లోని 9 చోట్ల మిస్సైల్స్ తో దాడి చేసింది.
ఇరాన్ లోని ఇస్ఫహాన్ (Isfahan) నగరంలో ఉన్న ఎయిర్ బేస్ మీద డ్రోన్లు, మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడి చేసినట్లు
ఇస్ఫాహన్ నగర శివార్లలో ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కూడా ఉంది కానీ దాని మీద దాడి జరిగిందా లేదా అనే దానిపై సందిగ్తట నెలకొంది.
అమెరికన్ వార్తా సంస్థ ABC NEWS మొదటగా దాడి విషయం వెళ్లడించగా తాజాగా ఇరాన్ అధికార వార్త సంస్థ ఇర్నా (IRNA) ఇజ్రాయెల్ దాడి విషయం వెల్లడించింది.
మరో ఇరాన్ వార్తా సంస్థ అయిన ఫార్స్ (FARS) మాత్రం ఇస్ఫాహాన్, షిరాజ్, టెహ్రాన్ ఎయిర్పోర్ట్ సమీపంలో పెద్ద శబ్దాలు వినిపించాయి అని పేర్కొంది.
అయితే ఇజ్రాయెల్ కి చెందిన వార్తా సంస్థలు మాత్రం ఎలాంటి కథనాలు ప్రచురించలేదు.
మరోవైపు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రపంచ దేశాలలో ఉన్న తమ రాయబార కార్యాయాలకి ఒక సందేశం పంపిస్తూ ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడుల గురుంచి ఎలాంటి వ్యాఖ్యలు కానీ మీడియా సమావేశాలు నిర్వహించవద్దని కోరింది!
అఫ్కోర్స్ అమెరికా వత్తిడితో పాటు ఇజ్రాయెల్ భయాలు ఇజ్రాయెల్ కి ఉన్నాయి.
అందుకే ముందస్తు ప్రకటన చేయకుండా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తున్నది!
రెండ్రోజుల క్రితం ఇజ్రాయెల్ చేసిన దాడి కేవలం ఏదో మేము కూడా ఎదురు దాడి చేసాము అన్నట్లుగా ఉంది తప్పితే ఇజ్రాయెల్ దాడి వల్ల ఇరాన్ కి పెద్ద నష్టం కలిగినట్లుగా లేదు.
ఇస్ఫహాన్ నగర ఎయిర్ బేస్ మీద చేసిన దాడి వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఇజ్రాయెల్ కీ?
Isfahan ఎయిర్ బేస్ లో ఉన్నవి F-14 టామ్ క్యాట్ జెట్ ఫైటర్స్ మాత్రమే!
వాటిని ధ్వంసం చేయడం వల్ల ఎవరికి లాభం?
ఎవరికీ లాభం లేదు నష్టం లేదు.
1975 లో ఇరాన్ కి అమెరికా కి సంబంధాలు బాగా ఉన్న సమయంలో అమెరికా అప్పట్లో అధునాతన టెక్నాలజీ కలిగి ఉన్న F-14 Tomcat ఫైటర్ జెట్ లని అమ్మింది.
1979 లో ఆయుతొల్ల ఖోమెనీ తిరుగుబాటు చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గా ప్రకటించాక అమెరికాతో సంబంధాలు క్షీణించాయి.
అదే సంవత్సరంలో ఇరాన్ లోని అమెరికన్ రాయబార కార్యాలయ సిబ్బందిని బందీలుగా చేశాడు ఖోమేనీ దాంతో అమెరికాతో ఇరాన్ కి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి .