వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఖాతాలోకి మరో కొత్త బిజినెస్ చేరనుంది. ప్రముఖ ఐకానిక్ క్యాండీ కంపెనీ ‘రావల్ గావ్ షుగర్ ఫామ్’ను కొనుగోలు చేయనున్నారు. అందుకు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూ.27 కోట్ల డీల్ కుదుర్చుకుంది. మాంగో మూడ్, కాఫీ బ్రేక్, టట్టీ ఫ్రూటీ, పాన్ పసంద్, చాకోక్రీమ్, సుప్రీం వంటి ఉత్పత్తలకు ప్రసిద్ధి చెందిన రావల్ గావ్ షుగర్ ఫామ్ తన అన్ని హక్కులను రిలయన్స్ కు విక్రయించి నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది.
కొంతకాలంగా ఆ కంపెనీ నష్టాల బాట పట్టింది. దీంతో వ్యాపారాన్ని కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. అందుకే ఈ డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం.