”2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. ఐదేళ్ల అరాచక పాలనకు చమరగీతం పాడబోతున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధిలేమి, ప్రతిపక్ష నేతలు, ప్రజాసంఘాల నేతలపై దాడులు,.. అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రా జనం .. జగన్మోహన్ రెడ్డి ..వైసీపీ సర్కార్ ను సాగనంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్.”
2024 లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఎన్నెన్ని సీట్లు గెలవబోతున్నారు..>> అనే దానిపై ప్రముఖ తెలుగు వెబ్ పోర్టల్ ”అభి న్యూస్” నెల రోజుల పాటు నిర్వహించిన సర్వేలో టీడీపీ కూటమి విజయబావుటా ఎగరవేయనున్నట్లు తేటతెల్లమయింది.
మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 118 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోనున్నట్లు ”ఓటర్ నాడి” సర్వే వెల్లడి చేసింది. వైసీపీ అభ్యర్థులు 35 చోట్ల గెలవబోతున్నారు. 22 స్థానాలలో కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. జిల్లాల వారీగా సర్వేలో స్పష్టమైన వివరాలు ‘అభిన్యూస్’ పాఠకుల కోసం ప్రత్యేకం…
- ఉమ్మడి జిల్లాల వారీగా సర్వే వివరాలు
”అభిన్యూస్” తెలుగు ప్రజలకు సుపరిచితమైన డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్. విశేష జనాదరణ ఉన్న అభిన్యూస్ ” ఓటర్ నాడి” పేరుతో 2024 మార్చి 12 నుంచి 2024 ఏప్రిల్ 14 వ తేదీ వరకు నిర్వహించిన సర్వే (సుమారు నెల రోజులు) లో వెల్లడైన అంశాలను విశ్లేషించి ఇస్తున్న లెక్కలు ఇవి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఓటర్ అభిప్రాయంలో కొన్ని మార్పులు వస్తాయ్. మరోమారు సర్వే చేసి మరో విశ్లేషణాత్మక కధనం అందిస్తాం.