ఆంధ్రప్రదేశ్ కి అత్యంత కీలక పరిశ్రమ అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భూములు, ఆస్తుల విషయంలో యధాస్థితిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. విశాఖ స్టిల్స్ ప్రయివేట్ చేయాలని చుసిన కేంద్రంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భూములు, యంత్రాలు, ఇతర ఆస్తులు విక్రయించబోమంటూ సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ చెప్పిన విషయాలని కోర్ట్ నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 100 శాతం పెట్టుబడులను మాత్రమే ఉప సంహరిస్తున్నామని సొలిసిటర్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 19 కి వాయిదా వేసింది.
ఈ పిటిషన్ వేసిన వారిలో కె ఏ పాల్ తో పాటు మాజీ ఐపిఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.