మరో నయా బిజినెస్ లోకి అడుగు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పతంజలి యోగా రాందేవ్ బాబా కొత్త అవతారం ఎత్తనున్నారు. యోగాతో ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేసుకున్న ఆయన ఇప్పుడు మరో కొత్త బిజినెస్ లో అడుగు పెట్టడం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇప్పటికే యోగాతో పాటు అనేక ఆయుర్వేద ఉత్పత్తులతో అగ్రగామిగా నిలవడం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఆయన ఈ కొత్త వ్యాపారంలో కూడా తనదైన మార్కును వేస్తారని అంతటా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది సాఫ్ట్ వేర్ రంగం. రోజురోజుకూ దాని ప్రభావం పెరగడం మనం చూస్తునే ఉన్నాం. భవిష్యుత్తులో టెక్ రంగం మరింతంగా అభివృద్ధిచెందే అవకాశం చాలానే ఉంది. అందుకే రాందేవ్ బాబా సాఫ్ట్వ్ వేర్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఆ రంగంలో అనుకోదగ్గ దిగ్గజంగా మారే అవకాశం ఉందనేది అందరూ భావిస్తున్న అంశం.
అప్పుల్లో కూరుకుపోయిన ‘రోల్డా’ ఇండియా కంపెనీని యోగా గురు రాందేవ్ బాబా రూ.830 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని సొంతం చేసుకోడానికి ముందుకు వచ్చారు. ఆ కంపెనీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇటీవల నిర్వహించిన వేలం పాటలో పతంజలి అత్యధిక బిడ్ ను కోడ్ చేసింది.
కమల్ సింగ్ 1989లో రోల్డా ఇండియా అనే సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపించారు. అది ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, జియోగ్రాఫిక్ డేటా, ఇన్ఫర్ మేషన్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలందిస్తోంది. అయితే ఈ కంపెనీ 2023 జనవరిలో దివాలా తీసినట్టు ప్రకటించారు. వివిధ సంస్థలకు వేల కోట్లలో బాకీ పడింది. యూనియన్ బ్యాంక్ కన్సార్టియం, అసురక్షిత విదేశీ బాండ్ హోల్డర్ లు లాంటి కంపెనీలు మొత్తం రూ.14వేల కొట్ల అప్పుల్లో మునిగిపోయింది.
ఈ నేపథ్యంలో జరిగిన వేలం పాటలో పతంజలి అత్యధఇక బిడ్ ను కోడ్ చేసింది. రూ.820 నుంచి రూ.830 కోట్లు ఉన్నట్టు సమాచారం.టేక్ ఓవర్ చేసుకొనే చర్యలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలు పూర్తయితే యోగా గురు రాందేవ్ బాబా టెక్ రంగంలోకి అడుగుపెట్టినట్టే..