శాఖాహారం మాత్రమే..
మాంసాహారం నిషిద్ధం
15కిలోమీటర్ల వరకు నిబంధనలు
అయోధ్యలో బాల్ రామక్ ప్రతిష్ఠ అనంతరం ఆ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. అయితే అక్కడ కేఎఫ్సీ అవుట్ లెట్ ప్రారంభం అవుతందనే వార్తలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కేఎఫ్ సీ అనగానే నాన్వెజ్ తినేవాళ్ల నోళ్లలో నీళ్లూరతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోట అవుట్లెట్లు కలిగిన ఆ సంస్థ త్వరలో అయోధ్యలోనూ దుకాణం తెరవబోతున్నట్టు సమాచారం. దానిపై అయోధ్య జిల్లా యంత్రాంగం కూడా స్పందించింది. ఆ ప్రాంతంలో మాంసాహార విక్రయాలపై నిషేధం ఉందని స్పష్టం చేసింది. కావాలంటే శాకాహార పదార్థాలు అమ్ముకోవచ్చని తెలిపింది.
కేఎఫ్ సీ రాకను ఆహ్వానిస్తున్నామని అయోధ్య జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ తెలిపారు. అయితే నిషేధిత ప్రాంతంలో శాకాహార పదార్థాలు మాత్రమే విక్రయించాలని చెప్పారు. మాంసాహార పదార్థాల విక్రయం, వినియోగాన్ని రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముందే యోగి ప్రభుత్వం నిషేధించింది. అయోధ్యకు 15 కిలోమీటర్ల పరిధి తర్వాత ఈ నిబంధనలేవీ వర్తించవని స్పష్టం చేశారు.