”జగన్మోహన్ రెడ్డి జైలు శిక్ష అనుభవించడం, , షర్మిల పాదయాత్ర.. విజయమ్మ సభలు, వివేకానంద్ రెడ్డి హత్య, కోడికత్తి డ్రామా.. వీటితో పాటు చంద్రబాబు అధికారంలో ఉండగా.. ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీల మితిమీరిన ఆగడాలు.. ఇలా పలు అంశాలు 2019లో జగ్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డాయి.”
2024 ఎన్నికలలో సంక్షేమ పధకాలు గట్టెక్కిస్తాయని కొంత నమ్మకంగా ఉన్న జగన్ అండ్ కో.. వాటికితోడు కొన్ని జిమ్మిక్కులనూ నమ్ముకున్నట్లు తెలుస్తోంది.
వ్యూహాలైనా, పథకాలైనా రాజకీయాల్లో అస్తమానూ ఉపయోగపడవు. ఒక్కసారే ఉపయోగపడతాయి. ఒక ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్నే మరో ఎన్నికలో కూడా అమలు చేస్తే ఫలితాలు వ్యతిరేఖంగా వస్తాయ్న్ని. ప్రజలను ఆకర్షించే పథకాలు కూడా అంతే! అమలులో ఉన్న పథకాలను తమ హక్కుగా ప్రజలు భావిస్తారు. 2019 ఎన్నికల్లో బాబాయ్ హత్య, కోడి కత్తి కేసు జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డాయి. ప్రస్తుత ఎన్నికల్లో అదే బాబాయ్ హత్య కేసు ఆయనకు రాజకీయంగా ఎంతో కొంత నష్టం కలిగించబోతోంది. వైసీపీ నాయకుడు ఒకరు కడప న్యాయస్థానాన్ని ఆశ్రయించి బాబాయ్ హత్య కేసు గురించి డాక్టర్ సునీత, వైఎస్ షర్మిలతో పాటు ప్రతిపక్ష నాయకులు ఎవరూ ఆరోపణలు చేయకుండా స్టే తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానం తన పరిధిని అతిక్రమించిందని న్యాయనిపుణులు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
పది రోజుల క్రితం విజయవాడలో బస్సుయాత్ర సందర్భంగా జనంలో నుంచి చిన్న రాయి విసరగా అది తగిలి జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పైన స్వల్పంగా గాయమైంది. అంతే… ముఖ్యమంత్రిని హత్య చేయడానికి చంద్రబాబు అండ్ కో కుట్ర పన్నారని వైసీపీ నాయకులు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. కుట్లు వేయాలంటే గాయం లోతుగా ఉండాలి. కానీ వేసినట్లు చెప్పుకున్నారు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ను వైద్యుల బృందం విజయవంతంగా నిర్వహించినట్టు ఫొటోలు దిగి పబ్లిసిటీ చేసుకున్నారు. కోడి కత్తి ఘటన సందర్భంగా ఇలాగే కుట్లు వేశామని చెప్పుకొన్న వైద్యుడికి జగన్ ప్రభుత్వంలో పదవి కట్టబెట్టారు.
గులకరాయి సానుభూతి కూడా ఈ ఎన్నికలలో ఎంతోకొంత ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. సంక్షేమ పధకాలు తమను గెలిపిస్తాయని భవిస్తూనే,, ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టడానికి కూడా జగన్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీయే పరిధిలో ఏకంగా ఒకో కుటుంబానికి 50 వేల నగదు పంపిణీ చేస్తారని కూడా విస్తృత ప్రచారం జరుగుతోంది. అలాగే వైసీపీ కీలక నేతలు పోటీలో ఉన్న కొన్ని చోట్ల ఓటుకి 5-10 వేలు కూడా ఇస్తారన్న ప్రచారము కూడా సాగుతోంది. అయితే జనం ఈ ప్రలోభాలకు ఏ మేరకు ప్రభావితం అవుతారో వేచి చూడాలి. తమ, పిల్లల భవిష్యతు గురించి ఆలోచిస్తారా,, తాత్కాలిక ప్రయోజనాల కోసం దీర్ఘ కాలిక భవిష్యత్తును తాకట్టుపెట్టుకుంటారా? అనేది మరి కొంత కాలం వెయిట్ చేస్తే కానీ తెలియదు.