”వాలంటీర్లను నగదు పంపిణీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఫించన్ల పంపణీపై తాజాగా ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది..”
ఇంటింటికీ పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ పంపిణీ కుదరని పక్షంలో.. డీబీటీల రూపంలో చెల్లించాలని సీఎస్ను ఈసీ ఆదేశించింది. కాగా.. ఇంటి వద్ద పెన్షన్ల పంపిణీ కుదరదని ఈసీకి తెలిపిన సీఎస్.. ఏప్రిల్లో చేసినట్లే చేస్తామని వెల్లడించారు. దీంతో తాజాగా క్లియర్ కట్గా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి- 30న జారీ చేసిన విషయాన్ని ఈసీ గుర్తు చేసింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్కు తేల్చిచెప్పింది. దీంతో పాటు.. పెన్షన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అయితే ఎక్కడా వలంటీర్లను వాడుకోవద్దని.. ప్రత్యామ్నాయంగా మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని సీఎస్ను ఎన్నికల సంఘం ఆదేశించింది. ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఎన్నికల కమిషన్.. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.