ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హామీలు ప్రకటించని ప్రధాని
చంద్రబాబును పొగడం – ప్రసంగం తెలుగులో ప్రారంభించడం.. ఇవే మోడీ చేసినవి
ఆంధ్రుల రాజధాని అమరావతికి ఎన్నో వరాలు ప్రకటిస్తారు.. అని మోడీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. హామీల మాటల ఉన్నా.. ‘అమరావతికి చట్టబద్దత ‘ అంశంపై కూడా మోడీ పెదవి విప్పలేదు . కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ . … మోడీ సభకు ఒకరోజు ముందు అమరావతి చట్టబద్దత అంశం పరిశీలిస్తాం . . అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు . అమరావతి రైతులు చంద్రబాబుకు చేసిన విజ్ఞప్తి కూడా చట్టబద్దత . దీనిపై ప్రధానితో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు . అయితే మోడీ మాత్రం దీనిపై ప్రస్తావించకుండా దాటవేశారు .
పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని , అమరావతికి సహకారం అందిస్తామని మాత్రమే చెప్పారు మోడీ . ..
జగన్ భయం ఎలా పోగొడతారు బాబు గారూ.. టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు . 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి . .. అమరావతి రాజధాని కాదని , , మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చి గందరగోళంలో పడేసారు . అమరావతి కోసం భూములిచ్చిన 29 వేలమంది రైతులు రోడ్డెక్కారు . దేశంలోనే అత్యంత అరుదైన ఉద్యమం చేసారు .
మరోమారు జగన్ అధికారంలోకి రారన్న భరోసా ఇస్తారా ? అంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సైతం చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , లోకేష్ లను అడుగుతున్నారు . జగన్ వస్తే . .. భారీ పెట్టుబడులు పెట్టిన మాకు భరోసా ఏమిటి ? అంటూ ఇప్పటికే కీలకమైన పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరక్క వారు వేరే రాష్ట్రాల వైపు ద్రుష్టి సారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్ .
ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ
- తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
- దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్న ప్రధాని
- ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా: ప్రధాని
- ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ
- దాదాపు 60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా: ప్రధాని
- ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్కు బలమైన పునాదులు: ప్రధాని
- చంద్రబాబు, పవన్కల్యాణ్కు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
- అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
- రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
- రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
- రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన
- ప్రధాని సభకు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన లక్షలమంది ప్రజలు
- సరైన సమయంలో సరైన నేత … : సీఎం చంద్రబాబు
- ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు: సీఎం చంద్రబాబు
- గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు: సీఎం చంద్రబాబు
- గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి: సీఎం
- పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారు: సీఎం
- మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం: సీఎం
- గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు: సీఎం
- ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారు: సీఎం
- ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
- మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
- మోదీజీ మేమంతా మీకు అండగా ఉన్నాం: సీఎం
- ప్రజలతోనూ వందేమాతరం, భారత్మాతాకి జై నినాదాలు చేయించిన సీఎం
- సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారు: సీఎం
- ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు: సీఎం
- మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ: సీఎం
- ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానానికి ఎదిగింది: సీఎం
- త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది: సీఎం
- 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది: సీఎం
- ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోదీ కృషిచేస్తున్నారు: సీఎం
- దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు
- మోదీ నాయకత్వంలో భారత్.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది: సీఎం
- కూటమిగా పోటీచేయడంతో 93 శాతం స్ట్రైక్రేట్తో విజయం సాధించాం: సీఎం
- వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం: సీఎం
- కేంద్ర సాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: సీఎం
- దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది: పవన్ కల్యాణ్
- ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు: పవన్ కల్యాణ్
- రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: పవన్ కల్యాణ్
- అమరావతి రైతుల త్యాగాలను మరచిపోము: పవన్ కల్యాణ్
- అమరావతి రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటాం: పవన్ కల్యాణ్
- రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం: పవన్ కల్యాణ్
నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్
- ఒక్క పాకిస్థాన్ కాదు వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్ను ఏమీచేయలేరు: మంత్రి లోకేశ్
- భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు: మంత్రి లోకేశ్
- భారత్ వద్ద మోదీ అనే మిసైల్ ఉంది: మంత్రి లోకేశ్
- నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్
- మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం: లోకేశ్
- ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారు : లోకేశ్
- మోదీ, బాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు: లోకేశ్
- 2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు: లోకేశ్
- రాజధాని కూడా లేకుండానే విడిపోయాం: లోకేశ్
- చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు: లోకేశ్
- చంద్రబాబుపై కోపంతో అమరావతిని పక్కనబెట్టారు: లోకేశ