ఇంధన బ్యాన్ ఎఫెక్ట్- రూ.70 లక్షల కారు రూ.10 లక్షలకే
‘న్యూ పాలసీ’ ఎఫెక్ట్తో లగ్జరీ కార్లను సైతం తక్కువ ధరకు అమ్మేస్తున్న దిల్లీ వాసులు
”పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలు , 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిషేధం.” అంటూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో . .. గడువు తీరిన కార్లను నామమాత్రపు ధరలకు అమ్మకానికి పెడుతున్నారు.
దేశ రాజధాని దిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహన పాలసీ ఎఫెక్ట్తో ఎంతోమంది ఇప్పటికే కార్లను కారుచౌకగా అమ్మేశారు.
దిల్లీ వాస్తవ్యుడు నితిన్ గోయల్ రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్ను రూ.8 లక్షలకే అమ్మేశారు. రూ.40 లక్షల మెర్సిడెజ్ సీ క్లాస్ 220 సీడీఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూ.4 లక్షలకే అమ్మారు. దిల్లీకే చెందిన రితేశ్ గందోత్ర రూ.55 లక్షల లగ్జరీ ఎస్యూవీ కారును నామమాత్రపు రేటుకు విక్రయించారు. వాహన పాలసీపై దిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ సర్కారు పునరాలోచనలో పడింది. త్వరలోనే కొత్త వాహన పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తును మొదలుపెట్టింది. ఈ పనేదో కొన్ని నెలల ముందే మొదలుపెట్టి ఉంటే తాము కార్లను చౌకగా అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని బాధిత వాహనదారులు వాపోతున్నారు.
ఎన్జీటీ ఆదేశాలు అమల్లోకి- వాహనదారులకు చుక్కలు దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కీలక ఆదేశాలిచ్చింది. పదేళ్లకుపైగా వినియోగించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకుపైగా వినియోగించిన పెట్రోలు వాహనాలను దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతించరాదని నిర్దేశించింది. ఆ ఆదేశాలను తదుపరిగా సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనదారులకు డెడ్లైన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్జీటీ ఆదేశాల అమలులో భాగంగానే జులై 1 నుంచి గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంధనమే పోయనప్పుడు కార్లను మాత్రం ఏం చేసుకుంటామని చాలామంది వాహనదారులు భావించారు. వారంతా తమ వాహనాలను తక్కువ రేట్లకే దిల్లీ అవతలి వ్యక్తులకు అమ్ముకున్నారు. అయితే దీనిపై వ్యతికేత వ్యక్తం కావడంతో సర్కారు మళ్లీ పునరాలోచనలో పడింది.
వీలైనంత త్వరగా ఒక పరిష్కారం చూపిస్తాం : దిల్లీ సర్కారు కాలం చెల్లిన పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఇంధనం పోయకూడదనే నిర్ణయంపై దిల్లీ సర్కార్ వెనుకడుగు వేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని సాధించే దిశగా కసరత్తు చేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం రోజున ఈ అంశంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM)కి దిల్లీ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరింది.
బ్యాన్తో ఇబ్బందిపడుతున్న జనం గడువు తీరిన వాహనాలకు ఇంధనం కొట్టకుండా డిల్హే సర్కార్ తీసుకువచ్చిన పాలసీతో ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్ విధించడం సరికాదని, దాని అమలులో సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బ్యాన్తో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ఆయా వాహనాలపై బ్యాన్ను వెంటనే అమల్లోకి తేవాలనేది అపరిపక్వ నిర్ణయమని మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. కొంత గడువు ఇచ్చిన తర్వాత బ్యాన్ చేయడం కరెక్ట్ అంటూ పలు వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది .
వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి – టీడీపీ – వైసీపీ రాజకీయ క్రీడ
ఒక నాయకుడి కారు కింద పది కార్యకర్త చనిపోతే కారు సదరు నాయకుడిపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం > >> అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు . అయితే సింగయ్య కారుకిందపడినడిపుడు . .. కారు ఆపి అతన్ని ఆసుపత్రికి తీసుకువెళితే ఎలాంటి విమర్శలు వచ్చేవి కావు . కానీ చావు బతుకుల మధ్య ఉన్న సింగయ్యను పక్కనపడేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు . సకాలంలో వైద్యం అందక సింగయ్య చనిపోయాడు .
ఒక కార్యక్రమంలో జగన్ ని చూసేందుకు వచ్చి జగన్ కారు కిందపడి మరణించిన సింగయ్య కుటుంబాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించుకుని పరామర్శించారు . సింగయ్య కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం వార్తలలో నిలిచింది. పైకి చూస్తే, ఇది ఒక ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునే మానవతా దృక్పథంతో కూడిన చర్యగా కనిపిస్తుంది. నాగరిక సమాజంలో పలకరింపు, పరామర్శ, ఓదార్పు అనేవి మానవత్వానికి ప్రతీకలు. అయితే, ఈ సంఘటనను కేవలం మానవతా కోణంలోనే కాకుండా, దాని వెనుక ఉన్న పోలీసు కేసు, నైతిక బాధ్యతల నేపథ్యంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
సింగయ్య మరణానికి కారణమైన ప్రమాదంపై నమోదైన కేసులో జగన్ రెండవ ముద్దాయి (A2). కారు కింద పడిన వ్యక్తిని పట్టించుకోకుండా, పక్కకు లాగి ముందుకు సాగిపోవడం “ఉద్దేశం లేని హత్య” (Culpable Homicide not amounting to Murder) కిందకు వస్తుందని, వాహన యజమానిగా ఈ విషయం తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం నేరమని పోలీసులు అభియోగం మోపారు.
జగన్ పై చర్యలు వద్దన్నారు . . సరే.. పిలిపించుకుని మాట్లాడటం సబబేనా?
ఈ అభియోగాన్ని కేసును పూర్తిగా కొట్టివేయాలని (క్వాష్ చేయాలని) జగన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ, న్యాయమూర్తి “తొందరపాటు చర్యలు తీసుకోవద్దు” అని పోలీసులను ఆదేశించారు. దీని అంతరార్థం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జగన్ను అరెస్టు చేయరాదని! అయితే, అతడిని విచారించవచ్చో లేదో అనే విషయంలో స్పష్టత లోపించింది. చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టే, ఏమి చేయకూడదో ముద్దాయికి కూడా ఆదేశాలు ఇవ్వడం సహజ న్యాయం కదా! దీన్నే ఊళ్ళలో ఏమీ చదువుకోని వారు కూడా “తల్లీ బిడ్డల న్యాయం” అంటారు. సమధర్మాన్ని సూచించే తల్లీబిడ్డల న్యాయం కోర్టులో కూడా కనబడాలి కదా!
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సాధారణంగా ఏదైనా కేసులో, ముద్దాయి సాక్షులను లేదా బాధితులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే, ప్రాసిక్యూషన్ బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది న్యాయ ప్రక్రియలో ఒక ప్రాథమిక సూత్రం. జగన్ విషయంలో, ఆయన ఇంకా కేసు నుండి బయటపడలేదు. న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటించలేదు. అలాంటి సున్నితమైన దశలో, కేసులో బాధితులైన సింగయ్య కుటుంబాన్ని ఏకంగా తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం?
ఈ ప్రాథమిక విషయాన్ని విస్మరించి, బాధితులతో సమావేశమవడం న్యాయ సూత్రాల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇది బాధితులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో లేదా క్వాష్ పిటిషన్ విచారణలో ఉన్నప్పుడు, నిందితుడికి లభించిన తాత్కాలిక రక్షణను బాధితులను ప్రలోభపెట్టడానికో, ప్రభావితం చేయడానికో వాడుకోకూడదు.
న్యాయస్థానాలు చట్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. కానీ ఆ నిర్ణయాలు కేవలం సాంకేతికంగానే కాకుండా, న్యాయాన్ని అందించేవిగా, ధర్మాన్ని నిలబెట్టేవిగా ఉండాలి. చట్టం (Law): సమాజ క్రమానికి రూపొందించిన నియమాల సమాహారం. న్యాయం (Justice): ఆ చట్టం ద్వారా సాధించాల్సిన అంతిమ లక్ష్యం. ధర్మం (Dharma): చట్టం మరియు న్యాయానికి ఆత్మ వంటిది. ఇది నైతికత, నీతి, సామాజిక బాధ్యతలతో ముడిపడి ఉంటుంది.
సమాజాన్ని ప్రభావితం చేయగల రాజకీయ నాయకులు ఈ “ధర్మాన్ని” నిలబెట్టడంలో అత్యంత కీలకమైన బాధ్యత వహించాలి. వారి ప్రవర్తన సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలి. కానీ, ప్రస్తుత సంఘటనలో ఆ బాధ్యత కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కోర్టు ఆదేశాలు, తీర్పులను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులకు లభించే ఊరటలపై సామాన్యులలో సైతం చర్చ జరుగుతోంది. “పోలీసుల కాళ్లు కట్టేసి, దొంగతోపాటు పరుగెత్తమన్నట్లుంది తీర్పు,” లేదా “ఈ కోర్టులో ఇలాగే ఉంటుంది, పై కోర్టులో చూడాలి” వంటి వ్యాఖ్యలు ప్రజాబాహుళ్యంలో వినిపిస్తున్నాయంటే, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ “అప్డేటెడ్” ప్రజల అభిప్రాయాలను, వారిలోని నైతిక ఆక్రోశాన్ని న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
న్యాయవ్యవస్థ ప్రాథమికంగా చట్టానికి బాధ్యత వహిస్తుంది, కానీ ఆ చట్టాన్ని న్యాయాన్ని సాధించే సాధనంగా మాత్రమే ఉపయోగించాలి. ఈ మొత్తం ప్రక్రియ “ధర్మం” అనే ఉన్నతమైన నైతిక చట్రంలో జరిగినప్పుడే దానికి సార్థకత. రానురాను ఆ సమతూకం దెబ్బతినడమే నేటి అసలు విషాదం.
అయితే ఈ ఘటనలో జగన్మోహన్ రెడ్డి వైపు తప్పులేదంటూ తటస్థ వైఖరి ముసుగు వేసుకున్న కొందరు మేధావులు వాదిస్తున్నారు . ఒక మనిషిని కారు గుద్ది ప్రమాదంలో ఉంటె . .. అది తెలిసి కూడా వదిలేసి వెళ్లిపోవడం మానవత్వమా ? సదరు మేధావులు చెప్పాలి .
తమ ఆమోదం ఉండాలంటున్న చైనా – అవసరంలేదన్న బౌద్ధ గురువు
దలైలామా . .. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ గురువు. బౌద్ధంలో కీలక , చారిత్రక వ్యవహారాలపై ఆయన తీసుకునే నిర్ణయాలకు బౌద్ధ సమాజం మద్దతుగా నిలవడం ఆనవాయితీ. అయితే దలైలామా వారసుడి ఎంపికపై చైనా నిర్ణయంతో తాజాగా వివాదం నెలకొంది .
” నా వారసుడిని నిర్ణయించే అధికారం నాకు మాత్రమే ఉంది..” అంటూ బౌద్ధ మత గురువు దలైలామ చేసిన వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ”దలైలామా వారసుడి ఎంపిక వ్యవహారంలో తప్పనిసరిగా మా ఆమోదముద్ర ఉండాల్సిందే…” అని చైనా స్పష్టంగా పేర్కొంది. వారసుడి గుర్తింపు కార్యక్రమాన్ని చైనాలోనే పురాతన విధానాలను అనుసరించి నిర్వహించాలని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావోనింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు . దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది . టిబెట్ను గుప్పిట పెట్టుకోవడానికి తమ చెప్పుచేతల్లో ఉండే కీలుబొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ఎప్పటినుంచో ఉబలాటపడుతోంది.
దలైలామా పోస్టు తో ….
”15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది , దానిని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్కు మాత్రమే ఉంటుంది . ..” అని సోషల్ మీడియాలో దలైలామా పోస్టు చేశారు . ఈ వ్యాఖ్యలపై స్పందించిన చైనా వెంటనే విదేశాంగమంత్రితో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వాదనకు దిగింది . 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని చైనా వాదిస్తోంది. తను తదనంతరం (మరణించిన తర్వాతే) తన వారసుడు వస్తారని దలైలామా స్పష్టం చేశారు. 2015లో ఈ ట్రస్ట్ను దలైలామా ఏర్పాటు చేశారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా? అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్నివర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. స్పందించిన వారిలో టిబెట్ మతపెద్దలు, చైనాలోని వారు కూడా ఉన్నట్లు తేటతెల్లం చేసారు .
‘వారసుడి ఎంపిక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఉండాలి. 18వ శతాబ్దపు క్వింగ్ రాజవంశం ప్రారంభించిన ‘గోల్డెన్ అర్న్’ పద్ధతిని అనుసరించాల్సిందేనని మావో నింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా కూడా సంప్రదాయాలకు అనుగుణంగా ఎంపికైనప్పటికీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ అర్న్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2007లో గోల్డెన్ అర్న్ విధానాన్ని చైనా చట్టబద్ధం చేసింది. దీనిలో విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు జోక్యం చేసుకోకూడదనే నిబంధన ఉంటుంది’ అని మావోనింగ్ అన్నారు. అయితే, మావోనింగ్ దలైలామా వ్యాఖ్యలకు ఇచ్చిన స్పందన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార వెబ్సైట్లో ప్రచురితమైన ట్రాన్స్క్రిప్ట్లో లేకపోవడం గమనార్హం.
లివింగ్ బుద్ధా పునర్జన్మ ఆచారం 700 సంవత్సరాలకు పైగా కొనసాగుతోందని భారత్లోని చైనా రాయబారి సూఫెహాంగ్ అన్నారు. ‘దలైలామ కూడా మతపరమైన ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూనే ఎంపికయ్యారు. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛ విధానాన్ని అమలు చేస్తోంది. వారసుల ఎంపిక ప్రక్రియ కూడా చైనా చట్టాలు, మత సంప్రదాయాల ఆధారంగా మాత్రమే జరగాలి’ అని ద్వారా ఎక్స్ ద్వారా వెల్లడించారు.
కొత్త అధ్యక్షుల నియామకంతో మారనున్న రాజకీయ పరిణామాలు
బీజేపీ వ్యూహం వెనుక 2029 లక్ష్యం కనిపిస్తోందా ? ?
బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలకు పార్టీ కొత్త అధ్యక్షులను నియమించింది. దీంతో ఆ పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై రాజకీయ వర్గాల్లో తాజాగా వాడిగా వేడిగా చర్చ జరుగుతోంది.
కాషాయ పార్టీ మొదటినుంచీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక విషయంలో తనదైన విలక్షణతను చాటుకుంటోంది. పార్టీ బలపడేందుకు ఇతర పార్టీల్లో కీలక పదవుల్లో పనిచేసినవారిని పార్టీలోకి చేర్చుకున్నా వారిని అధ్యక్ష పదవుల్లో నియమించడం లేదు. తొలినుంచీ పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని మాత్రమే అందుకు ఎంచుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును, ఏపీ పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ ను ఎంపిక చేయడం దీనినే సూచిస్తోంది. పార్టీ కోసం కష్టపడేవారిని తప్పక గుర్తిస్తామని చాటుతూ పార్టీ క్యాడర్లో మొరాలిటీని పెంచేందుకు ఈ విధానం ఆపార్టీకి ఉపకరిస్తోంది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా..
తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీ నియమించిన అధ్యక్షులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగానే ఎంచుకుంది. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్నవారే. ఇక తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్ ది కూడా అదే సామాజికవర్గమన్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజికవర్గం మొదటినుంచీ అధికశాతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూవస్తోంది. ఇక సంఖ్యాప్రకారం తక్కువే ఐనా రాజకీయంగా ఆ ప్రాంతంలో గట్టి ప్రభావం చూపగల సత్తా వెలమలది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ను మరింత బలహీనపరచేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. వెలమలతో పాటు.. బీసీలు, ఇతర సామాజికవర్గాల మద్దతుతో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా..
వచ్చే ఎన్నికలనాటికి తెలంగాణలో అధికారం సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. కాళేశ్వరంలో అవినీతి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పాత్ర, ఫోన్ ట్యాపింగ్ అంశాలను ఆయుధంగా చేసుకుని సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోలేకపోతే అది తనకే మేలు చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఆ కారణంగానే కాంగ్రెస్ మీదే విమర్శల దాడిని పెంచుతోంది. ప్రజలపై ప్రభావం చూపే అంశాలపైన, క్షేత్రస్థాయి సమస్యలపైనా భారీ స్థాయిలో ప్రచారం, పోరాటం చేస్తూ ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని ప్రజలు భావించేలా పార్టీని బలోపేతం చేయడం. ఇందుకు అనుగుణంగా కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియాను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఏపీ విషయం తర్వాత చూసుకుందాం..
ఏపీలో ఇప్పటికిప్పుడు బలపడకపోయినా పరవాలేదు. అక్కడ తాను భాగస్వామిగా ఉన్న కూటమే అధికారంలో ఉంది. కనుక బీజేపీ అధిష్ఠానం ఏపీ కంటే తెలంగాణకు ప్రాధాన్యమిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ కారణంగానే ఏపీలో సీఎం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా భావించిన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ అనుమతులు నిరాకరించింది. ఒకవేళ ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రారంభించి ఉంటే తెలంగాణలో బీజేపీకి రాజకీయంగా నష్టమని ఆ పార్టీ భావించినట్టు విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే దీనిని ఆయుధంగా మలుచుకుని అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ లాభపడేందుకు ప్రయత్నిస్తాయని బీజేపీ భావించింది. ఇదే అంశంపై ఇప్పటికే ఆ పార్టీలు రెండూ ప్రాంతీయ సెంటిమెంట్ను రగిలించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు బీజేపీ ఆ అవకాశం లేకుండా చేసింది.
ఏపీలో “సైలెంట్ గ్రోత్ష మోడల్
నిజానికి 2024 ఎన్నికలకు కొద్దికాలం ముందుదాకా ఏపీలో బీజేపీ- టీడీపీ సంబంధాలు ఏమంత సజావుగా లేవు. నాటి వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరోక్ష మద్దతు ఉందన్న భావం జనంలో సైతం విస్తృతంగా ఉన్న సమయమది. టీడీపీ- బీజేపీ కలిసి నడవడం సాధ్యమేనా అన్న అభిప్రాయం ఉండేది. అయితే జనసేనాని పవన్కల్యాణ్ టీడీపీతో కలిసినడవాలని గట్టిగా నిర్ణయించుకోవడంతోపాటు మూడు పార్టీల కూటమి ఏర్పాటుకు గట్టిప్రయత్నం చేయడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో బీజేపీ పరిస్థితి తెలంగాణకు భిన్నంగా ఉంది. ఎన్డీఏ భాగస్వామిగా తిరుగులేని విజయం పొందినప్పటికీ, పార్టీకి అక్కడ మద్దతు స్వల్పమే. అందుకే పార్టీ బలోపేతానికి నెమ్మదిగా అడుగులు వేయాలనుకుంటోంది. భవిష్యత్తు నిర్మాణం పైన దృష్టి పెట్టిందని అర్థమవుతోంది.
పార్టీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కుటుంబం మొదటినుంచీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిఉంది. ఆయన తండ్రి కూడ ఆర్ఎస్ఎస్లో కీలకంగా పని చేశారు. మాధవ్ 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో అదే స్థానం నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన మాధవ్కు సౌమ్యుడిగా పేరుంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా మిత్రపక్షాలతో సమన్వయం, సంయమనం పాటిస్తూ సొంత పార్టీ బలోపేతానికి కృషి చేయగల సత్తా ఆయనకుందని బీజేపీ భావించడంతోనే ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అందించినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండవ విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులు , స్థానికులకు ఇచ్చే బెనిఫిట్స్ గురించి ప్రభుత్వం విధివిధానాలు వెల్లడించింది .
రాజధాని మలివిడత భూసమీకరణ నిబంధనలు విడుదల – ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూసమీకరణ నిబంధనలు-2025గా ప్రభుత్వ ఉత్తర్వులు
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతోపాటు ఇతర ఆవరసరాలకు సంబందించి భూ సేకరణ ప్రక్రియ మొదలెట్టారు . మేరకు సీఆర్డీఏ పరిధిలో రాబోయే రోజుల్లో చేయబోయే భూసమీకరణకు సంబంధించిన నిబంధనల్ని సర్కార్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 217 చదరపుకిలోమీటర్ల పరిధిలోని రాజధానికి మినహా, మిగతా సీఆర్డీఏ ప్రాంతం మొత్తానికి వర్తిస్తాయి. 2014లో ప్రకటించిన భూసమీకరణ నిబంధనల్నే దాదాపుగా సీఆర్డీఏ ప్రాంతానికీ వర్తింపజేస్తున్నారు. 28 గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీనే భవిష్యత్లో భూసమీకరణలో భూములిచ్చే రైతులకూ వర్తింపజేయబోతున్నారు.
పట్టా భూములకు మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్రతి ఎకరానికి 1000 గజాల నివాస, 250 చదరపు గజాల వాణిజ్య ప్లాట్ చొప్పున ఇస్తారు. జరీబు భూములకు ప్రతి ఎకరానికి 1000 చదరపు గజాల రెసిడెన్షియల్, 450 చదరపు గజాల కమర్షియల్ స్థలాలు ఇవ్వనున్నారు. వివిధ కేటగిరీల అసైన్డ్ భూములకు, అభ్యంతరంలేని, అభ్యంతరకర ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నవారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించారు.
తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000లు, జరీబు భూములకు ఎకరానికి రూ.50,000ల చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10 శాతం చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు, 1954 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత అసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. మిగతా కేటగిరీల భూములకు కౌలు వర్తించదు.
భూసమీకరణలో భూములిచ్చే రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ, పట్టాదారు పాస్పుస్తకం, టైటిల్డీడ్ ఉంటే కుటుంబానికి గరిష్ఠంగా లక్షన్నర వరకు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తారు. భూసమీకరణ పరిధిలోని గ్రామాల ప్రజలకు ఉచిత విద్య, వైద్య సదుపాయం కల్పిస్తారు. అవసరమైన చోట వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. అక్కడి ప్రజలకు ట్రాక్టర్లు, నిర్మాణరంగానికి ఉపయోగపడే యంత్రసామగ్రి ఉంటే ప్రభుత్వం లేదా సీఆర్డీఏ చేపట్టే ప్రాజెక్టుల్లో వాటిని వినియోగించుకుంటారు. వారికి అద్దెచెల్లిస్తారు. ప్రైవేట్ భూముల్లోని టేకు చెట్లు నరికి, విక్రయించుకునేందుకు ట్రాన్సిట్ పర్మిషన్ జారీ చేస్తారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడే నాటికే పంటలు ఉంటే ఫలసాయం తీసుకునేందుకు అనుమతిస్తారు.
కృష్ణా నది ఒడ్డు వెంబడి ఉన్న, 50 అడుగుల్లోపే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న, ఏడాది పొడవునా వివిధ రకాల పంటలు పండే వాటిని జరీబు భూములుగా పరిగణిస్తారు. మెట్ట భూములతో పోలిస్తే వాటి విలువ ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున, ప్రభుత్వం ఎక్కువ ప్యాకేజీ ఇస్తోంది. భూములిచ్చిన రైతులకు స్థలాల్ని భూసమీకరణ తుది నోటిఫికేషన్ వెలువడిన 12 నెలలకు అప్పగిస్తారు.
తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి రూ.30,000లు, జరీబు భూములకు ఎకరానికి రూ.50,000ల చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి ఏడాది నుంచి ఏటా 10 శాతం చొప్పున కౌలు మొత్తం పెరుగుతుంది. పట్టా భూములు, 1954 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత అసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది.
ఏమిటి? ఈ క్వాంటం వ్యాలీ హడావుడి. చంద్రబాబు నాయుడు తరచూ చెపుతున్న దీని గురించి చాలామందికి తెలియదు . గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ అంటుంటే కూడా చంద్రబాబు విజన్ ను అర్ధం చేసుకోకుండా కువిమర్శలు చేసిన వారి నోళ్లు మూయించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ హబ్ . క్వాంటం టెక్నాలజీలో పరిశోధన, ఇన్నొవేషన్ & స్కిల్స్ డెవలప్మెంట్కు ప్రపంచస్థాయి సెంటర్!
వీటి గురించి తెలుసుకుంటే … ఎవరైనా అడిగితె చెప్పడానికి ఉంటుంది . …
ఎందుకు?
– ఫ్యూచర్-రెడీ: క్వాంటం కంప్యూటర్లు వైద్యం, సెక్యూరిటీ, AIలో విప్లవం తెస్తాయి!
– ఆర్థిక పురోగతి: హై-టెక్ ఉద్యోగాలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షిస్తుంది.
– తెలుగు యువతకు క్వాంటం స్కిల్స్ శిక్షణ. ఇవన్నీ సవ్యంగా జరిగితే రానున్న ఐదారేళ్లలో . …
– “డిజిటల్ ఆంధ్ర” నిజం అవుతుంది!
క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ గురించి . .. సామన్య ప్రజలకు ఇదేంటో తెలుసుకోవడం కష్టమే. 90వ దశకంలో ఇలానే చంద్రబాబు ఐటీ అంటే కూడా మెజార్టీ జనానికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఐటీ విప్లవం సాధించిన ఫలితాలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకున్న వారే. ఇప్పుడు భవిష్యత్ తరాల అవసరాల కోసం రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకనుంది.
అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీని డీప్టెక్హబ్గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ ఏఐ సెమీకండక్టర్స్, రక్షణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్లు, ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయనుంది. పాలనలోనూ దీని అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న ఐటీ సాఫ్ట్వేర్ సేవలకు భిన్నంగా కటింగ్-ఎడ్జ్ పరిశోధన, హార్డ్వేర్ తయారీ, వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు గాను అమరావతిలో ఈ కేంద్రం కానుందని సర్కార్ చెబుతోంది.
అమరావతిలో 50 ఎకరాలను ప్రభుత్వం క్వాంటా0 వ్యాలీ కోసం కేటాయించింది. 2026 జనవరి 1 వ తేదీన వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఈ నెల 30న క్వాంటం మిషన్ పేరిట విజయవాడలో నిపుణులతో వర్క్షాప్ను సర్కార్ నిర్వహిస్తోంది. రూ.4000ల కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది.
డీప్టెడ్ వ్యాలీ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 1.5 మిలియన్ ఉన్నతస్థాయి ఉద్యోగాలు భవిష్యత్లో వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ ఆంచనా వేస్తోంది. క్వాంటం సైంటిస్టులు, రీసెర్చర్లు, క్వాంటం సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, క్వాంటం హార్డ్వేర్ ఇంజినీర్లు, క్వాంటం-అవేర్ డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, సైబర్సెక్యూరిటీ నిపుణులు, డొమైన్ నిపుణులు, సిస్టమ్ ఇంజినీర్లు, కమర్షియలైజేషన్ ప్రొఫెషనల్స్ వంటి వాటిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అమెరికా యూనివర్సిటీలో . ..
అమరావతిలో ఏర్పాటు చేసే పార్కు జాతీయ క్వాంటం మిషన్లో భాగం కానుంది. 2023-2024 నుంచి 2030-2031 మధ్య 8 ఏళ్లలో రూ.6300 కోట్లకు పైగా జాతీయ క్వాంటం మిషన్ ఖర్చు చేయనుంది. అందులో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. డీప్టెక్ రీసెర్చ్ పార్క్కు సహకరించేందుకు అమెరికాకు చెందిన పర్డ్యూ విశ్వవిద్యాలయం, జపాన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలు అంగీకరించాయి. ఆస్ట్రేలియాకు చెందిన విశ్వవిద్యాలయాల సహకారం కోసం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అమరావతి స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా క్వాంటం వ్యాలీ రూపొందుతోంది.
క్వాంటం కంప్యూటింగ్ మార్కెట్ 2024లో 71.4 మిలియన్ డాలర్ల నుంచి 2035 నాటికి 500 మిలియన్ డాలర్లకు చేరే ఛాన్స్ ఉంది . ఈ అవకాశాన్ని అందింపుచ్చుకుని దేశాన్ని గ్లోబల్ క్వాంటం లీడర్గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో అధిక వాటా పొందే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వం ఆలోచన. క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేస్తోంది.
దేశంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్ 156-క్యూబిట్ క్వాంటం సిస్టమ్-2ను ఐబీఎం సంస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఎల్ అండ్ టీ సంస్థ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే క్వాంటం కంప్యూటింగ్ సేవలు, హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్లను టీసీఎస్ అందించనుంది. హెల్త్కేర్, ఫైనాన్స్, తయారీ రంగాల్లో క్వాంటం సామర్థ్యాలను టీసీఎస్ అనుసంధానిస్తుంది.
అధికారం చేపట్టి ఏడాది అవుతున్నా.. వైసీపీ అధినేత జగన్ పై ఎందుకంత ఫోకస్
మీరు నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నా . .. నిత్యం జనంలో చర్చ జరిగేలా చేస్తున్నారు
”బాబాయ్ వివేకానంద్ రెడ్డిని చంపించి ఆ నెపాన్ని నాపై మోపారు . .. నారా సుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రికలో రాసారు.”
”మద్యం కుంభకోణంలో భారీగా దోచుకున్నారు . ఇసుక తిన్నారు . . మైన్స్ ను దోచుకున్నారు.”
” జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లారు . వీళ్ళు చేసిన ఆర్ధిక అరాచకాలకు ఇంకా ఇబ్బందులు పడుతున్నాం . ..”
ఇలా ప్రతి సందర్భంలోను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ,, వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు , కూటమి నేతలు చేస్తున్న విమర్శలలో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనేది పక్కన పెడితే… జనం కూడా జగన్ అరాచకాలు , అక్రమాలపై ఆందోళన చెంది వైసీపీని ఘోరంగా ఓడించారు.
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అధికారంలోకి వచ్చిన నాలుగైదు నెలల వరకు జగన్ అండ్ కో అరాచకాలు , అక్రమాలు గురించి చెపుతూ ఉంటె జనం కూడా కాస్త ఓపిగ్గా విన్నారు. ఏడాది దాటుతున్నా ఈ పాటను చంద్రబాబు అండ్ కో వదలకపోతే జనంలోనూ చులకనయ్యే ప్రమాదం పొంచి ఉంది .
జనానికి కావలసింది అదికాదు : జగన్ పై రోజు విమర్శలు చేయడం కాదు జనానికి కావలసింది. అభివృద్ధి , సంక్షేమం , శాంతి , భద్రతల పరిరక్షణ వంటివి కోరుకుంటారు. ఇవన్నీ కూటమి పాలనలో చెప్పుకోదగ్గ రీతిలోనే సాగుతున్నాయి . అయితే జనంలో ఎక్సపెటేషన్స్ పెంచడంవల్ల ఇంకా ఏవేవో కావాలని కోరుకునే జనం సంఖ్య పెరుగుతోంది. దీన్ని రీచ్ అవ్వడం ఏ సర్కార్ కైనా సవాలే . జగన్ ప్రభుత్వంతో పోలిస్తే . .. కూటమి పాలన ఎన్నో రేట్లు మెరుగే . అయినా . .. జనానికి సంతృప్తి మాత్రం ఇంకా చాలడంలేదనే అనిపిస్తోంది . అంటే చంద్రబాబు . .. అవి చేస్తాం . . ఇవి చేస్తాం . . అని ఏ మీటింగులోను వదలకుండా చేస్తున్న ప్రచారం కూడా కూటమి పాలిట ఇబ్బందిగా తయారయిందని చెప్పాలి .
ఇలాంటివి ప్రజాస్వామ్య ధిక్కారం కింద పరిగణించాల్సిందే ….
‘అభిప్రాయ సేకరణ ‘ స్కాన్ చేయమంటే ఎంతమంది వైసీపీ బ్యాచ్ ని నమ్ముతారు ?
గంజాయి స్మగ్లర్లపై పోలీసుల ఉక్కుపాదం . . వారికి మాత్రం వైసీపీ అధినేత జగన్ పరామర్శలు . .. ఎక్కడికిపోతున్నాం . .. అంటూ సమాజం లో కొన్ని వర్గాలు ఆ పార్టీని , సదరు నేతను ఛీత్కరించుకుంటున్నా ధోరణిలో మాత్రం మార్పు రావడంలేదు .
వైఎస్ఆర్సీపీ “రీకాల్” కార్యక్రమం రాజకీయ దాడిగా కనిపిస్తున్నప్పటికీ, శాసనసభ బహిష్కరణ, చట్టవ్యతిరేక ఆరోపణలు, సమీక్షా రాహిత్యం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలదు. సీనియర్ నాయకులు ఈ వైఖరిని సరిదిద్దకపోతే, పార్టీ రాజకీయంగా మరింత బలహీనపడే అవకాశం ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ప్రకటించిన “రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో” కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు1 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు వైఫల్యాన్ని ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు వారాల పాటు ఇంటింటికీ వెళ్లి, క్యూఆర్ కోడ్ ద్వారా ఈ హామీలను ప్రజలకు వివరించాలని పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతలకు ఆదేశించారు. అయితే, ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తూ, ప్రజాతీర్పును అవమానిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం చవిచూసింది. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు సాధించి, రాష్ట్రంలోని 13 జిల్లాలకు 8 జిల్లాల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఈ ఓటమి తర్వాత పార్టీలో సమగ్ర సమీక్ష జరగలేదు. ఓటమికి కారణాలను విశ్లేషించడం, లోపాలను సరిదిద్దుకోవడం జరగలేదు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని మొక్కుబడి ప్రకటన కూడా చేయలేదు. బదులుగా, “రీకాల్” కార్యక్రమం పేరుతో ప్రతిపక్షంపై దాడిని ఉధృతం చేసింది. ఈ వైఖరి పార్టీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోలేని అసమర్థతను సూచిస్తుంది.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులుగా, శాసనసభలో ప్రజా సమస్యలను లేవనెత్తడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వారి బాధ్యత. అయితే, ఈ బాధ్యతను విస్మరించి, సభను బహిష్కరించడం ద్వారా ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. శాసనసభ బహిష్కరణ ద్వారా పార్టీ తన రాజకీయ అసమర్థతను బహిర్గతం చేసుకుంటోంది, ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోంది.
గతంలో నిర్వహించిన “గడపగడపకూ” కార్యక్రమం ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ, అది విఫలమైంది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిరస్కరించి, వైఎస్ఆర్సీపీని ఓడించారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, “రీకాల్” కార్యక్రమంతో మళ్లీ ప్రతిపక్షంపై దూషణలకు దిగింది. ఈ వైఖరి వైఎస్ఆర్ సిపి వ్యూహాత్మక లోపాన్ని, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేని లోటును బయటపెడుతోంది.
వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఆరోపణలకు ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటువంటి చర్యలు పార్టీ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, శాసనసభ బహిష్కరణ ద్వారా వైఎస్ఆర్సీపీ ఈ బాధ్యతను విస్మరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో “రీకాల్” ప్రకటించడం పార్టీ నైతిక అర్హతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు పార్టీ వైఖరిపై బహిరంగంగా స్పందించకపోవడం గమనార్హం. గతంలో జగన్ నిర్ణయాలపై విమర్శలు చేసిన నాయకులు, ఇప్పుడు నిశ్శబ్దం వహించడం పార్టీలో అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తుంది. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కార్యకర్తలు జగన్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అతివిశ్వాసం, పోల్ మేనేజ్మెంట్ వైఫల్యాలు ఓటమికి కారణమని ఆరోపించారు. అయినప్పటికీ, ఈ అసంతృప్తిని పరిష్కరించే చర్యలు తీసుకోలేదు. సీనియర్ నాయకులు ఈ వైఖరిని సవాలు చేయకపోతే, పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు సర్వోన్నతం. ఓడిన పార్టీలు తమ లోపాలను సమీక్షించుకుని, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు కృషి చేయాలి. అయితే, వైఎస్ఆర్సీపీ ఈ మార్గాన్ని విస్మరించి, శాసనసభను బహిష్కరించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, “రీకాల్” ద్వారా ప్రతిపక్షంపై దూషణలకు దిగడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. “గడపగడపకూ” కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో, “రీకాల్” కూడా విఫలమైతే, పార్టీ విశ్వసనీయత మరింత దెబ్బతింటుంది. ఈ వైఖరి పార్టీ రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టవచ్చు .. అంటూ పలువురు జగన్ అంటే ఇష్టపడే వాళ్ళు సైతం సూచిస్తున్నారు . అయినా అతని వైఖరిలో మార్పు వస్తుందని భావించడం వీరి అమాయకత్వమే అవుతుంది .
కూటమి హామీలపై వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి అభిప్రాయ సేకరణ చేయాలని జగన్ ఆదేశం. స్థానికంగా వైసీపీ చోటా నేతలు ఈ పనిని చేయ్యపట్టాల్సి ఉంటుంది . అయితే ఇప్పటికే జనంలో స్థానిక వైసీపీ వాళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం గురించి తెలిసిందే. ఈ ప్రభావంతో జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అభాసుపాలవుతుందని మెజార్టీ నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .
ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపి తుది తీర్పు వెల్లదించిన తెలంగాణ హైకోర్టు
రాయదుర్గంలో 3.5 ఎకరాల కేటాయింపుపై జారీచేసిన జీఓల కొట్టివేత
నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయన్న పిటిషనర్లు
సదరు భూమి విలువ రూ.350 కోట్ల ఉంటుందని అంచనా
తెలంగాణలో భారీ భూకేటాయింపును ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర సంచలనం కలిగించాయి . హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు అత్యంత విలువైన ప్రాంతంలో చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓలను కొట్టివేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. న్యాయవాది రఘునాథ్రావు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం ఈ కేటాయింపులు జరిపిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) వాదనలు వినిపించారు. హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటు వల్ల అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారం సులభతరం అవుతుందని తెలిపారు. న్యాయస్థానాల వెలుపల వివాదాలు పరిష్కారమవ్వాలని కోర్టులే ప్రోత్సహిస్తున్నాయని, దీనివల్ల న్యాయవ్యవస్థపై భారం కూడా తగ్గుతుందని ఆయన తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు ఈ ఏడాది జనవరిలోనే ముగియడంతో, ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా శుక్రవారం తుది తీర్పును వెలువరిస్తూ, ఐఏఎంసీకి భూమిని కేటాయించడంతో పాటు, దాని ప్రస్తుత భవన నిర్వహణ కోసం జారీ చేసిన జీఓలను సైతం పూర్తిగా కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఐఏఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులు రద్దయ్యాయి.
శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో గల సర్వే నెంబరు 83/1లో 3.5 ఎకరాలకు పైగా భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ కారిడార్లో ఉన్న ఈ భూమి విలువ రూ. 350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించడం చట్టవిరుద్ధమని న్యాయవాది కె. రఘునాథ్రావు, వెంకటరామ్రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి . దీనిపై తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది .
అమ్మమ్మలు , నానమ్మల కాలంలో కాస్త అజీర్తిగా అనిపిస్తే… కాస్త వాము వేయండి .. అనేవారు . వాములో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనలలో తేలింది.
వాము . .. కేవలం వంటలలో రుచిని అందించడంతో పాటు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది .
అజీర్తి, దగ్గు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ట్యాబ్లెట్లతో తగ్గించుకుంటున్నారు, అయితే వీటిని తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుండి . వాములోని థైమోల్ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గ్యాస్, కడుపు ఇబ్బరం వంటివి . అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుండు , ఇది కడుపులోని ఆమ్లాలను తటస్థీకరించి, ఎసిడిటీ, గుండెల్లో మంటను తగ్గింస్తుంది . వాములో ఉండే యాంటీ-స్పాస్మోడిక్ లక్షణాలు కండరాల నొప్పులు, కడుపు నొప్పి, తిమ్మిర్లను నియంత్రిస్తాయి .
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : వాములో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పించే అనేక ఓషధ గుణాలు వాములో ఉన్నాయి . దగ్గు , జలుబుతో బాధపడేవాళ్లు . .. కాసింత వామును నమిలితే ఉపశమనం కలుగుతుంది .
ఆస్తమా : ఇది శ్వాసనాళాలను సడలించి, గాలి ప్రవాహాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల దగ్గు, ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి ఇస్తుంది . వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థ్రైటిస్ వల్ల ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది .
శ్వాసకోశ వ్యవస్థ : వాములోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని థైమోల్ ముక్కు రంధ్రాలను శుభ్రం చేస్తుందని, శ్లేష్మాన్ని తొలగించడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుందని వివరించారు. ఆయుర్వేదంలో దీన్ని కడుపు ఉబ్బరం. ఆయాసం , విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి వివిధ చికిత్సలకు ఉపయోగించే వారని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ స్పష్టం చేస్తుంది .
మౌత్ వాష్ నర్ గా ….వాము నూనెను టూత్పేస్ట్, మౌత్ వాష్ల్లో వాడతారని, ఇది నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడి . . నోటి దుర్వాసన రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొద్దిగా వామును నోట్లో వేసుకుని నమిలినా మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా వాము వేసి మరిగించినా నీటిని గోరువెచ్చగా వేడి చేసుకోని, ఆ తర్వాత ఈ నీటితో పుక్కిలిస్తే పంటి నొప్పులు దూరమవుతాయి .
బాలింతలకు మేలు! : గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుందని, అలాగే బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుందని తెలిపారు. అంతే కాకుండా గర్భవతులు వామును రోజూ తీసుకుంటే శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుందని పేర్కొన్నారు.
గ్యాస్ ట్రబుల్ : కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో వాము, నెయ్యి కలిపి తింటే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా గ్యాస్ ట్రబుల్తో బాధపడేవారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మరిగే నీళ్లలో అర చెంచా వాము వేసి కాసేపు మరిగించి వడగట్టిన నీరును గోరువెచ్చగా తాగితే పొట్టలోని గ్యాస్ తేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా వాము పొడిని నమిలితే కూడా గ్యాస్ తగ్గిపోతుందని చెపుతున్నారు .
వాము ఆకులతో . .. వాము ఆకులతో బజ్జీలు వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి . వాము ఆకలి కాషాయం కొన్ని వ్యాధులకు పరిస్కారం చూపుతుంది .