by Abhi Correspondent | Jul 15, 2025 | బిజినెస్
హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) కొత్త సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియా నాయర్ సక్సెస్ స్టోరీ .. మహిళలకు మాత్రమే కాదు.. అందరికీ స్ఫూర్తి . .
చిరు ఉద్యోగం నుంచి అదే కంపెనీలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం వెనుక కఠోర శ్రమ , పట్టుదలతో ఆమె ఈ తరం వారికి ఆదర్శవంతంగా నిలుస్తోంది.
వందేళ్ల చరిత్ర ఉన్న కంపెనీ. ఎన్నో వేలమంది ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. కొన్నివేల మంది చేస్తున్నారు. అయితే ఒకామె ఈ కంపెనీలోని కెరీర్ ప్రారంభించి . .. ఇదే కంపీనీ సిఈవో స్థాయికి ఎదిగారు . ఆ కంపెనీలో 30 ఏళ్లుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆమె.. ఎన్నో ఆటుపోట్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు..
ప్రియా నాయర్. చిన్న ఉద్యోగి నుంచి సీఈఓ స్థాయికి ఎదిగిన ప్రియా నాయర్ సక్సెస్ నేటి తరానికి ఎంతో ఆదర్శవంతం. అనుచరణీయం . ..
ఆమె ప్రతీ అడుగులో అంకితభావం, ఎదురైన ప్రతీ సవాలును స్ఫూర్తిగా మలుచుకున్న ధైర్యం, ఆమె హృదయంలోని అచంచలమైన సంకల్పం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆమె విజయం కేవలం ఆమె ఒక్కరిదే కాదు.. అకుంఠిత దీక్షతో శ్రమించే వారికి మార్గదర్శనం . ..
కంపెనీ వస్తువులను.. సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు.. ప్రియా నాయర్ మెదడులో వచ్చిన ఆలోచన ఆమెను సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలిపింది. 2014లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరెంట్ ఎక్కువగా ఉండేది కాదు. పైగా కోతలు ఎక్కువ. ఇక ఇంటర్నెట్ అంటే చాలా మందికి పరిచయమే లేదు. టీవీలు ఉన్నా.. చాలా గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేవి కావు. 1933లో ప్రారంభించిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అయితే అప్పటికే దేశంలోనే మంచి పేరున్న ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థగా కొనసాగుతోంది. ఇక ఈ సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు కొనేవారు చాలా మంది గ్రామీణ ప్రాంతాల వారే . దీంతో సంస్థ తీసుకువచ్చిన కొత్త ఉత్పత్తులను వారికి పరిచయం చేయడం ఎలా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.
హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కొత్త సీఈఓ అండ్ ఎండీగా నియమితులైన ప్రియా నాయర్ ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆ సంస్థ 92 సంవత్సరాల చరిత్రలో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ ప్రియా నాయర్ కావడం విశేషం. 1995లో హెచ్యూఎల్లో చేరిన ప్రియా నాయర్.. ఇప్పుడు సీఈఓ స్థాయికి చేరుకున్నారు. సంస్థలోని హోమ్ కేర్, బ్యూటీ అండ్ వెల్బీయింగ్, పర్సనల్ కేర్ డిపార్ట్మెంట్లలో సేల్స్ అండ్ మార్కెటింగ్లో అనేక కీలక పాత్రలు పోషించారు. ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు.. ఆ సంస్థకు చెందిన బ్యూటీ అండ్ వెల్బీయింగ్ విభాగానికి గ్లోబల్ ప్రెసిడెంట్గా పనిచేశారు. సీఎంఓగా ఆమె గ్లోబల్ బ్రాండ్ స్ట్రాటజీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. హెచ్యూఎల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆమె లండన్లో నివసించేవారు. వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కర్బన ఉద్గారాలను వీలైనంత తగ్గించడం, నీటిని తక్కువగా ఉపయోగించుకోవడం సహా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చేందుకు అనుగుణంగా తమ కంపెనీ ఉత్పత్తులను ప్రియా తీసుకొచ్చారు.
”ప్రియా నాయర్ మనసుతో ఆలోచిస్తారు . ఎందుకంటే ఆమె ప్రచారం చేసిన బ్రాండ్లు అన్నీ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించేలా చూడటం ఆమె అలవాటు . …” అని సంస్థలో ఆమె గురించి బాగా తెలిసిన ఉన్నతోద్యోగులు చెపుతూ ఉంటారు . కార్పొరేట్ దిగ్గజాలు సైతం ఈ మాటను అంగీకరిస్తారు .
by Abhi Correspondent | Jul 14, 2025 | ఆరోగ్యం
మనలో చాలా మందికి మునగకాడాలంటే మహా ఇష్టం. కాడలే కాదు . . మునగాకు అంతకంటే బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసా ? మునగాకులో మన శరీరానికి అవసరమయ్యే చాలా ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు ఉన్నాయి. ఆకుల్లో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది కాల్షియం, ప్రోటీన్, ఐరన్, అమైనో యాసిడ్లను కూడా కలిగి ఉంది. ఇవి మీ శరీరాన్ని నయం చేయడానికి, కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కణాలను దెబ్బతినకుండా రక్షించగల రోగనిరోధక వ్యవస్థను పెంచే పదార్థాలు ఇందులో ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లలో కొన్ని రక్తపోటును తగ్గించగలవని , రక్తం , శరీరంలో కొవ్వును తగ్గించగలవని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయ్ .
పోషకాల గని మునగాకు : మునగాకులో ఎ, సి, ఇ, కె, బి1, బి2, బి3 వంటి అనేక విటమిన్లు , కాల్షియం ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు, ప్రొటీన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఎ, నారింజ కంటే 7 రెట్లు అధికంగా విటమిన్ సి, పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయట. మునగాకును గాయాలు, నొప్పి, పూతల, కాలేయ వ్యాధి, గుండె జబ్బులు, క్యాన్సర్, వాపులను నయం చేయడానికి ఉపయోగిస్తారని నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ అధ్యయనంలో పేర్కొంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది : మునగాకులో ఉండే విటమిన్ C, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరానికి సహాయపడుతుందంటున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడంలో మునగాకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.
రక్తహీనత నివారణ: మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
రక్తపోటు నియంత్రణ : మునగాకులోని ఫైటోకెమికల్స్ రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి, రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయంటున్నారు నిపుణులు. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని, బీపీ సమస్య ఉన్నవారు మునగాకు సూప్ లేదా రసం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
ఎముకల బలం : కాల్షియం, భాస్వరం అధికంగా ఉండటం వల్ల మునగాకు ఎముకలను దృఢం చేస్తుంది . ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు.
యాంటీ ఆక్సిడెంట్ గుణాలు : మునగాకులో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, పాలిఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి, కణ నష్టాన్ని నివారించి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తాయని, క్యాన్సర్ నివారణలో కూడా ఇవి సహాయపడతాయని తెలిపారు.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి : మునగాకులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకులో కాల్షియం. మెగ్నీషియం మృద్ధిగా ఉంటుందని, కీళ్ల నొప్పులను తగ్గించడానికి, ఎముకల పటిష్టతకు సహాయపడుతుందని వివరించారు.
చర్మం, జుట్టు మెరుగైన ఆరోగ్యం : ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలతో పోరాడతాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకులో విటమిన్లు ఎ, ఇ అనేవి మొటిమలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా చేస్తాయని, జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుందని వివరించారు.
బరువు తగ్గడం : మునగాకు మెటబాలిజంను పెంచి, ఆకలిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రెండు నెలలపాటు . .. వారంలో రెండు , మూడుసార్లు మునగాకును ఆహారంలో తినేవారు 4-5 కిలోల బరువు తగ్గుతారు .
మునగ ఆకు అందుబాటులో లేనివారు మునగాకు పౌడర్ ని వాడవచ్చు . అనేక కంపెనీలు పౌడర్ ని ఆన్ లైన్ లో విక్రయిస్తున్నాయ్ . ఇటీవల కాలంలో మునగాకు పౌడర్ అమెరికా , బ్రిటన్ వంటి దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంది .
by Ram Maddipati | Jul 14, 2025 | ఆంధ్రప్రదేశ్
బిట్స్ ఏఐ + క్యా0పస్ పై కుమారమంగళం బిర్లా ప్రకటన
అమరావతిలో మరో ప్రతిష్ట విద్యా సంస్థ క్యా0పస్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే మొదటి ఏఐ యూనివర్సిటీ
అమరావతిలో ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతిష్ఠాత్మక బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్-బిట్స్ విశ్వవిద్యాలయ కులపతి, పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా ప్రకటించారు. 7000 మంది విద్యార్థులకు స్టడీకి అవకాశం కల్పించేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని… వచ్చే 2027 నుంచి ప్రవేశాలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కృత్రిమ మేథ, డేటాసైన్స్, రోబోటిక్స్, కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు వెల్లడించారు .
ఇండియాలో ఫస్ట్ ఏఐ క్యాంపస్: ఐవోటీ, ఏఐ ఆధారిత సేవలతో డిజిటల్ ఫస్ట్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుంది .. దేశంలో ఎక్కడా ఇలాంటి క్యాంపస్ లేదు . . . దేశంలో ఉన్నతవిద్య దిశను మార్చేందుకు తొలి అడుగుగా ఈ క్యాంపస్ను తీర్చిదిద్దుతామన్నారు. అమరావతిలో రెండేళ్లు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్లు అభ్యసించేలా డిజైన్ చేస్తున్నామని జాయింట్ పీహెచ్డీలు చేయొచ్చని బిర్లా వివరించారు. అమరావతి క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కాబోతోందని కంప్యూటర్ సైన్సులోని అన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ అక్కడ ఉంటాయని ఉపకులపతి రామగోపాలరావు చెప్పారు. వివిధ మైనర్ ప్రోగ్రామ్స్ను అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. వ్యవసాయం నుంచి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రంగాల కోర్సులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
70 ఎకరాలలో బిట్స్
బిట్స్ అమరావతి క్యాంపస్ ఏర్పాటుకు సీఐర్డీఏ 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలనూ ఆలయ నమూనాలో నిర్మిస్తామని తెలిపింది. దీంతో వారు కోరిన ప్రాంతంలోనే ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద కూడా దీనిపై చర్చ జరిగింది. బిట్స్ క్యాంపస్ నమూనాలను ఆయన పరిశీలించారు.
భూ సమీకరణ-2 .. వ్యవహారంలో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గిన నేపథ్యంలో… ఆ అంశంపై పెద్దగా చర్చ లేకుండా ఉండేందుకు బిట్స్ అమరావతిలో ఏర్పాటు అంశం వెంటనే తెరపైకి వచ్చినట్లు కూడా పలువురు ప్రచారం మొదలుపెట్టారు .
by Rama Chandra P | Jul 13, 2025 | అభిప్రాయం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ”బీజేపీ లో 75 ఏళ్లకే రిటైర్మెంట్ ‘ తేనెతుట్టను కదిల్చారు
“ఒక వ్యక్తికి 75 ఏళ్లు నిండినప్పుడు శాలువాతో సత్కరిస్తే, దాని అర్థం ‘మీరు వృద్ధులయ్యారు, ఇప్పుడు పక్కకు తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వండి’ అని (ఆర్ ఎస్ ఎస్ పాతతరం నాయకుడు) మోరోపంత్ పింగ్లే అనేవారు.” ఈ మాటలు నాగ్ పూర్ లో ఒక పుస్తకావిష్కరణ సభలో ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా ప్రస్తావించారు.
దీంతో … పార్టీలో, ప్రతిపక్షాల్లో రాజకీయ వర్గాల్లో ప్రధాని 2025 సెప్టెంబర్లో 75 ఏళ్లు నిండనున్న నరేంద్ర మోదీకి ఈ నియమాన్ని వర్తింప చేస్తారా? లేదా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
బీజేపీలో “75 ఏళ్ల వయసు నిబంధన” గత కొన్నేళ్లుగా చర్చకు వస్తున్న అంశమే! 75 ఏళ్ళకు రిటైర్ అవ్వాలన్న నియమం ఇది బీజేపీ పార్టీ నియమావళి (పార్టీ కాస్టిట్యూషన్) లో అధికారికంగా పొందుపరిచినది కాదు.
2014లో నరేంద్ర మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత, పార్టీలో సీనియర్ నాయకులకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ ఇచ్చేందుకు ఒక అనధికారిక మార్గదర్శకంగా దీనిని అమలులోకి తెచ్చారు. 75 ఏళ్లు దాటిన నాయకులను ఎన్నికల రాజకీయాల నుండి, ప్రభుత్వ పదవుల నుండి తప్పించి, వారికి “మార్గదర్శక్ మండల్” వంటి సలహా కమిటీలలో స్థానం కల్పించారు. ఈ నిబంధన ప్రకారమే బీజేపీ కురువృద్ధులైన ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా వంటి అనేక మంది సీనియర్ నాయకులను క్రియాశీల రాజకీయాల నుండి పక్కన పెట్టారు. ఇది పార్టీలో కొత్త తరానికి అవకాశం కల్పించేందుకూ, నాయకత్వ మార్పును మరింత పటిష్టం చేసేందుకూ ఉద్దేశించిన వ్యూహంగా చెపుతూ ఉంటారు .
2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో, ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రతిపక్ష నాయకులు ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. “మోదీ గెలిస్తే, 2025లో 75 ఏళ్లు నిండిన తర్వాత ఆయన రిటైర్ అయి, అమిత్ షాను ప్రధానిని చేస్తారు” అని వారు ప్రచారం చేశారు. ఇది బీజేపీ ఓటర్లలో గందరగోళం సృష్టించే ప్రయత్నమని బీజేపీ నాయకులు కొట్టిపారేశారు.
ఈ ప్రచారంపై హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా వంటి అగ్ర నాయకులు స్పష్టత ఇచ్చారు. వారి వివరణ ప్రకారం బీజేపీ లో అలాంటి నిబంధన ఏదీ లేదు. ఇది కేవలం ఒక అవగాహన మాత్రమే. ఇది ప్రధాని మోదీకి వర్తించదని, ఆయన తన పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని (2029 వరకు) కొనసాగిస్తారని, ఆ తర్వాత కూడా దేశానికి నాయకత్వం వహిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇది కేవలం ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అపోహ మాత్రమేనని, బీజేపీలో నాయకత్వంపై ఎలాంటి సందిగ్ధత లేదని వారు పేర్కొన్నారు.
ఇపుడు భగవత్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో, ఆర్ఎస్ఎస్ వర్గాలు స్పందించి, ఆ వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావని, కేవలం పింగ్లే గారి వ్యక్తిత్వాన్ని వివరిస్తున్నప్పుడు చేసిన సాధారణ వ్యాఖ్యలని వివరణ ఇచ్చాయి.
మోదీయే ఇపుడు బిజెపి ముఖచిత్రం ఆయన చరిష్మా, ప్రజాదరణే పార్టీకి అతిపెద్ద బలం. ముఖ్యంగా, బీజేపీకి సొంత మెజారిటీ రాని ఈ సంకీర్ణ ప్రభుత్వంలో, మోదీ నాయకత్వం మరింత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను పక్కనపెట్టే సాహసం పార్టీ చేయకపోవచ్చు. ఈ “నియమం” పార్టీలో అంతర్గత పోటీని తగ్గించి, నాయకత్వాన్ని సుస్థిరం చేయడానికి గతంలో ఉపయోగపడింది. అయితే, ఆ నియమాన్ని దాని రూపకర్తకే వర్తింపజేయడం రాజకీయంగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. మోదీ వంటి అత్యంత బలమైన నేతలకు ఈ సూత్రం వర్తించే పరిస్థితి ప్రస్తుత బీజేపీ లో ఉండకపోవచ్చు. ‘బీజేపీ నీడన ఎదిగిన మోడీ వటవృక్షం అయ్యారు . .. మోడీ చాటున బీజేపీ మరుగుజ్జు అయింది . .” అంటూ వస్తున్నా వ్యాఖ్యానాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సిందే .
by Rama Chandra P | Jul 12, 2025 | ఆరోగ్యం, పరిశీలన
మహిళల్లో వచ్చే ప్రత్యేక గుండె సమస్యలపై అధ్యయనం
మీ PMS గుండె సమస్యలకు హెచ్చరిక సంకేతం కావచ్చని మీకు తెలుసా? – తాజా అధ్యయనంలో తేలిన విషయాలు గమనించండి
రెండు దశాబ్దాలుగా దాదాపు లక్ష మంది మహిళలను పర్యవేక్షించిన ఒక పెద్ద-స్థాయి అధ్యయనంలో, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (PMS) మరియు మరింత తీవ్రమైన ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ (PMDD) వంటి ప్రీమెన్స్ట్రువల్ లక్షణాలు ఉన్నవారు అరిథ్మియా మరియు స్ట్రోక్ వంటి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది.
చాలా మంది మహిళలు తమ పీరియడ్స్కు ముందు రోజుల్లో అనుభవించే ప్రీమెన్స్ట్రువల్ లక్షణాలలో తరచుగా మానసిక స్థితిలో మార్పులు, అలసట, రొమ్ము సున్నితత్వం మరియు ఉబ్బరం ఉంటాయి.
ఈ లక్షణాలను చాలా కాలంగా “స్త్రీగా ఉండటంలో భాగం” అని తోసిపుచ్చినప్పటికీ, అవి భవిష్యత్తులో హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి.
నేచర్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్లో ప్రచురించబడిన స్వీడిష్ అధ్యయనంలో, ప్రీమెన్స్ట్రువల్ లక్షణాలు ఉన్న మహిళలకు గుండె జబ్బులు లేని వారితో పోలిస్తే 10 శాతం ఎక్కువ ప్రమాదం ఉందని కనుగొన్నారు.
హైదరాబాద్ వైద్యులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం, రోగి ఫలితాలను మెరుగుపరచడానికి గుండెపోటు యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఛాతీ నొప్పి ఒక సాధారణ లక్షణం అయినప్పటికీ, దవడ, మెడ, చేయి, భుజం లేదా వీపులో నొప్పి, శ్వాస ఆడకపోవడం, చెమట పట్టడం, వికారం మరియు తలతిరగడం వంటి ఇతర సూచికలను విస్మరించకూడదని ఈ అధ్యయనం నొక్కి చెబుతుంది.
చూడవలసిన ముఖ్య హెచ్చరిక సంకేతాలు:
ఛాతీ అసౌకర్యం: ఒత్తిడి, బిగుతు, బిగుతుగా ఉండటం లేదా ఛాతీలో నొప్పి కొన్ని నిమిషాలు లేదా పునరావృతమవుతుంది.
ఇతర ప్రాంతాలలో నొప్పి: ఛాతీ నుండి దవడ, మెడ, చేయి, భుజం లేదా వీపు వరకు ప్రసరించే అసౌకర్యం లేదా నొప్పి.
శ్వాస ఆడకపోవడం: తక్కువ శ్రమతో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
చెమట పట్టడం: ముఖ్యంగా శారీరక శ్రమ లేకుండా చల్లని చెమటతో విరిగిపోవడం.
వికారం మరియు మైకము: మీ కడుపులో అనారోగ్యంగా అనిపించడం లేదా తేలికగా తల తిరగడం, బహుశా మూర్ఛ అనుభూతితో.
అలసట: అసాధారణ అలసట, ముఖ్యంగా అది తీవ్రంగా లేదా అకస్మాత్తుగా ఉంటే.
క్రమరహిత హృదయ స్పందన: సాధారణ కారణాల వల్ల కాకుండా దడ లేదా వేగంగా కొట్టుకునే గుండె.
ముందస్తు గుర్తింపు ఎందుకు కీలకం:
మెరుగైన ఫలితాలు: ఈ హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం మరియు వాటికి ప్రతిస్పందించడం వలన వేగవంతమైన చికిత్స మరియు మెరుగైన మనుగడ మరియు కోలుకునే అవకాశాలు లభిస్తాయి.
తగ్గిన తీవ్రత: తక్షణ వైద్య జోక్యం గుండె కండరాలకు నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
సమస్యల నివారణ: ముందస్తు రోగ నిర్ధారణ మరియు చికిత్స గుండెపోటుతో సంబంధం ఉన్న తీవ్రమైన సమస్యల ఆగమనాన్ని నిరోధించవచ్చు.
మీరు హెచ్చరిక సంకేతాలను అనుభవిస్తే ఏమి చేయాలి:
తక్షణ వైద్య సహాయం తీసుకోండి: మీరు ఏవైనా హెచ్చరిక సంకేతాలను అనుభవిస్తే, ప్రత్యేకించి అవి కలిసి సంభవిస్తే సహాయం కోరడంలో ఆలస్యం చేయవద్దు.
అత్యవసర సేవలకు కాల్ చేయండి: వెంటనే మీ స్థానిక అత్యవసర నంబర్ను సంప్రదించండి.
వైద్య నిపుణులకు తెలియజేయండి: మీకు చికిత్స చేసే వైద్య నిపుణులకు మీ లక్షణాలను స్పష్టంగా తెలియజేయండి.
“ఈ ఫలితాలు చాలా ఆసక్తికరంగా మరియు ముఖ్యమైనవి” అని హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ అన్నారు.
“మనం తరచుగా ప్రీమెన్స్ట్రువల్ డిజార్డర్లను పూర్తిగా హార్మోన్ల లేదా భావోద్వేగ సంబంధమైనవిగా భావిస్తాము, కానీ ఇది లోతైన శారీరక ప్రభావం ఉండవచ్చని చూపిస్తుంది.”
PMS మరియు PMDD యొక్క లక్షణాలు ఏమిటి?
ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది స్త్రీ ఋతుస్రావం ముందు రోజులు లేదా వారాలలో సంభవించే భావోద్వేగ, శారీరక మరియు ప్రవర్తనా లక్షణాల సమూహాన్ని సూచిస్తుంది మరియు సాధారణంగా ఋతుస్రావం ప్రారంభమైన తర్వాత తగ్గుతుంది.
భావోద్వేగ మరియు ప్రవర్తనా లక్షణాలు:
మానసిక మార్పులు
చిరాకు లేదా కోపం
ఆందోళన లేదా ఉద్రిక్తత
దుఃఖం లేదా ఏడుపు
ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది
నిద్ర సమస్యలు (నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం)
ఆకలిలో మార్పులు లేదా ఆహార కోరికలు
రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి తగ్గడం.. వంటివి
శారీరక లక్షణాలు వీటిని కలిగి ఉండవచ్చు:
ఉబ్బరం లేదా నీరు నిలుపుకోవడం
మొటిమల మంటలు
రొమ్ము సున్నితత్వం లేదా వాపు
తలనొప్పి, అలసట లేదా తక్కువ శక్తి
కీళ్లు లేదా కండరాల నొప్పి
మలబద్ధకం లేదా విరేచనాలు
PMS సర్వసాధారణం మరియు స్వల్పంగా ఉన్నప్పటికీ, PMDD (ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్) అనేది ఋతుస్రావానికి ముందు రోజుల్లో తీవ్రమైన భావోద్వేగ మరియు శారీరక లక్షణాలను కలిగించే మరింత తీవ్రమైన రూపం.
PMDD లక్షణాలు:
తీవ్రమైన మానసిక మార్పులు
నిరాశ లేదా నిరాశ భావాలు
చిరాకు లేదా కోపం
ఇతర PMS-సంబంధిత లక్షణాలతో పాటు
PMS వలె కాకుండా, PMDD రోజువారీ జీవితం, పని మరియు సంబంధాలను గణనీయంగా దెబ్బతీస్తుంది. ఇది ఋతుస్రావం అవుతున్న స్త్రీలలో 3 నుండి 8 శాతం మందిని ప్రభావితం చేస్తుంది.
PMS లక్షణాలు స్వల్పంగా ఉంటే, జీవనశైలి మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్ర మరియు సమతుల్య ఆహారం వంటివి సహాయపడతాయి. కానీ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా జీవన నాణ్యతను ప్రభావితం చేస్తే, అది PMDD కాదా అని అంచనా వేయడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
అధ్యయనం ఏమి కనుగొంది?
PMS అనుభవించడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల (CVD) దీర్ఘకాలిక ప్రమాదం ఎక్కువగా ఉందో లేదో నిర్ణయించడం మరియు ఏ నిర్దిష్ట గుండె పరిస్థితులు ఉన్నాయో గుర్తించడం పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. PMS నివేదించిన 90,000 మందికి పైగా మహిళలు, లక్షణాలు లేని పోల్చదగిన సమూహంతో పాటు, 22 సంవత్సరాల వరకు ట్రాక్ చేయబడ్డారు.
ఈ అధ్యయనం లక్షణాలతో కూడిన మహిళలను సాధారణ జనాభాతో పోల్చింది. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని పరిశోధకుల నేతృత్వంలో, ఇది మహిళలను వారి సోదరీమణులతో పోల్చడం ద్వారా ఉమ్మడి కుటుంబ లక్షణాలను కూడా పరిగణనలోకి తీసుకుంది – ఇది జీవసంబంధమైన సంబంధానికి ఆధారాలను బలపరిచే పద్ధతి.
అరిథ్మియా సంభవం, ఇస్కీమిక్ స్ట్రోక్, గుండెపోటు మరియు ఇతర గుండె పరిస్థితుల వంటి ఫలితాలను కొలుస్తారు. ధూమపానం, BMI, మానసిక ఆరోగ్యం, విద్య, శారీరక శ్రమ మరియు ఇతర జీవనశైలి మరియు జనాభా వేరియబుల్స్ వంటి అనేక అంశాలకు అనుగుణంగా గణాంక నమూనాలు సర్దుబాటు చేయబడ్డాయి.
25 ఏళ్లలోపు PMSతో బాధపడుతున్న మహిళలు మరియు ప్రసవానంతర నిరాశ చరిత్ర ఉన్నవారిలో ప్రమాదంలో తేడాలను కూడా ఈ అధ్యయనం అన్వేషించింది. జీవసంబంధమైన గుర్తులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
ఆసక్తికరంగా, PMS ఉన్న మహిళలకు CVD వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది. అరిథ్మియా ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంది మరియు ఇస్కీమిక్ స్ట్రోక్ ప్రమాదం సుమారు 27 శాతం పెరిగింది.
25 ఏళ్లలోపు PMS లేదా PMDDతో బాధపడుతున్న మహిళల్లో మరియు ప్రసవానంతర నిరాశను అనుభవించిన వారిలో ఈ ప్రమాదం ముఖ్యంగా ఉచ్ఛరించబడింది – రెండు పరిస్థితులు హార్మోన్ల మార్పులతో ముడిపడి ఉన్నాయి.
పరిశోధకులు అనేక జీవసంబంధమైన విధానాలు ఈ సంబంధాన్ని వివరించవచ్చని నమ్ముతారు. ప్రీమెన్స్ట్రువల్ లక్షణాలతో ఉన్న స్త్రీలు రక్తపోటు మరియు ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడే వ్యవస్థ యొక్క క్రమబద్ధీకరించబడని రెనిన్-యాంజియోటెన్సిన్-ఆల్డోస్టెరాన్ వ్యవస్థ (RAAS) కలిగి ఉండవచ్చని ఒక సిద్ధాంతం.
మరొక అవకాశం దీర్ఘకాలిక తక్కువ-స్థాయి వాపు, ఇది గుండె జబ్బులకు తెలిసిన ప్రమాద కారకం. మూడవ పరికల్పన అంతర్లీన జీవక్రియ సమస్యలను సూచిస్తుంది, ఇవి తరచుగా స్ట్రోక్లు మరియు గుండెపోటులతో సంబంధం కలిగి ఉంటాయి.
PMS లేదా PMDD వంటి ప్రీమెన్స్ట్రువల్ లక్షణాలు ఉన్న స్త్రీలు అరిథ్మియా మరియు స్ట్రోక్తో సహా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, రెండు దశాబ్దాలకు పైగా 90,000 మంది మహిళలను ట్రాక్ చేసిన ఒక ప్రధాన స్వీడిష్ అధ్యయనం తెలిపింది. 25 ఏళ్లకు ముందు నిర్ధారణ అయిన స్త్రీలలో లేదా ప్రసవానంతర నిరాశతో బాధపడుతున్న వారిలో ఈ ప్రమాదం ముఖ్యంగా గుర్తించబడింది.
భారతీయ వైద్యులు దీనితో ఏకీభవిస్తున్నారు
ముఖ్యంగా యువతులు మరియు పెరినాటల్ డిప్రెషన్ ఉన్నవారిలో పెరిగిన హృదయనాళ ప్రమాదం ఒక హెచ్చరిక సంకేతం అని డాక్టర్ ముఖర్జీ చెపుతున్నారు .
“ఇది PMS లక్షణాలను తీవ్రంగా పరిగణించాలని మనకు గుర్తు చేస్తుంది. ఇది లక్షణాల ఉపశమనం కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదాన్ని గుర్తించడానికి కూడా ఒక గుర్తుగా ఉంటుంది” అని ఆయన అన్నారు మరియు ఈ సమూహంలో ముందస్తు స్క్రీనింగ్ మరియు జీవనశైలి మార్పు దీర్ఘకాలిక హృదయనాళ సంఘటనలను తగ్గించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు.
మహిళల్లో రుతువిరతి, PCOS, గర్భధారణ సంబంధిత పరిస్థితులు మరియు ఊబకాయం మరియు ధూమపానం వంటి జీవనశైలి కారకాలను హృదయనాళ ప్రమాదాలతో అనుసంధానించే గణనీయమైన ఆధారాలు ఇప్పటికే ఉన్నాయని పరిశోధనకు నాయకత్వం వచించిన మహిళా డాక్టర్ వివరించారు. కానీ PMS మరియు గుండె ఆరోగ్యం మధ్య సంబంధం బాగా స్థిరపడలేదు.
హృదయనాళ సంఘటనలను సాధారణంగా గుండె నిపుణులు నిర్వహిస్తారని మరియు అరుదుగా ఎవరైనా PMS గురించి అడుగుతారని డాక్టర్ నళినీ చంద్ర పేర్కొన్నారు .
“ఈ కొత్త అధ్యయనం ఆసక్తికరమైన పరిశీలనా కోణాన్ని తెస్తుంది, కానీ PMSని స్వతంత్ర ప్రమాద కారకంగా పరిగణించడం చాలా తొందరగా ఉంది” అని ఆమె జోడించారు.
వాస్తవానికి, PMS లేని కానీ ఇతర ప్రసిద్ధ ప్రమాద కారకాలు ఉన్న మహిళలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు .
ఈ లింక్ ఎందుకు ఉందో మరియు దానిని ఎలా నివారించాలో గుర్తించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని వైద్యులు అంగీకరిస్తున్నప్పటికీ, ఋతు ఆరోగ్యం మరియు గుండె ఆరోగ్యాన్ని కలిపి చూడాలని వారు అంటున్నారు.
ముందస్తు రుతువిరతికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వారు తగినంత ఆధారాలు ఉన్నాయని కూడా ఎత్తి చూపారు.
“యువతులు ఇప్పుడు PMS మరియు గుండె సంబంధిత ప్రమాదాల గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదు. దీనికి మరిన్ని ఆధారాలు అవసరం” అని డాక్టర్ సుందర్ రాజన్ స్పష్టం చేసారు .
by Abhi Correspondent | Jul 11, 2025 | పరిశీలన
ఇది ప్రపంచమంతటా పాకుతున్న సంక్షోభం….. జననాల తగ్గుముఖంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
”ప్రపంచం “జనాభా పతనం” అనే అపూర్వమైన సంక్షోభం అంచున ఉంది. భవిష్యత్తులో ఈ సమస్య తీవ్రమైన సామాజిక, ఆర్థిక పరిణామాలకు దారితీస్తుంది” అని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. జూలై 11న జరుపుకునే ''ప్రపంచ జనాభా దినోత్సవం 2025'' సందర్భంగా, ఐరాస విడుదల చేసిన నివేదికలో ఆందోళన కలిగించే అనేక అంశాలు తేటతెల్లమవుతున్నాయ్ .
ఈ సంవత్సరం, “యువతకు సాధికారత: వారు కోరుకున్న కుటుంబాలను సృష్టించుకునేందుకు న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచం” అనే ధీమ్ తో , ఈ సమస్య కేవలం సంఖ్యలకు నివేదిక సంబంధించినది కాదని, మానవ హక్కులు, అవకాశాలు, మరియు యువత భవిష్యత్తుకు సంబంధించినదని ఐరాస స్పష్టం చేసింది.
ఐరాస నివేదిక ప్రకారం, ప్రపంచ సగటు సంతానోత్పత్తి రేటు (ఒక మహిళ తన జీవితకాలంలో జన్మనిచ్చే పిల్లల సగటు సంఖ్య) గత కొన్ని దశాబ్దాలుగా గణనీయంగా క్షీణించింది. ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే, సంతానోత్పత్తి రేటు కనీసం 2.1గా ఉండాలి. దీనిని “రీప్లేస్మెంట్ లెవల్” అంటారు. అయితే, ప్రపంచంలోని మూడింట రెండు వంతుల జనాభా ఇప్పుడు ఈ స్థాయి కంటే తక్కువ సంతానోత్పత్తి రేట్లు ఉన్న దేశాలలో నివసిస్తున్నారు.
దక్షిణ కొరియా, జపాన్, స్పెయిన్, ఇటలీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఈ రేటు 1.5 కంటే తక్కువకు పడిపోయింది. ఆశ్చర్యకరంగా, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా సంతానోత్పత్తి రేటు 2.0 కంటే దిగువకు చేరింది.
ఈ క్షీణతకు అనేక కారణాలు ఉన్నాయి. మహిళల విద్య, ఉద్యోగావకాశాలు పెరగడం, పట్టణీకరణ, పిల్లల పెంపకం ఖరీదైనదిగా మారడం, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, మరియు కుటుంబ నియంత్రణ పద్ధతులపై పెరిగిన అవగాహన వంటి సామాజిక, ఆర్థిక మార్పులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్పులు వ్యక్తిగత స్థాయిలో సానుకూలమైనవే అయినప్పటికీ, సమిష్టిగా అవి జనాభా శక్తిసామర్థ్యాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి.
వృద్ధాప్య జనాభా: సంతానం తక్కువగా ఉండటం, ఆయుర్దాయం పెరగడంతో సమాజంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, సామాజిక భద్రతా పథకాలపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తుంది.
కార్మిక శక్తి కొరత: పనిచేసే వయస్సులో ఉన్న యువత సంఖ్య తగ్గడంతో, దేశాలు తీవ్రమైన కార్మిక కొరతను ఎదుర్కొంటాయి. ఇది పారిశ్రామిక ఉత్పత్తి, ఆవిష్కరణలు, మరియు ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది.
ఆర్థిక మాంద్యం: వినియోగదారుల సంఖ్య తగ్గడంతో, మార్కెట్లు కుంచించుకుపోతాయి. ఇది దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉంది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోతుంది.
సామాజిక మార్పులు: యువతరంపై వృద్ధుల సంరక్షణ భారం పెరుగుతుంది. ఇది కుటుంబ నిర్మాణంలో మరియు సామాజిక సంబంధాలలో మార్పులకు కారణమవుతుంది.
ఐరాస ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతోంది. ఈ సమస్యను కేవలం జనాభా సంఖ్యలను పెంచేదిగా చూడకూడదు. చాలా మంది యువతీ యువకులు పిల్లలను కనాలని కోరుకుంటున్నప్పటికీ, ఆర్థిక అభద్రత, సరైన మద్దతు లేకపోవడం, మరియు సామాజిక ఒత్తిళ్ల కారణంగా వారు తమ కోరికను నెరవేర్చుకోలేకపోతున్నారని ఐరాస పేర్కొంది. దీనినే “పునరుత్పత్తి ఏజెన్సీ” లేకపోవడం అంటారు.
ప్రజలు, ముఖ్యంగా యువత, వారు కోరుకున్నప్పుడు, కోరుకున్న సంఖ్యలో పిల్లలను కనగలిగే వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల బాధ్యత అని ఐరాస వాదిస్తోంది. దీనికోసం, కుటుంబాలకు అనుకూలమైన విధానాలను రూపొందించాలి. ఇందులో భాగంగా, సరసమైన పిల్లల సంరక్షణ, తల్లిదండ్రులిద్దరికీ వేతనంతో కూడిన సెలవులు, గృహ వసతి మద్దతు, మరియు ఉద్యోగ భద్రత కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. అయితే, దీనికి పరిష్కారం ప్రజలను ఎక్కువ మంది పిల్లలను కనమని బలవంతం చేయడం కాదు. బదులుగా, యువతకు సాధికారత కల్పించడం, వారి పునరుత్పత్తి హక్కులను గౌరవించడం, వారు తమ కుటుంబాలను నిర్మించుకోవడానికి అవసరమైన మద్దతును అందించడం ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోగలం… అని మేధావులు, జర్నలిస్టులు సూచిస్తున్నారు .
by Rama Chandra P | Jul 11, 2025 | ఆధ్యాత్మికం
సెప్టెంబరు 24 నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు
తరాల సాంప్రదాయబద్దమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. ఈ క్రమంలో సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక అన్నమయ్య భవనంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభాగాల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కీలక నిర్ణయాలు:
- బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతల కోటాలో దర్శనాలకు అనుమతి ఉండదు.
- దర్శన క్యూ లైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాలలో అన్నప్రసాదాల పంపిణీ, లడ్డూల నిల్వను పెంచుకోవడం.
- వివిధ సేవలకు శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులకు ఆహ్వానం
- సెప్టెంబర్ 28న గరుడ వాహన సేవ నిర్వహించనుండటంతో, ఆ నెల 27 నుంచి 29 వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ.
బ్రహ్మోత్సవాల వివరాలు :
- బ్రహ్మోత్సవాలకు ముందే సెప్టెంబరు 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
- సెప్టెంబరు 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24 న ధ్వజారోహణం.
- అక్టోబరు 1న రథోత్సవం, 2న చక్రస్నానం.
- ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అదే విధంగా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు అందుబాటులో ఉంటాయి.
by Rama Chandra P | Jul 10, 2025 | జాతీయం
రిటైర్మెంట్ తర్వాత వేదాలు , ఉపనిషత్తులు చదువుతారట … నేచురల్ ఫార్మింగ్ చేస్తారట
అమిత్ షా . . కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలోనూ, కేంద్ర సర్కార్ లోనూ సెకండ్ ప్లేస్ లో ఉన్న అమిత్ షా తీసుకున్న నిర్ణయం దేశమంతా చర్చకు తెరతీసింది .
‘‘రిటైర్మెంట్ తర్వాత వేదాలు, ఉపనిషత్తులు చదవాలని కోరికగా ఉంది . ప్రకృతి వ్యవసాయానికీ కొంత సమయాన్ని కేటాంయిచాలనుకుంటున్నాను . రసాయన ఎరువులు , పురుగుమందులతో పండించే పంటలతో జీవనశైలి రోగాలైన బీపీ, డయాబెటిస్, థైరాయిడ్తో పాటు ప్రాణాంతక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఫర్టిలైజర్ల వాడకంపై రైతు సోదరులంతా సామూహికంగా ఆలోచించాల్సి ఉంది. బలమైన నిర్ణయం తీసుకోవాలి . ప్రకృతి వ్యవసాయంతో శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది.” అని అమిత్ షా తన రిటర్మెంట్ ప్రకటన సందర్బంగా చెప్పుకొచ్చారు .
మరో సహకార ఉద్యమం రావాలి .
కేంద్ర సహకార శాఖ నాలుగో ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సహకార్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గుజరాత్లోని ఆనంద్లో చేపట్టిన కార్యక్రమానికి అమిత్ షా తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. అమూల్ డెయిరీకి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పీపుల్, పీఏసీఎస్, ప్లాట్ఫాం, పాలసీ, ప్రాస్పరిటీతో కూడిన కోపరేటివ్ ఉద్యమం దేశవ్యాప్తంగా రావాలని పిలుపునిచ్చారు.సహకార శాఖ మంత్రిగా తన ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అమిత్ షా తెలిపారు. సహకార రంగం వల్ల అనేక మంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేలా సాయ పడిందని గుర్తు చేశారు. ‘‘హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమైన శాఖ ఇచ్చారని అందరూ అన్నారు. కానీ, నేను మాత్రం సహకారశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించినప్పుడు హోంశాఖ కంటే పెద్ద శాఖ ఇచ్చారని భావించా. ఎందుకంటే ఈ శాఖ దేశంలోని పేదలు, రైతులు, గ్రామాలు, పశుసంపద కోసం పనిచేస్తుంది’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
by Rama Chandra P | Jul 9, 2025 | ఆంధ్రప్రదేశ్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం యాత్రలో బెంబేలెత్తిన జనం
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి మామిడి రైతులను పరామర్శించే బంగారుపాళ్యం యాత్ర జనసమీకరణ డ్రామా గా మారింది . ఈ యాత్రకు 10 వేలమందిని అనుమతించాలని ఆయన పార్టీ ఆర్గనైజర్లు పోలీసులను కోరారు. మండలాల వారీగా ఎంతెంత మంది ఎన్నెన్ని వాహనాల్లో రావాలో స్థానిక వైసీపీ నేతలకు కోటాలు కూడా విధించారు. 500 మందికి మించి అనుమతించలేమని పోలీసులు సమాధానమిచ్చారు . జగన్ పార్టీవారికి లా అండ్ ఆర్డర్ తో పనిలేదు. ఈ సారికూడా పోలీసు ఆదేశాలను ధిక్కరించేసారు . ఇష్టానుసారం పేట్రేగిపోయారు .
జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పహారా కాస్తున్న పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వైసీపీ మూకల వీరంగం..
అయితే బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా చేశారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్ యార్డ్లోకి వైసీపీ శ్రేణులు ప్రవేశించారు. పోలీసుల సూచనలను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
జగన్ కి జనసమీకరణ అవసరం :
151 స్థానాల నుండి 11 స్థానాలకు పడిపోయిన పార్టీకి, జన సమీకరణ ఒక రాజకీయ అవసరంగా మారింది. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి: 1) ఓటమి తర్వాత పార్టీ బలహీనపడిందనే ముద్రను చెరిపేయడం, 2) కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచడం, 3) అధికార పక్షానికి తమ బలాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శించడం.
ఈ వ్యూహం నిస్సందేహంగా నిరాశలో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని చురుకుగా ఉంచుతుంది.
* కోర్ ఓటర్ బేస్, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతుంది.
* నాయకుడి ఉనికిని, ప్రాముఖ్యతను మీడియాలో, ప్రజలలో నిరంతరం నిలుపుతుంది.
* కొత్త వివాదాలను సృష్టించడం ద్వారా అధికార పక్షాన్ని నిరంతరం రక్షణాత్మక స్థితిలో ఉంచుతుంది…. అని భావిస్తున్న వైసీపీ ఆ పార్టీ కేడర్ పైనా , నేతలపైనా జనంలో ఉన్న అభిప్రాయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదు .
వైసీపీ హంగామా వల్ల నష్టాలు:
* ప్రజా విసుగు (Public Fatigue): నిరంతరం పునరావృతమయ్యే రాజకీయ నాటకంగా ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఈ డ్రామా
తటస్థ ఓటర్లను జగన్ పార్టీకి దూరం చేస్తుంది. కిడ్నాప్, హింస, ఎన్నికల అక్రమాలు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రౌడీలకు నాయకులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, నేర ప్రవర్తనను సమర్థించడంగా భావిస్తున్నారు.
పదే పదే జన ప్రదర్శనల వల్ల ప్రభుత్వంపై విధానపరమైన, వాస్తవ సమస్యల ఆధారంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశాన్ని జగన్ పార్టీ పోగొట్టుకుంది. .
ఇది పునరుజ్జీవనానికి స్థిరమైన మార్గమా?
జన సమీకరణ అనేది పార్టీ మనుగడకు అవసరమైన స్వల్పకాలిక సాధనం అయినప్పటికీ, అది పార్టీ పునరుజ్జీవనానికి దీర్ఘకాలిక వ్యూహంగా సరిపోదు. రాజకీయ పునరుజ్జీవనం అనేది కేవలం ధిక్కారం, వేధింపుల కథనంపై ఆధారపడి సాధ్యం కాదు. దానికి బదులుగా, పార్టీ తన భారీ ఓటమికి గల కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవడం, తన కోర్ బేస్ను దాటి విస్తృత ఓటర్లతో తిరిగి కనెక్ట్ అవ్వడం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ఆకర్షణీయమైన, సానుకూల దృష్టిని అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుంది
by Rama Chandra P | Jul 9, 2025 | పరిశీలన, బిజినెస్
ఫార్మా ఉత్పత్తులపై 200శాతం,రాగిపై 50, సుంకాలు విధించనున్నట్లు ప్రకటించిన ట్రంప్
భారత్పై భారీ ప్రభావం పడుతుందంటున్న నిపుణులు
తన పిచ్చి చేష్టలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి దిగారు. ఇప్పటికే అమెరికాకు దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం టారిఫ్లను విధించిన ట్రంప్, తాజాగా రాగిపై కూడా 50 శాతం సుంకాలను ప్రకటించారు. అలాగే అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక ఏడాది తర్వాత 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా వార్నింగ్ ఇచ్చారు. సుంకాల అమలు గడువును ఆగస్టు 1 తర్వాత పొడిగించేదిలేదని ట్రాంప్ క్లారిటీ ఇచ్చారు .
భారత్పై ప్రభావం ఏ మేరకు . ..
విధించిన సుంకాలు మిగతా దేశాలతో పాటు భారత్పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యూఎస్కు ఎక్కువగా రాగి, ఔషదాలను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. 2024-25లో ప్రపంచదేశాలకు 2 బిలియన్ డాలర్ల విలువైన రాగి, దాని అనుబంధ ఉత్పత్తులను సరఫరా చేసింది భారత్. ఇందులో అమెరికా మార్కెట్లకు 360 మిలియన్ డాలర్లు లేదా 17 శాతంగా రాగి ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వాణిజ్య డేటా ప్రకారం, సౌదీ అరేబియా (26 శాతం), చైనా (18 శాతం) తర్వాత అమెరికాకు ఎక్కువ రాగి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశంగా మన దేశం మూడవ స్థానంలో ఉంది .
ఫార్మాకు గట్టి దెబ్బె . .. ట్రంప్ సుంకాలు భారత ఫార్మా రంగాన్ని దెబ్బతీయనున్నాయి. రాగి ఉత్పత్తులతో పోలిస్తే ట్రంప్ సుంకాల ప్రభావం ఫార్మా రంగంపైనే ఎక్కువ పడనుంది. ప్రపంచ దేశాల్లో అమెరికాకే భారత్ ఎక్కువ ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను సరఫరా చేసింది. ఇది మునుపటి ఏడాది ఎగుమతులు 8.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. అలాగే భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతంగా ఉంది. ఫార్మా రంగంపై 200 శాతం లెవీ విధించడం వల్ల ఈ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, అమెరికాతో ట్రేడ్ డీల్ను కుదుర్చుకునే పనిలో భారత్ ఉంది. సుంకాల అమలు గడువు ఆగస్టు 1లోపు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే, కొత్త టారిఫ్ ల ప్రభావం భారత మార్కెట్లపై పడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.