అమరావతికి సైకత శిల్ప హారతి . ..

Ram Maddipati

April 6, 2026

సైకత శిల్పం….. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఫైనల్ చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించిన సందర్భంగా ”అమరావతి మన రాజధాని ‘ ‘ అన్న నినాదంతో రూపొందించిన సైకత శిల్పం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ , అతని కుమార్తెలు సోహిత, ధన్యత కలసి రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంది . ఆలోచింపచేస్తుంది .

స్వర్ణాంధ్రప్రదేశ్ కు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ పటం, ఆంధ్రప్రదేశ్ పచ్చగా ప్రకృతితో ఉండాలన్నట్టుగా చుట్టూ మొక్కలు, అభివృద్ధికి సూచికగా బుల్లెట్ ట్రైన్, ఆకాశ హార్మ్యాలు,విమానం, అమరావతికి గుర్తుగా బుద్ధుడు, ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం 35 వేల ఎకరాలను ఇచ్చిన రైతులకు గుర్తుగా ఒక రైతును ఈ సైకత శిల్పంలోరూపొందించడం జరిగింది…

You May Also Like…