చంద్రబాబు ఆహ్వానంతో పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తారా?

Rama Chandra P

May 31, 2025

జగన్ భయం ఇంకా వీడలేదంటున్న పరిశ్రమ వర్గాలు.

దిల్లీలో సీఐఐ వార్షిక సమ్మేళనం – ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వెల్లడించిన చంద్రబాబు

– సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని పిలుపు

”సంపద సృష్టి , ,, సంపద సృష్టి . .. అంటూ పదేపదే చెప్పే చంద్రబాబు మాటలను పరిశ్రమ వర్గాలు నమ్ముతాయి . అయితే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా కొంత భయం పారిశ్రామికవేత్తలతో కనిపిస్తూనే ఉంది . 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు , అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది . .. అంటూ టీడీపీ చేసిన ప్రచారం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది . ఈ ప్రచారం ఇపుడు ఏపీకి పరిశ్రమలు రావడానికి అడ్డుపడేలా ఉంది .

సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామిక వేత్తలు సహకరించాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్‌నెట్‌ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వాళ్లలో తానూ ఒకడినని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌కు జనాభా అనుకూలత ఉందన్న చంద్రబాబు డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ను భారత్‌ సరిగ్గా ఉపయోగించుకోవాలన్నారు.

“ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌, డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీలు ఇలా చాలా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలే. నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నా, చాలా మంది నాయకులను చూశాను. సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ప్రధానిగా ఉన్నారు. మోదీ నాయకత్వం దేశానికి ఓ ప్రధాన బలం. అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అన్నాను, ఇప్పుడు స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటున్నాను. విశాఖలో టీసీఎస్‌ మొదలవుతోంది, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ పరిశ్రమ ప్రారంభం కాబోతోంది. అలాగే విశాఖకు గూగుల్‌ రాబోతోంది” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్‌ చేయడానికి శ్రమిస్తున్నాం. హైదరాబాద్‌ బ్రౌన్‌ఫీల్డ్‌ సిటీ, అమరావతి గ్రీన్‌ఫ్లీడ్‌ సిటీ. అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా. భవిష్యత్తులో ఉత్తమ నగరంగా అమరావతి ఎదుగుతుంది. 2047 విజన్‌గా 15 శాతం వృద్ధిరేటుతో సాగాలనేది లక్ష్యం. క్వాంటం వ్యాలీ, ఏఐ నినాదంతో ముందుకు సాగుతున్నాం. దేశంలో తొలిసారి క్వాంటం కంప్యూటింగ్‌ భారత్‌కు వస్తోంది. టీసీఎస్‌, ఐబీఎం, ఎల్‌ అండ్‌ టీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మారాం” అని చంద్రబాబు వివరించారు.

You May Also Like…