ఏపీ మెట్రో . .. రయ్  రయ్

ఏపీ మెట్రో . .. రయ్ రయ్

తక్కువ వడ్డీపై అప్పు – ముందుకు వచ్చిన పలు సంస్థలు

విజ‌య‌వాడ‌, విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్​ల‌కు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన విదేశీ బ్యాంకులు

ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలక నగరాలు విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ప్రారంభం అవుతున్నాయి . ఇప్పటికే ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్ లు సిద్ధం చేసే ప్రక్రియతో పాటు టెండర్ల ప్రక్రియకూ రంగం సిద్దమవుతుండగా.. ఇప్పుడు వీటికి మరో గుడ్ న్యూస్ అందింది. దీంతో ఇవాళ ఏపీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది.

విజ‌య‌వాడ‌లో ప్రతిపాదిత మెట్రో కారిడార్​ల‌ను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు ప‌రిశీలించారు. రెండు మెట్రో ప్రాజెక్ట్​ల‌కు అయ్యే వ్యయంలో రూ.12,000 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా వేసినట్లు తెలుస్తోంది.

విశాఖ మెట్రోకు రూ.6,100 కోట్లు, విజ‌య‌వాడ మెట్రోకు రూ.5,900 కోట్లు రుణం స‌మీక‌రించాల‌ని నిర్ణయించారు. త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకుల‌తో మెట్రో కార్పొరేష‌న్ ఎండీ సంప్రదింపులు జ‌రుపుతున్నారు. త్వర‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌తో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చ‌ర్చలు జ‌ర‌ప‌నున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ వేగంగా ముందుకు వెళ్తోంది.

విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్​కు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ తొలిదశలో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్‌, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్‌, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్‌ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లు మరో కారిడార్‌ నిర్మించనున్నారు.

విజయవాడ మెట్రో రైల్ రెండు దశలుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో రెండు కారిడార్​లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ, కారిడార్ 1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రోరైల్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు చేపట్టాలని భావిస్తున్నారు .

అమరావతి ‘చట్ట బద్ధత ‘  కోసం  ఏమి చేయబోతున్నారు ?

అమరావతి ‘చట్ట బద్ధత ‘ కోసం ఏమి చేయబోతున్నారు ?

సురక్షితమైన పరిపాలనా భవిష్యత్తు కోసం భవిష్యత్ లో ఆటంకాలు తలెత్తకుండా అమరావతి సేఫ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం


అమరావతికి చట్టపరమైన శాశ్వతత్వాన్ని పొందేందుకు వ్యూహాత్మక ప్రయత్నాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తుంది, రాష్ట్ర స్వయంప్రతిపత్తి మరియు పరిపాలనా స్థిరత్వాన్ని సాధించడం మధ్య సున్నితమైన సమతుల్యతను ప్రతిబింబిస్తుంది .

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సుదీర్ఘ చర్చ కొత్త అధ్యాయంలోకి ప్రవేశించింది, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉంచడానికి ” ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014” ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) చట్టం, 2014, సెక్షన్ 3లో వివరించిన విధంగా నోటిఫికేషన్ ద్వారా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించడానికి రాష్ట్రానికి ఇప్పటికే అధికారం ఇస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్ట శాసన మద్దతు అవసరం లేకుండా రాష్ట్రాలు తమ రాజధానిని ఏర్పాటు చేసుకునే కార్యనిర్వాహక అధికారం ఉంది .

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విభజనను సులభతరం చేయడానికి రూపొందించబడిన పునర్వ్యవస్థీకరణ చట్టం, ప్రధానంగా ఆస్తి విభజన, బాధ్యతలు మరియు పరివర్తన ఏర్పాట్లను పరిష్కరించింది, వీటిలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా తాత్కాలికంగా నియమించడం కూడా ఉంది.

మిగిలిన రాష్ట్ర రాజధానిని శాశ్వతంగా నిర్ణయించడానికి ఉద్దేశించబడలేదు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సవరణ కోసం చేసిన అభ్యర్థన, ఇప్పటికే ఉన్న రాష్ట్ర యంత్రాంగాలు తగినంతగా ఉన్నప్పుడు కేంద్ర జోక్యాన్ని కోరడం వల్ల కేంద్రానికి కొత్త చిక్కులు వచ్చి పడతాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి .

జగన్ దెబ్బకు అమరావతి విలవిల

2015 లో విభాజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమర్ధించారు. 2019లో అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే జగన్ . .. మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చారు . దీంతో అమరావతిని పాతరేసినట్లయింది . ఆ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది . పెట్టుబడిదారుల్లో , అమరావతి రైతులలో , జనంలోనూ జగన్ భయం వెంటాడుతూనే ఉంది. జగన్ మరోమారు అధికారంలోకి రాడన్న భరోసా ఇస్తారా ? అంటూ పలువురు పారిశ్రామికవేత్తలే అడుగుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కూటమి నేతలకు జగన్ అధికారంలోకి రాడన్న భరోసా ఉన్నా జనాన్ని నమ్మించలేరనే విషయం గమనించాలి .


మూడు రాజధానుల నమూనా కోసం గత వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన – అమరావతిని శాసనసభ రాజధానిగా, విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా మరియు కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదించారు . – విస్తృత నిరసనలు మరియు చట్టపరమైన సవాళ్లకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 తీర్పు అమరావతిని ఏకైక రాజధానిగా పునరుద్ఘాటించింది, రాష్ట్రానికి దాని రాజధాని విధులను మూడుగా విభజించే శాసన సామర్థ్యం లేదని ప్రకటించింది. అయినా అప్పటి సీఎం జగన్ తన మొండి వైఖరితో మూడు రాజధానుల ముచ్చటను వదలకపోగా . . మరింత బలంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నించారు .

ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం, అమరావతి పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది, జూన్ 2024లో నాయుడు రాష్ట్రానికి రాజధానిగానే ఉంటుందని ప్రకటించారు. ఈ మార్పు ప్రజలు మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఒక ఖచ్చితమైన అంశంగా సరిపోవడంలేదు . ఎందుకంటే దీనికి చట్టబద్దత లేదన్న డిబేట్ ఇంకా నడుస్తూనే ఉంది .

రెండవది, APCRDA చట్టం మరియు ఆర్టికల్ 162 కింద కార్యనిర్వాహక అధికారాలు అమరావతిని రాజధానిగా పేర్కొనడానికి చట్టపరమైన ఆధారాన్ని అందిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయాన్ని కేంద్ర చట్టంలో పొందుపరచడం భవిష్యత్తులో విధానపరమైన తిరోగమనాలకు వ్యతిరేకంగా బలమైన కవచాన్ని అందిస్తుంది. పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించడానికి పార్లమెంటరీ ఆమోదం అవసరం, దీని వలన తదుపరి మార్పు రాజకీయంగా మరియు విధానపరంగా సంక్లిష్టమైన ప్రయత్నంగా మారుతుంది.


ఇది రాష్ట్ర స్థాయి రాజకీయాల అస్థిరత నుండి అమరావతిని రక్షించగలదు, ముఖ్యంగా రాజధాని కోసం విభిన్న దృక్పథాలతో ప్రభుత్వాలను మార్చిన రాష్ట్ర చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే. ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి $1.6 బిలియన్ల నిధులతో అమరావతి అభివృద్ధి యొక్క ఇటీవలి పునరుద్ధరణ, దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించడానికి స్థిరమైన చట్రం యొక్క అవసరాన్ని మరింత నొక్కి చెబుతుంది.

మూడవదిగా, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం చేసిన విజ్ఞప్తి, అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా చట్టబద్ధతను పెంచడానికి పార్లమెంటరీ చట్టం యొక్క అధికారాన్ని ఉపయోగించుకునే వ్యూహాత్మక ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. స్మార్ట్, స్థిరమైన పట్టణ కేంద్రంగా భావించబడిన ఈ నగరం, సింగపూర్ కన్సార్టియం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

అయితే, 2019 మరియు 2024 మధ్య ఈ ప్రాజెక్ట్ ఎదురుదెబ్బలను ఎదుర్కొంది, మూడు రాజధానుల ప్రతిపాదన రైతులకు యాన్యుటీ చెల్లింపులను నిలిపివేయడానికి, భూమిలేని కుటుంబాలకు పెన్షన్‌లను రద్దు చేయడానికి మరియు ప్రపంచ బ్యాంకు వంటి కీలక అంతర్జాతీయ భాగస్వాములను ఉపసంహరించుకోవడానికి దారితీసింది.

ప్రధాని మోదీ కూడా హామీ ఇవ్వలేదు . .

మే 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పునర్ నిర్మాణ పనులు ప్రారంభించారు . ఆ సందర్బంలో అమరావతికి చట్టబద్దత అంశంపై అయన ఎటువంటి హామీ ఇవ్వలేదు . ఈ ప్రభావం కూడా రాజధాని అమరావతి అభివృద్ధిపై స్పష్టంగా కనిపిస్తుందన్నది కాదనలేని అంశం . ఇప్పటికీ ఏపీ బీజేపీలో జగన్మోహన్ రెడ్డి అనుకూల నేతలు ఉన్నారు . వారి ద్వారా జగన్ అమరావతిని ఎంతోకొంత ఇబ్బంది పెట్టగలరని ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది జనం ఇప్పటికీ అనుమానంగానే ఉన్నారు.ఈ విషయంలో చంద్రభాబు నాయుడు మాటల ద్వారా ఇచ్చే భరోసాను ప్రజలు నమ్మలేరు . దీనిపై కూటమి సర్కార్ పూర్తిస్థాయిలో చట్టబద్దతపై కేంద్రం నుంచి పూర్తిస్థాయి భరోసా తీసుకోవాలి . లేకపోతే చంద్రబాబు ఎన్ని చెప్పినా అమరావతి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న రీతిలోనే ఉంటుందని గుర్తించాలి

దేవిన సిస్టర్స్ ‘సింధూర్’ సైకతం.. అద్భుతం

దేవిన సిస్టర్స్ ‘సింధూర్’ సైకతం.. అద్భుతం


ఓబుళాపురం అక్రమాలలో ‘గాలి ‘  శిక్ష నుంచి తప్పించుకుంటాడా ?

ఓబుళాపురం అక్రమాలలో ‘గాలి ‘ శిక్ష నుంచి తప్పించుకుంటాడా ?

గాలి జనార్దన్‌రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ కేసులో (OMC) సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఏ2 గాలి జనార్దన్‌రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. దోషులు అందరికీ ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.

ఏ3 వీడీ రాజగోపాల్‌ను, ఏ4 ఓఎంసీ కంపెనీని, ఏ7 మెఫజ్ అలీఖాన్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. వీడీ రాజగోపాల్‌కు అవినీతి నిరోధక చట్టం కింద నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. ఏ4 ఓఎంసీ కంపెనీని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు, రూ.లక్ష, రూ.లక్ష చొప్పున రూ.2 లక్షల జరిమానా విధించింది.

ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే వీరు పైకోర్టులకు అప్పీలుకు వెళ్లే ఛాన్స్ ఉంది . అక్కడ వీరికి ఇదే శిక్ష ఖరారవుతుందా ? లేదా తప్పుకుంటారా ? అనేది వేచి చూడాలి .

నిర్దోషులు: సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా తేల్చింది. 2004-09 మధ్య గనులశాఖ మంత్రిగా సబిత పనిచేశారు. సబితతో పాటు విశ్రాంత ఐఏఎస్‌ కృపానందంను నిర్దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. 2022లో ఏ6 శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు కేసు నుంచి డిశ్చార్జి చేసింది.

తుది తీర్పు దశాబ్దంన్నర తర్వాత . . : ఓబుళాపురం మైనింగ్‌ కేసులో 15 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది. ఈ మధ్యలో ఎన్నో జరిగాయి . ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీలో ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.ఓబుళాపురం మైనింగ్‌ కేసు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెలలో వాదనలు ముగిసాయి. విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. 2022లో తెలంగాణ హైకోర్టు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్ఛార్జి చేసింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది.

మోదీ నోట.. ఏదీ  అమరావతి చట్టబద్దత?

మోదీ నోట.. ఏదీ అమరావతి చట్టబద్దత?

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హామీలు ప్రకటించని ప్రధాని

చంద్రబాబును పొగడం – ప్రసంగం తెలుగులో ప్రారంభించడం.. ఇవే మోడీ చేసినవి

ఆంధ్రుల రాజధాని అమరావతికి ఎన్నో వరాలు ప్రకటిస్తారు.. అని మోడీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. హామీల మాటల ఉన్నా.. ‘అమరావతికి చట్టబద్దత ‘ అంశంపై కూడా మోడీ పెదవి విప్పలేదు . కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ . … మోడీ సభకు ఒకరోజు ముందు అమరావతి చట్టబద్దత అంశం పరిశీలిస్తాం . . అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు . అమరావతి రైతులు చంద్రబాబుకు చేసిన విజ్ఞప్తి కూడా చట్టబద్దత . దీనిపై ప్రధానితో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు . అయితే మోడీ మాత్రం దీనిపై ప్రస్తావించకుండా దాటవేశారు .

పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని , అమరావతికి సహకారం అందిస్తామని మాత్రమే చెప్పారు మోడీ . ..

జగన్ భయం ఎలా పోగొడతారు బాబు గారూ.. టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు . 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి . .. అమరావతి రాజధాని కాదని , , మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చి గందరగోళంలో పడేసారు . అమరావతి కోసం భూములిచ్చిన 29 వేలమంది రైతులు రోడ్డెక్కారు . దేశంలోనే అత్యంత అరుదైన ఉద్యమం చేసారు .

మరోమారు జగన్ అధికారంలోకి రారన్న భరోసా ఇస్తారా ? అంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సైతం చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , లోకేష్ లను అడుగుతున్నారు . జగన్ వస్తే . .. భారీ పెట్టుబడులు పెట్టిన మాకు భరోసా ఏమిటి ? అంటూ ఇప్పటికే కీలకమైన పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరక్క వారు వేరే రాష్ట్రాల వైపు ద్రుష్టి సారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్ .

ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ

  • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
  • దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్న ప్రధాని
  • ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా: ప్రధాని
  • ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ
  • దాదాపు 60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా: ప్రధాని
  • ఇవి కేవలం కాంక్రీట్‌ నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్‌ భారత్‌కు బలమైన పునాదులు: ప్రధాని
  • చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

  • అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
  • రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
  • రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
  • రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన
  • ప్రధాని సభకు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన లక్షలమంది ప్రజలు
  • సరైన సమయంలో సరైన నేత … : సీఎం చంద్రబాబు
  • ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు: సీఎం చంద్రబాబు
  • గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు: సీఎం చంద్రబాబు
  • గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి: సీఎం
  • పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారు: సీఎం
  • మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం: సీఎం
  • గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు: సీఎం
  • ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారు: సీఎం
  • ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
  • మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • మోదీజీ మేమంతా మీకు అండగా ఉన్నాం: సీఎం
  • ప్రజలతోనూ వందేమాతరం, భారత్‌మాతాకి జై నినాదాలు చేయించిన సీఎం
  • సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారు: సీఎం
  • ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు: సీఎం
  • మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ: సీఎం
  • ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానానికి ఎదిగింది: సీఎం
  • త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది: సీఎం
  • 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది: సీఎం
  • ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోదీ కృషిచేస్తున్నారు: సీఎం
  • దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు
  • మోదీ నాయకత్వంలో భారత్‌.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది: సీఎం
  • కూటమిగా పోటీచేయడంతో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించాం: సీఎం
  • వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం: సీఎం
  • కేంద్ర సాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: సీఎం
  • దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది: పవన్‌ కల్యాణ్
  • ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు: పవన్‌ కల్యాణ్
  • రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: పవన్‌ కల్యాణ్
  • అమరావతి రైతుల త్యాగాలను మరచిపోము: పవన్‌ కల్యాణ్
  • అమరావతి రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటాం: పవన్‌ కల్యాణ్
  • రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం: పవన్‌ కల్యాణ్

నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్

  • ఒక్క పాకిస్థాన్‌ కాదు వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీచేయలేరు: మంత్రి లోకేశ్
  • భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు: మంత్రి లోకేశ్
  • భారత్‌ వద్ద మోదీ అనే మిసైల్‌ ఉంది: మంత్రి లోకేశ్
  • నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్
  • మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం: లోకేశ్
  • ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారు : లోకేశ్
  • మోదీ, బాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు: లోకేశ్
  • 2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు: లోకేశ్
  • రాజధాని కూడా లేకుండానే విడిపోయాం: లోకేశ్
  • చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు: లోకేశ్
  • చంద్రబాబుపై కోపంతో అమరావతిని పక్కనబెట్టారు: లోకేశ