పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా మన సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతమైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట కు చెందిన దేవిన సిస్టర్స్ రూపొందించిన సైకత శిల్పం..అందరిలో దేశభక్తిని నింపుతోంది. ప్రముఖ సైకత శిల్పి, ఆర్టిస్ట్ దేవిన శ్రీనివాస్ కుమార్తెలైన దేవిన సోహిత , దేవిన ధన్యత ఇద్దరూ తండ్రి నుంచి సైకత శిల్ప కళను నేర్చుకున్నారు. పర్వదినాలు , ప్రముఖ పండగలతోపాటు . …. ప్రజలను చైతన్యం చేయాల్సిన తరుణంలో సందర్భానుసారం వీరు రంగంపేటలోనే సైకత శిల్పాలు రూపొందిస్తు ఉంటారు. స్ఫూర్తి వంతంగా సైకత శిల్పాలు రుపొండుస్తున్న ఈ సోదరీమణులకు పలువురు అభినందనలు చెపుతున్నారు. ”భారత్ పంతం – ముష్కరుల అంతం ‘ ‘ అనే స్లోగన్ తో రూపొందించిన సైకతం స్ఫూర్తిని రగిల్చింది .
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: సీఎం చంద్రబాబు
'' ''అమరావతిని డిజిటల్ హబ్ గా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.. భవిష్యత్తులో...


