by Rama Chandra P | Jun 16, 2025 | ఆంధ్రప్రదేశ్
వైసీపీ కుట్రలో భాగంగానే ‘సాక్షి ‘ డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిపై జుగుప్సాకర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ సమాజంలో అనుమానాలు , సోషల్ మీడియాలో జోరుగా చర్చ..
సాక్షి మీడియా కొమ్మినేని శ్రీనివాస్ రావు , మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు సంస్కార హీనపు , మురికి వ్యాఖ్యల చర్చ ఉదంతం జరిగిన మరుసటి రోజే అమరావతిలో అనంతవరం -నెక్కల్లు గ్రామాల మధ్యలో గూగుల్ సంస్థ ఏర్పాటు జరగాలి . 143 ఎకరాల విస్తీర్ణంలో లో గూగుల్ సంస్థ ఏర్పాటు కానుంది అన్న వార్త మీడియాలో ఫోకస్ కాకుండా . .. డైవర్ట్ చేయడమే . .. అమరావతి పై దారుణ వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నేతలు పన్నిన పన్నాగం అంటూ రెండ్రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది .
గూగుల్ సంస్థ ప్రతినిధులు సైట్ విజిట్ కూడా ఆ లొకేషన్ కి ఒకే చెప్పారు అన్న వార్త వెలువడింది.. దీంతో కూటమి సర్కార్ కి మంచి పేరొస్తుందన్న ఆందోళనలో వైసీపీ కుయుక్తులు పన్నినట్లు పలువురు అనుమానిస్తున్నారు .
గూగుల్ ఇక్కడికి రావడం . … రాష్ట్ర రాజధాని నిర్మాణంలోనే ఒక గేమ్ చేంజర్ అనుకోవాలి..
ఎందుకు అంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేయబడిన ఇన్ఫోసిస్ క్యాంపస్ 50 ఎకరాలలో ఏర్పాటు చేయబడింది..
ఆ సంస్థకి ఆరోజుల్లో భూమి కేటాయింపు చేసింది కూడా నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే..
ఆరోజుల్లో ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో ఎకరానికి 500 మంది చొప్పున మొత్తం 50 ఎకరాలలో 25,000 మందికి ఉద్యోగ కల్పన జరగాలి..
కానీ వాస్తవంగా నేడు ఆ క్యాంపస్ లో అంతకన్నా ఎక్కువగా ఉద్యోగ కల్పన జరిగింది..
నేడు అమరావతి లో ఏర్పాటు కానున్న 143 ఎకరాల క్యాంపస్ లో ఎంత ఉద్యోగ కల్పన జరగనుంది అనేది ఆలోచించండి..
ఒక్క సంస్థ ద్వారా ఒక్క క్యాంపస్ లోనే ప్రత్యక్షంగా కనీసం ఒక 50,000 మందికి తగ్గకుండా ఉపాధి దక్కితే దాని ద్వారా ఇంకెంత మంది పరోక్ష ఉపాధి పొందుతారో ఆలోచించండి..
రాష్ట్రానికి ఇంతటి ఘనత ఒనగూరనుంది అనే వార్త రాష్ట్ర ప్రజలకు తెలియడానికన్నా ముందే ప్రభుత్వంలో వున్న జగన్ కోవర్ట్ అధికారులు ద్వారా జగన్ & ముఠాకి ముందుగానే లీక్ అయ్యి వుండొచ్చు అనేది నిర్వివాదాంశం..
కాబట్టే అటువంటి అంతర్జాతీయ సంస్థ అమరావతి కి రాకుండా అడ్డుకోవడంలో భాగంగానే అమరావతి బ్రాండింగ్ దెబ్బతీయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం అమరావతిలో ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువగా వున్నారు ఇక్కడ ప్రజలలో వేశ్యా వృత్తిలో వున్న వారు ఎక్కువగా వున్నారు అని ప్రచారం చేయడంలో భాగంగానే జరిపిన చర్చ తప్ప అది అప్పటికప్పుడు యాదృచ్చికంగా జరిగిన చర్చ కాదు..
ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా గుర్తు చేసుకుందాము కొన్ని నెలల క్రితం చంద్రబాబు గారు “నేడు యూట్యూబ్ ఇండియా చీఫ్ తో నేడు మాట్లాడాను అమరావతిలో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయమని అడిగాను” అని ట్వీట్ చేసిన రోజు..
అదే ట్వీట్ ను యూట్యూబ్ వారికి ట్యాగ్ చేస్తూ కొందరు దుర్మార్గులు “అమరావతిలో మహిళలకు భద్రత లేదు..రేపు మీ సిబ్బందికి కూడా రక్షణ ఉండదు పైగా అమరావతి ముంపు ప్రాంతం కాబట్టి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టుకోవాలి అంటే హైదరాబాద్ లో పెట్టుకోండి తప్ప అమరావతిలో పెట్టవద్దు” అని ప్రచారం చేసిన ఉన్మాదుల రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా చేసినట్లు చెపుతున్నారు . ..
ఇటువంటి కుట్రదారుల విషయంలో కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి .
by Abhi Correspondent | Jun 15, 2025 | ఆరోగ్యం
వారంలో కనీసం నాలుగుసార్లు తాగితే బోలెడన్ని లాభాలు
మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే ‘టీ’ పడాల్సిందే. అయితే రెగ్యులర్ గా తాగే టీ వలన కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . దీంతో ఇటీవల పలువురు గ్రీన్ టీ అలవాటు చేసుకుంటున్నారు . .
డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుందని, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుందని, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుందని అనుకుంటారు. కానీ, గ్రీన్ టీని పరిమితి మించి తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరం ఉండటం మంచిదని పేర్కొన్నారు.
గుండె జబ్బుల వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఈ సమస్య రాకుండా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం గుండె జబ్బులకి ప్రధాన కారణాలు. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఆర్టరీస్లో ప్లేక్ ఫార్మ్ అయ్యి గుండె జబ్బులకీ స్ట్రోక్కీ దారి తీస్తుంది. గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి.
గ్రీన్ టీలో ఉండే టానిన్లు శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతాయని ఒక పరిశోధనలో తేలిందట . దీని వల్ల వికారం, మలబద్ధకం, కడుపులో అసౌకర్యం, బీపీ పెరగడం లాంటి సమస్యలు రావొచ్చని ”నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ”పరిశోధనలో స్పష్టమయింది . అంతేకాకుండా పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
తలనొప్పి : గ్రీన్ టీని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయని నిపుణులు తెలిపారు. అందులో తలనొప్పి మొదటిది, అంతేకాకుండా నిద్రలేమి, చిరాకు, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని వివరించారు.
గ్రీన్ టీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే పొందాలంటే గ్రీన్ టీని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే, ఏ హెల్త్ కండిషన్కి అయినా సరే ఇదో మ్యాజిక్ క్యూర్ అని అనుకోరాదు. కాబట్టి, మంచి ఆరోగ్యం కోసం మీ రోజుని ఒక కప్పు గ్రీన్ టీతో మొదలు పెట్టండి.
గ్రీన్ టీ ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అధిక మోతాదులో తీసుకున్నప్పుడు ప్రతికూల ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఆరోగ్యంతో ఉన్నవారు కూడా రోజుకు 2-3 కప్పులు మించి గ్రీన్ టీ తీసుకోవద్దని సూచిస్తున్నారు.
by Srinivas Vedulla | Jun 15, 2025 | అభిప్రాయం
బాంబులా పేలిన జన మనోగతం
సాక్షిటివిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జర్నలిస్ట్ ని అని చెప్పుకునే కృష్ణంరాజు అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలపై నమోదైన కేసులో జుడీషియల్ రిమాండ్ ఖైదీగా జైలు కి వెళ్లిన కొమ్మినేని శ్రీనివాసరావు కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినంత మాత్రాన జనం నోళ్ళ నుంచి తప్పించుకోలేరు . ..
మీడియామీద సామాన్యుల్లో జనరల్ గా వున్న కోపం, జగన్ అప్రజాస్వామిక, కక్షసాధింపు, నియంతృత్వాల మీదా, ఓడిపోయాక కూడా రాజధాని అమరావతిని వ్యతిరేకించి ద్వేషాన్ని వెళ్లగక్కే పైశాచికత్వాల మీద మధ్యతరగతి విద్యావంతుల్లో వున్న ఆగ్రహం- కృష్ణంరాజు మాటలతో బాంబులా పేలింది. ఇది కృష్ణంరాజుకు , కొమ్మినేని శ్రీనివాస్ కో నష్టం తెచ్చే అంశంకాకపోవచ్చు . కృష్ణంరాజు అంతగా తెలియని వ్యక్తి . ఈ ఎఫెక్ట్ జగన్ పైనా , అయన పార్టీ YSRCP పైనా … తీవ్ర ప్రభావం పడుతోంది .
మురికి వ్యాఖ్యలను నివారించగలిగి వుండి కూడా, కృష్ణంరాజుపై సోషల్ మీడియా ట్రోలింగ్ పెరిగిపోతుందని తెలిసి కూడా, ఆమేరకు హెచ్చరించి ఓ నవ్వు నవ్వేసి మౌనం పాటించిన కెఎస్ఆర్ దొరికిపోయారు. రిమాండ్ కు పంపడం శిక్షకాదు. ఆయన నేరంచేశాడు కాబట్టి శిక్షింపచేయడానికి మొదలైన పోలీసు ప్రక్రియలో ఒక భాగం మాత్రమే!
ఏ పార్టీ అధికారంలో వున్నా పోలీసు చర్య వెనుక రాజకీయ నిర్ణయాలే వుంటాయనేది కాదనలేని విషయం . పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించే పరిణతి మన సమాజానికి ఇంకా వచ్చినట్లు లేదు .
ఎమో షన్స్ ను రెచ్చగొట్టడంలో న్యూస్ టివిల పాత్ర అంతా ఇంతా కాదు. వార్తలకోసం సమాచారం కోసం 30 శాతం మంది వార్తా పత్రికలు చదువుతున్నారు. 65-70 శాతం వరకూ ప్రజలు న్యూస్ టివిలను చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల విస్తృతి పెరుగు తున్న ప్రస్తుత దశలో పేపర్లు చదివేవారు, టివిలు చూసేవారూ కలిసి 40 శాతం మందివరకూ యూ ట్యూబ్ చానళ్ళను, న్యూ యాప్ లనూ చూస్తున్నారు. వీరి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
పాఠకుల కంటే ప్రేక్షకులే ఎక్కువ మంది వున్న ఈ పరిస్ధితుల్లో టివిలు రేటింగ్ కోసం ఎమోషన్లను రెచ్చగొట్టి వార్తల్ని కల్తీ చేయడంలో మునిగిపోయాయి.
ఇతర టివిలు కనీసం కొంత తటస్ధతను నటిస్తున్నా సాక్షి టివి పూర్తిగా ఏకపక్ష0గానే వ్యవహరిస్తోంది . వాళ్ళు పెట్టుకున్నదే అందుకు . టివిల్లో డిబేట్లు, పానల్ డిస్కషన్లకు మరో పార్టీవారిని పిలవడం మానేశారు. ఈ ధోరణి కి కెఎస్ఆర్ కేంద్రబిందువు అయ్యారు. ఇతర టివిలు కూడా జగన్ వార్టీని వెలివేశాయి. ఈ బాధ్యత జగన్ దే తప్ప కెఎస్ఆర్ ది కాదు. అయినా సీనియర్ హోదాలో తప్పొప్పుల్ని ఆయనే మోయక తప్పలేదు.
ఏకపక్ష టివిలో డిబేట్ ని బ్యాలెన్స్ చేసే కెఎస్ఆర్ ను చూసిచూసి విసుగొచ్చేది. చివరికి నటనాత్మకమైన బేలెన్స్ చేయడంలో కూడా విఫలమైపోయారు. ఆయన జైలుకి వెళ్ళే వరకూ దారితీసిన పరిస్ధితులను గుర్తుచేసుకుంటే అమరావతి పై వ్యాఖ్యలు కేవలం ట్రిగ్రర్ నొక్కడం మాత్రమేనని అర్ధమైపోతుంది.
ఈ కేసులో చట్టం, న్యాయం ఒక ఫ్రేములో తమపని తాము చేసుకుపోతాయి. అది ధర్మబద్ధంగా లేకపోతే ప్రజలు గుర్తుంచుకుంటారు. సమయం వచ్చినపుడు తమ ఇంగిత జ్ఞానం (కామన్ సెన్స్) మేరకు ప్రతిస్పందిస్తారు. ప్రజల నిర్ణయాలు, రాగద్వేషాలు వారి ఇంగిత జ్ఞానం నుంచే వస్తాయి. చట్టం, న్యాయం, ధర్మం కంటే ఇంగితజ్ఞానమే బలీయమైనది.
by Rama Chandra P | Jun 14, 2025 | ఆరోగ్యం
సీజన్ లో తప్పక తినాలని సూచిస్తున్న వైద్య , పోషకాహార నిపుణులు
నేరేడు పండ్లలో పోషకాలూ మెండుగా ఉంటాయి. నేరేడు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. నేరేడు పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులతోపాటు ఫాస్ఫరస్, క్యాల్షియం, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. నేరేడు పండ్లు తింటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
వర్షాకాలంలో విరివిగా దొరికే నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎన్నో రోగాలకు సహజ నివారిణిగా పనిచేస్తాయని అంటున్నారు. ఇందులో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
డయాబెటిస్ కంట్రోల్ : నేరేడు పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదని నిపుణులు సూచిస్తారు . దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో గ్లూకోజ్ లెవల్ను నియంత్రించడానికి దోహదపడుతుందని పేర్కొంటున్నారు. నేరేడు పండ్ల విత్తనాలలో ఉండే జాంబోలిన్, జాంబుసిన్ వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో దోహదపడతాయని, నేరేడు పండ్లలోని ఆంథోసైనిన్లు, ఎలాజిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు స్టార్చ్ను చక్కెరగా మారకుండా నిరోధించే సామర్థ్యం ఉంటుందని, తద్వారా ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తుందని ”National Library Of Medicine ” పేర్కొంది .
కంటి ఆరోగ్యం : నేరేడు పండ్లలో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా రెటీనాను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతుందని, కళ్లలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి దోహదం చేస్తుందని వివరిస్తున్నారు.
నేరేడు పండ్లు తినడం వల్ల .. చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను తొలగిపోతాయి. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కానీ వీటిని సరైన కాంబినేషన్తో తినకపోతే.. ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు.కానీ వీటిని సరైన కాంబినేషన్తో తినకపోతే.. ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు. నేరేడు పండ్లు కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. నేరేడు పండ్లు కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లు టేస్ట్లో పుల్లగా ఉంటాయి. ఇవి ఖాళీ కడుపుతో తింటే.. ఎసిడిటీ, కడుపు నొప్పి, చికాకు వంచి సమస్యలు వస్తాయి. నేరుడు పండు తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాబట్టి ఆహారం తిన్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.
by Rama Chandra P | Jun 13, 2025 | జనరల్
రికార్డ్ దిగుబడి సాధించి చూపించిన ఉపాధ్యాయురాలు –
ఎకరాకు 43 బస్తాల దిగుబడి అంటేనే కొన్ని ప్రాంతాలలో గొప్ప. అలాంటిది ఏకంగా అర ఎకరంలోనే ఈ దిగుబడి సాధించి రైతు లోకం నుంచే ఔరా అనిపించుకుంటున్నారు ఓ ఉపాధ్యాయురాలు . …
తమిళనాడుకు చెందిన ఆ మహిళా రైతు ఏకంగా అర ఎకరానికే 43 బస్తాల వరి పండించి రికార్డు సృష్టించింది. ఓ మహిళే ఈ ఘనతను సాధించింది.
అది కూడా ఆమె ఓ ఉపాధ్యాయురాలు కావడం విశేషం. ఆమె పేరు ప్రసన్న. తమిళనాడులో నివాసం. ఓ ప్రైవేటు కళాశాలలో లో సైన్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది.
అయితే చిన్నప్పటి నుంచి ప్రసన్నకు వ్యవసాయం అంటే ఎంతగానో ఇష్టం. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని గమనించి నిత్యం పొలానికి తీసుకెళ్లేవాడు.
అంతేకాదు ఆమె కళాశాలలో చేరినా రోజూ పొలానికి వెళ్లి వచ్చాకే కాలేజీకి వెళ్లేది. ఈ క్రమంలో ఆమె ఎమ్మెస్సీ బీఈడీ కూడా పూర్తి చేసి టీచర్గా ఉద్యోగం చేయడం ప్రారంభించింది.
అయితే వ్యవసాయం మీద మక్కువ ఉండడంతో ఓ రైతునే పెళ్లి కూడా చేసుకుంది. కాగా తమిళనాడుకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్తగా శ్రీవరి అనే వంగడాన్ని కనిపెట్టడంతో సదరు విత్తనం గురించి తెలుసుకుని దాన్ని పండించాలని నిర్ణయం తీసుకుంది.
అలా ప్రసన్న అనుకున్నదే తడవుగా సంబంధిత అధికారులను కలిసి విత్తనాలను తీసుకుని పంటలు వేసింది. కానీ మొదటి రెండు సార్లు విఫలమైంది.
అయితే ఈ సారి ఎలాగైనా సదరు విత్తనంతో మంచి దిగుబడి రాబట్టాలనుకుంది. ఈ క్రమంలో కృత్రిమ ఎరువుల జోలికి పోకుండా పూర్తి స్థాయిలో సేంద్రీయ పద్ధతిలో తయారు చేసిన ఎరువులను వాడింది.
అయితే ఈ సారి ఆమె అనుకున్నట్టుగానే అత్యంత ఎక్కువగా దిగుబడి సాధించింది. సాధారణంగా ఒక ఎకరా వరి పొలానికి దాదాపుగా 40 బస్తాలు పండుతాయి, కానీ ప్రసన్న చేసిన సాగుతో, శ్రీవరి విత్తనం కారణంగా ఆమె అర ఎకరం పొలంలోనే ఏకంగా 43 బస్తాలు (3223 కిలోలు) వరి పండింది.ఇప్పుడు ప్రసన్న దృష్టి బిందు సేద్యంపై పడింది. ఈ విధానంలో పంటలను పండిస్తూ పేరు తెచ్చుకోవాలన్నది ఆమె కోరిక. ఆమె ఆశ నెరవేరాలని మనమూ ఆశిద్దాం.
ఈ క్రమంలో మొదట్నుంచీ ప్రసన్న చేస్తున్న సాగును, ఆమె వ్యవసాయ పద్ధతులను అధికారులు రిజిస్టర్లలో నమోదు కూడా చేశారు.
దీంతో చివరికి ఆమె సాధించిన దిగుబడి రికార్డు స్థాయిలో ఉండడంతో ఆమెకు రూ.5 లక్షల నగదు కూడా ఈమెకు గిఫ్ట్ గా ఇచ్చారు . అందించారు.