యోగాకు హద్దుల్లేవు :   ప్రధాని మోదీ

యోగాకు హద్దుల్లేవు : ప్రధాని మోదీ

యోగాంధ్రకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ – అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

” యోగాకు మతం లేదు . కులంలేదు . అందరు హ్యాపీగా చేయొచ్చు . . గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది . గ్రామగ్రామాల్లో యువకులు, మహిళలు , చిన్నారులు యోగాను అనుసరిస్తున్నారు.యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని భారత్ నిరూపించింది . యోగాదినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి . . 175 దేశాల్లో యోగా చేయడం అసాధారణ విషయం”   ” అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు . విశాఖలో యోగాంధ్ర లో ముఖ్య అతిధిగా పాలొన్న ప్రధాని ఈ సందర్బంగా యోగాసనాలు వేశారు . ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అని, చంద్రబాబు, పవన్‌ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారని కొనియాడారు.

నూనె తగ్గంపు ఛాలెంజ్ “ యోగాడే సందర్బంగా వంటల్లో 10 శాతం నూనె తగ్గించి వాడటం ప్రారంభిద్దాం . .. ఇది ఛాలెంజ్గా తీసుకుందాం . ..అని మోడీ ఇచ్చిన ఛాలెంజ్ ను యోగాంధ్రలో పాల్గొన్న వారంతా కరతాళ ధ్వనులతో స్వీకరించారు .

వ్యక్తిగత క్రమశిక్షణ  ప్రకృతిలో మనిషి భాగస్వామి అని, యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్న , యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని మోడీ స్పష్టం చేసారు. క్రమం తప్పకుండ యోగ చేసే వారిలో వ్యక్తిగత క్రమశిక్షణ అలవాడుతుందన్నారు. ఇది వ్యక్తి అనూహ్య విజయాలకు దారిదీపం చూపుతుందని పేర్కొన్నారు .

భారతీయ సంస్కృతి అందరి క్షేమం కాంక్షిస్తుందన్న ప్రధాని, యోగాపై దేశంలోని అనేక వైద్యసంస్థలు పరిశోధన చేస్తున్నాయని తెలిపారు. యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయని, గుండె, నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందని చెప్పారు. మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతుందన్న ప్రధాని, అంతర్జాతీయ చికిత్సా కేంద్రంగా భారత్‌ మారుతోందన్నారు.

ప్రధాని మోడీ చొరవతో యోగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ గా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు . యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని చెప్పారు . – యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించడం మోడీ వల్లే సాధ్యమైందన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ప్రధాని మోడీని అందరూ ప్రశంసించాలన్నారు .

గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..

 విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో విజయం సాధించింది . ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది . విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ సందడిగా మారింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేసి . .. రికార్డ్ క్రియేట్ చేశారు .

విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 25వేల మంది గిరిజన విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సాధనలో భాగంగా ఏయూ మైదానంలో 25వేల మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ విద్యార్థులను సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేశ్‌ అభినందించారు.

మీ చిన్నారుల   కాళ్లకు సాక్సులు, షూస్ లేకుండా నడిపిస్తే బెనిఫిట్స్ తెలుసా?

మీ చిన్నారుల   కాళ్లకు సాక్సులు, షూస్ లేకుండా నడిపిస్తే బెనిఫిట్స్ తెలుసా?

ఏమిటి మీరు చెప్పేది… అలా చేస్తే … అరి కాళ్ళు కందిపోవు . .. అని టెన్షన్ పడుతున్నారా? బెనిఫిట్స్ తెలుసుకుంటే నో టెన్షన్

చెప్పులు లేకుండా పార్కులలో వాకింగ్ చేసే జనాన్ని ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. దీనివల్ల వచ్చే లాభాలు తెలుసుకున్న వారే ఇలా చేస్తున్నారు. అయితే లేలేత పాదాల చిన్నారులనూ ఇలా నడిపిస్తే . .. అమ్మో .. వాళ్ళ పాదాలు కందిపోతాయ్/.. అన్న ఆందోళన వస్తుంది చిన్నారుల తల్లులకు. అయితే ఆ ఆందోళన వదిలి ఇలా చేయించండి ఎన్ని ప్రయోజనలో కలుగుతాయని సెలవిస్తున్నారు మానసిక, వైద్య నిపుణులు . ..

పిల్లలకు చెప్పులు లేనిదే బయటకెళ్లనివ్వరు పేరెంట్స్. లేలేత పాదాలు కందిపోతాయని లేదా కాళ్లకు మట్టి అంటుతుందని సాక్సులు, షూలు తొడిగేస్తుంటారు. అయితే ఈ అతి జాగ్రత్త అన్ని సందర్భాల్లో పనికిరాదని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు చెప్పుల్లేకుండా నేలపై, పచ్చటి గడ్డిపై నడవడం వల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా వారికి అనేక ప్రయోజనాలు కలుగుయని అనేక పరిశోధననలలో స్పష్టమయింది .

2. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించండి… మరియు బాగా నిద్రపోండి!

నొప్పి, అలసట, పేలవమైన నిద్ర, ఆటో-ఇమ్యూన్ డిజార్డర్స్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే వాపుకు సంబంధించినవిగా భావిస్తారు. ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రణలో ఉంచడానికి మన శరీరంలో ప్రతికూల ఎలక్ట్రాన్ల సంఖ్యను పెంచడం చాలా ముఖ్యం మరియు దీన్ని చేయడానికి సరళమైన మార్గం ఎర్తింగ్. భూమి యొక్క సహజ ఉపరితలాలపై అరగంట పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రతికూల ఎలక్ట్రాన్‌లను గ్రహించడానికి సమయం లభిస్తుంది – మీతో దీన్ని చేయమని పిల్లలను ప్రోత్సహించడం వల్ల ప్రతి ఒక్కరి నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది!

3. పీడన బిందువులు & నాడీ వ్యవస్థను ఉత్తేజపరచండి

పిల్లలు బూట్లు ధరించినప్పుడు, వారు వాటిలో అన్నింటికంటే ప్రాథమిక ఇంద్రియ అనుభవాన్ని కోల్పోతారు – వారి పాదాల క్రింద ధూళి, రాళ్ళు, ఆకులు మరియు కొమ్మల అనుభూతి. మన పాదాలు బహుళ పీడన బిందువులు మరియు నరాల చివరలతో దృఢంగా అనుసంధానించబడి ఉంటాయి, ఇవి మన శరీరంలోని ఇతర భాగాలకు సందేశాలను అందిస్తాయి. బూట్లు ధరించడం వల్ల ఈ నరాల చివరల ప్రభావం మందగిస్తుంది, అయితే చెప్పులు లేకుండా వెళ్లడం వల్ల వాటిని ప్రేరేపిస్తుంది మరియు క్రమంగా, మన మొత్తం నాడీ వ్యవస్థ. ఇది బహుశా ఇంద్రియ ఆట యొక్క సులభమైన మరియు అత్యంత ఖర్చుతో కూడుకున్న రూపం!

వారి కీళ్ళు & కండరాలను బలోపేతం చేయండి

చెప్పులతో నడవడం వల్ల పిల్లల పాదాలు మరియు చీలమండలలోని కండరాలు బలపడతాయి, సమతుల్యత మరియు భంగిమ మెరుగుపడతాయి. ఇది పాదాల తోరణాలను నిమగ్నం చేస్తుంది, వాటిని బలోపేతం చేస్తుంది మరియు కాళ్ళ అంతటా కండరాల అమరికను మెరుగుపరుస్తుంది. ఇది, తుంటి, మోకాలు మరియు చీలమండలు వంటి కీళ్లలో స్థిరత్వ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది, తరువాత జీవితంలో గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. ప్రకృతితో సంబంధాన్ని పెంపొందించుకోండి

తమ బూట్లు వెంటనే తీసివేయడం వల్ల పిల్లలు తమ పరిసరాల గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి – నేల ఎలా ఉంటుంది? ముందు పదునైన రాతి ఉందా? పొదల్లో ఆ శబ్దం ఏమిటి? వారి ఇంద్రియాలు పెరుగుతాయి – వారు శ్రద్ధ చూపుతున్నారు. ఆ శ్రద్ధ నుండి వారు నడుస్తున్న సహజ ప్రపంచం పట్ల ప్రశంస వస్తుంది. వారు కాళ్ళ కింద కాగితపు ఆకులు నలిగిపోతున్నట్లు భావిస్తారు. గడ్డి యొక్క మృదుత్వం. ముళ్ళ యొక్క పదును. ఐదు ఇంద్రియాలు పూర్తిగా నిమగ్నమైనప్పుడు, వారు పూర్తిగా ప్రకృతితో కనెక్ట్ అవుతారు మరియు అన్నింటికంటే, సహజ ప్రపంచంలో ఉండటానికి ప్రేమను పెంపొందించుకోవడానికి బాల్యం కంటే మంచి సమయం ఇంకేముంటుంది?

ప్రస్తుతం మెజార్టీ పిల్లలకు చిన్న వయసులోనే కళ్లద్దాలు రావడం మనం అందరం చూస్తునే ఉన్నాం. ఇందుకు గ్యాడ్జెట్లు ఒక కారణమైతే, పోషకహార లోపం, నడిచే విధానం కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు నడక వచ్చినప్పట్నుంచే వారిని చెప్పుల్లేకుండా(barefoot) నేలపై, పచ్చటి గడ్డిపై నడిపించడం కంటి ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. ఎందుకంటే, కంటికి అనుసంధానమైన నాడులకు సంబంధించిన ప్రెస్సింగ్ పాయింట్స్ పాదాల్లో ఉంటాయని, నేలపై నడవడం వల్ల వాటిపై ఒత్తిడి పడుతుందని తద్వారా కళ్లకు సరైన రక్తప్రసరణ జరిగి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెపుతున్నారు పరిశోధకులు .

పచ్చటి గడ్డిని చూడడం వల్ల కంటిలోని కండరాలు రిలాక్సవుతాయని నిపుణులు అంటున్నారు. పెద్దైనా ఈ అలవాటును ఇలాగే కొనసాగించడం వల్ల ఇతర కంటి సంబంధిత సమస్యల్లేకుండా జాగ్రత్తపడచ్చు అని సూచిస్తున్నారు.

రోజూ కాసేపు పచ్చటి గడ్డిలో ఆడించడం, చెప్పుల్లేకుండా తిప్పడం వంటివి చేస్తే శరీరంలో హ్యాపీ హార్మోన్ గా పేర్కొనే ఎండార్ఫిన్లు విడుదలవుతాయని, తద్వారా మనసులోని టెన్షన్లన్నీ మాయమై, మానసిక ప్రశాంతత సొంతమవుతుందని పేర్కొంటున్నారు. చెప్పుల్లేకుండా నడవడం వల్ల అభిజ్ఞా వేగం, ఏకాగ్రతలో గణనీయమైన పెరుగుదల, మెదడు ఒత్తిడిలో గణనీయమైన తగ్గుదల కూడా ఉంటాయని . .. నేషనల్ లైబ్రరీ అఫ్ మెడిసిన్ స్పష్టం చేస్తోంది .

Note: ఈ శీర్షికలో ‘అభిన్యూస్ ‘ , వ్యాసకర్తలు అందించే వ్యాసాలు , సూచనలు వివిధ పరిశోధకులు చెప్పినవి. నిపుణులైన వారి సలహాలు , సూచనలు . వీటిని పాటించే ముందు తప్పనిసరిగా . .. మీ వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకోవడం బెటర్.

మావోయిస్టులు ఉనికి కోల్పోయినట్లేనా ?

మావోయిస్టులు ఉనికి కోల్పోయినట్లేనా ?

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది. వరుస ఎన్ కౌంటర్ల తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ వందల సంఖ్యలో సభ్యులను కోల్పోయింది. AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఎక్కువగా సంచరించే మావోలు . … దేవీపట్నం మండలంలోకి వచ్చేసారు. దశాబ్ద కాలంగా దేవీపట్నం మండల పరిసరాలలో మావోల కదలికలు లేవనే చెప్పాలి . అయితే AOB, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో నిఘా పెరగడంతో ఆయా ప్రాంతాలలో సురక్షితం కాదని భావించిన మావోలు . …దేవీపట్నం ఏరియాపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది .

ఏపీలోని అల్లూరి సీతారామ‌రాజు జిల్లా అడ‌వుల్లో భ‌ద్ర‌తా ద‌ళాల గాలింపు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఒక మ‌హిళ స‌హా ముగ్గురు మావోయిస్టు కీల‌క నేత‌లు మ‌ర‌ణించారు. రంప‌చోడ‌వ‌రం, మారేడుమిల్లి ప్రాంతాల స‌మీపంలోని కొండ‌మొద‌లు, కొయ్య‌ల‌గూడెం, చింత‌కూరు వ‌ద్ద ఇరువ‌ర్గాల‌కు భీక‌ర కాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌నలో చ‌నిపోయిన వారిని మావోయిస్టు అగ్ర‌నేత చ‌ల‌ప‌తిరావు భార్య అరుణ‌, గాజ‌ర్ల ర‌వి అలియాస్ ఉద‌య్‌, అంజు గా గుర్తించిట్టు తెలుస్తోంది. చ‌ల‌ప‌తిరావు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో చ‌త్తీస్‌గ‌ఢ్ ఒడిశా రాష్ట్రాల స‌రిహ‌ద్దులో జ‌రిగిన భ‌ద్ర‌తాద‌ళాల కూంబింగ్‌లో జ‌రిగిన కాల్పుల్లో మ‌ర‌ణించాడు.

కాగా ఘ‌ట‌నా స్థ‌లంలో మూడు ఏకే 47 రైఫిల్స్ స‌హా భారీగా ఆయుధాల‌ను భ‌ద్ర‌తాద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. హ‌తుల్లో అరుణ మావోయిస్టు స్పెష‌ల్ జోన్ క‌మిటీ స‌భ్యురాలు కాగా గాజ‌ర్ల ర‌వి కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా, అంజు ఆంధ్రా ఒరిస్సా బోర్డ‌ర్ స్పెష‌ల్ జోన్ క‌మిటీ ఏసీఎంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అరుణ 2018లో జ‌రిగిన నాటి టీడీపీ ఎమ్యెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హ‌త్య కేసులో నిందితురాలిగా ఉన్నారు. ఆమెపై రూ. 20 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. చ‌నిపోయిన‌వారి మృత‌దేహాల‌ను రంప‌చోడ‌వ‌రం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఇటీవ‌లికాలంలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఈ ప్రాంతమంతా ఉన్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు తాజా ప‌రిణామాల‌తో ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఒక‌ప్పుడు ఏవోబీ తో పాటు విశాఖ‌, తూర్పుగోదావ‌రిజిల్లాల్లోని దండ‌కార‌ణ్య ప్రాంతం మావోయిస్టుల‌కు పెట్ట‌నికోట‌గా ఉండేది. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌నుంచి ప‌లువురు యువ‌కులు ఈ ఉద్య‌మం ప‌ట్ల ఆకర్షితులై చేర‌డంతోపాటు, గ్రామాల్లో ప‌లువురు సానుభూతిప‌రులు సైతం ఉండేవారు. అందుకే మావోయిస్టు ఉద్య‌మం బ‌లంగా విస్తరించింది. భ‌ద్ర‌తా ద‌ళాల‌కు.. మావోయిస్టుల‌కు త‌ర‌చుగా కాల్పులు జ‌రుగుతూ ఇరువైపులా ప్రాణ‌న‌ష్టం జ‌రిగేది. కూంబింగ్ భారీస్థాయిలో జ‌రుగుతున్న స‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా తీవ్ర‌వాదులు స‌రిహ‌ద్దుల్లోని చ‌త్తీస్‌గ‌ఢ్ ఒడిశా ప్రాంతాల్లోని ద‌ట్ట‌మైన అడ‌వుల్లో త‌ర‌లిపోయి షెల్ట‌ర్ తీసుకునేవారు. త‌మ‌కు అనువైన స‌మ‌యంలో ఒక్క‌సారిగా విరుచుకుప‌డి ఎదురుదాడి చేసేవారు. ఈ కార‌ణంగానే వారిని ఎదుర్కోవ‌డం పోలీసుల‌కు పెనుస‌వాల్‌గా ఉండేది.

కొన్నేళ్ల క్రితం తీవ్ర‌వాద ఉద్య‌మం బ‌లంగా ఉన్న స‌మ‌యంలో ఏవోబీలోను, బ‌స్త‌ర్ అడ‌వుల్లోనూ కూంబింగ్‌కు వెళ్లిన భ‌ద్ర‌తాద‌ళాల‌పై ఊహించ‌నివిధంగా చుట్టుముట్టి మావోలు భీక‌ర‌మైన దాడులు చేశారు. 2008 జూన్ 29న ఒడిశా రాష్ట్రంలోని బ‌లిమెల జ‌లాశ‌యంలో గ్రేహౌండ్స్ ద‌ళాలు ప్ర‌యాణిస్తున్న ప‌డ‌వ‌పై మావోయిస్టులు తూటాల వ‌ర్షం కురిపించ‌డంతో 32మంది గ్రేహౌండ్స్ సిబ్బంది, ఐదుగురు పోలీసులు స‌హా మొత్తం 38 మంది మ‌ర‌ణించారు. 2010 ఏప్రిల్‌లో చ‌త్తీస్‌గడ్ రాష్ట్రంలోని చింత‌ల్నార్ వ‌ద్ద కూంబింగ్‌కు వెళ్లిన 200 మంది భ‌ద్ర‌తాద‌ళాల‌ను దాదాపు వెయ్యిమంది మావోయిస్టులు చ‌క్ర‌వ్యూహంలో బంధించి జ‌రిపిన మార‌ణ‌హోమంలో 76మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో జ‌రిగిన మావోయిస్టు దాడుల్లోనే ఇది అతిపెద్దది. 2023 ఏప్రిల్ నెల‌లో మ‌ళ్లీ దంతెవాడ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వ‌స్తున్న ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని మందుపాత‌ర‌తో పేల్చి 10మందిని బ‌లిగొన్నారు. మావోల దాడుల్లో ఇవి కొన్ని మాత్ర‌మే.

మావోయిస్టుల స‌మ‌స్యను బీజేపీ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. కేంద్ర హోం శాఖ‌.. మావోయిస్టు ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో అణ‌చివేయాల‌ని నిర్ణ‌యించింది. దీంతో సీఆర్‌పీఎఫ్ కోబ్రా ద‌ళాలు మావోల ప్రాబ‌ల్య‌మున్న రాష్ట్రాల పోలీసుల స‌హ‌కారం స‌మ‌న్వ‌యంతో వారున్న అట‌వీ ప్రాంతాల‌ను కొన్ని నెల‌లుగా ప్ర‌ణాళిక ప్రకారం జ‌ల్లెడ ప‌డుతున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ జ‌రుగ‌ని స్థాయిలో మావోల‌తో దాదాపు యుద్ధం చేస్తున్నాయి. గ‌త రెండు మూడు నెలల్లోనే మావోయిస్టు అగ్ర‌నాయ‌క‌త్వంతో స‌హా రెండువంద‌ల‌మందికి పైగా భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో హ‌త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఏం చేయాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితిని ఎదుర్కొంటున్న మావోయిస్టులు చెల్లాచెదురై షెల్ట‌ర్ తీసుకునేందుకు ఈ ప్రాంతానికి వ‌చ్చిన‌ట్టు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఆయుధాలు చేత‌బ‌ట్టి హింసావాదంతో వ్య‌వ‌స్థ‌ల‌ను మార్చవ‌చ్చ‌ని న‌మ్మే కాలం చెల్లిన ఆలోచ‌నావిధానం, మారిన సామాజిక ఆర్థిక అంశాల‌ను గుర్తించ‌లేని పిడివాదం.. సామాన్య ప్ర‌జ‌ల్లో ఉద్య‌మంపై ఒక‌నాటి సానుభూతి క్ర‌మేణా క‌రిగిపోవ‌డం మావోయిస్టు ఉద్య‌మం బ‌ల‌హీన‌ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పాలి. మారిన సామాజిక, ఆర్థిక‌ ప‌రిస్థితుల కార‌ణంగా యువ‌త‌కు అభివృద్ధి ఫ‌లాలు అంద‌డంతో కొత్త‌గా ఉద్య‌మం వైపు ఆక‌ర్షిత‌మ‌య్యేవారు క‌రువ‌య్యారు. ఇదే స‌మ‌యంలో కొంద‌రు మావోయిస్టు పార్టీ నేత‌లు తెలంగాణ‌లోనూ ఇటు ఏపీ, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోనూ కొన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి ఉద్య‌మాన్ని త‌మ స్వార్థం కోసం వాడుకున్నార‌న్న ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఒక‌ర‌కంగా వారి వెన్నుపోటు పార్టీని త‌ప్పుడు మార్గం ప‌ట్టించింది. మావోయిస్టుల‌ను త‌మ రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు, రాజ్యాధికారం చేజిక్కించుకునేందుకు అత్యంత వ్యూహాత్మ‌కంగా వాడుకున్న ఆ నేత‌లు తమ‌కు అధికారం ద‌క్కాక ఉద్య‌మాన్ని అంతం చేసేందుకు త‌మ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించారు. ఉద్య‌మం బ‌ల‌హీనం కావ‌డం మొద‌లైంది ఆ కాలంలోనే. ప్ర‌జాస్వామ్య‌ వ్య‌వ‌స్థ‌లో లోపాల‌పై పోరాడాల్సింది పోయి వ్య‌వ‌స్థ‌పైనే పోరాటం సాగిస్తామ‌న‌డం అర్థ‌ర‌హితం అవివేకం. మావోయిస్టు ఉద్య‌మం ఉత్ధాన ప‌త‌నాలు చెప్పే పాఠ‌మ‌దే. అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించే ధైర్య‌మున్న అతికొద్దిమంది యువ‌త ప్ర‌జాస్వామ్యానికి అనుగుణంగా పోరాడిఉంటే జాతిని ముందుకు న‌డిపించే నాయ‌కులుగా ఎదిగేవారు. ఆవేశం, అతివాదంతో ఆయుధాలు ప‌ట్టి అడ‌విపాలై త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుకోత మిగిల్చారు.

ఫోన్ ట్యాపింగ్ లో ‘కెసిఆర్’ ఇరుక్కోవాల్సిందే…

ఫోన్ ట్యాపింగ్ లో ‘కెసిఆర్’ ఇరుక్కోవాల్సిందే…

ఫోన్ ట్యాపింగ్‌. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మ‌రోసారి సంచ‌ల‌నంగా మారింది . తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, BRS చీఫ్ కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో మొద‌లై ఆ త‌ర్వాత ఇటు ఏపీకి కూడా ఈ అరాచ‌కం విస్త‌రించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తెలంగాణలో ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ ద‌ర్యాప్తులో వెలుగుచూసిన‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అటు రాజ‌కీయ పార్టీల నాయ‌కుల‌తోపాటు ఇటు సామాన్య ప్ర‌జ‌ల‌ను కూడా నివ్వెర‌ప‌రచేవే. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తోపాటు ప‌లువురుపారిశ్రామికవేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు, వ్యాపారులు కూడా ఈ ఘ‌ట‌న‌లో బాధితులేన‌ని వార్త‌లు వెలువ‌డుతుండ‌టం వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో కొంద‌రు నేత‌ల కార‌ణంగా విలువ‌లు ఎంత‌గా దిగ‌జారిపోయాయో స్పష్టం అవుతోంది .

గ‌తంలో ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ న‌గ‌రంలో నాడు టీడీపీ నేత‌గా ఉన్న రేవంత్‌రెడ్డిపై జ‌రిగిన స్టింగ్ ఆప‌రేష‌న్ ఓటుకు నోటు కేసు. రాజ‌కీయంగా అప్ప‌ట్లో అదో సంచ‌ల‌నం. తెలంగాణలో త‌మ పార్టీని శాశ్వ‌తంగా అంతం చేయాల‌ని జ‌రిగిన రాజ‌కీయ కుట్ర‌గా టీడీపీ ఆ ఘ‌ట‌న‌ను చెప్పుకున్నా.. టీడీపీకి రేవంత్‌రెడ్డికి అదో మ‌చ్చ‌గా మిగిలింద‌నే చెప్పాలి. ఈ కేసు కార‌ణంగానే గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వం రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన సంగ‌తి తెలుగు ప్ర‌జ‌లు అంత తేలిక‌గా మ‌ర‌చిపోలేరు. అంతేకాదు.. ఈ కేసులో నాటి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును నాడు కేసీఆర్ ప్ర‌భుత్వం టార్గెట్ చేయ‌డంతో ఫోన్ ట్యాపింగ్ అంశం అప్పట్లోనే తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. ఈ అనుమానంతోనే చంద్ర‌బాబునాయుడు ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్నా హైదరాబాద్ ను వ‌దిలి ఏపీ నుంచే పాల‌న సాగించేందుకు సిద్ధ‌ప‌డ్డారన్న విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే ఇదంతా ఫోన్ ట్యాపింగ్ స‌హాయంతో చేసిన కుట్ర‌గా భావించిన రేవంత్‌రెడ్డి ఆ త‌ర్వాత కాలంలో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఆయ‌న సీఎం అయిన నాటినుంచి గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై గ‌ట్టిగా దృష్టి సారించారు. నాటి ప్ర‌భుత్వంలో దీనికి సంబంధించి ప‌నిచేసిన కీల‌క అధికారుల విచార‌ణ‌లో విస్తుగొలిపే అంశాలు బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పోలీస్ అధికారిని అరెస్ట్ చేసిన విషయం విదితమే . అతను వెల్లడించిన సమాచారం ఆధారంగా కెసిఆర్ అండ్ కో కు కూడా ఉచ్చు బిగుస్తోంది .

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి. మించిదని చెప్పాలి . ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు . చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నారు . ఆ సమయంలో జగన్ కోరిక మేరకు కెసిఆర్ . .. చంద్రబాబు తదితరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించాయినట్లు బలమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి . దీనికి సంభిందించి ఇప్పటికే కొన్ని అధరాలు సేకరించినట్లు తెలుస్తోంది .

‘యోగా’… వరల్డ్ ఫోకస్

‘యోగా’… వరల్డ్ ఫోకస్

ప్రధాని మోదీ తోపాటు 5 లక్షల మంది పాల్గొనే ఛాన్స్

విశాఖ తీరంలో 22 కిలోమీటర్ల మేర యోగాడే భారీ నిర్వహణ

ఈ నెల 21న విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రధానితోపాటు 5 లక్షలు మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి, ఒక యోగా శిక్షకుణ్ని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం ఆంధ్రా వర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతోపాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా ప్రభుత్వం శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్‌కే బీచ్‌లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతోపాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకూ 22 కిలోమీటర్లు మేర దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు.

 విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో ఈ నెల 21న ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ‘యోగా సంగమం’ పేరుతో జరిగే అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో 5 లక్షల మంది ప్రజలు, 40 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ తెలిపారు.

మతం కాదు . … చాలా మంది అభిప్రాయపడుతున్నట్లు యోగా అనేది ఒక మతం కాదు, ఇది ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సును లక్ష్యంగా చేసుకునే జీవన విధానం. మనిషి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక జీవి, మన వేదాలలో చెప్పినట్లుగా యోగా ఈ మూడింటి మధ్య సమతుల్యతను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది . ఏరోబిక్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు శారీరక శ్రేయస్సును మాత్రమే నిర్ధారిస్తాయి. ఈ వ్యాయామాలు ఆధ్యాత్మిక లేదా ఆస్ట్రల్ బాడీ మెరుగుదలతో చాలా తక్కువ సంబంధం కలిగి ఉంటాయి.

యోగా ఒక సాధన మాత్రమే కాదు, అది జీవన దృష్టికోణం. యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతీయ సంస్కృతిని గర్వకారణంగా నిలుపుతోంది. యోగా భారతీయ సంస్కృతి, జీవన విధానంలో ఒక అమూల్యమైన వారసత్వం. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, మానసిక, శాస్త్రీయ, సాంస్కృతిక కోణాల నుండి మానవ జీవనాన్ని సమగ్రంగా సుసంపన్నం చేసే ఒక సంపూర్ణ జీవన శైలి. యోగాను సమగ్ర జీవన శైలిగా స్వీకరించడం ద్వారా వ్యక్తులు, సమాజం ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవనాన్ని సాధించగలరు.

శరీర నిర్మాణ శాస్త్రానికి, యోగ సాధనకు వున్న సంబంధాన్ని గుర్తించిన డాక్టర్ గన్ని భాస్కరరావు తమ GSL ఫిజియోథెరపీ, స్వతంత్ర ఫిజియో థెరపీ కాలేజీలలో ఒక సంవత్సరం యోగా కోర్సును 2017 సంవత్సరంలో ప్రారంభించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ అఫిలియేషన్ ఇవ్వడంతో దేశంలో మొదటి సారిగా పారామెడికల్ కోర్సులో యోగా ఒక సబ్జెక్టు అయ్యింది. వచ్చే సంవత్సరం నుంచి ఫిజియో ధెరపి రెండవ సంవత్సరంలో ఒక సబ్జెక్టుగా యోగాను చేరుస్తూ డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుపై ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ లో ప్రతి విద్యార్ధీ 21 రోజుల పాటు యోగ సాధన చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ అకడమిక్ ప్రోగ్రాంలో చేర్చింది. అన్ని మెడికల్ కోర్సుల్లో యోగ సాధనను పాఠ్యాంశంగా చేర్చే విధంగా ఆయా విభాగాల అధికారులు జాతీయ స్ధాయిలో అకడమిక్ కేలెండర్లు రూపొందిస్తున్నారు. యోగ ను ఒక పాఠ్యాంశంగా ప్రారంభించడంలో రాజమండ్రి జిఎస్ఎల్ ఫిజియోథెరపీ ముందడుగు వేయగా ఇపుడు ఆ పాదముద్రలు దేశమంతటా విస్తరిస్తున్నాయి.

యోగా మూలాలు భారతీయ ఆధ్యాత్మికతలో లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. పతంజలి రచించిన యోగసూత్రాలు యోగాను “చిత్తవృత్తి నిరోధః” (మనస్సు యొక్క చంచలత్వాన్ని నియంత్రించడం)గా నిర్వచించాయి. యోగా ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం ద్వారా ఆత్మను శుద్ధి చేసి, దైవంతో ఐక్యతను సాధించే మార్గాన్ని చూపుతుంది. భగవద్గీతలో కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ వంటి వివిధ యోగ మార్గాలను వివరించారు. ఇవి ఆధ్యాత్మిక జీవనానికి దిశానిర్దేశం చేస్తాయి. యోగా ద్వారా వ్యక్తులు స్వీయ-అవగాహన, శాంతి, జీవన లక్ష్యాన్ని సాధించగలరు.

మానసిక ఆరోగ్యం కోసం యోగా ఒక శక్తివంతమైన సాధనం. ఆధునిక జీవనంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు సర్వసాధారణం. యోగా లోని ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలు నాడీ వ్యవస్థను శాంతపరచి, మానసిక స్థిరత్వాన్ని అందిస్తాయి. శాస్త్రీయ అధ్యయనాలు యోగా కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను తగ్గించి, సంతోషాన్ని ప్రేరేపించే సెరోటోనిన్, డోపమైన్ వంటి హార్మోన్లను పెంచుతుందని నిరూపించాయి. యోగా ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత కూడా మెరుగుపడతాయి. భారతీయ సంస్కృతిలో యోగా ఒక జీవన విధానంగా స్వీకరించబడినప్పటికీ, ఆధునిక జీవన శైలిలో దీని అవసరం మరింత పెరిగింది.

యోగా శారీరక ఆరోగ్యానికి ఒక సమగ్ర విధానం. ఆసనాలు శరీర సౌలభ్యాన్ని, బలాన్ని, సమతుల్యతను పెంచుతాయి. ప్రాణాయామం శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. యోగా రక్తప్రసరణ, జీర్ణక్రియ, హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, రక్తపోటు, గుండె జబ్బుల నివారణలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ జీవనంలో యోగా శరీరాన్ని ఆలయంగా భావించి, దానిని ఆరోగ్యవంతంగా ఉంచే సాధనగా పరిగణించబడుతుంది. ఆధునిక కాలంలో ఫిట్‌నెస్ కేంద్రాలలో యోగా ప్రజాదరణ పొందడం దీని శారీరక ప్రాధాన్యతను సూచిస్తుంది.

యోగా శాస్త్రీయ దృక్కోణంలో కూడా అత్యంత సమర్థవంతమైన సాధనగా గుర్తింపు పొందింది. ఆధునిక వైద్య శాస్త్రం యోగాను ఒక పరిపూరక చికిత్సగా గుర్తిస్తోంది. నాడీ వ్యవస్థ, హార్మోన్ల వ్యవస్థ, మానసిక ఆరోగ్యంపై యోగా యొక్క ప్రభావాలను అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. ఉదాహరణకు, యోగా ద్వారా మెదడులోని హిప్పోకాంపస్, అమిగ్డాలా వంటి భాగాలు బలపడతాయని, ఇది జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణకు దోహదపడుతుందని తేలింది. యోగా యొక్క శాస్త్రీయ ఆధారం దానిని పాశ్చాత్య దేశాలలో కూడా ఒక గుర్తింపు పొందిన ఆరోగ్య సాధనగా మార్చింది. భారతదేశంలో యోగా శాస్త్రీయ అధ్యయనాలకు కేంద్రంగా మారిన సంస్థలు దీని ప్రాధాన్యతను మరింత బలపరుస్తున్నాయి.

యోగా భారతీయ సంస్కృతిలో ఒక అవిభాజ్య అంశం. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాలలో యోగా సూచనలు కనిపిస్తాయి. ఇది భారతీయ జీవన విధానంలో శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయాన్ని సాధించే మార్గంగా పరిగణించబడుతుంది. గురుకుల విద్యా విధానంలో యోగా ఒక అంతర్భాగంగా ఉండేది. అయితే, ఆధునికీకరణ, పాశ్చాత్య ప్రభావాల కారణంగా యోగా సాంస్కృతిక జీవనంలో కొంత వెనుకబడింది. దీనిని పునరుద్ధరించడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) ఒక మైలురాయిగా నిలిచింది, ఇది భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసింది.

యోగా విస్తరణ ఆశాజనకంగా ఉంది. 2015లో ఐక్యరాష్ట్ర సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం దాని ప్రపంచ గుర్తింపుకు నాంది. ప్రధాని నరేంద్ర మోది యోగాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ మాదిరి ప్రచారం చేయడం అంతర్జాతీయ గుర్తింపునకు ఒక కారణం. 75 ఏళ్ళ వయసులో చంద్రబాబు నాయుడు పరిపూర్ణ ఆరోగ్యానికి ఆయన యోగ సాధన ముఖ్యకారణమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు.

యోగా ఒక అభ్యాసంగా అసంఖ్యాక ప్రయోజనాలను కలిగి ఉంది, ఇది ఒక వ్యక్తిని శారీరకంగా మరియు మానసికంగా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. అది మీ రక్తపోటును తగ్గించడం లేదా మీ నొప్పిని తట్టుకునే శక్తిని పెంచడం అయినా, యోగా పనిచేసే కొన్ని విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • మెరుగైన రక్త ప్రసరణ:
    యోగా మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని అర్థం శరీరమంతా ఆక్సిజన్ మరియు పోషకాలను బాగా రవాణా చేయడం. మెరుగైన రక్త ప్రవాహం ఆరోగ్యకరమైన అవయవాలు మరియు మెరిసే చర్మాన్ని కూడా సూచిస్తుంది.
  • భంగిమను మెరుగుపరుస్తుంది:
    యోగా ఎలా నియంత్రించాలో మరియు సమతుల్యతను ఎలా నేర్పుతుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా, మీ శరీరం స్వయంచాలకంగా సరైన భంగిమను తీసుకుంటుంది. మీరు నమ్మకంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తారు.
  • మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది:
    క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల మీ మానసిక స్థితి తక్షణమే మెరుగుపడుతుంది ఎందుకంటే ఇది మీ శరీరానికి ఉత్తేజకరమైన శక్తిని ఇస్తుంది.
  • రక్తపోటు తగ్గుతుంది:
    రోజూ యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను సాధ్యం చేస్తుంది, దీని వలన శరీరం ప్రశాంతంగా ఉన్నప్పుడు రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది.
  • అకాల వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతుంది:
    సమయానికి ముందే కాకుండా అందంగా వృద్ధాప్యాన్ని ఎందుకు నిర్వహించకూడదు? అవును, యోగా విషాన్ని మరియు ఫ్రీ రాడికల్స్‌ను నిర్విషీకరణ చేయడానికి మరియు తొలగించడానికి సహాయపడుతుంది. ఇది ఇతర ప్రయోజనాలతో పాటు, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి కూడా సహాయపడుతుంది. యోగా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, ఇది వృద్ధాప్యాన్ని అధిగమించే మరో అంశం.
  • ఒత్తిడిని తగ్గిస్తుంది:
    మీరు యోగా మ్యాట్ మీద ఉన్నప్పుడు, మీరు సాధనపై దృష్టి పెడతారు. దీని అర్థం మీ దృష్టి అంతా చేతిలో ఉన్న విషయంపై కేంద్రీకృతమై ఉంటుంది మరియు మీ మనస్సు దానిని పీడిస్తున్న ఒత్తిడి మరియు ఇబ్బందులను నెమ్మదిగా తొలగిస్తుంది.
  • పల్స్ రేటు తగ్గుదల:
    యోగా శరీర ఒత్తిడిని తగ్గించడం ద్వారా శరీరాన్ని సులభతరం చేస్తుంది. శరీరం విశ్రాంతి తీసుకున్నప్పుడు, పల్స్ రేటు తగ్గుతుంది. తక్కువ పల్స్ రేటు అంటే మీ గుండె తక్కువ బీట్స్ వ్యవధిలో ఎక్కువ రక్తాన్ని పంప్ చేసేంత బలంగా ఉందని సూచిస్తుంది.
  • బలాన్ని పెంచుతుంది: శారీరకంగా బలాఢ్యులుగా తయారవ్వడానికి యోగా ఎంతో మెరుగైన సాధనం .
    శరీర బరువు ఎక్కువ ఉన్నవారిలో కేలరీలు యోగాతో కరుగుతాయి .
  • ఆందోళన వదులుతుంది :
    శరీరాన్ని మెలి తిప్పడం, వంగడం వంటివాటివల్ల ఆందోళన తగ్గుతుంది . యోగాతో శ్వాసను నియంత్రించడం వల్ల ఆందోళనను అధిగమించేందుకు ఉపయోగపడుతుంది .
  • తగ్గిన శ్వాస రేటు:
    యోగాలో నియంత్రిత శ్వాస ఉంటుంది. ఇది మీ ఊపిరితిత్తులను వాటి పూర్తి సామర్థ్యానికి నింపడం, తద్వారా అవి మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.
  • డిప్రెషన్ తో పోరాడుతుంది:
    మీరు యోగా సాధన చేసినప్పుడు, అణచివేయబడిన భావాలు బయటపడతాయి. మీరు విచారంగా అనిపించినప్పటికీ, ప్రతికూల శక్తి విడుదల అవుతుంది. యోగాతో క్రమంగా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది . ఇది డిప్రెషన్ తో పోరాడటానికి సహాయపడుతుంది.
  • సమతుల్యత :
    యోగా సమతుల్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది మరియు మీ శరీరంపై నియంత్రణ సాధించడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. యోగాను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల తరగతిలో భంగిమలను సమతుల్యం చేసుకునే మరియు తరగతి వెలుపల బాగా దృష్టి పెట్టే మీ సామర్థ్యం పెరుగుతుంది.
  • అవయవాల ఉద్దీపన:
    మీరు యోగా సాధన చేసినప్పుడు అంతర్గత అవయవాలు మసాజ్ చేయబడతాయి, తద్వారా వ్యాధులకు మీ నిరోధకత పెరుగుతుంది. అలాగే, మీరు మీ శరీరానికి అనుగుణంగా మారిన తర్వాత, సంవత్సరాల సాధన తర్వాత, మీ శరీరం సరిగ్గా పనిచేయకపోతే మీరు తక్షణమే చెప్పగలుగుతారు.
  • రోగనిరోధక శక్తి పెంపు :
    యోగా శరీరంలోని ప్రతి కణాన్ని నయం చేయడానికి మరియు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నప్పుడు, మీ శరీరం స్వయంచాలకంగా మరింత రోగనిరోధక శక్తిని పొందుతుంది. తద్వారా, రోగనిరోధక శక్తి పెరుగదానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని అనేక పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయ్ .