by Rama Chandra P | Nov 23, 2025 | ఆంధ్రప్రదేశ్
భూములు ఇవ్వొద్దంటూ రైతులను రెచ్చగొడుతున్న వైసీపీ
వరల్డ్ ఫెమస్ టెక్నీకల్ సంస్థ గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ ను అడ్డుకునే కుట్రకు వైసీపీ నేతలు తెరతీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంది. ఐటీ దిగ్గజ సంస్థ ఏకంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో దీన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి. కొందరు రైతుల ఫోర్జరీ సంతకాలతో, చనిపోయిన రైతు పేరుతో హైకోర్టులో పిటిషన్ వేశాయి. గూగుల్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వవద్దని . . మిగతా రైతులనూ రెచ్చగొడుతున్నాయి. ఆ భూములు తమకే ఇస్తే ఎక్కువ డబ్బులిస్తామని ప్రలోభపెడుతున్నాయి. దీని పై స్థానిక తహసీల్దార్ ఈ నెల 3న ఫిర్యాదు చేస్తే, పోలీసులు కేసు నమోదు చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ బినామీతో కంప్లీన్ట్ . : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ చుట్టుపక్కల రైతులను మభ్యపెట్టి డీ-పట్టా భూముల్ని కొనేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి బినామీగా ఉన్న వ్యక్తే ఇప్పుడు ఈ కుట్ర పన్నారు. అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ పేరుతో డీ పట్టా భూముల విక్రయాలకు తెర తీయడంతో ఆ విషయం బయటకు రావడానికి ముందే అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న ఆ ఐఏఎస్ అధికారి విశాఖ చుట్టుపక్కల ఎడాపెడా ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానిపై విచారణ కూడా కూటమి సర్కార్ పక్కపెట్టింది . ఆయన తరఫున బినామీగా వ్యవహరించిన వ్యక్తి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో రైతులకు అడ్వాన్స్లు చెల్లించి, వారితో ఒప్పందాలు చేసుకొని డీ పట్టా భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే తర్లువాడలో 308 ఎకరాల్ని గూగుల్కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో 200 ఎకరాల డీ పట్టా, శివాయ్ జమేదార్ భూములను రైతులకు పరిహారమిచ్చి భూసేకరణ చట్టం ప్రకారం సేకరిస్తోంది. ఆ బినామీ గుప్పిట్లో పెట్టుకున్న 76 ఎకరాలు కూడా ఆ భూముల్లో ఉన్నాయి. దీంతో భూ సేకరణ ప్రక్రియనే అడ్డుకునేందుకు కుట్ర పన్ని రైతులతో కోర్టులో కేసు వేయించారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీపట్టా భూముల కొనుగోలులో దళారిగా వ్యవహరించి, ఆనందపురం మండలంలోని ఒక పంచాయతీ సర్పంచి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు ఆ బినామీ తరఫున రైతుల్ని ప్రలోభ పెట్టే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిని తానేనని కూడా ఆ దళారి ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు వస్తున్న రైతులను అడ్డుకుంటున్న వారిపై, రైతుల సంతకాలు ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే ఇలాంటి కుట్రలను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ పకడ్బందీగా వ్యవహరించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి .
by Rama Chandra P | Nov 21, 2025 | ఆంధ్రప్రదేశ్
ఒకసారి నాటితే . .. మూడుసార్లు కోసుకోవచ్చు . . దేశీయ వెరైటీ
తులసి బాసో ….. ఇది ఒక సంప్రదాయ వరి రకం. రామాయణ కాలం నుంచీ ఈ వరి భారతదేశంలో సాగుచేశారని చెపుతారు .
ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. ఆ రాష్ట్రంలో వందల సంవత్సరాలుగా ఈ అరుదైన వరి రకాన్ని సాగుచేస్తున్నారు . ఒకసారి నాట్లు వేసుకుంటే మూడుసార్లు పంట తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో కొంతమంది రైతులు ఇలాంటి అరుదైన దేశీయ వంగడాలను అంతరించిపోకుండా కాపాడుతున్నారు. వీరు మన సాంప్రదాయ విత్తనాల పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నారని చెప్పాలి .
ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆర్గానిక్ మేళాలలో లేదా విత్తన మేళాలలో కలుసుకొని అరుదైన వరి వంగడాలను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
ఆ ప్రయత్నంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన అభ్యుదయ రైతు చందూల్ కుమార్ రెడ్డి ఈ అరుదైన వరి వంగడాన్ని అలాంటి రైతుల వద్ద సేకరించి, ఇప్పుడు ఒక ఎకరా తులసి బాసో పంట వేసినట్లు చెప్పారు .
తులసి బాసో పరిమళభరితమైన వరి రకం. “తులసి లాంటి సువాసన గల బియ్యం” అని అర్థం. అంటే సెంటెడ్ రకం. బాస్మతి లాగా మంచి సువాసన వస్తుంది. చిట్టి ముత్యాలులాగా చాలా చిన్న గింజ. తినడానికి చాలా మధురంగా ఉంటూ, ఎంత తిన్నా వెగటు అనిపించదు. భుక్తాయాసం రాదు.ఎక్కువ ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న బియ్యంగా గుర్తించబడింది. చిన్నపిల్లల ఎదుగుదలకు కావలసిన మంచి పోషక విలువలు మరియు ఔషధ గుణాలు ఉన్న బియ్యం. దేవాలయాలలో ప్రసాదాలకు, పాయసాలకు చాలా అనువైన రకం. రోజువారి అన్నంగా కూడా వండుకొని తినవచ్చు. కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉండటం వలన ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న బియ్యంగా చెప్తారు. ముడి బియ్యంగా తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.
తులసి బాసో పంట కాలం 135 రోజులు. ఖరీఫ్ కి మాత్రమే అనువైన రకం అంటే రోహిణి కార్తెలో వేసుకోగలిగితే మొదటి పంట 135 రోజులకి వస్తుంది. తరువాత 60 నుంచి 70 రోజులకు కోతకు వస్తుంది. మూడో పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. సహజంగా ప్రధాన పంటను కోసిన తర్వాత రెండవసారి మూడోసారి కోసినప్పుడు గింజ పరిమాణం తగ్గుతుంది. కానీ దీని గింజ పరిమాణం తగ్గదు. సువాసన, పరిమళం పెరుగుతుంది. మొదటి కోతకి, రెండవ కోతకి సువాసన పెరుగుతుంది. రెండవ కోతతో పోల్చుకుంటే మూడోసారి కోతకు వచ్చినప్పుడు అందులో సువాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే రైతులు విత్తనానికి వినియోగపరిచేటువంటి వాళ్ళు మొదటి కోతలో ఉన్న పంటను మాత్రమే విత్తనానికి వినియోగించాలి.
రెండవ పంట మూడో పంట విత్తనానికి వినియోగించకపోవడమే మంచిది. ఎందుకంటే దిగుబడి తగ్గుతుంది. దిగుబడి పూర్తిస్థాయిలో మనం చూస్తే 135 రోజుల తర్వాత ఎకరానికి 15 నుంచి 18 క్వింటాల్ వస్తుంది. రెండవ కోతకి 6 నుంచి 8 క్వింటాల్ వస్తుంది. మూడవకోతకి ఐదు నుంచి ఆరు క్వింటాల్ వస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనిని పండించవచ్చు. పంట ఒరగదు. ఎంతటి గాలులకైనా తట్టుకొని నిలబడుతుంది. తుఫాన్లు సైతం తట్టుకొని నిలబడి ఉండే రకం. అన్ని ప్రాంతాల వారు ఈ రకాన్ని పండించుకోవచ్చు.
ఇలాంటి అరుదైన వరి రకాలు సేకరించి,పండిస్తున్న అభ్యుదయ రైతు చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన చందూల్ కుమార్ రెడ్డిని ప్రక్రుతి సాగు రైతులే కాదు . .. అందరూ అభినందించాల్సిందే .
విత్తనాల కొరకు ఈ రైతును మీరు సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తూ పండించే విధానం, రైతులకు వివరిస్తారు. ఈ రైతుని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 6300027502, 9440809364
by Rama Chandra P | Nov 19, 2025 | ఆంధ్రప్రదేశ్
ఏపీలో 50 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు – ఏకకాలంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల కోసం పోలీసుల సోదాలు
దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత జోరుగా సాగుతోంది. 2027 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్నది కేంద్ర సర్కార్ నిశ్చయం . ఇందులో భాగంగా వరుసగా మావోయిస్టుల ఏరివేత సాగుతోంది . స్వచ్చందంగా లొంగిపోవాలని ఇప్పటికే సర్కార్ అల్టిమేటం జారీచేసింది . లొంగకపోతే మట్టుపెడతామని వార్నింగ్ ఇచ్చారు . ఈ నేపథ్యంలో ఏరివేత శరవేగంగా సాగుతోంది . ఆంధ్రప్రదేశ్లో చాలాకాలం తర్వాత మావోయిస్టుల అలజడి రేగింది. ఆపరేషన్ కగార్తో వరుస ఎన్ కౌంటర్లు, అగ్రనేతల మృతితో ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారన్న సమాచారంతో కొంతకాలంగా పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఏకకాలంలో రాష్ట్రంలోని అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటి వరకు విజయవాడలో 28, కాకినాడలో 2, ఏలూరులో 15 మందిని మిగతా ప్రాంతాల్లో మరికొంతమందితో కలుపుకుని మొత్తంగా రాష్ట్రంలో 50 మందికి పైగా మావోయిస్టులను అరెస్టు చేశారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టు డంప్ల కోసం గాలింపు కొనసాగుతుంది. హిడ్మా డైరీ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు.విజయవాడలోని కానూరు వద్ద ఉన్న కొత్త ఆటోనగర్లోని ఓ భవనంలో మావోయిస్టులు బస చేస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు జరిపారు. స్థానిక పోలీసుల సహకారంతో నలువైపుల నుంచి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అల్లూరి జిల్లాలోని మారేడుమల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్ది హిడ్మా, అతని భార్య రాజే, నలుగురు అనుచరులు ఎన్కౌంటర్ అయిన కొద్ది సేపటికే విజయవాడ శివారులో భద్రతా బలగాల సోదాలు చేపట్టారు.
“మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఆరుగురు చనిపోయారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశాం. మెుత్తం 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈరోజు ఉదయం 6.30 నుంచి 7 గంటల సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. రెండ్రోజులుగా ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశాం.” -మహేష్ చంద్ర లడ్హా, ఇంటెలిజెన్స్ ఏడీజీ
by Abhi Correspondent | Nov 10, 2025 | పరిశీలన
కంటెంట్ కాపీ.. ఇది పెద్ద విషయం ఏమీ కాదు . .. కానీ ఎందుకు అంత సీరియస్ గా వ్యవహరిస్తున్నారు ?
సోషల్ మీడియా వేగంగా పరిగెడుతున్న కాలం ఇది. ఒకరి కంటెంట్ మరొకరు కాపీ కొట్టడం , మార్పులు చేసి వాడుకోవడం . . సహజాతి సహజంగా సాగిపోతున్న రోజులు . దీనిని పెద్దగా పట్టించుకునేవారు కూడా లేరనే చెప్పాలి .
ఈనాడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లను ఉపయోగించుకుని వాటిని షేర్ చేస్తుంటే ఆ క్రెడిట్ ఈనాడు వాళ్ళకే వెళుతుంది కదా . .. అలాంటిది ఎందుకు వీళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ ఈనాడు పత్రికలో సెల్ఫ్ యాడ్ ఇచ్చారో జర్నలిస్ట్ వర్గాలలో చర్చ నడుస్తోంది .
తెలుగు వార్తాపత్రికలలో అత్యంత ఆదరణ ఉన్న పత్రిక ఈనాడు . విస్తృతంగా ప్రసారం అయ్యే ఈనాడు, పాఠకులను మరియు సోషల్ మీడియా వినియోగదారులను ఇలా హెచ్చరించడంలో ఉద్దేశ్యం అర్ధం కావడంలేదు .
ఈనాడు యాజమాన్యంలోని రామోజీ గ్రూప్ కంపెనీ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ నోటీసు, అనుమతి లేకుండా వాట్సాప్, ఫేస్బుక్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తన వార్తా కథనాలు లేదా ఇ-పేపర్ కంటెంట్ను షేర్ చేస్తే కాపీరైట్ చట్టం కింద చర్య తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది.
సంక్షిప్తంగా, ఫార్వార్డింగ్, స్క్రీన్షాట్లు లేదా “ఈనాడు హెడ్లైన్లతో శుభోదయం” సందేశాలు ఉండకూడదు.
ఈ వైఖరి చాలా ఇతర ప్రచురణలు చేసే దానికి ఎంత విరుద్ధంగా ఉందో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆచరణాత్మకంగా నేడు ప్రతి డిజిటల్ వార్తా సంస్థ కథనాల పైభాగంలో లేదా దిగువన సులభమైన షేర్ బటన్లను అందిస్తుంది, పాఠకులను ఈ పదాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. అయితే, ఈనాడు ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఈదుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ హెచ్చరిక ఈనాడు దాని కంటెంట్ ఆన్లైన్లో ఎలా ప్రసారం చేయబడుతుందో లేదా అర్థం చేసుకోబడుతుందో దానిపై గట్టి నియంత్రణను ఉంచడానికి మార్గం కావచ్చు, ముఖ్యంగా రాజకీయ చర్చలు తరచుగా కథనాలను ఆకారంలో లేని సమయంలో.
అయితే, ఒక కథనం ప్రచురించబడిన తర్వాత, అది సహజంగానే ప్రజాక్షేత్రంలోకి ప్రవేశిస్తుందని విమర్శకులు ఎత్తి చూపారు, అక్కడ పాఠకులు మరియు వ్యాఖ్యాతలు చర్చించడానికి, విశ్లేషించడానికి మరియు విభేదించడానికి కూడా స్వేచ్ఛగా ఉంటారు.
సోషల్ మీడియా ఈ చర్యపై తనదైన శైలిని కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పవనాలు మారుతున్నాయని ఈనాడు పెరుగుతున్న భయాన్ని ఈ హెచ్చరిక ప్రతిబింబిస్తుందని చాలా మంది వినియోగదారులు చమత్కరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే ఆ బృందం కఠినమైన రోజులు ఎదురుచూస్తుందని సూచిస్తూ, పత్రిక ఆందోళనను ఇది వెల్లడిస్తుందని కొందరు పేర్కొన్నారు.
టీడీపీ , కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చినా . .. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన , అరాచకాలకు పురిగొల్పింది ఆ పార్టీ కీలక నేతలపై చర్యలు తీసుకోకపోవడం ఈనాడుకు కోపం తెప్పిస్తోంది . పైగా జగన్ సీఎంగా ఉన్నపుడు హవా కొనసాగించిన అధికారులలో ఇంకా కొందరు కూటమి పాలనలో సైతం కీ రోల్ పోషిస్తున్నారు . దీనిపై కూడా ఈనాడు అక్కసు వెళ్లగక్కుతోంది .
తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, అసంతృప్తి పూర్తిగా తొలగిపోయినట్లు కనిపించడం లేదు. జగన్ ఆన్లైన్ సైన్యం – వెక్కిరించడానికి మరియు మీమ్లకు – పెరగడం ఈనాడును అంచున ఉంచిందని, డిజిటల్ రంగంలో దాని ప్రభావం జారిపోతుందనే ఆందోళనతో ఉందని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు .
by Rama Chandra P | Nov 7, 2025 | పరిశీలన
ప్రతిరోజూ కొత్తగా 2,650 కొత్త వాహనాలు రోడ్డు మీదకు పరుగులు… బెంగళూరులో మొత్తం వాహనాలు కోటి 20 లక్షలు
బెంగళూరు ట్రాఫిక్ తో ఆ నగర ప్రజలకు , రోజు వచ్చిపోయే జనానికి నరకం కనిపిస్తోంది. వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నా . . అందుకు తగ్గట్లు రోడ్లను విస్తరించలేరు కదా …
కర్ణాటక స్టేట్ రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో సగటున రోజుకు 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు మహా నగరానికి, తాజా వాహనాలతో మరింత ఒత్తిడిని తెచ్చిడి . శాఖ డేటా ప్రకారం.. అక్టోబర్లో వాహన రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్తో పోలిస్తే 46 శాతం మేర పెరిగాయి. సెప్టెంబర్లో 56,831 వాహనాలు నమోదుకాగా, అక్టోబర్లో అది 86,014కు ఎగబాకింది. అంటే రోజువారీ సగటు రిజిస్ట్రేషన్లు 1,894 నుండి 2,774కి పెరిగాయి – ఇది ఇటీవల సంవత్సరాల్లో అత్యధిక నెలవారీ వృద్ధిగా చెప్పుకోవచ్చు.ఈ పెరుగుదలలో ప్రధాన పాత్ర ద్విచక్ర వాహనాలదేనని చెప్పవచ్చు. ప్రతిరోజూ సుమారు 1,900 బైకులు, స్కూటర్లు రిజిస్టర్ అవుతున్నాయి. అదనంగా రోజుకి 514 కార్లు కూడా రోడ్లపైకి వస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులో నమోదైన వాహనాల మొత్తం సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. ఇందులో 83.8 లక్షల ద్విచక్ర వాహనాలు, 24 లక్షల కార్లు ఉన్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే ఓ ఏడాది కాలంలోనే బెంగళూరు రోడ్లు వాహనాలతో కిక్కిరిసి . .. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగడం ఖాయం . స్కూల్స్ , కాలేజీలు టైమింగ్స్ లో మార్పులు చేపట్టడం , సాఫ్ట్ వేర్ ఆఫీసులు సమయాలలో మార్పులు వంటివి చేపట్టడం ద్వారా కొంతవరకు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయవచ్చు . దీనికంటే ముందు వాహనాలు సంఖ్య పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది .
by Abhi Correspondent | Nov 1, 2025 | జనరల్, పరిశీలన
భారత్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ సర్కార్ ప్రచారం . . అమెరికన్ యువతను రెచ్చగొట్టే రీతిలో పబ్లిసిటీ . .
టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు దక్కుతాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం స్థానికతను తెరపైకి తేవడం ద్వారా అమెరికన్ల హృదయాలలో తన స్థానాన్ని పదిలపరచుకోవాలని వేస్తున్న ఎత్తులు అన్నీ , ఇన్నీ కావు .
ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ ఉద్యోగాల విధానంపై దృష్టి మరింత పెట్టింది. తాజాగా అమెరికా కార్మిక శాఖ (U.S. Department of Labor) సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక కొత్త వీడియో ప్రకటన ఈ మార్పును బలంగా ప్రతిబింబిస్తోంది. American Dream Stolen అనే శీర్షికతో విడుదలైన ఈ ప్రచారం, కంపెనీలు H-1B వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని చూపుతోంది . , తక్కువ వేతనాలపై విదేశీ కార్మికులను నియమించడం ద్వారా యువ అమెరికన్ల అవకాశాలను హరించాయని ఆరోపిస్తూ . .. ఇందులో ఉంది . ఇలాంటి వాటిని భారత్ను ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లబ్ధిదారుగా హైలైట్ చేస్తుండటం గమనార్హం . ప్రస్తుతం జారీ అయ్యే H-1B వీసాల్లో సుమారు 72 శాతం భారతీయ పౌరులకే వెళ్తున్నాయని, ఇది టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లో అత్యధికమని గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రకటనలో స్పష్టంగా చెప్పకపోయినా, వీడియోలో చూపించిన గణాంకాలు, టెక్స్ట్లు భారతీయ ఐటీ నిపుణులను లక్ష్యంగా చేస్తున్నట్లు అర్ధం అవుతోంది .
1950ల కాలం నాటి అమెరికా దృశ్యాలను ఈ వీడియోలో చూపిస్తూ.. ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న అమెరికన్లు, సంతోషంగా జీవిస్తున్న కుటుంబాలు.. ”The American Dream was built on hard work and opportunity” అనే టాగ్ లైన్తో ప్రారంభమవుతుంది. కానీ తరువాతి సెకన్లలో ”That dream was stolen from young Americans” అనే పదాలతో అమెరికా యొక్క వీసా దుర్వినియోగం కారణంగా ఈ దేశంలో యువతకు అవకాశాలు కోల్పోయినట్లు.. వాటిని వేరేవాళ్లు ఎత్తుకుపోతున్నట్లు చూపిస్తుంది. దీని లక్ష్యం ఏంటంటే.. అమెరికన్ కార్మికులను తక్కువ వేతనాలపై నియమించే విదేశీ వర్కర్లతో భర్తీ చేయకుండా కార్పొరేట్ కంపెనీలను అడ్డుకోవడం .. అని అక్కడివారు భావిస్తున్నట్లు అర్ధం చేసుకోవచ్చు . ”ఒక అమెరికన్ ఉద్యోగం ముందుగా ఒక అమెరికన్కే చెందాలి. మేము చట్టబద్ధమైన వలసలకు వ్యతిరేకం కాదు, దాని దోపిడీకి వ్యతిరేకం” అంటూ స్థానిక యువతలో చైతన్యం కలిగిస్తున్నామంటూ చెప్పుకుంటున్నారు .
by Abhi Correspondent | Oct 31, 2025 | పరిశీలన
వేగంగా బలపడి, అంత వేగంతో బలహీనపడిన ‘మొంథా’ వాతావరణ పెను మార్పులు
”మొంథా’, తుఫాను సోమవారం ఉదయం కాకినాడ సమీపంలో తీరం దాటబోతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంగా ఈదురు గాలులు వీస్తాయి .. కనుక జిల్లా అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి . .” అంటూ వాతావరణ శాఖ అధికారులు సీరియస్ గా అప్రమత్తం చేశారు . కాకినాడ జిల్లా యంత్రాంగం కూడా అన్ని చర్యలు చేపట్టింది . అయితే తుపాను తన దిక్కును మార్చుకుంది . ఇలా ఎందుకు జరుగుతుంది . వాతావరణ అంచనాలకు తుపాను వంటి వైపరీత్యాలు అందకపోతే ప్రమాదాలు మరింత పెరుగుతాయా ?
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపంలో ప్రారంభమైన ‘మొంథా’, శనివారం ఉదయానికి వాయుగుండంగా, ఆదివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా, రాత్రికి తుపానుగా మారింది. మంగళవారం నాటికి ఇది తీవ్రమైన తుపానుగా బలపడింది. కానీ తీరం దాటిన తర్వాత అదే వేగంతో బుధవారం తెల్లవారుజామున తుపానుగా, ఆపై తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.
తుపాన్ల లక్షణాలు మారిపోతున్నాయ్: ఏ రెండు తుపాన్లు ఒకేలా ఉండవు. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో ఇప్పుడు తుపాన్ల లక్షణాలు వేగంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘మొంథా’ తుపాను ఏర్పడే వరకు బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగిన విధంగా ఉన్నాయి. కానీ తర్వాత పరిస్థితులు అది బలం పుంజుకునేందుకు, ప్రభావం చూపేందుకు అనుకూలించలేదు. వాతావరణ మార్పుల దృష్ట్యా తుపాన్ల ప్రవర్తన మారిపోతోందని విశాఖపట్నం వాతావరణ నిపుణుడు ఆచార్య భానుకుమార్ తెలిపారు.
by Abhi Correspondent | Oct 30, 2025 | ఆంధ్రప్రదేశ్
తుపాను నష్టం, ప్రస్తుత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష – రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టంపై అంచనాలు
విపత్కర పరిస్థితులలో సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో చంద్రబాబు అందెవేసిన చేయి . ప్రకృతి వైపరీత్యాలను ఆపేసి టెక్నాలజీ లేకపోయినా . .. పక్కా ప్రణాళిక , నిరంతర మానిటరింగ్ , టెక్నాలజీ ఉపయోగించుకుని సాధ్యమైనంత నష్టం తగ్గించడం , , చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో . ..
..29 ఏళ్ళ వ్యవధిలో విరుచుకు పడిన మూడు పెను తుపానుల మధ్య అతిపెద్ద సాంకేతిక విప్లవం వుంది. ఈ మూడు పెద్ద తుపాను సమయాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉండటం యాదృచ్చికమే . .
. 1996 కొనసీమ తుపాను (నవంబర్ 6, 1996) నాటికి కమ్యూనికేషన్లు, టెక్నాలజీ అంతగా లేవు. పెను తుపాను దెబ్బకి అపుడు 1000 మందికి పైగా చనిపోయారు. 2014 లో హుదూద్ తుపాను నాటికి కమ్యూనికేషన్లు బాగా పెరిగాయి. అపుడు 64 మంది చనిపోయారు. ఇపుడు మొంథా తుపాను నాటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనూహ్యంగా వ్యాపించింది. ఈ తుపానులో మరణాలు రెండుకి పరిమితం కావడం కాస్త బెటర్ . .
రాష్ట్రంలో తుపాను నష్టంపై తాజా వివరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.
రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. 59 వేలకుపైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం కలిగిందని ఇంకా భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోగా, రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. దెబ్బతిన్న 2294 కి.మీ. పొడవున ఆర్అండ్బీ రహదారుల వల్ల ఆర్అండ్బీ శాఖకు రూ.1,424 కోట్లు నష్టం కలిగిందని తెలిపారు. రూరల్ వాటర్ సప్లయ్కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వచ్చిందనిని అధికారులు సీఎంకి వివరించారు.
18 లక్షల మందిపై తుపాను ప్రభావం: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని తేల్చిచెప్పారు. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రకృతి వైపరీత్యాలను అపేసే టెక్నాలజీలు లేవు. ముందు జాగ్రత్తల వల్ల ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించ వచ్చు. టెక్నాలజీ ని పూర్తిగా వినియోగించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇంతటి సాంకేతికత లేనపుడే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు కి మించిన నాయకుడు లేడన్న పేరు తెచ్చుకున్నారు. అన్ని వనరులను సమీకృతం చేసి పనిచేసే ప్రళాళికలే ఆయన విజయ రహస్యం.
1996 నవంబర్ 6 నాటి కోనసీమ తుపానులో 200 కిలోమీటర్ల గాలివేగానికి పబ్లిక్ ప్రయివేట్ ఆస్ధులు అపారంగా ధ్వంసమయ్యాయి. వెయ్యిమంది చనిపోయారు. కోనసీమ తుపాను నష్టాలకు ప్రధాన కారణం ఉప్పెన/ నీరు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే ఏర్పడిన ఈ విపత్తులో సహాయక చర్యలకోసం ఆయన రాజమండ్రిలో మకాం వేశారు. సబ్ కలెక్టర్ ఆఫీసే సెక్రటేరియట్ / సిఎం పేషీగా మారిపోయింది. ప్రిస్సిపల్ సెక్రటరీ రమాకాంత రెడ్డి ప్రధాన అధికారిగా, ఆర్ డి ఒ శ్రీధర్ ఆయన ప్రధాన సహాయకుడిగా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో “తుపాను సహాయక ప్రభుత్వమే” నడిచింది. కకా వికలమైం కోనసీమ కోలుకోడానికి ఆ తర్వాత ఐదారేళ్ళు పట్టింది.
అప్పటికి రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రెండే కంప్యూటర్లు వున్నాయి. ప్లాస్టిక్ కవర్ తో ముసుగు వేసి వుండేవి. ఎందుకంటే అప్పటికి ఏడాది క్రితమే వచ్చిన “విండోస్ 95” కి ప్రయివేటు రంగం అలవాటు పడుతున్నంతగా ప్రభుత్వ రంగం అలవాటు పడలేదు. నల్లటి స్క్రీన్ మీద తెల్లటి text కనబడే Dos ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి విండోస్ 95 గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ (GUI) తో ప్రామాణికమైన, వినియోగం పెరుగుతున్న ఇంటర్ఫేస్గా మారింది. దీనిపై చంద్రబాబుకి లోతైన అవగాహన వుంది. ఆయన సూచన మేరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ కంప్యూటర్లను అప్ డేట్ చేయించారు. కానీ దానిని వినియోగించే వారు అక్కడ లేకపోవడంతో వేరే చోట నుంచి తీసుకువచ్చారు .
18 ఏళ్ళు గడచిపోయాయి. ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ సాధనాలైన కాల్ కాన్ఫరెన్సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వీటిని నిర్వహించడానికి నిర్దిష్టమైన బెస్ట్ ప్రాక్టీసెస్ పాటిస్తూ, వాటి విజయాన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేషన్స్ (KPIs) ద్వారా లెక్కగట్టడం మొదలైంది. ఈ సాంకేతికతలు ఫోర్త్ ఐటి రివల్యూషన్ కు ఊతమిచ్చాయి.
2014 అక్టోబర్ 12 న హుదూద్ తుపాను వచ్చింది. 210 కిలోమీటర్ల గాలివేగానికి విశాఖపట్నం ఏరియాలో 64 మంది చనిపోయారు. విద్యుత్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలడం వల్ల 21 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లింది . హుదూద్ నష్టాలకు ప్రధాన కారణం భారీ గాలి. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు విశాఖపట్టణంలో మకాం వేశారు. తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక సహాయ చర్యలు అమలు చేయించారు. విశాఖ ప్రాంతం ఏడాదిలో కోలుకోవడంలో చంద్రబాబు తనవంతు పాత్ర నిర్వహించారు .
ప్లానింగ్ + టెక్నాలజీ = క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు సూత్రం ఇదే . ..
కూలిపోయిన చెట్లను కూలీలతో ముక్కలు చేయించి రోడ్లను క్లియర్ చేయడం ఇందుకు వారాలు వారాలే పట్టడం 1996 నాటి పరిస్ధితి. అడ్డదిడ్డంగా పడిపోయిన స్ధంభాలు చెట్లను ఎత్తి పక్కన పెట్టడానికి క్రెయిన్లు అందుబాటులోకి రావడం 2014 నాటి పరిస్ధితి. ఈ పద్దెనిమేళ్ళలోనూ టెక్నాలజీ అనూహ్యంగా పెరిగింది .
11 ఏళ్ళు గడచిపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) అనూహ్యంగా వికసించింది. టెక్నాలజీ రియల్ టైమ్ గవర్నెన్స్ ను సాధ్యం చేస్తుంది. దీనికి ఫైబర్ గ్రిడ్ వంటి మౌలిక సదుపాయాలు వచ్చాయి. లార్జర్ కనెక్టివిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విస్తరిస్తోంది.
రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు వారి వారి డాష్ బోర్డుల మీద మొంథా తుపాన్ ని గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సమస్త ప్రభుత్వ యంత్రాంగమూ ఇదే పనిలో వుంది. ఇందువల్ల ప్రాణ నష్టాన్ని జీరో శాతానికి తెచ్చే అవకాశం వుంది.
టెక్నాలజీ నివినియోగించుకోవడంతో పాటు సమస్యని గుర్తించడం (Identification) పరిష్కారానికి వనరుల్ని సమీకృతం చేయడం(Integration) అన్ని శక్తుల్ని భాగస్వామ్యం చేయడం(Involvement) చిత్తశుద్ధితో పని చేయడం (Integrity) – ఈ “I 4” సూత్రాన్ని పాటించడం వల్లే క్రైసిస్ మేనేజిమెంటులో చంద్రబాబు నాయుడికి మించిన రాజకీయ నాయకుడు లేరన్న గౌరవాన్ని పేరు ప్రఖ్యాతుల్ని అయన గడించుకున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డేటా మెదడు అయితే, కనెక్టివిటీ గుండె. విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్ రావడమంటే
అది భారత్ కు మాత్రమే కాక కనీసం 12 దేశాల కనెక్టివిటీకి పెద్ద బ్యాక్ బోన్ గా నిలబడుతుందని చెప్పడం అతిశయోక్తికాదు .
by Rama Chandra P | Oct 29, 2025 | బిజినెస్
”2025 టాటా సియెర్రా” లాంఛ్ డేట్ ఫిక్స్- వివరాలు ఇవిగో !
సరికొత్త వాహనాలపై మోజు ఉండే వాహన ప్రియులకు అదిరే అప్డేట్ ఇది .. దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త SUV “టాటా సియెర్రా”ను త్వరలో విడుదల చేయబోతోంది. నవంబర్ 25న భారతదేశంలో లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ కారు కాన్సెప్ట్ మోడల్ను మొదటిసారిగా 2020 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత కంపెనీ ఇప్పుడు దీనిని విడుదల చేసేందుకు రెడీ అయింది.
టాటా “సియెర్రా” నేమ్ప్లేట్ పాత, ప్రతిష్టాత్మకమైనది. 2020 ఆటో ఎక్స్పో తర్వాత 2023లో అప్డేటెడ్ “సియెర్రా EV” కాన్సెప్ట్ వెల్లడైంది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్పోలో దాదాపు పూర్తిగా నిర్మించిన అంతర్గత SUV ఉత్పత్తిని ఆవిష్కరించారు.
దీని ఫైనల్ ప్రొడక్షన్-స్పెక్ మోడల్ గతంలో ప్రదర్శించిన చివరి నియర్-ప్రొడక్షన్ కాన్సెప్ట్కు దగ్గరగా పోలి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ICE, EVల మధ్య కొన్ని స్టైలింగ్ తేడాలు కనిపించవచ్చు, వాటిలో గ్రిల్లో మార్పులు కూడా ఉన్నాయి. ICE మోడల్ బ్లాక్ గ్రిల్ను కలిగి ఉంది .
టాటా సియెర్రా ఇంటీరియర్: టాటా సియెర్రా ఇంటీరియర్ విషయానికి వస్తే డాష్బోర్డ్లో 3 డిస్ప్లేలతో పాటు అనేక సాంకేతిక ఫీచర్లు ఉంటాయి. ఇందులో ఎంపిక చేసిన వేరియంట్లలో డెడికేటెడ్ కో-డ్రైవర్ డిస్ప్లే ఉంటుంది. ఇది లెవల్ 2 ADAS ఫంక్షన్లు, 360-డిగ్రీ కెమెరాలతో పాటు అనేక ఫీచర్లు ఇందులో స్పెషల్ .
టాటా సియెర్రా ఇంజిన్: పవర్ట్రెయిన్ విషయానికొస్తే, ఇది టాటా కొత్త హైపెరియన్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుందని భావిస్తున్నారు. అదనంగా ఈ SUV డీజిల్ ఇంజిన్ ఎంపికనూ అందించవచ్చు. ఇది టాటా హారియర్లో కనిపించే సుపరిచితమైన 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్. “టాటా సియెర్రా EV” పవర్ట్రెయిన్కు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రివీల్ కాలేదు. అయినప్పటికీ ఇది “టాటా కర్వ్ EV”, “టాటా హారియర్ EV” వంటి కార్లతో పవర్ట్రెయిన్ భాగాలు ఇందులో ప్రత్యేకంగా నిలుస్తాయి .
by Rama Chandra P | Oct 28, 2025 | ఆంధ్రప్రదేశ్
‘మొంథా’ ఎఫెక్ట్ – 107 రైళ్లు రద్దు – హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసిన రైల్వే
తుఫాను మంథా: ఆంధ్రప్రదేశ్లో రైలు, విమాన మరియు బస్సు సర్వీసులు ప్రభావితమయ్యాయి
తుఫాను కారణంగా విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి విమానాశ్రయాల నుండి విమాన కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి.
మొంథా తుపాను ముంచుకొస్తోంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను, మరికొద్దిసేపట్లో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా, దాదాపు 18గంటల పాటు ప్రభావం చూపనుంది. కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది.
తుఫాను మంథా దృష్ట్యా, దక్షిణ మధ్య రైల్వే మరియు తూర్పు తీర రైల్వే అక్టోబర్ 28, మంగళవారం భద్రతా కారణాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుండి విశాఖపట్నం వరకు మరియు దాని గుండా వెళ్ళే అనేక రైలు సర్వీసులను రద్దు చేశాయి,
దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయబడిన లేదా తిరిగి షెడ్యూల్ చేయబడిన రైళ్ల జాబితాలను విడుదల చేసింది. తుఫాను కారణంగా విజయవాడ, విశాఖపట్నం మరియు రాజమండ్రి విమానాశ్రయాల నుండి విమాన కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఉత్తర-వాయువ్య దిశలో కదులుతున్న తుఫాను మంథా త్వరలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది, మంగళవారం రాత్రి నాటికి మచిలీపట్నం మరియు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
రియల్ టైమ్ వాయిస్ అలర్ట్లు
అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మోంతా తుఫాను హెచ్చరికల కోసం రియల్ టైమ్ వాయిస్ అలర్ట్లను తీరప్రాంత జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాలకు ప్రయోగాత్మకంగా అందజేస్తున్నట్లు తెలిపింది.
“విద్యుత్తు అంతరాయం సమయంలో కూడా, 360° హార్న్ స్పీకర్ సిస్టమ్ ఒక కిలోమీటరు వ్యాసార్థంలో స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది. ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాలకు విస్తరించనుంది” అని APSDMA తెలిపింది.
తూర్పు తీర రైల్వే రైలు యొక్క స్వల్పకాలిక ముగింపు/ స్వల్పకాలిక ప్రారంభాన్ని ప్రకటించింది.
అక్టోబర్ 27న హౌరా నుండి బయలుదేరిన రైలు నంబర్ 18005 హౌరా-జగ్దల్పూర్ సమలేశ్వరి ఎక్స్ప్రెస్ రాయగడ వద్ద స్వల్పకాలిక ముగింపును పొందుతుంది మరియు అక్టోబర్ 29న రాయగడ నుండి హౌరాకు 18006గా తిరిగి వస్తుంది. అందువల్ల, అక్టోబర్ 29న రాయగడ మరియు జగదల్పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు.
రైలు నంబర్ 18448 హిరాఖండ్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 28న జగదల్పూర్కు బదులుగా రాయగడ నుండి భువనేశ్వర్కు బయలుదేరుతుంది. అందువల్ల, అక్టోబర్ 28న రాయగడ మరియు జగదల్పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు.
రైలు నంబర్ 18108 ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 28న జగదల్పూర్కు బదులుగా రాయగడ నుండి రూర్కెలాకు ప్రారంభమవుతుంది. అందువల్ల, అక్టోబర్ 28న రాయగడ మరియు జగదల్పూర్ మధ్య ఈ రైలు సేవ ఉండదు.
ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు విమాన స్థితిని తనిఖీ చేయాలని ఆదేశించింది.
“ప్రస్తుత తుఫాను పరిస్థితులు మరియు #విజయవాడ, #విశాఖపట్నం మరియు #రాజమండ్రి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షపాతం కారణంగా, ఈ నగరాలకు మరియు వాటి నుండి విమాన కార్యకలాపాలు ప్రభావితమవుతాయి” అని X లో ఒక పోస్ట్లో పేర్కొంది.
“విమానాశ్రయానికి వెళ్లే ముందు అన్ని వినియోగదారులు https://t.co/4fxgr5orzK వద్ద వారి విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము. జలదిగ్బంధనం మరియు ట్రాఫిక్ రద్దీని అంచనా వేస్తున్నందున, దయచేసి అదనపు ప్రయాణ సమయంతో మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. మీ భద్రత మరియు సౌకర్యం మా ప్రధాన ప్రాధాన్యత, దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి” అని అది జోడించింది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రభావిత ప్రాంతాలలో అవసరమైన బస్సు సర్వీసులు మాత్రమే నడపాలని APSRTC మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు .
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ మరియు కాకినాడ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని IMD గుర్తించింది. ఇంతలో, రాబోయే తుఫాను దృష్ట్యా పొరుగున ఉన్న ఒడిశా కూడా హై అలర్ట్లో ఉంది.
సోషల్ మీడియా పుకార్లపై అధికారుల అలెర్ట్ . .. హుద్ . .హుద్ సమయంలో తీసిన వీడియోలను యు ట్యూబ్ లో పెడుతూ . .. కాకినాడలో అల్లకల్లోలం నెలకొందంటు కొందరు చేస్తున్న ప్రచారంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . తప్పుడు ప్రచారం చేసేవారిపై కేసులు పెడతామని పోలీసు అధికారులు వెల్లడించడంతో తప్పుడు ప్రచారాలకు కాస్త బ్రేక్ పడింది .
ఈదురుగాలులకు పలుచోట్ల కూలుతున్న చెట్లు
- ఈదురుగాలులకు ఉమ్మడి తూ.గో. జిల్లాలో పలుచోట్ల కూలుతున్న చెట్లు
- కాకినాడ కలెక్టరేట్, సురేష్నగర్, బాలాజీ చెరువు వద్ద కూలిన చెట్లు
- కాకినాడ సురేష్నగర్లో విరిగిపడిన రెండు విద్యుత్ స్తంభాలు
- తుని పార్కు సెంటర్, రౌతులపూడి మం. ఎ.మల్లవరంలో కూలిన చెట్లు
- కోనసీమ: అల్లవరం మం. బోడసకుర్రులో రోడ్డుపై కూలిన భారీ చెట్టు
- క్రేన్లతో చెట్లు తొలగించి రాకపోకలు పునరుద్ధరిస్తున్న పోలీసులు
- కోనసీమ: అంబాజీపేట మం. వక్కలంక పుల్లేటికుర్రులో ఈదురుగాలులు
- ఈదురుగాలులకు కొబ్బరి చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు ధ్వంసం