అమరావతి విష బీజాలు కట్టడి చేయకపోతే,

అమరావతి విష బీజాలు కట్టడి చేయకపోతే,

Those who are spewing venom at Amaravati must be stopped

జగన్ మోహన్ రెడ్డి పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి జనం మూలన కూర్చోబెట్టినా.. కొందరు కీలక నేతలైతే కుదేలయ్యారు కానీ , ,ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. విష ప్రచారాలను చొప్పిస్తూనే ఉన్నారు . వీరిని కట్టడి చేయడం కూటమి సర్కార్ కి చేతకావడంలేదనే చెప్పాలి. ఒకటీ , ఆరా కేసులు పెట్టినా వాళ్లలో భయం పుట్టించలేకపోతున్నారన్న విమర్శలు కూటమి కేడర్ నుంచే బలంగా వినిపిస్తున్నాయి .

‘‘అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు అప్పులు చేసి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన సొమ్మును ఒకేచోట ఖర్చు చేయడం ఏమిటి?’’ అంటూ ప్రజలలో విష ప్రచారం చేస్తున్న వారికీ వాస్తవాలు తెలుసు . అయినా విషం చిమ్ముతున్నారు . అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అయింది. హైదరాబాద్‌లో, అంటే సైబరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నుంచి అందుతున్న ఫలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడాన్ని గుర్తు చేసుకోవాలి .

రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు అవసరమా? అని వైసీపీ సోషల్ మీడియాతో పాటు , ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ గొంతు చించుకుంటూనే ఉన్నారు . ఇలాంటి వాళ్లు హైదరాబాద్‌ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది. హైదరాబాద్‌లో ఇప్పటికీ ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకొనే వారికి ఈ భూములను ఆకర్షణగా చూపుతున్నారు. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగం కూడా ముందుకు రావాలి. ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా నిర్మాణాలు జరిగినప్పుడే రాజధానికి ఒక రూపు వస్తుంది. అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నసుగుతున్నవారు ఈ విషయం తెలుసుకోవాలి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటానికి కారణం ??? చెన్నయ్‌, బెంగళూరు, ముంబై వంటి మహానగరాలు ఉండటం వల్లనే ఈ రాష్ట్రాలకు భారీగా ఆదాయం సమకూరుతుంది . ఇలాంటివన్నీ ప్రజలలోకి వెళ్లేలా కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలి .

అమరావతిపై లేనిపోని విష ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా , మేధావుల ముసుగులో జనాన్ని రెచ్చగొడుతూ . . రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారి ప్రతి చర్యలను గమనించడానికి పోలీసు శాఖలో ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి . .. నిఘా ద్వారా విష బీజాలు నాటే వారిని ఆదిలోనే అడ్డుకోవాలి . లేకపోతె . .. అమరావతి అనే మహా యజ్ఞంలో విషం చిమ్మే వారు మరింత పెట్రేగిపోయే ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ గ్రహించి మేల్కోవాలి. మెతక వైఖరి వీడి , అరాచకవాదులపై కొరఢా ఝళిపించాలి .

యూఎస్​-ఇండియా ట్రేడ్ డీల్​-జేడీ వాన్స్ ప్లాన్ ఏమిటి ?

యూఎస్​-ఇండియా ట్రేడ్ డీల్​-జేడీ వాన్స్ ప్లాన్ ఏమిటి ?

 భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ట్రేడ్​ డీల్​)పై చర్చలు జరుగుతున్న వేళ యూఎస్​ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్‌ కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, ఆయన చాలావ టఫ్​ నెగోషియేటర్ అని, ఆయన చాలా బాగా బేరసారాలు చేస్తారని, అందుకే తాము ఆయనను గౌరవిస్తామని జేడీ వాన్స్​ అన్నారు.

ట్రేడ్ డీల్​పై పురోగతి
ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్‌- ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రేడ్​ డీల్​ కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ఇరుదేశాల నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు, గ్యాస్‌ల దిగుమతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ట్రంప్‌ సైతం భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. జేడీ వాన్స్‌ తాజా ప్రకటనతో త్వరలోనే ఒప్పందం ఖరారుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మోదీ నోట.. ఏదీ  అమరావతి చట్టబద్దత?

మోదీ నోట.. ఏదీ అమరావతి చట్టబద్దత?

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హామీలు ప్రకటించని ప్రధాని

చంద్రబాబును పొగడం – ప్రసంగం తెలుగులో ప్రారంభించడం.. ఇవే మోడీ చేసినవి

ఆంధ్రుల రాజధాని అమరావతికి ఎన్నో వరాలు ప్రకటిస్తారు.. అని మోడీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. హామీల మాటల ఉన్నా.. ‘అమరావతికి చట్టబద్దత ‘ అంశంపై కూడా మోడీ పెదవి విప్పలేదు . కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ . … మోడీ సభకు ఒకరోజు ముందు అమరావతి చట్టబద్దత అంశం పరిశీలిస్తాం . . అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు . అమరావతి రైతులు చంద్రబాబుకు చేసిన విజ్ఞప్తి కూడా చట్టబద్దత . దీనిపై ప్రధానితో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు . అయితే మోడీ మాత్రం దీనిపై ప్రస్తావించకుండా దాటవేశారు .

పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని , అమరావతికి సహకారం అందిస్తామని మాత్రమే చెప్పారు మోడీ . ..

జగన్ భయం ఎలా పోగొడతారు బాబు గారూ.. టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారు . 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి . .. అమరావతి రాజధాని కాదని , , మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చి గందరగోళంలో పడేసారు . అమరావతి కోసం భూములిచ్చిన 29 వేలమంది రైతులు రోడ్డెక్కారు . దేశంలోనే అత్యంత అరుదైన ఉద్యమం చేసారు .

మరోమారు జగన్ అధికారంలోకి రారన్న భరోసా ఇస్తారా ? అంటూ పలువురు పారిశ్రామికవేత్తలు సైతం చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , లోకేష్ లను అడుగుతున్నారు . జగన్ వస్తే . .. భారీ పెట్టుబడులు పెట్టిన మాకు భరోసా ఏమిటి ? అంటూ ఇప్పటికే కీలకమైన పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరక్క వారు వేరే రాష్ట్రాల వైపు ద్రుష్టి సారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్ .

ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ

  • తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ
  • దుర్గాభవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్న ప్రధాని
  • ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా: ప్రధాని
  • ఒక స్వప్నం సాకారమవుతుందనే విషయం కళ్లముందు కనిపిస్తుంది: ప్రధాని మోదీ
  • దాదాపు 60 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా: ప్రధాని
  • ఇవి కేవలం కాంక్రీట్‌ నిర్మాణాలు కాదు.. ఏపీ ప్రగతికి, వికసిత్‌ భారత్‌కు బలమైన పునాదులు: ప్రధాని
  • చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

  • అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
  • రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
  • రూ.49,040 కోట్ల విలువైన రాజధాని పనులకు ప్రధాని మోదీ శ్రీకారం
  • రూ.8 వేల కోట్ల విలువైన వివిధ కేంద్ర ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన
  • ప్రధాని సభకు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరైన లక్షలమంది ప్రజలు
  • సరైన సమయంలో సరైన నేత … : సీఎం చంద్రబాబు
  • ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు: సీఎం చంద్రబాబు
  • గతంలో మోదీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారు: సీఎం చంద్రబాబు
  • గత ఐదేళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయి: సీఎం
  • పహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారు: సీఎం
  • మళ్లీ మోదీ చేతులమీదుగానే పనుల పునఃప్రారంభం: సీఎం
  • గతంలో మోదీని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు: సీఎం
  • ఇటీవల మోదీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారు: సీఎం
  • ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
  • మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
  • మోదీజీ మేమంతా మీకు అండగా ఉన్నాం: సీఎం
  • ప్రజలతోనూ వందేమాతరం, భారత్‌మాతాకి జై నినాదాలు చేయించిన సీఎం
  • సరైన సమయంలో సరైన నేత దేశాన్ని పాలిస్తున్నారు: సీఎం
  • ప్రపంచవ్యాప్తంగా మోదీ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నారు: సీఎం
  • మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పదో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ: సీఎం
  • ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఐదో స్థానానికి ఎదిగింది: సీఎం
  • త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుంది: సీఎం
  • 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుంది: సీఎం
  • ఒకవైపు అభివృద్ధి.. మరోవైపు పేదరిక నిర్మూలనకు మోదీ కృషిచేస్తున్నారు: సీఎం
  • దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు
  • మోదీ నాయకత్వంలో భారత్‌.. అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది: సీఎం
  • కూటమిగా పోటీచేయడంతో 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించాం: సీఎం
  • వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం: సీఎం
  • కేంద్ర సాయంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం: సీఎం
  • దివిసీమ తుపానులా గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసింది: పవన్‌ కల్యాణ్
  • ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు: పవన్‌ కల్యాణ్
  • రాజధాని రైతుల పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: పవన్‌ కల్యాణ్
  • అమరావతి రైతుల త్యాగాలను మరచిపోము: పవన్‌ కల్యాణ్
  • అమరావతి రైతుల త్యాగాలకు జవాబుదారీగా ఉంటాం: పవన్‌ కల్యాణ్
  • రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీర్చుకుంటాం: పవన్‌ కల్యాణ్

నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్

  • ఒక్క పాకిస్థాన్‌ కాదు వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీచేయలేరు: మంత్రి లోకేశ్
  • భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు: మంత్రి లోకేశ్
  • భారత్‌ వద్ద మోదీ అనే మిసైల్‌ ఉంది: మంత్రి లోకేశ్
  • నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌కు దిమ్మతిరగడం ఖాయం: లోకేశ్
  • మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం: లోకేశ్
  • ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెబుతూ మద్దతిస్తున్నారు : లోకేశ్
  • మోదీ, బాబు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు: లోకేశ్
  • 2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు: లోకేశ్
  • రాజధాని కూడా లేకుండానే విడిపోయాం: లోకేశ్
  • చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు: లోకేశ్
  • చంద్రబాబుపై కోపంతో అమరావతిని పక్కనబెట్టారు: లోకేశ
మోదీ అమరావతికి ఏమిస్తారు ?

మోదీ అమరావతికి ఏమిస్తారు ?

రాజధాని మారకుండా పార్లమెంటులో చట్టబద్దత హామీ అయినా ఇస్తారా?

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంబించి . .. ఏయే వరాలు ప్రకటిస్తారు? 2015లో అమరావతి శంఖుస్థాపన చేసినపుడు నీళ్లు – మట్టి ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్న అప్పటి NDA సర్కార్ . .. 2025 లో ఏమి చేయబోతోంది. ఇప్పటి వరకు వరల్డ్ బాంక్ నుంచి, ఇతర సంస్థల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించారు . ఇంతవరకు బాగానే ఉంది . కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వబోయే పథకాలపై మోదీ క్లారిటీ ఇవ్వాలని ఆంధ్రప్రజలు కోరుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారు . దానిపై గట్టిగా అడిగే సత్తా ఉన్న నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కనిపించరు. 2019-2024 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ , ఈడీ కేసుల భయంతో స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రాన్ని అడదకుండా దొంగాట ఆడేసారు .

ఇపుడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2014-2019 మధ్య సీయంగా ఉన్నారు . చంద్రబాబుకు కేసుల భయం లేకపోయినా … మెతక వైఖరి అవలంబించి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు . ఇపుడు అడిగే పరిస్థితి ఉన్నా , , అమరావతి , పోలవరం పనులకు భారీగా నిధులు రాబట్టుకోవాలన్న కుతూహలంతో స్పెషల్ స్టేటస్ గురించి ఎలాగూ మోదీ ని అడగే పరిస్థితి ఉండదు .

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఆధారపడి ఉందన్న విషయం తెలిసిందే . రాజకేయగ మన అవసరం ఉన్నా . .. ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి.

అమరావతికి చట్టబద్దత హామీ ఇస్తారా ? రాజధాని ఏర్పాటు సమయంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సపోర్టుగా మాట్లాడారు. 33 వేల ఎకరాలు కూడా సరిపోదన్నారు . 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని సర్వనాశనం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు . అమరావతిపైనా , ఆ ప్రాంతంలో ఒక సామాజిక వర్గంపైనా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు . రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై రాక్షసత్వం చూపారు . దేవుడు కరుణించి వారి ఉద్యమం సక్సెస్ అయింది . వారి మనోభీష్టం మేరకు జగన్ ని ఆంధ్రప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు . ఇంతవరకు బాగానే ఉంది . చంద్రబాబు నాయుడు , కూటమి నేతలు తామే ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా అధికారంలో ఉంటామన్న భ్రమలలో తేలియాడుతున్నారు . అయితే ప్రజలు మాత్రం కొన్ని అనుమానాలలోనే ఉంటారు . ఆంధ్రప్రదేశ్ గ్రహపాటు బాగోక మరోమారు జగన్ అధికారంలోకి వస్తే . . పరిస్థితి ఏమిటి ? అన్న భయంలో మాత్రం కొందరు ఉన్నారు . వీరికి కూటమి ఎటువంటి భరోసా ఇస్తుంది . అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీతో ‘అమరావతి చట్టబద్దత ‘ హామీ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు . చంద్రబాబు ఈ పని చేయగలిగితే సక్సెస్ అయినట్లే . అమరావతి చట్టబద్దత అంశంపై మోదీ ఎటువంటి హామీ ఇవ్వకపోతే మాత్రం అమరావతి భవితవ్యంపై నీలినీడలు అలుముకునే ప్రమాదం పొంచి ఉంటుంది .

ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తారు. అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభిస్తుండటంతో ఈ పర్యటన కీలకంగా మారింది. ఈ సందర్భంగా మోదీ.. లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ….. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2.55కి కేరళలోని తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.15కి అమరావతి హెలిప్యాడ్‌కి చేరతారు. తర్వాత 3.25కి సభా వేదిక దగ్గరకు వెళ్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4.45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అప్పుడే అమరావతి పెవిలియన్‌ను పరిశీలిస్తారు .