అప్పట్లో ఇవన్నీ లేవు . , కానీ . ,

అప్పట్లో ఇవన్నీ లేవు . , కానీ . ,

ఓ తండ్రి . . కొడుక్కి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు మీరూ చదవండి . ..

తండ్రిని ఒక కొడుకు అడిగిన ఒక సందేహం…. (పాతికేళ్ల క్రితం నాటి కధ . . అయినా కొత్తగానే ఉంటుంది . ..)

నాన్నా ! మీ కాలంలో;;;;

1. ఇంత టెక్నాలజీ లేదు..

2. ఆర్డర్ పెడితే పది నిమిషాలలో ఫుడ్ ఇంటికొచ్చే సౌకర్యంలేదు . ..

3. వేగవంతమైన ఇంటర్నెట్ లేదు..

4. ఆధునిక TV లు లేవు..

5.  కంప్యూటర్లు లేవు..

6. ఏసీ లు లేవు..

7. లగ్జరీ కార్ లు లేవు..

8. మొబైల్ ఫోన్ లు లేవు… మీరెలా బ్రతికేవారు? 

*దానికి ఆ తరము తండ్రి గారు ఇచ్చిన జవాబు అందరూ చదవవలసిందే*.

మీ తరమువారు ఈ రోజుల్లో  ఎలాగైతే

1. ప్రార్ధన లేకుండా..

2. మర్యాద లేకుండా

3. ప్లానింగ్ లేకుండా

4. క్రమశిక్షణ లేకుండా..

5. పెద్దల ఎడల గౌరవం లేకుండా..

6. మన చరిత్ర పై అవగాహన లేకుండా..

7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా.

8. ఏ మోరల్ వేల్యూస్ లేకుండా…   రోజులు ఎలా గడిపేస్తున్నారో!

మేము ఆ Morals అన్నీ పాటిస్తూ ఆనందముగా జీవించాము.

మేము మీలాగా…

1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు..

2. పాఠశాల వేళలు అయిన

తరువాత చీకటి పడేదాకా ఆడుకున్నాము. TV లు చూడలేదు…

3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక నిజమైన స్నేహితులతో గడిపాము..

4. దాహము వేస్తే కుళాయి నీరు, బావి నీరు త్రాగాము. బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు..

5. ఒకే గ్లాస్ లో నలుగురం జ్యూస్ త్రాగినా, కాకి ఎంగిలి చేసిన జామకాయలు తిన్నా

మాకెప్పుడూ జబ్బులు రాలేదు..

6. మూడు పూటలా అన్నమే తిన్నా మాకు ఊబకాయం రాలేదు…

7. షూస్ లేకుండా ఉత్తి పాదాలపై పరిగెత్తినా

మాకు కీళ్ళ నొప్పులు రాలేదు..

8. సొంత ఆట వస్తువులు తయారు చేసికొని ఆడుకున్నాము,, అష్టా చెమ్మా, ఏడు పెంకులు, కోతి కొమ్మచ్చి, వైకుంఠ పాళీ ఆడుకున్నాము.

బంధువులతో కలసి మెలసి ఆనందముగా ఉన్నాము,

9. పిలువక పోయినా స్నేహితుల ఇండ్లకు వెళ్లి వారి తినుబండారాలు ఆరగించాము..

10. మావి black and వైట్ ఫొటోలే అయినా వాటి వెనుక ఎన్నో మధుర స్మృతులు…..

    బహుశా మాతల్లి దండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే.

మా వారసులు శాసించినది పాటించే మొదటి తరమూ మాదే కావచ్చు…..

అయినప్పటికీ..

మీ యాంత్రిక జీవితానికి యధాశక్తి సహాయ పడుతున్న వాళ్ళము…

మేము ఒక limited ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్ళము…..

అందుకే మా విన్నపము ఏమంటే..

*భూమి పైనుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాలనుండి,  ఎంతో కొంత మానుండి మీరు నేర్చుకోండి*.…….

మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు,

మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో,

ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతామేమో . …. ఈ కధ సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తూ ఉంటుంది . ఇలాంటి ఆలోచింపచేసే కధలు , వాస్తవాలను నేటి తరం పిల్లలకు ఏదోలా చేరవేయాలి . కనీసం ఒక్క్కసారైనా దీనిపై ఆలోచన చేస్తారు . అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఎప్పుడైనా అనిపిస్తే . .. అటుగా అడుగులు వేసే ప్రయత్నం అయినా మొదలెడతారు . . పాజిటివ్ గా ఆలోచిద్దాం . ..

బిల్ గేట్స్ – 99 శాతం సంపద దానం చేస్తున్నారు

బిల్ గేట్స్ – 99 శాతం సంపద దానం చేస్తున్నారు

దీని వెలువ తొమ్మిది లక్షల కోట్ల పైమాటే . ..

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంపదంలో 99 శాతాన్ని పేదల కోసం వెచ్చించాలని నిర్ణయించారు . ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్‌కు (Gates Foundation) విరాళంగా ప్రకటించారు. ఆ సంపదతో గేట్స్ ఫౌండేషన్ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను భారీ స్థాయిలో చేపట్టనున్నారు. 2045 నాటికి ఆ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసి గేట్స్ ఫౌండేషన్‌ను పూర్తిగా మూసెయ్యాలని నిర్ణయించుకున్నారు.గేట్స్ ఫౌండేషన్‌ను బిల్‌గేట్స్, మిలిందా 2000 సంవత్సరంలో స్థాపించారు. గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఛారిటబుల్ ట్రస్ట్.

ప్రస్తుత లెక్కల ప్రకారం బిల్‌గేట్స్ సంపదలో 99 శాతం అంటే 107 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం 9 లక్షల కోట్ల రూపాయలు. అలాగే దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి రాబోయే 20 ఏళ్లలో మరో 200 బిలియన్ డాలర్లు (రూ.16 లక్షల కోట్ల రూపాయలకు పైగా)ను కూడా ఖర్చుపెట్టబోతున్నారు. ఈ డబ్బును పూర్తిగా ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన వంటి సేవా కార్యక్రమాలకు వెచ్చించి, ఆపై సంస్థను శాశ్వతంగా మూసివేయాలని యోచిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్‌కు ప్రపంచ కుభేరుడు అయిన వారెన్ బఫెట్ కూడా భారీగా విరాళాలు అందజేస్తుంటారు.

 ఆపరేషన్ సిందూర్.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్‌కు భారీ షాక్

 ఆపరేషన్ సిందూర్.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్‌కు భారీ షాక్

10 మంది కుటుంబసభ్యులు, అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడి

ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్‌ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబసభ్యులు కూడా మరణించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. బహావల్‌పూర్‌లో జరిగిన దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించిన మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబసభ్యులు బాంబు ధాటికి మరణించారు.

 భారత్ చేపట్టిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబసభ్యులు హతమయ్యారు. 10 మంది కుటుంబసభ్యులు, మరో నలుగురు అనుచరులు మరణించినట్లు మసూద్ అజార్ వెల్లడించాడు. భారత్ దాడుల్లో మసూద్ అజార్ అక్క, బావ, మేనల్లుడు, అతని భార్యతో పాటు మరో ఐదుగురు మరణించినట్లు చెప్పాడు. జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం బహవల్​పుర్​లోని జామియా మస్జీద్​ సుబాన్​ అల్లాహ్​ ప్రాంతంలో జరిగిన దాడిలో మరణించినట్లు తెలిపాడు.

ఉగ్ర స్థావరాలే టార్గెట్ :

భారత దళాలు పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోగల ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్, లష్కరే తోయిబాప్రధాన కార్యాలయాలున్న ప్రాంతాల్లోనే ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాదుల స్థావరాలనే తాము టార్గెట్ చేసుకున్నామని భారత్ స్పష్టం చేసింది. సామాన్యులకు అపాయం కలుగకుండా ఆపరేషన్ నిర్వహించినట్టు వెల్లడించింది.

ఈ దాడిలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ 25 నిమిషాలపాటు బాంబుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అత్యంత కచ్చితత్వంతో జరిపిన ఈ దాడుల్లో సుమారు 70 మంది ఉగ్రవాదులు అంతమయ్యారు. పీఓకే ఉగ్రస్థావరాలతోపాటు పాక్‌లోని ఐదు ఉగ్రక్యాంపులను కూడా భారత్ ధ్వంసం చేసింది.

భారత్ చర్యలపై స్పందించిన పాక్..

ఈ ఆపరేషన్‌ను యుద్ధ చర్యగా అభివర్ణించింది. అయితే, భారత్ తన చర్యలను కట్టిపెడితే తాము ప్రతి దాడికి దిగబోమని కాళ్లబేరానికి వచ్చింది. ఇదిలా ఉంటే భారత్‌ కూడా పాక్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితి మరింత దిగజార్చేలా దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామనని వార్నింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలిచాయి. స్వీయ రక్షణ భారత దేశ హక్కు అని ముక్తకంఠంతో పేర్కొన్నాయి.

యూఎస్​-ఇండియా ట్రేడ్ డీల్​-జేడీ వాన్స్ ప్లాన్ ఏమిటి ?

యూఎస్​-ఇండియా ట్రేడ్ డీల్​-జేడీ వాన్స్ ప్లాన్ ఏమిటి ?

 భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ట్రేడ్​ డీల్​)పై చర్చలు జరుగుతున్న వేళ యూఎస్​ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రకటించారు. పరస్పర సుంకాలను నివారించడానికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాల్లో భారత్‌ కూడా ఉండొచ్చని ఆయన అన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, ఆయన చాలావ టఫ్​ నెగోషియేటర్ అని, ఆయన చాలా బాగా బేరసారాలు చేస్తారని, అందుకే తాము ఆయనను గౌరవిస్తామని జేడీ వాన్స్​ అన్నారు.

ట్రేడ్ డీల్​పై పురోగతి
ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జేడీ వాన్స్‌- ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రేడ్​ డీల్​ కుదుర్చుకునేందుకు భారత్, అమెరికా కొనసాగిస్తున్న చర్చల్లో పురోగతిపై ఇరుదేశాల నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యూహాత్మక సాంకేతికతలు, రక్షణ, ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవడంపై దృష్టిసారించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు, గ్యాస్‌ల దిగుమతి పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ట్రంప్‌ సైతం భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. జేడీ వాన్స్‌ తాజా ప్రకటనతో త్వరలోనే ఒప్పందం ఖరారుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఒకప్పుడు పాకిస్తాన్ లో ఎంపీ – భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ

ఒకప్పుడు పాకిస్తాన్ లో ఎంపీ – భారత్ లో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ

భారత్ పౌరసత్వం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వైనం

ఒకప్పుడు అతను పాకిస్థాన్ పార్లమెంట్ మెంబర్ . అంటే ఎంపీ అన్న మాట . పరిస్థితులు ఎలా తారుమారవుతాయో ఇతని ఉదంతం ఒక ఉదాహరణ . ఆ ​ మాజీ ఎంపీ ప్రస్తుతం భారత్​లో ఐస్​క్రీములు అమ్ముకుంటున్నారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్​ భుట్టో ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న దివాయా రామ్​, హరియాణాలోని ఫతేబాద్​లో ఐస్​క్రీమ్​ వ్యాపారం చేసుకుంటున్నారు. 25ఏళ్ల క్రితం భారత్​కు వచ్చిన ఆయన ఇక్కడే స్థిరపడిపోయారు. తాజాగా భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీసాలు రద్దు చేయగా ఈయన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అసలు ఆయన భారత్​కు ఎందుకు వచ్చారు? జీవనం సాగించేందుకు ఐస్​క్రీములు వ్యాపారం ఎంచుకున్నారు .

పాకిస్థాన్​కు చెందిన దివాయా రామ్​ 1989లో మైనార్టీల రిజర్వ్​ స్థానంలో ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, పార్లమెంట్​ సభ్యులుగా ఉన్నా ఆయన కుటుంబంపై దాడులు మాత్రం ఆగలేదు. ఒకసారి దివాయా రామ్​ కూతురిని కిడ్నాప్​ చేసినా, పోలీస్ వ్యవస్థ కూడా ఈయనకు సహకరించలేదు . దీంతో ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఎంపీ పదవికి రాజీనామా చేసి కుటుంబంతో సహా భారత్​కు వచ్చేశారు. భార్య రాజో రాణి, 8మంది కుమారులు, ఇద్దరు కూతుళ్లు సహా 13 మంది వచ్చారు. ఆ తర్వాత ఒక కుమార్తె జన్మించగా, ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యుల సంఖ్య 30కి చేరింది. తొలుత నెల రోజుల టూరిస్ట్​ వీసాతో వచ్చిన ఆయన, తర్వాత ప్రతి ఏడాది రెన్యూవల్ చేస్తున్నారు . అనంతరం ఐదేళ్లకు ఆయన వీసాను 2018 వరకు పొడిగించారు.

పాకిస్థాన్​లో వేధింపులు తాళలేక దివాయా రామ్​ బంధువు రామ్ ప్రకాశ్​ కుటుంబం కూడా 2006లో భారత్​కు వచ్చి స్థిరపడింది. ఫతేబాద్​లోని సర్దావాలాకు వచ్చి స్థిరపడి, ఇక్కడే వివాహం చేసుకున్నాడు. అనంతరం అతడి కుటుంబంలోని ఆరుగురికి భారత పౌరసత్వం దక్కగా, ఇంకా కొందరివి ప్రాసెస్​లో ఉన్నాయి. కాగా, జమ్ము కశ్మీర్​ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్​ వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే భారత్‌ విధించిన ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు 786 మంది పాకిస్థానీయులు అటారీ-వాఘా సరిహద్దు దాటి పాకిస్థాన్​కు తిరిగి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడ నుంచి 1,367మంది పౌరులు భారత్​ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

2018 వరకు వీసాతో ఉన్న దివాయా రామ్​ కుటుంబం శరణార్థిగా భారత్​లోనే ఉంటున్నారు. అనంతరం 2018లో వీసా గడువు పెంపునకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత తన వీసా గడుపు పెంచడానికి స్థానిక నేతలతో పాటు అందరి చూట్టూ తిరిగారు. CAA చట్టం ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా పాకిస్తాన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న ఆ దేశ పౌరులైన . . దీర్ఘకాలంగా ఇక్కడే ఉంటున్న వారికి భారత్ పౌర సత్వం విషయంలో మానవత్వంతో ఆలోచించి . .. నిర్ణయం తీసుకోవాలి .

పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తుకు సిద్ధం : పాక్ ప్రధాని

పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తుకు సిద్ధం : పాక్ ప్రధాని

జమ్మూ కాశ్మీర్ సమీపంలో  పహల్గాంలో జరిగిన మారణహోమం   తరువాత భారతదేశానికి ప్రపంచ దేశాల మద్ధతు పెరుగుతోంది.  పాకిస్థాన్‌ ఏకాకి అయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ పై క్రమంగా ఒత్తడి పెరుగుతోంది. దీనితో ఇప్పటి వరకు గుంభనంగా   ఉన్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్ నోరు మెదిపారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

“జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఓ విషాదకర ఘటన జరిగింది. దీంతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఉగ్రదాడిపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తునకు మేము సిద్ధంగా ఉన్నాం. శాంతికే మేము ప్రాధాన్యత ఇస్తాం” అని షరీఫ్‌ పాకిస్థాన్‌ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న విషయాన్ని దాచిపెట్టి, ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.

చర్చల ద్వారానే పరిష్కారం!
ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా పాక్ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ పరోక్షంగా స్పందించారు. “మా దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో ఎన్నటికీ రాజీపడం. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ, ‘ఇండియా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఇలాంటి చర్యలతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మేము చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలువురు పాక్ మంత్రులు భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే.

 ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలను బలితీసుకుని నరమేధం సృష్టించారు. పాక్‌ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌’ ఈ దాడులకు పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి, పోషిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు ఆంక్షలు విధించింది. పాక్‌ పౌరులు తక్షణమే భారత్‌ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీనితో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని లోలోపల భయంగానే ఉన్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు .