అమరావతిపై మురికి వ్యాఖ్యలతో… గూగుల్ ఏర్పాటు వార్త ప్రాధాన్యత లేకుండా చేయడమే వైసీపీ పన్నాగమా?

అమరావతిపై మురికి వ్యాఖ్యలతో… గూగుల్ ఏర్పాటు వార్త ప్రాధాన్యత లేకుండా చేయడమే వైసీపీ పన్నాగమా?

వైసీపీ కుట్రలో భాగంగానే ‘సాక్షి ‘ డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతిపై జుగుప్సాకర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ సమాజంలో అనుమానాలు , సోషల్ మీడియాలో జోరుగా చర్చ..

సాక్షి మీడియా కొమ్మినేని శ్రీనివాస్ రావు , మరో జర్నలిస్ట్ కృష్ణంరాజు సంస్కార హీనపు , మురికి వ్యాఖ్యల చర్చ ఉదంతం జరిగిన మరుసటి రోజే అమరావతిలో అనంతవరం -నెక్కల్లు గ్రామాల మధ్యలో గూగుల్ సంస్థ ఏర్పాటు జరగాలి . 143 ఎకరాల విస్తీర్ణంలో లో గూగుల్ సంస్థ ఏర్పాటు కానుంది అన్న వార్త మీడియాలో ఫోకస్ కాకుండా . .. డైవర్ట్ చేయడమే . .. అమరావతి పై దారుణ వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నేతలు పన్నిన పన్నాగం అంటూ రెండ్రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది .

గూగుల్ సంస్థ ప్రతినిధులు సైట్ విజిట్ కూడా ఆ లొకేషన్ కి ఒకే చెప్పారు అన్న వార్త వెలువడింది.. దీంతో కూటమి సర్కార్ కి మంచి పేరొస్తుందన్న ఆందోళనలో వైసీపీ కుయుక్తులు పన్నినట్లు పలువురు అనుమానిస్తున్నారు .

గూగుల్ ఇక్కడికి రావడం . … రాష్ట్ర రాజధాని నిర్మాణంలోనే ఒక గేమ్ చేంజర్ అనుకోవాలి..

ఎందుకు అంటే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేయబడిన ఇన్ఫోసిస్ క్యాంపస్ 50 ఎకరాలలో ఏర్పాటు చేయబడింది..

ఆ సంస్థకి ఆరోజుల్లో భూమి కేటాయింపు చేసింది కూడా నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే..

ఆరోజుల్లో ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో ఎకరానికి 500 మంది చొప్పున మొత్తం 50 ఎకరాలలో 25,000 మందికి ఉద్యోగ కల్పన జరగాలి..

కానీ వాస్తవంగా నేడు ఆ క్యాంపస్ లో అంతకన్నా ఎక్కువగా ఉద్యోగ కల్పన జరిగింది..

నేడు అమరావతి లో ఏర్పాటు కానున్న 143 ఎకరాల క్యాంపస్ లో ఎంత ఉద్యోగ కల్పన జరగనుంది అనేది ఆలోచించండి..

ఒక్క సంస్థ ద్వారా ఒక్క క్యాంపస్ లోనే ప్రత్యక్షంగా కనీసం ఒక 50,000 మందికి తగ్గకుండా ఉపాధి దక్కితే దాని ద్వారా ఇంకెంత మంది పరోక్ష ఉపాధి పొందుతారో ఆలోచించండి..

రాష్ట్రానికి ఇంతటి ఘనత ఒనగూరనుంది అనే వార్త రాష్ట్ర ప్రజలకు తెలియడానికన్నా ముందే ప్రభుత్వంలో వున్న జగన్ కోవర్ట్ అధికారులు ద్వారా జగన్ & ముఠాకి ముందుగానే లీక్ అయ్యి వుండొచ్చు అనేది నిర్వివాదాంశం..

కాబట్టే అటువంటి అంతర్జాతీయ సంస్థ అమరావతి కి రాకుండా అడ్డుకోవడంలో భాగంగానే అమరావతి బ్రాండింగ్ దెబ్బతీయడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం అమరావతిలో ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువగా వున్నారు ఇక్కడ ప్రజలలో వేశ్యా వృత్తిలో వున్న వారు ఎక్కువగా వున్నారు అని ప్రచారం చేయడంలో భాగంగానే జరిపిన చర్చ తప్ప అది అప్పటికప్పుడు యాదృచ్చికంగా జరిగిన చర్చ కాదు..

ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా గుర్తు చేసుకుందాము కొన్ని నెలల క్రితం చంద్రబాబు గారు “నేడు యూట్యూబ్ ఇండియా చీఫ్ తో నేడు మాట్లాడాను అమరావతిలో యూట్యూబ్ అకాడెమీ ఏర్పాటు చేయమని అడిగాను” అని ట్వీట్ చేసిన రోజు..

అదే ట్వీట్ ను యూట్యూబ్ వారికి ట్యాగ్ చేస్తూ కొందరు దుర్మార్గులు “అమరావతిలో మహిళలకు భద్రత లేదు..రేపు మీ సిబ్బందికి కూడా రక్షణ ఉండదు పైగా అమరావతి ముంపు ప్రాంతం కాబట్టి మీరు ఏదైనా పెట్టుబడి పెట్టుకోవాలి అంటే హైదరాబాద్ లో పెట్టుకోండి తప్ప అమరావతిలో పెట్టవద్దు” అని ప్రచారం చేసిన ఉన్మాదుల రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా చేసినట్లు చెపుతున్నారు . ..

ఇటువంటి కుట్రదారుల విషయంలో కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి .

తెలుగు రైతన్నలు  పండుగ – ‘ఏరువాక పున్నమి’

తెలుగు రైతన్నలు పండుగ – ‘ఏరువాక పున్నమి’

తెలుగు రైతాంగానికి ఉగాదే కాకుండా . .. ఏరువాక పౌర్ణమి కూడా చెప్పుకోదగ్గ పండగే. అయితే ఇటీవల దీని ప్రాధాన్యత క్రమంగా రైతాంగం తగ్గిస్తూ వస్తున్నారు . కొన్ని ప్రాంతాలలో మాత్రం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు .

ఓషధులకి, సస్యానికి అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను అందిస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు. ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞం అని సంస్కృతంలో ఉద్వృషభ యజ్ఞం అని, కన్నడంలో కారణి పబ్బం అని జరుపుకుంటారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్ష బుుతువు ప్రారంభం కాగానే, రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి, వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, పూలతో అలంకరించి కట్టేకాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు. అనంతరం కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపిస్తారు. పొలానికి వెళ్లి భూమాతకు ఆరాధిస్తారు. అలాగే ఏరువాక పున్నమి రోజున సాయంకాలం వేళ రంగు రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి, డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు. అనంతరం ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.

సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుంటూ ఉంటాము. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ ఉంది. ‘ఏరువాక పున్నమి’ పేరిట జరుపుకునే ఈ పండుగ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏరువాక పౌర్ణమి ఎప్పుడు వస్తుంది?
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన జరుపుకోనున్న ఏరువాక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.

ఏరువాక పౌర్ణమి అంటే?
రోళ్ళు పగిలే రోహిణి కార్తె వెళ్లి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు.

కర్షకుల పండుగ
ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్థిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.

ఏరువాక పూజ
ఏరువాక పున్నమి రోజున మట్టిని నమ్మి కష్టించి పని చేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ తమకు వ్యవసాయంలో చేదోడుగా ఉండే ఎద్దులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో సర్వాంగసుందరంగా అలంకరిస్తారు. అనంతరం పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు.

క్వాంటం టెక్నాలజీ.. కేరాఫ్ ‘అమరావతి’

క్వాంటం టెక్నాలజీ.. కేరాఫ్ ‘అమరావతి’

క్వాంటం టెక్నాలజీకి భారతదేశంలోని ప్రధాన కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దాలన్న దార్శనికతతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఉన్నారు . .

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ నిపుణులు, ఏఐ నిపుణులతో సంప్రదింపులు జరిపిన చంద్రబాబు . .. అమరావతిలోని క్వాంటం వ్యాలీ కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు, ఈ పరివర్తన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ లీడర్ షిప్ కి కేరాఫ్ గా నిలబెట్టాలని కలలు కంటున్నారు . ..

ఈ చొరవ కోసం వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి జూన్ 30న అమరావతిలో క్వాంటం మిషన్‌పై కీలకమైన వర్క్‌షాప్ జరుగుతుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

జాతీయ క్వాంటం మిషన్‌కు అనుగుణంగా..
క్వాంటం వ్యాలీ అభివృద్ధి యొక్క ప్రతి వివరాలపై నిశితమైన శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా ప్రాజెక్ట్ ఆశయాన్ని సూచించడానికి ఒక ఐకానిక్ ఆర్కిటెక్చరల్ నిర్మాణాన్ని సృష్టించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

“హైదరాబాద్ హైటెక్ సిటీ 1990లలో పురోగతికి చిహ్నంగా మారినట్లే, క్వాంటం వ్యాలీ భవనం ఆవిష్కరణకు ప్రపంచ చిహ్నంగా నిలబడాలి” అని చంద్రబాబు నాయుడు అన్నారు, సౌందర్య మరియు క్రియాత్మక శ్రేష్ఠత అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటం మిషన్ భారతదేశ జాతీయ క్వాంటం మిషన్ (NQM)కి అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం పరిశోధన మరియు అప్లికేషన్‌లో మార్గదర్శకుడిగా స్థాపించింది. సమీక్ష సందర్భంగా, అధికారులు మిషన్ లక్ష్యాలను వివరించే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించారు:

ఈ మిషన్ నాలుగు కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది: క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ & మెట్రాలజీ, మరియు క్వాంటం మెటీరియల్స్ & పరికరాలు.

రాబోయే ఐదు సంవత్సరాలలో ₹4,000 కోట్ల అంచనా పెట్టుబడితో, ఈ చొరవ క్వాంటం ఆధారిత ప్రజా మౌలిక సదుపాయాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది, ఆంధ్రప్రదేశ్‌ను అటువంటి పురోగతికి పైలట్ రాష్ట్రంగా నిలబడింది .

ఈ మిషన్ రెండు దశల్లో విప్పుతుంది:

దశ I (2025–2027): ఈ దశ అమరావతిలో 50 ఎకరాల క్యాంపస్‌లో క్వాంటం వ్యాలీ స్థాపనతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. క్వాంటం ఆవిష్కరణకు బలమైన పునాదిని నిర్మించడానికి విద్య, పరిశోధన మరియు పైలట్ కార్యక్రమాలపై కూడా ఇది దృష్టి పెడుతుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) మద్రాస్ వంటి విద్యాసంస్థలు మరియు ఐబిఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మరియు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) వంటి పరిశ్రమ దిగ్గజాలతో భాగస్వామ్యాలు ఈ దశను నడిపిస్తాయి.
రెండవ దశ (2027–2030): రెండవ దశ ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీలో ప్రపంచ నాయకత్వానికి నడిపించడం లక్ష్యంగా పెట్టుకుంది, వాణిజ్యీకరణ, ఎగుమతి సామర్థ్యాలు మరియు పరిశ్రమలలో పెద్ద ఎత్తున స్వీకరణపై దృష్టి పెడుతుంది.

మే 2024లో IBM, TCS మరియు L&Tతో కుదుర్చుకున్న వ్యూహాత్మక అవగాహన ఒప్పందాల (MoUలు) ద్వారా క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ ఇప్పటికే గణనీయమైన ఊపును పొందింది. ఈ భాగస్వామ్యాలు 18 జనవరి 2026న ప్రారంభించనున్న క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ అభివృద్ధికి కీలకమైనవి.

TCS క్వాంటం సాఫ్ట్‌వేర్ సేవలను అందిస్తుంది మరియు 17 రాష్ట్రాలలో 43 పరిశోధనా కేంద్రాలకు ప్రాప్యతను అందిస్తుంది, అయితే L&T క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌తో సహా ఐకానిక్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆమోదించిన ప్రాజెక్ట్ యొక్క వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR)తో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 54 ఎకరాల భూమిని కేటాయించింది.

క్వాంటం వ్యాలీ భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటుందని భావిస్తున్నారు, ఇది విద్యావేత్తలు, స్టార్టప్‌లు మరియు పరిశ్రమ నాయకుల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. హైదరాబాద్‌లోని HITEC సిటీ నుండి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్, క్వాంటం టెక్నాలజీలు, AI, సైబర్ సెక్యూరిటీ మరియు డ్రగ్ డిస్కవరీపై దృష్టి సారించడం ద్వారా దాని విజయాన్ని ప్రతిబింబించడం మరియు అధిగమించడం లక్ష్యంగా పెట్టుకుంది.

జూన్ 30, 2025న జరగనున్న క్వాంటం సమ్మిట్ IT, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్టార్టప్‌లు మరియు ఆవిష్కర్తలు వంటి విభిన్న రంగాల నుండి ప్రతినిధులను ఒకచోట చేర్చుతుంది.

క్వాంటం కంప్యూటింగ్, AI మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు సామాజిక ఫాబ్రిక్‌లో అనుసంధానించడానికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సమ్మిట్ లక్ష్యం. ఈ మిషన్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మరియు ప్రపంచ ప్రతిభ మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ నిపుణులు పాల్గొంటారు.

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌కు రూట్

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్‌ పార్క్‌కు రూట్

హైదరాబాద్ కి హైటెక్ సిటీ ఎలాగో . … అమరావతికి క్వాంటం వ్యాలీ అలా అన్నమాట . …

రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ( Quantum Valley Technology Park) ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఈరోజు (శనివారం) ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది.

క్యాంటం కంప్యూటింగ్ సర్వీసెస్ , సొల్యూషన్స్ తో పాటు పరిశోధన, మరియు హైబ్రీడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను టీసీఎస్ అందించనుంది. అలాగే వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి, విద్యా రంగాలకు చెందిన వివిధ అప్లికేషన్లు, పరిశోధన సహకారాన్ని అందించేలా టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ప్రభుత్వం. క్లైంట్ నెట్వర్క్‌తో పాటు స్టార్టప్ , ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్ అండ్ టీ సంస్థ అందించనుంది. 2026 జనవరి 1 నాటికి అమరావతి రాజధానిలో అధునాతన క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది. ఇది పూర్తయితే . . ఒక్క అమరావతిలోనే 50 వేల మంది నిపుణులకు మంచి సాలరీతో ఉద్యోగాలు లభించనున్నాయి .

గండికోటకు మహర్దశ 

గండికోటకు మహర్దశ 

300 అడుగత్తున నిటారుగా ఉండే ఇసుక రాతి కొండలు.. రెండు కొండల మధ్య పెన్నా నది సవ్వడులు.. , మరోవైపు ప్రాచీన చరితకు సాక్ష్యంగా నిలిచే వెయ్యేళ్ళ నాటి కోట.. పునాది లేకుండానే టన్నుల బరువుండే పెద్ద పెద్ద రాళ్లతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన కోట గోడ.. . ప్రకృతి ప్రేమికులకు నయనానందం కలిగించే అపురూప దృశ్యాలు. ఒక్కసారి అడుగుపెడితే.. ‘’గండికోట’’ అందాలను ఎవరైనా మనసారా ఆస్వాదించాల్సిందే.

ఎర్రమల కొండల మధ్య ఒంపులు తిరుగుతూ గలగల పారే పెన్నా నది అందాలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తాయ్. నదికి ఇరువైపుల ఉన్న ఎత్తైన కొండలపై సూర్యకాంతి పడినపుడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అంతలోనే మబ్బులు కమ్మేస్తాయ్. ఈ వెలుగు-నీడల దోబూచులాట పర్యాటకులకు వీనుల విందు.

ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఇంత అందంగా ఎవరు పేర్చారు? అనిపించేలా కొండలను ఆనుకుని ఉన్న బండరాళ్లు.. ఈ ప్రాంతానికి పర్యాటక వన్నె తీసుకువచ్చాయి.

‘గ్రాండ్ కాన్యన్’… అమెరికాలో అరిజోనా రాష్ట్రంలో Colorado river, దాని చుట్టూ ఎత్తైన ప్రదేశం… ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. యునెస్కో గుర్తింపు కూడా పొందింది.

‘గండికోట’లో ఎత్తైన కొండల మధ్య గలగలపారే పెన్నా అందాలు కూడా గ్రాండ్ కాన్యన్ ను పోలి ఉంటాయని అంటుంటారు. అందుకే ‘గండికోట’ను “గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా” గా అభివర్ణిస్తూ ఉంటారు. అమెరికాలో గ్రాండ్ కాన్యన్ లో మాదిరిగా సాహసక్రీడల ఏర్పాటుకు గండికోట ప్రాంతం ఎంతో అనువైనదిగా పర్యాటక శాఖ గుర్తించింది.

వేల సంవత్సరాల చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలి ఉన్న ‘గండికోట’ చారిత్రక వైభవాన్ని ఈ తరానికి అందించేందుకు పాలకులు సంకల్పంతో ఉన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ పర్యాటక మంత్రిత్వ శాఖతో పలుమార్లు సంప్రదింపులు జరిపి ‘’గండికోట’’కు నిధుల మంజూరుకు కీలకంగా వ్యవహరించారు. కేంద్రమంత్రిగా సొంత రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో పాటు… గండికోట ప్రాంతాన్ని ‘పెమ్మసాని’ వంశీయులు 400 ఏళ్లపాటు పాలించిన చారిత్రక నేపథ్యం ఉంది. తమ వంశీయుల చరిత్రను తర్వాత తరాల వారికి చూపించుకోవాలన్న ఉద్దేశ్యం కూడా ఉండొచ్చు. ఇది పక్కనపెడితే రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడనుంది.

“గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం గండికోట. పెమ్మసాని పూర్వీకులు 300-400 సంవత్సరాలపాటు మిలటరీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పెమ్మసాని నాయకాస్ గండికోట పాలకులుగా కూడా దక్షిణ భారతదేశంలో పేరుగాంచారు.. ఇది పర్సనల్ గా కూడా నాకు ముఖ్యమే. గండికోట పర్యాటక అభివృద్ధితో రాయలసీమ ప్రాంతానికి పూర్వ వైభవం, ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు వస్తాయ్” అని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

క్రీ.శ. 1123 లో కాకరాజు అనే సామంత రాజు గండికోటకు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయ్. కాకతీయ రాజుల సామంత రాజులు, విజయనగర సామ్రాజ్య సామంత రాజులు, కళ్యాణ చోళులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెపుతుంది. పెమ్మసాని నాయకాస్ (శ్రీకృష్ణదేవరాయల సైన్యాధికారులు) కూడా కొంతకాలం గండికోటకు రాజధానిగా చేసుకుని గుత్తి, అనంతపురం తదితర రాయలసీమ ప్రాంతాన్ని పాలించారు.

క్రీ.శ. 1323లో మహ్మదీయుల దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తరువాత గండికోట ప్రాంతం మహ్మదీయుల పాలన కిందకు వచ్చింది. ఆ సమయంలో గండికోటలో అనేక చారిత్రక కట్టడాలు కూల్చివేశారు.

క్రీ. శ . 1420-1448 మధ్య గండికోటకు పాలించిన తిమ్మనాయుడు ఈ కోటను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. వీరతిమ్మనాయుడు, రామలింగనాయుడు తదితరుల ‘గండికోట’ పాలకులు రాయలసీమ ప్రాంతంలో కరవుకాటకాలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టేవారు. కరవు నుంచి రాజ్య ప్రజలను కాపాడేందుకు లోతైన, భారీ చెరువుల నిర్మాణం చేపట్టడంతోపాటు,, ఆహార ధాన్యాల నిల్వల కోసం భారీ ధాన్యాగారాలు నిర్మించారు.

1652 లో Mir Jumla అనే ముస్లింరాజు గండికోటపై దండయాత్ర చేయడానికి ప్రయత్నించాడు. అప్పటి పాలకుడైన చిన తిమ్మనాయుడు సాహసానికి తట్టుకోలేక వెనుతిరిగిన ముస్లిం రాజు, చిన తిమ్మనాయుడుని విష ప్రయోగంతో చంపినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. చిన తిమ్మనాయుడు గండికోట చివరి రాజు.

గండికోట నిర్మించిన రాజులు ఎత్తైన కొండ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మూడు దుర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, జలపాతాలు ఈ గండికోట ప్రాంతానికి సహజ రక్షణ కవచంగా అప్పట్లో ఉండేవి.

  1. జలదుర్గం: మూడు వైపుల నీటి ప్రవాహంతో కోతకు రక్షణ కల్పించే ఏర్పాట్లు
  2. వనదుర్గం: అడవులు ఎక్కువగా పెంచారు. శత్రువులు కోటలోకి ప్రవేశించకుండా అటవీ ప్రాంతంలో కందకాలు ఏర్పాటు చేసేవారు
  3. పర్వతదుర్గం: ఎత్తైన కొండపైన కోట ఉండటం వల్ల శత్రు సైన్యం చేరడం కష్టమవుతుందని ఈ ప్లాన్ తో నిర్మించారు. కింద నుంచి శత్రు సైన్యం కొండపైన కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసే సమయంలో కోట లోపల నుంచి ‘గండికోట’ సైనికులు శత్రు సైన్యంపై ప్రతిదాడి చేసే వ్యూహంలో భాగంగా ఈ నిర్మణం చేపట్టారు.

వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు 12 కిలోమీటర్ల దూరంలో ‘గండికోట’ ఉంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలకు గండికోట అందుబాటు దూరంలో ఉంటుంది.

  • బెంగుళూరు నుంచి గండికోటకు 290 కిలోమీటర్లు
  • చెన్నై నుంచి గండికోటకు 364 కిలో మీటర్లు
  • హైదరాబాద్ నుంచి గండికోటకు 386 కిలో మీటర్లు.
  • తిరుపతి నుంచి గండికోటకు.. 227 కిలో మీటర్ల దూరం ఉంది.
  • కడప ఎయిర్ పోర్ట్ నుంచి గండికోటకు 75 కిలో మీటర్ల దూరం.

గండికోట పేరు వినగానే.. ఏభై, అరవై ఏళ్ల పైబడిన వయస్సు వారికి సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘’గండికోట రహస్యం’’ సినిమా తళుక్కున గుర్తు రావడం సహజం.

లోకేష్ కి మోదీ అభయం – 2027 లో పట్టాభిషేకం?

లోకేష్ కి మోదీ అభయం – 2027 లో పట్టాభిషేకం?

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయ్. మన రాష్ట్ర రాజకీయ భవితవ్యం కూడా NDA చేతిలోకి వెళ్ళబోతున్నాయ్.

”2029 లోనే కాదు . . 2034 లో మరో దఫా కూడా ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు..” అంటూ జనసేన అధినేత , ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తూ ఉంటారు . అయితే మారుతున్న సమీకరణల నేపథ్యంలో 2027 లోనే నారా లోకేష్ కి పట్టం కట్టడానికి రంగం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.

మోదీ ఆశీస్సులు: ఏపీ మంత్రి లోకేష్ కి ప్రధాని మోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల ప్రధాని నివాసంలో రెండు గంటలపాటు లోకేష్ కుటుంబంతో మోదీ ఉల్లాసంగా గడపడమే దీనికి సంకేతంగా భావించవచ్చు. లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలంటూ కొంత కాలం క్రితం టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో జనసేన కేడర్ భగ్గుమంది. ఉపముఖ్యమంత్రి పదవి ఒకటే ఉండాలనేది టీడీపీ , జనసేన మధ్య ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం. అందులో భాగంగానే చంద్రబాబు సైతం లోకేష్ ని ఉపముఖ్యమంత్రి చేయడానికి ఇష్టపడలేదు.

2029 లో పవన్ ని సీఎం చేయాలన్న డిమాండ్ జనసైనికుల నుంచి తీవ్రంగా ఉంది . అయితే పవన్ తన బలం , బలహీనతలు బాగా అంచనావేయగలిగిన నేతగా ఎదిగారు. పొత్తుతో ముందుకెళితేనే జనసేనకు కూడా భవిష్యత్ ఉంటుందని బలంగా నమ్మిన వ్యక్తి పవన్. 2019 దెబ్బ ఈ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే ఎన్నికలకు సైతం పొత్తుతోనే వెళ్లాలన్నది పవన్ యోచన.

పొత్తుతో ఉన్నపుడు అతిపెద్ద పార్టీ ఏదైతే ఆ పార్టీ నుంచే సీఎం వంటి కీలక పదవులు కేటాయింపు ఉంటుంది . ఇందులో భాగంగానే 2029 లో కూడా టీడీపీ కె ఈ ఛాన్స్ దక్కుతుంది . పవన్ కి కేడర్ నుంచి ఒత్తిడి ఎక్కువవుతున్నా… అతను మాత్రం ఆచి – తూచి అడుగేస్తున్నారు . వచ్చే ఎన్నికలలో పవన్ ని దక్షిణాది మొత్తం తిప్పనున్నారు . సనాతన సారధిగా ఐడెంటిటీ పొందిన పవన్ ప్రాభవం . .. ఏపీ , తెలంగాణతోపాటు . .. కర్ణాటక , తమిళనాడులలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ ని ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా . .. సౌత్ ఇండియన్ పొలిటికల్ స్టార్ గా బీజేపీ ప్రమోట్ చేయనుంది .

2027 లో . .. అంటే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల ముందే లోకేష్ కి సీఎం పదవి పగ్గాలు అప్పగిస్తారని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి . 2026 మహానాడులో లోకేష్ ని టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చేస్తారన్న ప్రచారం కూడా ఉంది.

పవన్ కి కేంద్రమంత్రి పదవి . .. లోకేష్ సీఎం అయితే పవన్ ఉపముఖ్యమంత్రిగా ఎలా ఉంటారు ? పవన్ కి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు . ఈ మేరకు మోదీ టీమ్ ఒక అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది .

వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా . .. చంద్రబాబు : లోకేష్ సీఎం పీఠం అధిరోహిస్తే . .. చంద్రబాబును ఉప రాష్ట్రపతిగా చేసే ప్రయత్నాలు NDA నేతలు చేపట్టినట్లు తెలుస్తోంది .

2029 ఎన్నికల ఎత్తుగడగా బీజేపీ . .. 2029 లో నాలుగోసారి గెలుపు బీజేపీకి అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీతో కొన్ని ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపితే పోటీ మరింత గట్టిగ ఉంటుంది. ముక్యంగా బీజేపీ దక్షిణాదిపై ద్రుష్టి సారించింది . ఇందులో భాగంగా ఏపీ , తెలంగాణలు కూడా తమకు కీలకంగా బీజేపీ భావిస్తోంది.

2014-2019 మధ్య చంద్రబాబు , బీజేపీ తో పొత్తులో ఉన్నారు . 2019 ఎన్నికలలో మాత్రం NDA నుంచి బయటకు వచ్చి . .. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. ఈ దెబ్బ 2019 లో టీడీపీకి బొప్పి కట్టింది . దీంతో 2024 లో చేసిన తప్పును సరిదిద్దుకున్నారు . బీజేపీతో జతకట్టి అప్రతిహత విజయం సాధించారు . ఇదే సమయంలో కేంద్ర0లో సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే ఏపీ నుంచి టీడీపీ మద్దతు మస్ట్. అంతేకాకుండా . .. చంద్రబాబును వదిలేస్తే లాభంలేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. గతంలో వాజపేయి ఉన్నపుడు బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది. మళ్ళీ 2019 లో దూరమయింది . ఇలా ఒక్కోసారి . .. ఒక్కోరకంగా రాజకేయన్గా చంద్రబాబు మార్పులు ఉండటంతో బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉన్నారు . చంద్రబాబును ఇలా వదిలేస్తే లాభంలేదన్న భావనలో ఉన్న మోడీ , అమిత్ షా . .. సీబీఎన్ కి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెడితే బాగుంటుదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది .