లేని “బాధితుడి” పై అల్లరికి జగన్ పార్టీ ప్రయత్నం

లేని “బాధితుడి” పై అల్లరికి జగన్ పార్టీ ప్రయత్నం

(కామినేని-బాలకృష్ణ-చిరంజీవి వివాదం కథ)

ఈ సారి అధికారంలోకి వచ్చేది మేమే అని ప్రజల్ని నమ్మించడానికి “ఏ ఒక్కరినీ వొదిలేది లేదు” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి పదే పదే చేసే చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతూనే వున్నాయి. ప్రజల్లో జగన్ పై వ్యతిరేకత తగ్గలేదన్న నివేదికలను ఈ వైఫల్యాలు దృవపరస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ “కామినేని శ్రీనివాస్ – నందమూరి బాలకృష్ణ – చిరంజీవి” వివాదం.

ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. ఒక రాజకీయ వ్యూహం బెడిసికొట్టి, దాన్ని ప్రారంభించిన వారికే ఇబ్బందికరంగా మారిన ఉదంతం ఇది.

2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి శాసనసభను వేదికగా చేసుకుంది. ఈ క్రమంలో, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల ధరల వివాదంపై చర్చించడానికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారని గుర్తుచేశారు.

చంద్రబాబుకి, చిరంజీవికి ఎన్ టి ఆర్ కుటుంబానికి సన్నిహితుడైన కామినేని ఉభయకుశలోపరి అన్నట్టుగా

చిరంజీవి గట్టిగా నిలదీస్తేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని వ్యాఖ్యానించారు. దీని ద్వారా జగన్‌ను అహంకారిగా చిత్రీకరిస్తూ, అదే సమయంలో కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవిని హీరోగా ప్రశంసించడం ఆయన ఉద్దేశం.

కామినేని మాటలు ముగియకముందే, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జోక్యం చేసుకున్నారు. జగన్‌ను ఎవరూ నిలదీయలేదని కామినేని వాదనను ఖండించారు. అంతటితో ఆగకుండా, జగన్‌ను “సైకోగాడు” అంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు. ఇది మిత్రపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. జగన్‌కు ప్రధాన విమర్శకుడిగా తనకున్న ఇమేజ్‌కు, కామినేని వ్యాఖ్య భంగం కలిగిస్తుందని బాలకృష్ణ భావించి ఉండవచ్చు. ఏమైనా ఆయన ఆవేశపూరిత వ్యాఖ్యలు, కూటమిలోని సమన్వయ లోపాన్ని బయటపెట్టాయి.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి లౌక్యంగా ముగింపు పలికారు. ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తనను ఏమాత్రం అవమానించలేదని, సమావేశం స్నేహపూర్వకంగా జరిగిందని స్పష్టం చేశారు. గతంలో జగన్ – చిరంజీవి దంపతులను భోజనానికి ఆహ్వానించి సాదరంగా గౌరవించారు. తరువాత సినిమా రంగం ప్రతినిధులతో కలిసి చిరంజీవి వెళ్ళినపుడు జగన్ వీరిని పట్టించుకోనట్టు వ్యవహరించి తన ఆధిక్యత చూపించారు. ఇందులో చిరంజీవి పాక్షిక వాస్తవాన్ని మాత్రమే అశ్వద్ధామ హత: కుంజర అన్నట్టు ప్రస్తావించి అంతేకాకుండా, తన చొరవ వల్లే సినిమా టికెట్ ధరలు పెరిగాయని, అది బాలకృష్ణ నటించిన “వీర సింహారెడ్డి” చిత్రానికి కూడా మేలు చేసిందని సున్నితంగా గుర్తుచేశారు. ప్రత్యక్ష దాడికి దిగకుండా, వాస్తవాలతోనే ఆయన బాలకృష్ణకు సమాధానమిచ్చారు. తనను ఒక రాజకీయ పావుగా వాడుకోవడాన్ని నిరాకరిస్తూ, తన గౌరవాన్ని, స్వతంత్రతను చాటుకున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యలతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల బాలకృష్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ వివాదం కూటమి ఐక్యతకు నష్టం చేస్తుందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలతో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం ద్వారా వివాదాన్ని తుంచేశారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని వివరిస్తూ, రికార్డుల నుంచి తొలగించాలని పెద్దరికంతో హుందాగా స్పీకర్‌ను కోరారు. స్పీకర్, కామినేని, బాలకృష్ణ ఇద్దరి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.

ఈ వివాదాన్ని వైఎస్ఆర్సిపి తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించింది. కూటమిలో అంతర్గత కలహాలు ఉన్నాయని, వారు అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని తమ మీడియా ద్వారా ప్రచారం చేసింది. అయితే, ఈ వ్యూహం పూర్తిగా విఫలమైంది. చిరంజీవి ప్రకటనతో, ఈ కథనంలో “బాధితుడు” లేకుండా పోయారు. కూటమి నాయకత్వం వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంతో, వైఎస్ఆర్సిపి ప్రచారానికి ఆయుష్షు లేకుండా పోయింది.

ఈ సంఘటన వైఎస్ఆర్సిపికి రాజకీయంగా నష్టాన్నే మిగిల్చింది. ఎలాగంటే ఈ వివాదం కూటమిలోని బలహీనతను కాకుండా, సంక్షోభాన్ని పరిష్కరించగల వారి నాయకత్వ బలాన్ని ప్రదర్శించింది. చిన్న సమస్యపై అతిగా దృష్టి పెట్టడం ద్వారా, వైఎస్ఆర్సిపి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను విస్మరించిందని ప్రజలకు మరోసారి బోధపడింది. ఈ వివాదం, సినీ పరిశ్రమతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఉన్న ఘర్షణాత్మక గతాన్ని ప్రజలకు తిరిగి గుర్తు చేసింది. ఇది వారికి “బూమరాంగ్” అయింది.

వాతావరణ  మార్పులపై ఈ   అధ్యయనం అమోఘం

వాతావరణ మార్పులపై ఈ అధ్యయనం అమోఘం

2058లో తలెత్తబోయే దుష్ప్రభావాలపై అంతర్జాతీయ సంస్థ తో స్టడీ

ఎన్జీటీ సూచనలతో అమరావతిలో వాతావరణ మార్పులపై సమగ్ర అధ్యయనం – వచ్చే నెల చివరికి నివేదిక సిద్ధం

” వాతావరణంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది . రాజధాని అమరావతిలో రానున్న దశాబ్దాలలో ఎదురు కాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి …. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు . జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సూచన మేరకు రాజధాని నగరానికి సంబంధించి వాతావరణ మార్పులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా సంభవించే దుష్ఫలితాలను నివారించేందుకు CRDA తయారు చేయిస్తోంది. కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బహుళ జాతి సంస్థ అయిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ లోకల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇనీషియేటివ్స్‌- ఇక్లీ(ICLEI) ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా అధ్యయనం సాగుతోంది. అక్టోబరు చివరి నాటికి పూర్తి నివేదికను సమర్పించనుంది.

అమరావతి వాతావరణంపై విశ్లేషణ : రాజధాని అమరావతి నగరంలో వాతావరణంపై సమగ్ర విశ్లేషణ జరుగుతోంది. వాతావరణ మార్పులకు సంబంధించి గత వాతావరణ గణాంకాలను ఇక్లీ సంస్థ సిబ్బంది విశ్లేషిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వర్షపాతం, వాయు నాణ్యతపై ప్రభావం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ సాగుతోంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత ప్రతి ఏటా 0.22 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి 0.2 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర పెరుగుదల కనిపిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ప్రతి దశాబ్దానికి 0.32 డిగ్రీల సెంటిగ్రేడ్‌ చొప్పున పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గణాంకాలు వివిరించారు . 2015 – 2024 కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏటా 4.5 మిల్లీమీటర్ల చొప్పున వార్షిక వర్షపాతం పెరుగుతోంది. పెరుగుదల ప్రధానంగా నైరుతి రుతుపవనాల్లో కనిపించింది. వర్షం పడే రోజులు తగ్గుతున్నాయి. ప్రతి దశాబ్దానికి 2.6 రోజుల చొప్పున తరుగుదల నమోదైంది. కానీ వర్ష తీవ్రత మాత్రం పెరుగుతోంది.

2058 నాటికి వాతావరణ మార్పులు : రాజధానికి సంబంధించి నీటి సరఫరా, వృథా నీరు, వర్షపు నీరు, ఘన వ్యర్థాలు, రవాణా, విద్యుత్తు, భవనాలు, ఆరోగ్యం, హరితం, జీవవైవిధ్యం, గాలి నాణ్యత అంశాలపై ఇక్లీ ముమ్మరంగా అధ్యయనం చేస్తోంది. వీటికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు, 2058 నాటికి వాతావరణ మార్పుల కారణంగా తలెత్తే సమస్యలను ఎలా అధిగమించాలన్న దానిపై సూచనలు కూడా ఇవ్వనుంది. ప్రకాశం బ్యారేజి నుంచి అమరావతికి మొదటి దశలో 386 MLD నీరు, వైకుంఠపురం నుంచి రెండో దశలో 539 MLD చొప్పున 2058 నాటికి మొత్తం 925 MLD నీరు అవసరమవుతుందని అంచనా. 15 శాతం మేర నీటి నష్టాలు ఉంటాయని లెక్కగట్టారు.

2058 నాటికి వృథా నీరు 723 MLD వస్తుందని, ఈ నీటిని శుద్ధి చేసేందుకు 12 STPలు, 1 CETP నిర్మించాల్సి ఉంది. శుద్ధి చేసిన నీటిలో పచ్చదనం కోసం వినియోగించుకోవచ్చు. రాజధాని నగరంలో 2058 నాటికి రోజుకు 3,956 టన్నుల మేర ఘన వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉంది. ఇందులో తడి చెత్త 2,028 టన్నులు కాగా, పొడి చెత్త 1,436 టన్నులు. ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాజధానిలో విద్యుత్తు వినియోగం 220.5 మిలియన్‌ కిలోవాట్‌ అవర్‌. 2058 నాటికి డిమాండ్‌ 10,756 మిలియన్‌ కిలోవాట్‌ అవర్‌కు చేరుకోవచ్చని అధ్యయనంలో గుర్తించారు. సౌరవిద్యుత్తు డిమాండ్‌ 7,954 మిలయన్‌ కిలోవాట్‌ అవర్‌గా ఉంటుందని అంచనా.

అమరావతిలో సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీలు : అమరావతిలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 32.74 డిగ్రీల సెంటిగ్రేడ్‌. రాజధానిని హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేయాలన్నది బృహత్‌ ప్రణాళికలో లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఖాళీ స్థలాలు, రహదారుల వెంబడి పచ్చదనం పెంచితే భూమి ఉపరితల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర తగ్గే అవకాశం ఉందని అధ్యయనంలో గుర్తించారు. పచ్చదనం తక్కువగా ఉన్న అనంతవరం, లింగాయపాలెం, నేలపాడు, వెంకటపాలెం, నవులూరులో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తేలింది.

ఏపీ   లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్

ఏపీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్

ఏమిటి? ఎందుకు? ఎలా? క్లారిటీగా తేల్చేసిన ED

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ₹3,500 కోట్ల మద్యం కుంభకోణంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ప్రభుత్వ విధానాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనుసరించిన పక్కా ప్రణాళికను ఈడీ ఛేదించింది. డొల్ల కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్‌లు, బంగారు దుకాణాల ద్వారా సాగిన ఈ భారీ మనీలాండరింగ్ వ్యవహారం, దర్యాప్తు సంస్థలనే ఆశ్చర్యపరిచింది.

అక్రమ సంపాదనకు పునాది ఇదే . .

ఈ కుంభకోణం మూలాలు 2019 నాటి ప్రభుత్వ మద్యం విధానంలో ఉన్నాయి. ప్రైవేట్ దుకాణాలను రద్దు చేసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా ప్రభుతమే మద్యం అమ్మకాలు చేపట్టింది. ఈ కేంద్రీకృత విధానం ఒక వ్యవస్థీకృత సిండికేట్‌కు ఒక వరంగా మారింది. మద్యం సరఫరా ఆర్డర్లను తమకు అనుకూలమైన డిస్టిలరీలకు ఇచ్చేందుకు, ఆటోమేటెడ్ వ్యవస్థను పక్కనపెట్టి మాన్యువల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రముఖ బ్రాండ్లను కాదని, ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు. ఈ ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయల నల్లధనం పోగైంది.

నల్లధనాన్ని ఎలా వైట్ చేశారు

అక్రమంగా సంపాదించిన డబ్బును ఒక చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి సిండికేట్ రెండు ప్రధాన మార్గాలను ఎంచుకుంది. ఈ మార్గాలను ఛేదించడంపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.

1. డొల్ల కంపెనీల వ్యూహం:

ఈ కుంభకోణంలో 30కి పైగా డొల్ల కంపెనీలను సృష్టించారు. వీటికి సరైన చిరునామా గానీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ గానీ లేదు. డిస్టిలరీలు ముడుపుల డబ్బును నేరుగా ఇవ్వకుండా, ఈ డొల్ల కంపెనీలకు బదిలీ చేసేవి. ప్యాకేజింగ్, రవాణా వంటి సేవలు అందించినట్లు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించేవారు. ఉదాహరణకు, ఒకే ఒక్క వాహనం ఉన్న రవాణా సంస్థ, లక్షల మద్యం కేసులను తరలించినట్లు పత్రాలు చూపించడం ఈ మోసం తీవ్రతను తెలియజేస్తుంది. ఈ నకిలీ లావాదేవీల ద్వారా డబ్బు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి చేరేది. అక్కడి నుంచి దాన్ని నగదు రూపంలో డ్రా చేయడం లేదా ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం చేసేవారు.

2. బంగారం కొనుగోళ్ల మార్గం:

ఇది అత్యంత తెలివైన, క్లిష్టమైన పద్ధతి. డిస్టిలరీలు తమ బ్యాంకు ఖాతాల్లోని “తెల్ల ధనాన్ని” నేరుగా హైదరాబాద్, చెన్నైలోని ప్రముఖ నగల వ్యాపారులకు బదిలీ చేసేవి. ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసినట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్‌లు తీసుకునేవి. దీంతో ఆ లావాదేవీ చట్టబద్ధమైన వ్యాపార ఖర్చుగా వారి లెక్కల్లో. కానీ, కొనుగోలు చేసిన భౌతిక బంగారం మాత్రం సిండికేట్ సభ్యులకు చేరేది. ఈ పద్ధతి ద్వారా, బ్యాంకుల్లో గుర్తించడానికి వీలైన డబ్బును, లెక్కల్లోకి రాని భౌతిక ఆస్తిగా (బంగారం) మార్చారు.

ఈడీకి ఎలా చిక్కారు?

ఈ క్లిష్టమైన నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఈడీకి, రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అందించిన సమాచారం కీలకంగా మారింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లు ఈడీకి ఒక మార్గదర్శిగా ఉపయోగపడ్డాయి. డిస్టిలరీల బ్యాంకు ఖాతాల నుండి నగల వ్యాపారులకు, డొల్ల కంపెనీలకు జరిగిన వందల కోట్ల అనుమానాస్పద లావాదేవీలను సిట్ గుర్తించింది. ఈ ఆధారాలతోనే ఈడీ రంగంలోకి దిగింది.

దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ సహా 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో రావు సాహెబ్ బూరుగు మహదేవ్ జ్యువెలర్స్, మోహన్ లాల్ జ్యువెలర్స్ వంటి బంగారు దుకాణాలు, వెంకటేశ్వర ప్యాకేజింగ్ వంటి డొల్ల కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సోదాల్లో కీలకమైన ఆర్థిక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు, నకిలీ ఇన్వాయిస్‌లు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో పురోగతి

స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. డిస్టిలరీల నుండి డబ్బు ఎప్పుడు, ఎలా బదిలీ అయింది, దానికి సరిగ్గా సరిపోయేలా నగల దుకాణాలు, డొల్ల కంపెనీలు ఇన్వాయిస్‌లు ఎలా జారీ చేశాయో ఈడీ అధికారులు నిర్ధారించుకుంటున్నారు. ఈ పత్రాల ఆధారంగా, డబ్బు ప్రయాణించిన మార్గాన్ని పూర్తిస్థాయిలో గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఆధారాల విశ్లేషణ పూర్తయ్యాక, ఈ కుంభకోణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ దర్యాప్తు, ప్రభుత్వ విధానాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యవస్థీకృత నేరగాళ్ల వెన్ను విరిచే దిశగా సాగుతోంది.

రాజకీయ లబ్ది కోసమే జగన్ . … విజయమ్మ పిటిషన్

రాజకీయ లబ్ది కోసమే జగన్ . … విజయమ్మ పిటిషన్

షర్మిలతో దీర్ఘకాల వైరుధ్యాల ఫలితంగానే జగన్‌ పిటిషన్‌ – రాజకీయ మైలేజీకి జగన్ కుటుంబ వివాదాన్ని వాడుకోవడం బాధాకరం – చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించిన వైఎస్ విజయమ్మ

” వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లి . . షర్మిలతో ఉన్న దీర్ఘకాల వైరుధ్యాలు, రాజకీయ కలహాల కారణంగానే జగన్‌ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌-NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. ;; అని అతని తల్లి , వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అన్నాచెల్లెలి వివాదాల్లో తాను ఇరుక్కుపోయానని ఈ మేరకు చెన్నై నేషనల్‌ కంపెనీ లా అప్పీలెట్‌ ట్రైబ్యునల్‌(NCLAT)కి నివేదించారు. రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని వాపోయారు.

ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌ను జగన్‌ ఆశ్రయించడానికి కారణం చెల్లి షర్మిలకు, ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదని తల్లి విజయమ్మ చెన్నైలోని ఎన్‌సీఎల్‌ఏటీకి నివేదించారు. అందుకోసమే సరస్వతి పవర్ లిమిటెడ్‌లో వాటాల బదలాయింపు, రిజిస్టర్‌లో వాటాదారుల పేర్ల మార్పుపై ఎన్‌సీఎల్‌టీ హైదరాబాద్‌ బెంచ్‌లో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారని విజయమ్మ పేర్కొన్నారు. ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని ఆవేదన వెలిబుచ్చారు.

జగన్ రాజకీయ ప్రాపకం కోసమే : కుటుంబ వివాదానికి కార్పొరేట్‌ రంగు పులిమి వాటిని జగన్‌ తన రాజకీయ మేలేజీకి వాడుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్‌డీడ్‌లు కుటుంబసభ్యుల మధ్య జరిగిన ఒప్పందమని చట్టప్రకారం దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ కార్పొరేట్‌ వివాదానికి సంబంధించినది కాదని అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుద్ధ్యాల ఫలితమేనని విజయమ్మ తేల్చిచెప్పారు. ప్రైవేటు, వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్‌ రంగు అద్ది తమ ప్రతిష్ఠను దెబ్బతీసి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమేనన్నారు.

అది చట్టవిరుద్ధం : విజయమ్మ, జనార్దన్‌రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్‌ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్‌లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్‌ చేస్తూ జగన్‌, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్‌సీఎల్‌టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్‌ తదితరుల పేర్లను పునరుద్ధరించాలంటూ జులై 29న తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీ(NCLAT)లో విజయమ్మ అప్పీల్‌ దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఎం.మహర్షి విశ్వరాజ్‌ ఈ అప్పీల్‌ను దాఖలు చేశారు. సరస్వతి పవర్ దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి దీన్ని చెన్నై అప్పీలెట్ బెంచ్ త్వరలో విచారించనుంది.

అప్పుడే రాజీనామా : సరస్వతి పవర్‌లో తాను ప్రధాన వాటాదారునేనని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో దాఖలు చేసిన అప్పీలులో విజయమ్మ స్పష్టం చేశారు. వాటాల బదలాయింపునకు ముందు తనకు 48.99 శాతం వాటాలున్నట్లు పేర్కొన్నారు. 2021 జులై 26న జగన్‌ 74 లక్షల 26 వేలు, భారతీరెడ్డి 40 లక్షల 50 వేల వాటాలను ప్రేమతో తన పేరిట గిఫ్ట్‌డీడ్‌లు ఇచ్చారని వివరించారు. 2021 ఆగస్టు 14న డైరెక్టర్ పదవికి జగన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. గిఫ్ట్‌ ఒప్పందాలను కానీ, వాటాల కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును కానీ ఏ సివిల్‌ కోర్టులోనూ జగన్ సవాల్ చేయలేదని విజయమ్మ పేర్కొన్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ ముసుగులో వాటిని ట్రైబ్యునల్‌లో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్ పెండింగులో ఉండగా ట్రైబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తే సెటిల్‌ కాని 99.75 శాతం వాటా అస్తవ్యస్తమవుతుందని విజయమ్మ ఆందోళన వెలిబుచ్చారు. సభ్యుల రిజిస్టర్‌పై యథాతథ స్థితి కొనసాగిస్తే జగన్‌, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని విజయమ్మ తెలిపారు. ట్రైబ్యునల్‌ ఉత్తర్వులతో జగన్, భారతి, క్లాసిక్‌ రియాల్టీల పేర్లను తప్పుగా పునరుద్ధరిస్తే తనకు నష్టంతోపాటు మరిన్ని వివాదాలకు తెరతీసినట్లవుతుందని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీకి విజయమ్మ నివేదించారు.

ఏపీలో మట్టిపాత్రలకు  ఆదరణ.. ఎందుకంటే

ఏపీలో మట్టిపాత్రలకు ఆదరణ.. ఎందుకంటే

స్టీల్ . , అల్యూమినియం … తప్పితే ప్లాస్టిక్ . .. ఇంటికి అవసరమయ్యే వస్తువులు , వంట సామగ్రి ఎక్కువగా వీటితోనే . వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . మట్టి పాత్రలలో వంట చేసుకోవడం ఆరోగ్యానికి మేలని శతాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు . అయితే రెండు , మూడు దశాబ్దాలుగా వాటి వినియోగం గణనీయంగా తగ్గింది . ఇటీవల కాలంలో జనంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో మట్టి పాత్రలు వినియోగం క్రమంగా పెరుగుతోంది . మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది .

వృత్తి నైపుణ్యాల పెంపు ద్వారా ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు పడేలా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ సన్నద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో వృత్తి పనివారికి శిక్షణతోపాటు వ్యాపార అవకాశాలకు తోడ్పాటు అందించనున్నారు. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో మట్టి పాత్రలకు మళ్లీ ఆదరణ లభిస్తోంది. మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని మట్టిపాత్రల తయారీకి సాంకేతికతను జోడించి విద్యుత్​తో నడిచే చక్రాన్ని (పోర్టర్‌ వీల్‌) కుమ్మర్లకు ఉచితంగా ఇస్తారు. ఆకట్టుకునేలా వివిధ పాత్రల తయారీకి పది రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. మార్కెటింగ్ మెళకువలు కూడా నేర్పుతారు .

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మట్టి పాత్రల తయారీపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు. నర్సీపట్నం మండలంలోని వేములపూడి ఖాదీ సొసైటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 120 మందిని ఎంపిక చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.

విక్రయాలకు సపోర్ట్ . .. : ఇప్పటివరకు కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికే ఉపకరణాలను ఉచితంగా ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికీ ఇవ్వాలని నిర్ణయించారు. మంజూరైన వాటిలో 80 కుమ్మర్లకు, 20 ఎస్సీలకు, 20 ఎస్టీలకు ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారు తయారు చేసిన వస్తువులు కేవీఐసీ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో విక్రయించేలా అవకాశం కల్పిస్తారు. ..వీటోతోపాటు … వివిధ సంస్థల సహకారంతో కూడా అమ్మకలకు సపోర్ట్ ఇవ్వనున్నారు .

చంద్రబాబు .. నెంబర్ – 3 సీఎం …

చంద్రబాబు .. నెంబర్ – 3 సీఎం …

ఇండియా టుడే సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం – రేవంత్ కి ఏడోస్థానం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా పటిమతో మరోమారు ప్రజామన్నన పొందారు. దేశంలోనే అగ్రగామి మీడియా ”ఇండియా టుడే ‘ పోల్ లో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే మూడో స్థానంలో నిలిచారు. గతంలో సీబీఎన్ ఈ రేసులో ఐదవ స్థానంలో ఉండేవారు .

యోగి నెంబర్ వన్ . ..

దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి (ఉత్తర ప్రదేశ్ ) ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్.. చాలా కాలంగా అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈయన ఇండియాలోనే నెంబర్ వన్ సీఎంగా స్తానం దక్కించుకున్నారు . రెండో సారి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. చంద్రబాబు టాప్ ఫైవ్ లో ఉన్నారు. ఆరు నెలల కిందట మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు దేశవ్యాప్తంగా టాప్ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆరు నెలల్లో ఆయన తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి అభిప్రాయాలను సేకరించి ప్రకటించారు . తెలుగు ప్రాంత ప్రజలు కాని వారు కూడా ఇందులో పాల్గొన్నారు . అయితే సాధారణంగా అందరికీ కాల్స్ వెళ్లినప్పుడు తెలుగు ఓటర్లు అభిప్రాయం చెబుతారు.

ఏపీలో కూటమికి 25 లోక్ సభ సీట్లు

తక్షణం ఎన్నికలు జరిగితే.. బీజేపీతో పాటు మిత్రపక్షాలు సీట్లను గణనీయంగా పెంచుకుంటాయని సర్వేలో వెల్లడి అయింది. టీడీపీ, జేడీయూ, శివసేన, వంటి పార్టీలు సీట్లను పెంచుకుంటాయి. అంటే.. ఆ పెరుగుదల కాస్త కాస్త ఎక్కువగానే ఉంది. 11 సీట్లను పెంచుకుంటాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇప్పటికిప్పుడు జరిగే ఎన్నికలలో 2024 లో ఓడిపోయినా ఆ నాలుగు ఎంపీ సీట్లలోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. అంటే ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు గెలుస్తారు .

లా అండ్ ఆర్డర్ప కడ్బందీగా…

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత . . చంద్రబాబు పాలంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ గణనీయంగా మెరుగుపడినట్లు సర్వేలో పాల్గొన్న మెజార్టీ జనం ఓటువేశారు . గత పాలనతో పోలిస్తే . … శాంతిభద్రతల విషయంలో ఎప్పటికీ చంద్రబాబు ఉండాలని పలువురు అభిలషించారు .

ఏపీలో గత ప్రభుత్వ పాలనకు.. ఇప్పటి పాలనకు చాలా తేడా కనిపిస్తోంది. పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ ఉండటంతో పాటు సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి. ప్రజలకు సంతృప్తి కలుగుతోంది. అభివృద్ధి పనులూ ఆగడం లేదు. దీంతో చంద్రబాబుపై ప్రజా విశ్వాసం పెరుగుతోంది. మరో వైపు వైసీపీ ప్రతిపక్ష. హోదా లేదని.. ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరించకుండా రాక్షస మూకగా వ్యవహరించింది . దీంతో 2019-2024 మధ్య అరాచకాలతో ప్రజలను పీడించుకుతిన్నారు . దీంతో వైసీపీని సాగనంపాలని జనమ్ ఏకపక్ష0గా తీసుకున్న నిర్ణయంతో కూటమి అధికారంలోకి వచ్చింది .