ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన ₹3,500 కోట్ల మద్యం కుంభకోణంలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ప్రభుత్వ విధానాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికి అనుసరించిన పక్కా ప్రణాళికను ఈడీ ఛేదించింది. డొల్ల కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్లు, బంగారు దుకాణాల ద్వారా సాగిన ఈ భారీ మనీలాండరింగ్ వ్యవహారం, దర్యాప్తు సంస్థలనే ఆశ్చర్యపరిచింది.
అక్రమ సంపాదనకు పునాది ఇదే . .
ఈ కుంభకోణం మూలాలు 2019 నాటి ప్రభుత్వ మద్యం విధానంలో ఉన్నాయి. ప్రైవేట్ దుకాణాలను రద్దు చేసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా ప్రభుతమే మద్యం అమ్మకాలు చేపట్టింది. ఈ కేంద్రీకృత విధానం ఒక వ్యవస్థీకృత సిండికేట్కు ఒక వరంగా మారింది. మద్యం సరఫరా ఆర్డర్లను తమకు అనుకూలమైన డిస్టిలరీలకు ఇచ్చేందుకు, ఆటోమేటెడ్ వ్యవస్థను పక్కనపెట్టి మాన్యువల్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రముఖ బ్రాండ్లను కాదని, ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చారు. ఈ ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయల నల్లధనం పోగైంది.
నల్లధనాన్ని ఎలా వైట్ చేశారు
అక్రమంగా సంపాదించిన డబ్బును ఒక చట్టబద్ధమైన ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి సిండికేట్ రెండు ప్రధాన మార్గాలను ఎంచుకుంది. ఈ మార్గాలను ఛేదించడంపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.
1. డొల్ల కంపెనీల వ్యూహం:
ఈ కుంభకోణంలో 30కి పైగా డొల్ల కంపెనీలను సృష్టించారు. వీటికి సరైన చిరునామా గానీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ గానీ లేదు. డిస్టిలరీలు ముడుపుల డబ్బును నేరుగా ఇవ్వకుండా, ఈ డొల్ల కంపెనీలకు బదిలీ చేసేవి. ప్యాకేజింగ్, రవాణా వంటి సేవలు అందించినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించేవారు. ఉదాహరణకు, ఒకే ఒక్క వాహనం ఉన్న రవాణా సంస్థ, లక్షల మద్యం కేసులను తరలించినట్లు పత్రాలు చూపించడం ఈ మోసం తీవ్రతను తెలియజేస్తుంది. ఈ నకిలీ లావాదేవీల ద్వారా డబ్బు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి చేరేది. అక్కడి నుంచి దాన్ని నగదు రూపంలో డ్రా చేయడం లేదా ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడం చేసేవారు.
2. బంగారం కొనుగోళ్ల మార్గం:
ఇది అత్యంత తెలివైన, క్లిష్టమైన పద్ధతి. డిస్టిలరీలు తమ బ్యాంకు ఖాతాల్లోని “తెల్ల ధనాన్ని” నేరుగా హైదరాబాద్, చెన్నైలోని ప్రముఖ నగల వ్యాపారులకు బదిలీ చేసేవి. ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసినట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు తీసుకునేవి. దీంతో ఆ లావాదేవీ చట్టబద్ధమైన వ్యాపార ఖర్చుగా వారి లెక్కల్లో. కానీ, కొనుగోలు చేసిన భౌతిక బంగారం మాత్రం సిండికేట్ సభ్యులకు చేరేది. ఈ పద్ధతి ద్వారా, బ్యాంకుల్లో గుర్తించడానికి వీలైన డబ్బును, లెక్కల్లోకి రాని భౌతిక ఆస్తిగా (బంగారం) మార్చారు.
ఈడీకి ఎలా చిక్కారు?
ఈ క్లిష్టమైన నెట్వర్క్ను ఛేదించడానికి ఈడీకి, రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అందించిన సమాచారం కీలకంగా మారింది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు ఈడీకి ఒక మార్గదర్శిగా ఉపయోగపడ్డాయి. డిస్టిలరీల బ్యాంకు ఖాతాల నుండి నగల వ్యాపారులకు, డొల్ల కంపెనీలకు జరిగిన వందల కోట్ల అనుమానాస్పద లావాదేవీలను సిట్ గుర్తించింది. ఈ ఆధారాలతోనే ఈడీ రంగంలోకి దిగింది.
దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ సహా 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో రావు సాహెబ్ బూరుగు మహదేవ్ జ్యువెలర్స్, మోహన్ లాల్ జ్యువెలర్స్ వంటి బంగారు దుకాణాలు, వెంకటేశ్వర ప్యాకేజింగ్ వంటి డొల్ల కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సోదాల్లో కీలకమైన ఆర్థిక పత్రాలు, హార్డ్ డిస్క్లు, నకిలీ ఇన్వాయిస్లు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో పురోగతి
స్వాధీనం చేసుకున్న ఆధారాలతో ఈడీ దర్యాప్తు వేగవంతమైంది. డిస్టిలరీల నుండి డబ్బు ఎప్పుడు, ఎలా బదిలీ అయింది, దానికి సరిగ్గా సరిపోయేలా నగల దుకాణాలు, డొల్ల కంపెనీలు ఇన్వాయిస్లు ఎలా జారీ చేశాయో ఈడీ అధికారులు నిర్ధారించుకుంటున్నారు. ఈ పత్రాల ఆధారంగా, డబ్బు ప్రయాణించిన మార్గాన్ని పూర్తిస్థాయిలో గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఆధారాల విశ్లేషణ పూర్తయ్యాక, ఈ కుంభకోణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ దర్యాప్తు, ప్రభుత్వ విధానాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యవస్థీకృత నేరగాళ్ల వెన్ను విరిచే దిశగా సాగుతోంది.
షర్మిలతో దీర్ఘకాల వైరుధ్యాల ఫలితంగానే జగన్ పిటిషన్ – రాజకీయ మైలేజీకి జగన్ కుటుంబ వివాదాన్ని వాడుకోవడం బాధాకరం – చెన్నై ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించిన వైఎస్ విజయమ్మ
” వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లి . . షర్మిలతో ఉన్న దీర్ఘకాల వైరుధ్యాలు, రాజకీయ కలహాల కారణంగానే జగన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్-NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. ;; అని అతని తల్లి , వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అన్నాచెల్లెలి వివాదాల్లో తాను ఇరుక్కుపోయానని ఈ మేరకు చెన్నై నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్(NCLAT)కి నివేదించారు. రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని వాపోయారు.
ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ను జగన్ ఆశ్రయించడానికి కారణం చెల్లి షర్మిలకు, ఆయనకు మధ్య ఉన్న రాజకీయ కలహాలను పరిష్కరించుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదని తల్లి విజయమ్మ చెన్నైలోని ఎన్సీఎల్ఏటీకి నివేదించారు. అందుకోసమే సరస్వతి పవర్ లిమిటెడ్లో వాటాల బదలాయింపు, రిజిస్టర్లో వాటాదారుల పేర్ల మార్పుపై ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్లో జగన్ పిటిషన్ దాఖలు చేశారని విజయమ్మ పేర్కొన్నారు. ఇద్దరూ తన పిల్లలు కావడంతో వారి రాజకీయ గొడవల్లో చిక్కుకున్నానని ఆవేదన వెలిబుచ్చారు.
జగన్ రాజకీయ ప్రాపకం కోసమే : కుటుంబ వివాదానికి కార్పొరేట్ రంగు పులిమి వాటిని జగన్ తన రాజకీయ మేలేజీకి వాడుకోవడం విచారకరమని వాపోయారు. గిఫ్ట్డీడ్లు కుటుంబసభ్యుల మధ్య జరిగిన ఒప్పందమని చట్టప్రకారం దానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్ కార్పొరేట్ వివాదానికి సంబంధించినది కాదని అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుద్ధ్యాల ఫలితమేనని విజయమ్మ తేల్చిచెప్పారు. ప్రైవేటు, వ్యక్తిగత వివాదాలకు కార్పొరేట్ రంగు అద్ది తమ ప్రతిష్ఠను దెబ్బతీసి అక్రమంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నమేనన్నారు.
అది చట్టవిరుద్ధం : విజయమ్మ, జనార్దన్రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలు హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్ తదితరుల పేర్లను పునరుద్ధరించాలంటూ జులై 29న తీర్పు వెలువరించింది. హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్ఏటీ(NCLAT)లో విజయమ్మ అప్పీల్ దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఎం.మహర్షి విశ్వరాజ్ ఈ అప్పీల్ను దాఖలు చేశారు. సరస్వతి పవర్ దాఖలు చేసిన పిటిషన్తో కలిపి దీన్ని చెన్నై అప్పీలెట్ బెంచ్ త్వరలో విచారించనుంది.
అప్పుడే రాజీనామా : సరస్వతి పవర్లో తాను ప్రధాన వాటాదారునేనని చెన్నై ఎన్సీఎల్ఏటీలో దాఖలు చేసిన అప్పీలులో విజయమ్మ స్పష్టం చేశారు. వాటాల బదలాయింపునకు ముందు తనకు 48.99 శాతం వాటాలున్నట్లు పేర్కొన్నారు. 2021 జులై 26న జగన్ 74 లక్షల 26 వేలు, భారతీరెడ్డి 40 లక్షల 50 వేల వాటాలను ప్రేమతో తన పేరిట గిఫ్ట్డీడ్లు ఇచ్చారని వివరించారు. 2021 ఆగస్టు 14న డైరెక్టర్ పదవికి జగన్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. గిఫ్ట్ ఒప్పందాలను కానీ, వాటాల కొనుగోలు ఒప్పందాల చెల్లుబాటును కానీ ఏ సివిల్ కోర్టులోనూ జగన్ సవాల్ చేయలేదని విజయమ్మ పేర్కొన్నారు. అలాంటప్పుడు కార్పొరేట్ ముసుగులో వాటిని ట్రైబ్యునల్లో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు. చెన్నై ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ పెండింగులో ఉండగా ట్రైబ్యునల్ ఉత్తర్వులను అమలు చేస్తే సెటిల్ కాని 99.75 శాతం వాటా అస్తవ్యస్తమవుతుందని విజయమ్మ ఆందోళన వెలిబుచ్చారు. సభ్యుల రిజిస్టర్పై యథాతథ స్థితి కొనసాగిస్తే జగన్, భారతీరెడ్డి, క్లాసిక్ రియాల్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని విజయమ్మ తెలిపారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులతో జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీల పేర్లను తప్పుగా పునరుద్ధరిస్తే తనకు నష్టంతోపాటు మరిన్ని వివాదాలకు తెరతీసినట్లవుతుందని చెన్నై ఎన్సీఎల్ఏటీకి విజయమ్మ నివేదించారు.
కుమ్మర్లకు ఉచితంగా పోర్టర్ వీల్ పంపిణీకి కూటమి సర్కార్ సన్నాహాలు — మట్టిపాత్రల ఆరోగ్యంపై ప్రచారం
స్టీల్ . , అల్యూమినియం … తప్పితే ప్లాస్టిక్ . .. ఇంటికి అవసరమయ్యే వస్తువులు , వంట సామగ్రి ఎక్కువగా వీటితోనే . వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . మట్టి పాత్రలలో వంట చేసుకోవడం ఆరోగ్యానికి మేలని శతాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు . అయితే రెండు , మూడు దశాబ్దాలుగా వాటి వినియోగం గణనీయంగా తగ్గింది . ఇటీవల కాలంలో జనంలో ఆరోగ్య స్పృహ పెరగడంతో మట్టి పాత్రలు వినియోగం క్రమంగా పెరుగుతోంది . మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది .
వృత్తి నైపుణ్యాల పెంపు ద్వారా ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు పడేలా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సన్నద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో వృత్తి పనివారికి శిక్షణతోపాటు వ్యాపార అవకాశాలకు తోడ్పాటు అందించనున్నారు. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో మట్టి పాత్రలకు మళ్లీ ఆదరణ లభిస్తోంది. మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని మట్టిపాత్రల తయారీకి సాంకేతికతను జోడించి విద్యుత్తో నడిచే చక్రాన్ని (పోర్టర్ వీల్) కుమ్మర్లకు ఉచితంగా ఇస్తారు. ఆకట్టుకునేలా వివిధ పాత్రల తయారీకి పది రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. మార్కెటింగ్ మెళకువలు కూడా నేర్పుతారు .
ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
స్టీల్ అల్యూమినియం పాత్రల్లో ఆహార పదార్థాలు వండడం అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నట్లు అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయ్ . ఇది కూడా మట్టి పాత్రలు తమ ఆహార పదార్థాలు వండుకునేందుకు దోహదం చేస్తుంది . అలాగే మనం తీసుకునే పోషకాహార పదార్థాలకు ఎలాంటి హాని జరగకుండా మట్టి పాత్రల్లో వండిన ఆహారపుర్థాలు తీసుకోవడం ద్వారా మన శరీరానికి పోషక విలువలు త్వరగా అంది జీర్ణ వ్యవస్థ,మిటబాలిజం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ రోజుల్లో ప్లాస్టిక్,అల్యూమినియం వాడకం ఎక్కువైంది. దీంతో అనేక రోగాల బారిన పడుతున్నాం. ఈ మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తినడం ద్వారా కూడా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలో దోహదపడతాయని డాక్టర్స్ తో పాటు ఇదీవర ఆర్గానిక్ ఫుడ్స్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు.
రాను రాను ఆహారపు అలవాట్లు మరాటమే కాదు.. ఆహారం తయారు చేసుకునే పాత్రలు కూడా మన ఆరోగ్యం పై అధికంగా ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో చాలావరకు మట్టి పాత్రలు ఉపయోగించి.. ఆ మట్టి పాత్రలోనే ఆహార పదార్థాలు తయారు చేసేవారు. ఈ మట్టి పాత్రల్లో తయారు చేసిన ఆహారం తినడం ద్వారా కూడా జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మనుషులు ఆరోగ్యంగా ఉండేందుకు మట్టి పాత్రలో దోహదపడతాయని డాక్టర్స్ సెలవిస్తున్నారు .
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మట్టి పాత్రల తయారీపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు. నర్సీపట్నం మండలంలోని వేములపూడి ఖాదీ సొసైటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 120 మందిని ఎంపిక చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.
విక్రయాలకు సపోర్ట్ . .. : ఇప్పటివరకు కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వారికే ఉపకరణాలను ఉచితంగా ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారికీ ఇవ్వాలని నిర్ణయించారు. మంజూరైన వాటిలో 80 కుమ్మర్లకు, 20 ఎస్సీలకు, 20 ఎస్టీలకు ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన వారు తయారు చేసిన వస్తువులు కేవీఐసీ విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో విక్రయించేలా అవకాశం కల్పిస్తారు. ..వీటోతోపాటు … వివిధ సంస్థల సహకారంతో కూడా అమ్మకలకు సపోర్ట్ ఇవ్వనున్నారు .
ఇండియా టుడే సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం – రేవంత్ కి ఏడోస్థానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనా పటిమతో మరోమారు ప్రజామన్నన పొందారు. దేశంలోనే అగ్రగామి మీడియా ”ఇండియా టుడే ‘ పోల్ లో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే మూడో స్థానంలో నిలిచారు. గతంలో సీబీఎన్ ఈ రేసులో ఐదవ స్థానంలో ఉండేవారు .
యోగి నెంబర్ వన్ . ..
దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి (ఉత్తర ప్రదేశ్ ) ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్.. చాలా కాలంగా అక్కడి ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈయన ఇండియాలోనే నెంబర్ వన్ సీఎంగా స్తానం దక్కించుకున్నారు . రెండో సారి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత .. చంద్రబాబు టాప్ ఫైవ్ లో ఉన్నారు. ఆరు నెలల కిందట మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో చంద్రబాబు దేశవ్యాప్తంగా టాప్ సీఎంల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. ఆరు నెలల్లో ఆయన తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. ఈ సర్వే దేశవ్యాప్తంగా అందరి అభిప్రాయాలను సేకరించి ప్రకటించారు . తెలుగు ప్రాంత ప్రజలు కాని వారు కూడా ఇందులో పాల్గొన్నారు . అయితే సాధారణంగా అందరికీ కాల్స్ వెళ్లినప్పుడు తెలుగు ఓటర్లు అభిప్రాయం చెబుతారు.
ఏపీలో కూటమికి 25 లోక్ సభ సీట్లు
తక్షణం ఎన్నికలు జరిగితే.. బీజేపీతో పాటు మిత్రపక్షాలు సీట్లను గణనీయంగా పెంచుకుంటాయని సర్వేలో వెల్లడి అయింది. టీడీపీ, జేడీయూ, శివసేన, వంటి పార్టీలు సీట్లను పెంచుకుంటాయి. అంటే.. ఆ పెరుగుదల కాస్త కాస్త ఎక్కువగానే ఉంది. 11 సీట్లను పెంచుకుంటాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఇప్పటికిప్పుడు జరిగే ఎన్నికలలో 2024 లో ఓడిపోయినా ఆ నాలుగు ఎంపీ సీట్లలోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. అంటే ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు గెలుస్తారు .
లా అండ్ ఆర్డర్ప కడ్బందీగా…
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత . . చంద్రబాబు పాలంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ గణనీయంగా మెరుగుపడినట్లు సర్వేలో పాల్గొన్న మెజార్టీ జనం ఓటువేశారు . గత పాలనతో పోలిస్తే . … శాంతిభద్రతల విషయంలో ఎప్పటికీ చంద్రబాబు ఉండాలని పలువురు అభిలషించారు .
ఏపీలో గత ప్రభుత్వ పాలనకు.. ఇప్పటి పాలనకు చాలా తేడా కనిపిస్తోంది. పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ ఉండటంతో పాటు సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి. ప్రజలకు సంతృప్తి కలుగుతోంది. అభివృద్ధి పనులూ ఆగడం లేదు. దీంతో చంద్రబాబుపై ప్రజా విశ్వాసం పెరుగుతోంది. మరో వైపు వైసీపీ ప్రతిపక్ష. హోదా లేదని.. ప్రతిపక్షంగా హుందాగా వ్యవహరించకుండా రాక్షస మూకగా వ్యవహరించింది . దీంతో 2019-2024 మధ్య అరాచకాలతో ప్రజలను పీడించుకుతిన్నారు . దీంతో వైసీపీని సాగనంపాలని జనమ్ ఏకపక్ష0గా తీసుకున్న నిర్ణయంతో కూటమి అధికారంలోకి వచ్చింది .
ఇపుడిపుడే పెరుగుతున్న లావాదేవీలు – 2026 జనవరికి మరింత స్పీడ్
అమరావతి రెండవ విడత భూ సమీకరణ అంశంతో వెనుకంజ . .. లేకపోతె మరింత దూకుడు
ఐదారేళ్లుగా కుంటినడకన సాగిన రియల్ ఎస్టేట్ ఏపీలో కాస్త ఊపందుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే 2026 జనవరి – ఫిబ్రవరి నెలలనాటికి మరింత జోరందుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అమరావతిలో రెండవ విడత ల్యాన్డ్ పూలింగ్ అంశం తెరపైకి రావడంతో ఒక్కసారిగా రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కి బ్రేక్ పడింది . ఇది ప్రభుత్వం చేసిన తెలివిమాలిన పనిగా రాజధాని ప్రాంత వాసులు చెపుతున్నారు . భూముల ధరలు పెరిగిన తర్వాత మరోవిడత భూ సమీకరణకు వెళ్లి ఉంటె ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చేదని చెపుతున్నారు .
రియల్ ఎస్టేట్ మందగమనానికి ప్రధానంగా ధరలు పెరగడం ఒక కారణమ్ కాగా . … జనం దగ్గర డబ్బు కొరత ఏర్పడటం మరో కారణం . ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగం గత కొన్ని సంవత్సరాలు స్తబ్దతను వీడుతోంది . స్టాంపులు, అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరగదాన్ని పరిశీలిస్తే . .. ఈ రంగం మళ్లీ రికవరీ మొదలు అవుతున్నట్టు కనిపిస్తోంది . రాజధాని అమరావతి, పరిసర ప్రాంతాలలో లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం, ఇతర జిల్లాల్లో పెరుగుతున్న లావాదేవీలు అన్ని కలిపి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఊపిరి ఊపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూ వ్యవహారాలు పెరిగి, కొంతకాలం ఆగిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుబడిదారుల్లో ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపడం ప్రారంభమైంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల నుండి వచ్చే ఆదాయం పెరగడం రియల్ ఎస్టేట్ రంగం తిరిగి లాభదాయక దిశలోకి వస్తున్నదని సూచిస్తోంది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 2024కి పోలిస్తే 44% ఆదాయ వృద్ధి నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి . అమరావతిలో రూ. 60,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు ప్రారంభం కావడం .. పనులు వేగవంతంగా సాగడం వంటివి కూడా రియల్ భూమ్ పెరుగుదలకు కారణం .
ఇటీవల రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలలో నమోదయ్యాయి . వీటిలో ఎక్కువ ఆదాయం రికార్డ్ అయింది. అమరావతిలో భూస్థూల ధరలు పెరిగిన తర్వాత కూడా లావాదేవీలు పెరుగుతునే ఉన్నాయి. అమరావతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎన్ మురళి మాట్లాడుతూ . .. 2024 ఎన్నికల తర్వాత భూ స్థల ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని లావాదేవీలు నెమ్మదిగా జరిగాయి. ఇపుడిపుడే ఊపందుకుంటున్నాయి .
అమరావతి, చుట్టుపక్కల భూములు , సైట్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, డెవలపర్లు మరియు పెట్టుబడిదారులు భవిష్యత్తులో మంచి అవకాశాలున్న సరసమైన ధరల ప్రాంతాలపై ఫోకస్ పెడుతున్నారు . అమరావతి, గుంటూరు, ఒంగోలు , నెల్లూరు, విశాఖపట్టణం వంటి జిల్లాల్లో భూమి మరియు భవనాల ధరలలో కూడా కొంత పెరుగుదల కనిపిస్తోంది . అమరావతిలో కొన్ని ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా ఉన్నా, గుంటూరు, రాజమండ్రి , నెల్లూరు, విశాఖ వంటి ప్రాంతాల్లో కొంచెం అందుబాటులో ధరలు ఉన్నాయి. దీని వల్ల కొత్త పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే దానిలో కాస్త ఆలోచనలో పడుతున్నారు .
నాలా రద్దుతో గ్రామాల్లో ‘రియల్ జోరు ‘ “” వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించాలంటే భూమార్పిడి జరగాలి . దీనికోసం స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రియల్టర్లను , పారిశ్రేమికవేత్తలను మామూళ్ల కోసం వేధించేవారు . దీనిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి . ఇదే సమయంలో నాలా బదులు . .. స్థానిక సంస్థలకు కొంత ఫీజు చెల్లించడం వల్ల ఆ నిధులు స్థానికంగా ఖర్చుచేసుకునే సౌబల్యం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సూచన కూడా సర్కార్ పరిగణలోకి తీసుకుంది . దీంతో నాలా రద్దు చేసారు . దీనివల్ల ముక్యంగా గ్రామీణ్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఊపందుకోనున్నాయ్ .
వేదంలా ఘోషించే గోదావరి గట్టున వెలసిన రాజమహేంద్రవరం అనాదిగా ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా నిలుస్తోంది. ఆ నదీ ప్రవాహంలాగే ఇక్కడి వైదిక సంప్రదాయం కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. ఈ పవిత్ర తీరంలో 16-8-2025 న ముగిసిన వేద సభలు ఆ అజరామర వారసత్వానికి ఆధునిక ప్రతిధ్వనుల్లా నిలిచాయి. పండితులు, విద్యార్థులు, ధర్మశ్రేయోభిలాషులు ఒకచోట చేరిన
ఈ సందర్భాలు కేవలం ఉత్సవాలు కాదు. అవి తరతరాల జ్ఞానధారను కాపాడుతూ, భవిష్యత్తుకు అందిస్తున్న ఒక మహాయజ్ఞానికి సాక్ష్యాలు. ఈ వేదఘోష రాజమహేంద్రవరం ఆత్మను, గోదావరి జీవన లయను ఏకకాలంలో ఆవిష్కరించింది.
జ్ఞానదీపం: వేదశాస్త్ర పరిషత్ చారిత్రక యాత్ర
ఈ వైదిక పునరుజ్జీవనంలో వేదశాస్త్ర పరిషత్ పాత్ర అత్యంత కీలకమైనది. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ మహాస్వామి వారి మార్గదర్శకత్వంలో, 1937 ఏప్రిల్ 13న ఉగాది పర్వదినాన ఈ సంస్థ ఆవిర్భవించింది.
ఆనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులను గమనిస్తే ఈ స్థాపన వెనుక ఉన్న లోతైన ఆలోచన అర్థమవుతుంది. భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ఆ దశలో, కేవలం రాజకీయ స్వేచ్ఛే కాకుండా, దేశ సాంస్కృతిక ఆత్మను కాపాడుకోవాలనే తపనతో ఈ పరిషత్ ఆవిర్భవించింది.
పరిషత్ లక్ష్యం కేవలం వేదాధ్యయనాన్ని ప్రోత్సహించడమే కాదు, అంతరించిపోతున్న జ్ఞానాన్ని కాపాడటం. ఒకప్పుడు వేదాలలో దాదాపు 1,133 శాఖలు ఉండగా, నేడు కేవలం 13 శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయని, అందులోనూ బోధించే గురువులున్నవి ఏడు శాఖలేనని గణాంకాలు చెబుతున్నాయి.
అంటే మన వైదిక విజ్ఞానంలో ఒక శాతం కన్నా తక్కువ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. ఈ తీవ్రమైన నష్టాన్ని అరికట్టాలనే అత్యవసర కర్తవ్యంతో పరిషత్ గత తొమ్మిది దశాబ్దాలుగా పనిచేస్తోంది. వేద విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించడం, వారిని ప్రోత్సహించడం, పండితులను గౌరవించడం, వైదిక పాఠశాలలకు ఆర్థికంగా అండగా నిలవడం వంటి బహుముఖ కార్యక్రమాలతో తన సేవలను విస్తరించింది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాక బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడి పరీక్షలకు హాజరుకావడం పరిషత్ సాధించిన జాతీయ స్థాయి గుర్తింపునకు నిదర్శనం.
89వ మహాసభ: పాండిత్యం, పట్టాలు, పురస్కారాలు
16-8-2015 వరకూ 6 రోజులు జరిగిన పరిషత్ 89వ వార్షిక మహాసభ ఈ సుదీర్ఘ యాత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. గౌతమీ ఘాట్లోని శ్రీ దత్త ముక్తి క్షేత్రంలో వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితిలో పండిత సభ జరిగింది. మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి అధ్యక్షత వహించిన ఈ సభకు ప్రవచన విరించి సామవేదం షణ్ముఖ శర్మ, శ్రీ కార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఆదిశంకరాచార్య సంప్రదాయంలోనే సమగ్ర వేదధర్మం నిక్షిప్తమై ఉందని, వేదరక్షణకే శ్రీకృష్ణుడు అవతరించాడని సామవేదం షణ్ముఖ శర్మ ఉద్బోధించారు.
ఈ సభలో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఒకవైపు పరిషత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్ర మూర్తి గత 88 ఏళ్ల ప్రస్థానాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, మరోవైపు గంగాధర శర్మ వంటి పండితులు వేద విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో అనుసంధానం చేస్తూ పరిశోధనలు జరగాలని పిలుపునివ్వడం గమనార్హం. ఇది సంప్రదాయం తన మూలాలను కాపాడుకుంటూనే, ఆధునిక ప్రపంచంతో సంభాషించడానికి సిద్ధంగా ఉందని చాటిచెప్పింది.
సభ ముగింపులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభావంతులకు స్వర్ణ, రజత పతకాలు ప్రదానం చేశారు. కంచిపీఠం తరపున గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠిని సత్కరించడం వంటి కార్యక్రమాలతో సభ వేద పండితుల గౌరవానికి పెద్దపీట వేసింది.
సంకల్పబలం: అనుబంధ వేదసభల తోడ్పాటు
రాజమహేంద్రవరంలో వేద పరిరక్షణ కేవలం ఒకే సంస్థకు పరిమితం కాలేదు. అది ఒక సామూహిక సంకల్పంగా విస్తరించింది. వేదశాస్త్ర పరిషత్ మహాసభకు అనుబంధంగా జరిగిన ఇతర సభలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. జ్ఞాన సరస్వతి ఆలయంలో కళాగౌతమి వ్యవస్థాపకులు డాక్టర్ బులుసు వి.ఎస్. మూర్తి అధ్యక్షతన ‘బులుసువారి వేద సభ’ జరిగింది. ఈ సభలో 15 మంది నూతన పట్టభద్రులతో పాటు, 150 మంది ఘనపాఠీలు, 100 మంది క్రమపాఠీలను సత్కరించడం ఈ కుటుంబం వేద సంప్రదాయం పట్ల చూపుతున్న అంకితభావానికి నిదర్శనం.
అదేవిధంగా, శంకర మఠంలో రాష్ట్రపతి పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి వేదశాస్త్ర పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ వార్షిక వేదసభ జరిగింది. ఈ సభకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫణి యజ్ఞేశ్వర ఘనపాఠి వంటి వారు హాజరుకావడం, స్థానిక ప్రయత్నాలకు జాతీయ స్థాయి సంస్థల మద్దతు ఉందని సూచిస్తుంది.
పరిషత్ వంటి పెద్ద సంస్థలు ఒక వ్యవస్థాగతమైన చట్రాన్ని అందిస్తుంటే, బులుసు వారి సభ, విశ్వనాథ వారి ట్రస్ట్ వంటివి సమాజంలో వేద సంస్కృతిని క్షేత్రస్థాయిలో బలంగా నాటుకునేలా చేస్తున్నాయి. ఈ వికేంద్రీకృత వ్యవస్థే ఈ సంప్రదాయం యొక్క స్థితిస్థాపకతకు అసలైన కారణం.
గురుపరంపర: పండిత వందనం, యువతకు స్ఫూర్తి
ఈ సభలన్నీ ఒక సత్యాన్ని బలంగా చాటాయి: వేదజ్ఞానం గురు-శిష్య పరంపర ద్వారానే సజీవంగా ఉంటుంది. విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి వంటి మహామహోపాధ్యాయులు అధ్యక్ష స్థానంలో కూర్చొని, నవయువ వేద విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడం అది ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానాన్ని, బాధ్యతను అప్పగించే ఒక పవిత్ర కార్యం.
వృద్ధులైన పండితులను సత్కరించడం ద్వారా సమాజం వారి తపస్సుకు, జ్ఞానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. యువ విద్యార్థులను పతకాలతో ప్రోత్సహించడం ద్వారా, ఈ కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని అభినందిస్తుంది. ఈ గౌరవం, ఈ ప్రోత్సాహమే కొత్త తరాలను వేదాధ్యయనం వైపు ఆకర్షిస్తుంది. సామవేదం షణ్ముఖ శర్మ వంటి వారు తమ ప్రవచనాల ద్వారా శాస్త్ర విషయాలను సామాన్యులకు చేరువ చేస్తూ, గురువులకు, సమాజానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు. గోదావరి నది ప్రవాహం ఎలాగైతే శాశ్వతంగా ఉంటుందో, ఆ తీరంలో వినిపించే వేదఘోష కూడా అలాగే అనంతంగా కొనసాగుతుందనే భరోసాను ఈ సభలు కలిగించాయి.