by Srinivas Vedulla | Apr 12, 2025 | జాతీయం, పరిశీలన
అన్నాడీయంకె తో చేతులు కలిపిన బీజేపీ – 2026 ఎన్నికల కోసం ఏడాది ముందే రంగంలోకి . ,
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మరియు మిత్ర పక్ష పార్టీలతో కలిసి పోటీ చేయడానికి ఎఐఎడిఎంకె తిరిగి ఎన్డీఏలోకి చేరింది. ఈ కూటమి ఎన్నికల్లో గెలిస్తే సీట్ల భాగస్వామ్యం మరియు ప్రభుత్వ కూర్పు వంటి విధానాలను తరువాత చర్చిస్తారు.
తమిళనాడు లో బీజేపీకి 3 శాతం కూడా ఓట్లు లేవు. అయినా 2026 ఎన్నికలలో ఆ రాష్ట్రంలో కాలుమోపెందుకు , 2029 సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాదిలో బలోపేతం అయ్యే సంకల్ప0తో కమలనాధులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు . 2024 లో ఆంధ్రప్రదేశ్ లో సైతం . .. 2 శాతం ఓట్లులేని బీజేపీ 8 అసెంబ్లీ , నాలుగు లోక్ సభ సీట్లను గెలుపొందడం ద్వారా తమ సత్తా చాటుకుంది .
తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, ఎఐఎడిఎంకె ఇతర మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తాయి.
చెన్నైలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా బిజెపి-ఎఐఎడిఎంకె కూటమి పునరుద్ధరణను ప్రకటించారు. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి హాజరైనప్పటికీ, విలేకరుల సమావేశంలో మాత్రం అంతా ఆయన మౌనంగానే ఉన్నారు.
ఓ పన్నీర్సెల్వం మరియు ఇతర ఎఐఎడిఎంకె వర్గాలతో సాధ్యమయ్యే సంబంధాలపై వ్యాఖ్యానించడానికి అమిత్ షా కూడా నిరాకరించారు. “ఎఐఎడిఎంకె అంతర్గత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము. ఎన్నికలకు సంబంధించిన విషయాల విషయానికొస్తే, చర్చలు మరియు నిర్ణయాలు ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో తీసుకోబడతాయి” అని ఆయన అన్నారు.
అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాతే ఈ కూటమి ఏర్పడిందా అని అడిగినప్పుడు, షా మాట్లాడుతూ, “అందులో కొంచెం కూడా నిజం లేదు ఎందుకంటే అన్నామలై ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మరియు అందుకే ఆయన నా పక్కనే కూర్చున్నారు” అని అన్నారు.
అన్నామలై పనితీరు శైలి, దివంగత జె. జయలలితతో సహా అన్నామలై నాయకులను విమర్శించడం వల్లే ఆయన 2023 సెప్టెంబర్లో రెండు పార్టీలు విడిపోయేలా చేశారు.
తరువాత చర్చించే అంశాలు
పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్య మరియు ప్రభుత్వ కూర్పు – కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత – తరువాత చర్చిస్తామని షా అన్నారు. “వాటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.
డీఎంకే ప్రభుత్వ వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు మరియు మహిళలకు భద్రత లేకపోవడం వంటి అంశాలను సనాతన ధర్మం, త్రిభాషా విధానం మరియు నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా డీఎంకే ప్రభుత్వ వైఫల్యం, శాంతిభద్రతల సమస్యలు మరియు మహిళలకు భద్రత లేకపోవడం వంటి అంశాలను మళ్లిస్తున్నారని బీజేపీ నాయకుడు అన్నారు.
నీట్ అంశంపై, డీఎంకే ప్రజల దృష్టిని మళ్లించడానికి తన సమస్యలను ఉపయోగిస్తోందని షా అన్నారు.
బిజెపి ఎల్లప్పుడూ తమిళ ప్రజలను, తమిళ రాష్ట్రాన్ని మరియు తమిళనాడును గౌరవిస్తుందని హోంమంత్రి అన్నారు.
“ఆ గౌరవం మరియు తమిళ వారసత్వాన్ని గౌరవిస్తూ, శ్రీ నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ను ప్రతిష్టించారు. కానీ డిఎంకె దానిని తప్పుగా సూచిస్తోంది” అని ఆయన మండిపడ్డారు .
“మేము తిరుక్కురల్ను వివిధ ప్రపంచ భాషలలోకి అనువదిస్తున్నాము, ఇది ఇప్పటికే 63 భాషలలోకి అనువదించబడింది. అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు తమిళనాడులో శాస్త్రీయ తమిళంలో పరిశోధనలు చేస్తున్నాయి. ప్రధాన మంత్రి మోడీ తమిళ సాహిత్య పండితుల రచనలను కూడా ప్రచురించారు. నేడు, తమిళనాడులోని యువత తమిళంలో ఐఎఎస్ మరియు ఐపిఎస్ వంటి పోటీ పరీక్షలు రాయగలరు. కానీ కేంద్రంలో డిఎంకె కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాలేదు” అని కూడా ఆయన అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఆయా రాష్ట్ర భాషలలో వైద్య మరియు ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తుందని షా అన్నారు. “గత మూడు సంవత్సరాలుగా, నేను తమిళనాడును సందర్శించిన ప్రతిసారీ, నేను దీని గురించి ఎంకె స్టాలిన్ను కోరుతున్నాను. అయితే, ఈ కోర్సులు ఇప్పటికీ తమిళంలో అందించడం లేదు” అని ఆయన అమిత్ షా చేసిన ఆరోపణలను ఈ సందర్బంగా గుర్తుచేసుకోవాలి .
డీఎంకేపై షా నిప్పులు చెరిగారు
డీఎంకే తన ఎక్సైజ్ విధానం ద్వారా ₹39,000 కోట్ల అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఉచిత ధోతీ పంపిణీ మరియు 100 రోజుల ఉపాధి పథకం MGNREGA కూడా అవినీతిలో కూరుకుపోయాయని ఆయన అన్నారు.
“డీఎంకే ఇసుక అవినీతి మరియు విద్యుత్ అవినీతితో సహా వివిధ అవినీతి కార్యకలాపాలకు పాల్పడింది. వారు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు” అని ఆయన అన్నారు.
ఏఐఏడీఎంకే నాయకులు కేపీ మునుసామి, ఎస్పీ వేలుమణి మరియు తంగమణి కూడా ఎడప్పాడితో ఉన్నారు.
మార్చి 25న ఎడప్పాడి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రతినిధి బృందం ఢిల్లీలోని షా నివాసంలో ఆయనను సందర్శించిన తర్వాత తమిళనాడులో సంబంధాలను పునరుద్ధరించే చర్యలు బహిరంగంగా వెలువడ్డాయి.
by Srinivas Vedulla | Apr 10, 2025 | పరిశీలన
చంద్రబాబు విధాన నిర్ణయాలను ప్రజలు విశ్వసిస్తున్నారా ?
ఆంధ్రుల రాజధాని అమరావతి నిజంగానే దూసుకుపోతుందా? కూటమి నేతలు చెపుతున్నట్టు ‘ప్రపంచంలోనే టాప్ – 5 సిటీస్ ‘ లో చోటు దక్కించుకుంటుందా ? వీరు చేస్తున్న ప్రకటనలకు , ఫీల్డ్ లో జరుగుతున్న పనులకు పొంతన కనిపిస్తుందా ? కనీసం పదేళ్ళకయినా ప్రపంచ నగరాలతో పోటీపడే ప్లాన్ తో అమరావతి నిర్మాణం కొనసాగుతుందా ?
రాజధానిలో శరవేగంగా జరుగుతున్న పనులను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తుంది . అయితే చంద్రబాబు నాయుడు చెపుతున్నంత వేగవంగంగా మాత్రం ‘అమరావతి రయ్ రయ్ ‘ మంటూ దూసుకుపోయే పరిస్ట్టి ఉండకపోవచ్చు . ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లో స్టబ్టత నెలకొంది. రానున్న మూడు , నాలుగేళ్లపాటు రియల్ మూమెంట్ అంతగా ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయ్ . ఈ నేపథ్యంలో అమరావతి కూడా అంతంతమాంత్రంగానే రియల్ ఎస్టేట్ నడుస్తుంది . అయితే కూటమి సర్కార్ చేస్తున్న హంగామాకు జనంలోనూ , రాజధాని వాసులలోను హైప్ వస్తోంది . దీంతో వాస్తవ పరిస్థితులను వీరు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.
భూముల ధరలు భారీగా . .. ప్రస్తుతం అమరావతి , పరిసర ప్రాంతాలలో భూముల ధరలు అధికంగా ఉన్నాయి . హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పడిన సమయమ్లోను , శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణము సమయంలోను ప్రారంభంలో అక్కడి భూముల ధరలు కాస్త అందుబాటులో ఉండేవి . దీంతో జనం ఎగబడి భూములు కొనుగోలుకు ముందుకు వచ్చారు . ఇపుడు అమరావతి బూస్ట్ అప్ అవుతుందని ముందే ఊహించి భారీగా పెంచేశారు. రాజధాని ప్రాంతంలో ప్రస్తతం చదరపు గజం భూమి ధర రూ 35 వేల నుంచి రూ 70 వేల వరకు ఉంది . అయితే లావాదేవీలు ఎక్కువగా జరగడంలేదు . అమ్ముడుపోకపోయినా రైతులు , రియల్టార్లు మాత్రం ధరలు తగ్గించి అమ్మడానికి ఇష్టపడటంలేదు .
ఈ నేపథ్యంలో నాలుగైదేళ్ల వరకు అమరావతి ప్రాంతంలో భూముల ధరలలో పెద్ద మార్పు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు . అయితే ప్లాట్లు యజమానులు మాత్రం …. ఇపుడు ప్రకటించిన ప్రాజెక్టులు ప్రారంభం అయితే . .. ఐదారు నెలలలోనే గజం లక్షకు పెరుగుతుందని ఆశతో ఉన్నారు.
హైదరాబాద్ ఎఫెక్ట్ : 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రా నుంచి పెట్టుబడులు హైదరాబాద్ తరలిపోయాయి . ఆ సమయంలో హైదరాబాద్ మంచి హైప్ లో ఉంది. అక్కడ వందల కోట్ల రూపాయలు పెట్టి భూములు , విల్లాలు కొనుగోలు చేశారు . ఇటీవల రెండేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం అంచున సాగుతోంది . ఈ నేపథ్యంలో అక్కడ విక్రయించి . . అమరావతిలో పెట్టుబడులు పెడదామని భావిస్తున్న ఆంధ్రులకు అవకాశం దొరకడంలేదు . దీంతో అమరావతికి వచ్చే పెట్టుబడులు నిరాశాజనకంగా ఉన్నట్లు రియల్ ఎస్టేట్ సంస్థలు భావిస్తున్నాయి.
పదేళ్ల సమయం పడుతుంది : అమరావతి విశ్వనగరంగా అవతరించాలంటే కనీసం పదేళ్ల సమయం పడుతుంది . ఇపుడు జరుగుతున్న అభివృద్ధికి బ్రేక్ లేకుండా . .. 2029 లో కూడా కూటమి అధికారంలోకి వస్తే ఈ పనులు కొనసాగుతాయి . పొరపాటునో , గ్రహపాటునో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే అమరావతిని మళ్ళీ భ్రష్టు పట్టించారని చెప్పలేం . .. ఇదే కారణంతో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మెజారిటీ పెట్టుబడిదారులు తటపటాయిస్తున్నారు . దీనిపై కూటమి సర్కార్ , ,, కేంద్ర పెద్దలతో మాట్లాడుకుని జనంలో బలమైన నమ్మకం కలిగేలా చేయగలగాలి . లేకపోతె చంద్రబాబు చెపుతున్న కబుర్లకు , జరుగుతున్న పనులకు కొంత గ్యాప్ ఉండటంతో ప్రజల్లో విశ్వాసం కలగదు. దీనిని కూటమి నేతలు గుర్తెరగాలి .
by Srinivas Vedulla | Apr 9, 2025 | ఆంధ్రప్రదేశ్
”లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలి . .” అంటూ మూడు నెలల క్రితం టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి , చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని సరికొత్త పల్లవి అందుకున్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్లో మాట్లాడిన వర్మ పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టం చేసారు . రాష్ట్ర రాజకీయాలలో యువతకు స్ఫూర్తివంతమైన నేతగా లోకేష్ గుర్తింపు పొందారన్నారు . లోకేశ్ తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని ఈ సందర్బంగా టీడీపీ అధిష్టానానికి , చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని, అది పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ అన్నారు.
పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో తప్పుకుని జనసేన అధినేత పవన్ కి టికెట్ ఇచ్చారు . ఇందుకు ప్రతిగా వర్మకు ఎమ్ఎల్సి ఇస్తామని చంద్రబాబు , పవన్ హామీ ఇచ్చారు . అయితే వర్మకు ఘలక్ ఇచ్చారు . అయినా వర్మ పార్టీకి విధేయంగానే ఉన్నారు . ఈ సమయంలో వర్మపై జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ పై పిఠాపురం టీడీపీ కేడర్ ఆగ్రహంగా ఉంది . దీనిపై టీడీపీ అధిష్టానం సైతం వర్మను సముదాయించే పని చేయడంలేదు . అయినా వర్మ తన ఆగ్రహాన్ని బయటపెట్టకుండా టీడీపీని వెన్నంటే ఉన్నారు .
కాకినాడ సభలో వర్మ . .. పార్టీ భవిష్యత్తు కోసం 2047 ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోకేశ్ నాయకత్వానికి కార్యకర్తలు సంపూర్ణ మద్దతు చెపుతున్నారని కూడా చెప్పుకొచ్చారు .
by Srinivas Vedulla | Apr 9, 2025 | జనరల్
టారిఫ్ లు వద్దన్న టెస్లా అధినేత – పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాల మంట.. తన సన్నిహితుడు , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య మంట పెడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహితుడు ఎలాన్ మస్క్ మధ్య టారిఫ్ ల వ్యవహారం చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది . ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఇరువురి మధ్య అభిప్రాయ విబేధానికి కారణమని ఓ అమెరికన్ మీడియా సంస్థ తాజాగా ప్రత్యేక కథనం కూడా పబ్లిష్ చేసింది . సుంకాలు విధించ వద్దని మస్క్ ఎంత చెప్పినా ట్రంప్ వినలేదనేది ఆ కధనం సారాంశం . వెనక్కి తగ్గేది లేదని టెస్లా అధిపతికి అధ్యక్షుడు బల్ల గుద్ది మరీ చెప్పేశారట. సుంకాల దెబ్బకు తన సంపద భారీగా తరిగిపోవడంతో పాటు టెస్లా కార్ల కంపెనీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో ట్రంప్ పై మస్క్ గుర్రుగా ఉన్నట్లు సదరు కధనం స్పష్టం చేసింది .
నాలుగు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ అత్యంత కీలక భూమిక పోషించారు . తన ట్విటర్ (X ), ఇతర ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా అమెరికా ప్రజలలో ట్రంప్ వైపు తిప్పడంలో క్రియాశీల పాత్ర పోషించారు .
ప్రతీకార సుంకాలకు తాను వ్యతిరేకమని మస్క్ చెప్పకనే చెప్పారు. గత వారంలో ట్రంప్ సుంకాలు ప్రకటించిన కొద్ది సేపటికే ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్మాన్ స్వేచ్ఛా వాణిజ్యంపై మాట్లాడుతున్న వీడియోను మస్క్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే ఇందుకు నిదదర్శనం. అంతేకాదు, యూర్పతో సుంకాలు లేని వాణిజ్యం నెరపాలని కోరారు. అయితే, సుంకాలపై మస్క్ వైఖరిని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం మస్క్, నవారో మధ్య మాటల యుద్ధమే కొనసాగుతోంది. మస్క్, వైట్హౌ్సకు మధ్య అగాధం పెరిగిందన్న వార్తలను ఇది మరింత బలపరుస్తోంది.
ట్రంప్ విధించిన టారిఫ్ ల ప్రభావం వల్ల అమెరికాలో కూడా నిరుద్యోగం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళనలో లక్షలాది ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అయినా ట్రంప్ వెనక్కి తగ్గేదిలేదంటూ హుంకరిస్తున్నారు .
రూ.11.61 లక్షల కోట్లు హాంఫట్ ట్రంప్ సుంకాల దెబ్బకు మస్క్ సంపద ఈ ఏడాదిలో 13,500 కోట్ల డాలర్ల (రూ.11.61 లక్షల కోట్లు) మేర తరిగిపోయి ప్రస్తుతం 30,000 కోట్ల డాలర్ల దిగువకు (రూ.25.80 లక్షల కోట్లు) పడిపోయింది. గత గురు, శుక్రవారాల్లోనే మస్క్ నెట్వర్త్ 3,100 కోట్ల డాలర్ల మేర క్షీణించింది. సోమవారం నాడు మరో 440 కోట్ల డాలర్ల ఆస్తిని కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత నష్టం వాటిల్లబోతోందని టెస్లా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | జనరల్
లోతైన గోతిలోకి . . పెద్ద యంత్రాన్ని దించే పనిలో రైతు ఉపాయం గ్రేట్ … ముప్పయ్ – నలభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది కధ లాంటి నిజం . . 2 నిముషాలు కేటాయించి చదవండి..
కేరళ రాష్ట్రంలో అలెప్పి సమీపంలో ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు . ఆ ప్లాంట్ కనస్ట్రక్షన్ సమయంలో ఒక పెద్ద సమస్య తలెత్తింది . . ఫ్యాక్టరీలో లోతైన గొయ్యి తవ్వారు. ఆ గొయ్యిలో ఒక భారీ యంత్రం పెట్టాలి. కానీ ఆ యంత్రం చాలా బరువుగా ఉండడం వల్ల దాన్ని లోపల పెట్టడం కష్టంగా మారింది.
యంత్రం సైట్కి తీసుకొచ్చారు. కానీ 30 అడుగుల లోతైన గుంతలో దించడం ఎలా అన్నది పెద్ద తలనొప్పిగా మారింది!
యంత్రాన్ని సరిగ్గా ఉంచకపోతే, ఫౌండేషన్కి మరియు యంత్రానికీ నష్టం కలుగుతుంది.
అప్పుడు (1980-85 మధ్య కాలంలో ) పెద్ద బరువులు ఎత్తగలిగే క్రేన్లు అంతగా అందుబాటులో లేవు. కొన్ని క్రేన్లు ఉండవచ్చు, కానీ అవి ఆ లోతు వరకు దించలేవు. దించినా సేఫ్ గా దించడం సాధ్యం కాదని ఇంజినీర్లు చేతులెత్తేశారు.
చివరికి ఆ కంపెనీ ఇంజినీర్లు , ఇతర నిపుణులు తాము చేయలేమని తేల్చేసి, ఈ సమస్యకి ఎవరు పరిష్కారం చూపుతారో తెలుసుకోడానికి టెండర్ పిలిచారు . చాలా మందే తమ తమ ఐడియాలు పంపారు. ఎక్కువమంది క్రేన్ వాడే ఆలోచనతోనే వచ్చారు.
వాళ్లు 10 నుంచి 15 లక్షల వరకు టెండర్ కోడ్ చేశారు.
అయితే, ఆ ఊరికి సమీపంలో ఉండే ఒక రైతు వచ్చి కంపెనీ ఇంజినీర్లను అడిగాడు:
“ఈ మెషిన్ నీటిలో తడిసితే ఏమైనా సమస్య ఉంటుందా?”
కంపెనీ ఇంజినీర్లు : “ఏమీ సమస్య లేదు.”
అయితే ఆ రైతు కూడా టెండర్ వేసాడు. కానీ అతడు కేవలం 5 లక్షలకె పని పూర్తిచేస్తామని కోడ్ చేసాడు . అందుకే ఆ పని అతనికే అప్పగించారు.
అయితే ఆశ్చర్యంగా, అతను తన ప్లాన్ చెప్పలేదు. “నా దగ్గర ఈ పని చేయగలిగే టీమ్ ఉంది, నేను పనిని పూర్తి చేస్తాను” అని మాత్రమే అని వెళ్ళిపోయి . . మరుసటి రోజు వచ్చాడు .
రాగానే కంపెనీ ఉద్యోగులు, మేనేజర్లు, బాస్ అందరూ ఆ పని ఎలా చేస్తాడో చూడడానికి ఉత్కంఠగా ఎదురుచూశారు.
సైట్కి ఎటువంటి ప్రిపరేషన్ కనిపించలేదు. కానీ నిర్ణయించిన సమయానికి చాలా ట్రక్కులు వచ్చాయి. ఆ ట్రక్కులన్నీ మంచు పలకలతో నిండినవి. ఆ మంచు బ్లాక్లను గుంతలో వేసారు.
ఆ తరువాత యంత్రాన్ని తీసుకొచ్చి, మంచు బ్లాక్ల మీద పెట్టారు.
తరువాత మినీ వాటర్ పంప్ ద్వారా గుంత నుంచి నీటిని బయటకి పంపారు. మంచు కరిగిపోయింది, నీరు తిసే కొద్దీ యంత్రం క్రిందకి దిగింది.
4-5 గంటల్లోనే పని పూర్తయ్యింది. మొత్తం ఖర్చు లక్ష రూపాయల లోపే అయ్యింది.
యంత్రం సరిగ్గా స్థిరంగా అమరింది. ఆ వ్యక్తికి నాలుగు లక్షల పైన లాభం వచ్చింది!
ఇది చూస్తే తెలుసుతుంది – వ్యాపారం అయినా , వ్యవహారం అయినా తెలివిగా , సులువుగా చేయడానికి చదువు ఒక్కటే సరిపోదు . అనుభవం , సమయస్ఫూర్తి , సందర్భానుసారం.. వ్యవహార జ్జ్ఞానం ముఖ్యమని . . .
సమస్యలకు సింపుల్ సొల్యూషన్ కనుగొనడం ఒక కళ. అది మన తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది.
ఆ మనిషి తన ఆచరణాత్మక జ్ఞానంతో పెద్ద సమస్యకు సులభమైన పరిష్కారం చూపించి . . ఇంజినీర్లను సైతం నోటిమీద వేలువేసుకునేలా చేసాడు. పదిమందితో శబాష్ అనిపించుకున్నాడు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | క్రీడలు
IPL హిస్టరీలో తొలి కెప్టెన్గా రికార్డు! – RAJAT PATIDAR 2025 IPL
ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆర్సీబీ 2025 ఐపీఎల్ సీజన్ని అద్భుతంగా స్టార్ట్ చేసింది. ఆరు పాయింట్లతో టేబుల్లో మూడో ప్లేస్లో ఉంది. అనేక సంవత్సరాలుగా కొంతమంది స్టార్ ప్లేయర్లపైనే అతిగా ఆధారపడిన ఆర్సీబీ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. బలమైన జట్టును నిర్మించి, టీమ్ని అద్భుతంగా నడిపిస్తున్న కెప్టెన్ రజత్ పటీదార్కే ఈ క్రెడిట్ దక్కుతుందని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీ ప్రస్తుత సీజన్ ప్రారంభంలో గ్రాండ్ విక్టరీలు అందుకుంది. టాప్ టీమ్లు కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ ని హోమ్ గ్రౌండ్లో ఓడించింది. వరుసగా ఈడెన్ గార్డెన్స్, చెపాక్ వాంఖడేలో అద్భుత విజయాలు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర కెప్టెన్ కూడా ఒకే సీజన్లో ఇలా చేయలేక పోయాడు. అరుదైన ఘనత సాధించిన మొదటి వ్యక్తిగా పటీదార్ నిలిచాడు.అలానే ఓ అరుదైన రికార్డును పటీదార్ సొంతం చేసుకున్నాడు.
ఐపీఎల్లో ఒకే సీజన్లో రెండు జట్లు మాత్రమే తమ సొంత స్టేడియంలలో KKR, CSK, MIలను ఓడించాయి. మొదట పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ XI పంజాబ్ ) 2012లో ఈ ఘనత అందుకుంది. అయితే ఆ జట్టు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఆడమ్ గిల్క్రిస్ట్, డేవిడ్ హస్సీ నేతృత్వంలో ఓడించింది. తాజాగా ముంబయిపై ఆర్సీబీ వాంఖడేలో గెలవడంతో అరుదైన రికార్డు అందుకున్న ఏకైక కెప్టెన్గా పటీదార్ నిలిచాడు. ఇది తమకెంతో గర్వకారణంగా ఉందని జట్టులో ఉన్న ఇతర ఆటగాళ్లు హ్యాపీగా చెపుతున్నారు.
by Srinivas Vedulla | Apr 8, 2025 | ఆరోగ్యం
స్టూడెంట్స్ ఊబకాయం..పొంచి ఉన్న ఫ్యాటీ లివర్ ప్రమాదం
నలుగురు కళాశాల విద్యార్థులలో ఒకరు ఊబకాయం, ఐదుగురిలో ఒకరు ప్రీ-హైపర్టెన్సివ్: ‘అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక’
భారతదేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. 257,199 మంది స్క్రీనింగ్ చేయబడిన వ్యక్తులలో 65% మంది దీని బారిన పడ్డారు. ముఖ్యంగా, వారిలో 85% మంది ఎప్పుడూ మద్యం సేవించలేదు, దీనిని జీవక్రియ సమస్యగా వైద్య నిపుణులు హైలైట్ చేస్తున్నారు.
అపోలో నివేదిక ఏమి చెపుతుంది?: అపోలో హాస్పిటల్స్ ఇటీవల జరిపిన పరిశోధన ఫలితాలు.. నివేదిక ప్రకారం, నలుగురు భారతీయ కళాశాల విద్యార్థులలో ఒకరు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు అధిక రక్తపోటు యొక్క ప్రారంభ సంకేతాలను కలిగి ఉంటున్నారు. 2.5 మిలియన్ల మందిపై నిర్వహించిన స్క్రీనింగ్ల ఆధారంగా, “హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025” నివేదిక, రక్తపోటు మరియు మధుమేహం వంటి పెరుగుతున్న ఆరోగ్య సమస్యల తీవ్రతను తెలియచేస్తోంది.
.ఏప్రిల్ 7న ప్రారంభించబడిన ‘’హెల్త్ ఆఫ్ ది నేషన్ 2025 నివేదిక’’, అపోలో ఆసుపత్రులు, క్లినిక్లు మరియు వెల్నెస్ సెంటర్లలో 2.5 మిలియన్లకు పైగా ప్రజల ఆరోగ్య పరీక్షల ఆధారంగా రూపొందించబడింది.
పరీక్షించబడిన విద్యార్థులలో, 28 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు ఈ నివేదిక తేటతెల్లం చేస్తోంది. అయితే 19 శాతం మంది ప్రీ-హైపర్టెన్సివ్గా ఉన్నారు – అంటే వారి రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రమాద స్థాయికి దగ్గరలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అన్ని వయసులవారిలో, 26 శాతం మంది ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని మరియు 23 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని, ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా, నివేదిక వెల్లడిస్తుంది. .
ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి లక్షణాలపై ఆధారపడటం ఇకపై సరిపోదని అపోలో నివేదిక సూచిస్తోంది. ఇది యువకులు మరియు పెద్దలు ఇద్దరూ క్రమం తప్పకుండా నివారణ ఆరోగ్య తనిఖీలు చేయించుకోవడానికి సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.
ఈ నివేదిక నేడు భారతదేశంలో మూడు ప్రధాన ఆరోగ్య సవాళ్లను కూడా హైలైట్ చేస్తుంది: కొవ్వు కాలేయ వ్యాధి, రుతుక్రమం ఆగిపోయిన తర్వాత ఆరోగ్య క్షీణత మరియు బాల్య ఊబకాయం, ప్రారంభ జీవనశైలి మార్పులు మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణ కోసం పిలుపునిచ్చింది.
ఈ సందర్బంగా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో ఊబకాయులు తీసుకోవాల్సిన ఆరోగ్య చర్యలపై వివరించారు. “ప్రతి ఇంటి గుండెలో ఆరోగ్యాన్ని ఉంచడం ద్వారా భారతదేశం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలను సృష్టించే అవకాశాన్ని పొందాలి. నివారణ ఆరోగ్య సంరక్షణ ఇకపై భవిష్యత్ ఆశయం కాదు – ఇది నేటి దేశ శ్రేయస్సుకు మూలస్తంభం. ముందస్తుగా చర్య తీసుకోవడం, లోతుగా పరీక్షించడం మరియు ప్రతి పౌరుడికి జ్ఞానం మరియు ప్రాప్యతతో సాధికారత కల్పించడం అనే మన సమిష్టి బాధ్యతను ఈ నివేదిక ధృవీకరిస్తుంది. ప్రతి విద్యా పాఠ్యాంశాలు, కార్పొరేట్ ప్రయోజనాలు మరియు కుటుంబ దినచర్యలలో నివారణ సంరక్షణను ఏకీకృతం చేయాల్సిన సమయం ఇది. అప్పుడే మనం అనారోగ్యానికి చికిత్స చేయడం నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వైపు మళ్లగలం మరియు రాబోయే తరాలకు స్థితిస్థాపకంగా, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్ధారించగలం.” అని రెడ్డి స్పష్టం చేశారు.
ఫ్యాటీ లివర్: ఎ న్యూ మెటబాలిక్ అలార0
నివేదిక ప్రకారం, ఫ్యాటీ లివర్ వ్యాధి భారతదేశం యొక్క అతిపెద్ద నిశ్శబ్ద ముప్పులలో ఒకటిగా మారుతోంది. పరీక్షించబడిన 257,199 మందిలో 65 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉన్నట్లు కనుగొనబడింది మరియు వారిలో 85 శాతం మంది ఎప్పుడూ మద్యం సేవించలేదు—ఇది కేవలం కాలేయ సమస్య కాదు, పూర్తి స్థాయి జీవక్రియ సమస్య అని నిరూపిస్తోంది.
ఆశ్చర్యకరంగా, ప్రభావితమైన వారిలో సగానికి పైగా సాధారణ రక్త పరీక్షలు చేయించుకున్నారు, సాంప్రదాయ స్క్రీనింగ్ మాత్రమే తరచుగా దాచిన ప్రమాదాలను కోల్పోతుందని చూపిస్తుంది.
“పరీక్షించబడిన వారిలో 66 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు – వారిలో 85 శాతం మంది ఆల్కహాల్ లేనివారు – ఇది కొత్త రోగ నిర్ధారణలు మరియు స్థాయిలో ముందస్తు గుర్తింపు కోసం ఆవశ్యకతను సూచిస్తుంది. సాంప్రదాయ స్క్రీనింగ్ ఇకపై సరిపోదు. అపోలో యొక్క ప్రోహెల్త్ కార్యక్రమం వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడానికి అధికారం ఇవ్వడం మాత్రమే కాదు; ఇది స్కేలబుల్ మరియు ప్రిడిక్టివ్ హెల్త్కేర్కు పునాది వేస్తోంది. నివారణ భారతదేశం యొక్క అత్యంత స్కేలబుల్ హెల్త్కేర్ పరిష్కారం, మరియు అపోలో యొక్క లక్ష్యం నివారణ ఆరోగ్యాన్ని ప్రజాస్వామ్యీకరించడం, ”అని అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సునీతా రెడ్డి చెపుతున్నారు.
నిద్ర రుగ్మతలు: నలుగురిలో ఒకరు OSA ప్రమాదంలో ఉన్నారు
నిద్ర ఆరోగ్యంలో కూడా ఆందోళనకరమైన ధోరణి ఉద్భవించింది. పరీక్షించబడిన 53,000 మందిలో, 24 శాతం మందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) ప్రమాదం ఎక్కువగా ఉంది – ఇది ఊబకాయం మరియు గుండె జబ్బులతో దగ్గరి సంబంధం ఉన్న నిద్ర రుగ్మతగా రుజువయింది. .
33 శాతం మంది పురుషులు మరియు 10 శాతం మంది మహిళలు అధిక ప్రమాదం ఉన్నట్లు కనుగొనబడింది, 55 సంవత్సరాల తర్వాత ప్రాబల్యం పెరుగుతుంది. OSA తరచుగా నిర్ధారణ చేయబడదు, ఒత్తిడి లేదా అలసటగా తప్పుగా భావించబడుతుంది.
40 ఏళ్లలోపు వారిలో కూడా, దాదాపు సగం మంది పురుషులు మరియు మూడింట ఒక వంతు మంది స్త్రీలు విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు – ఇది శక్తి, జ్ఞానం మరియు జీవక్రియను ప్రభావితం చేసే సమస్యగా పరిశోధకులు సెలవిస్తున్నారు.
సూక్ష్మపోషక అంతరాలు విస్తృతంగా ఉన్నాయి. 77 శాతం మంది మహిళలు మరియు 82 శాతం మంది పురుషులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు, అయితే విటమిన్ B12 లోపం 38 శాతం మంది పురుషులు మరియు 27 శాతం మంది స్త్రీలను ప్రభావితం చేసింది
by Srinivas Vedulla | Apr 8, 2025 | ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకు, పరిసర గురుకుల పాఠశాల విద్యార్థులు అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలతో చరిత్ర సృష్టించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ యోగ గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన ఈ వరల్డ్ రికార్డ్ కి వేదికయింది . లండన్ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలీస్ రేనాడ్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ దినేశ్కుమార్కు అందజేశారు. యోగ గురువు పతంజలి శ్రీనివాస్ . .. గిరిజన విద్యార్థులకు దశాబ్ద కాలంగా యోగలో శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్ నిస్వార్ధ సేవలకు గాను కలెక్టర్ . . దినేష్ ఎక్కడికి బదిలీ అయినా . . ఆయా ప్రాంతాలలో గిరిజనులకు శ్రీనివాస్ సేవలు వినియోగిస్తున్నారు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | సినిమా
ఇమేజ్ కోసమా ? అప్పటి కామెడీని కంటిన్యూ చేయడంపై భయమా ?
టాలీవుడ్ లో ఏ కేరెక్టర్ అయినా ఇట్టే ఒదిగిపోగల నటుడు జూనియర్ ఎన్టీఆర్ . తాను పోషించిన పాత్రకు 100 శాతం న్యాయం చేయగల అరుదైన నటులలో ముందువరసలో ఉంటారు తారక్. అయినా అదుర్స్ సీక్వల్ ఎందుకు చేయనంటున్నారు ఈ యాక్టర్.
”అన్ని కేరెక్టర్ లలోకి కామెడీ చేయడమే కష్టం. అందునా అదుర్స్ లో చేసిన కామెడీ ఇప్పుడు చేయాలంటే నాకు భయంగానే ఉంది. మళ్ళీ ఆ టెంపో వస్తుందో లేదో అన్న ఆందోళన ఉంది . అందుకే అదుర్స్ – 2 చేయనని చెపుతున్నాను . చేయనంటే .. ఇప్పట్లో చేయనని చెపుతున్నాను . ..” అని ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు జూనియర్. ఔన్ మరి అతను చెప్పింది నిజమే . .. అప్పట్లో అదుర్స్ లో ఎన్టీఆర్ , బ్రహ్మనందం కాంబినేషన్ కూడా అంతలా అదిరింది. ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ అప్పట్లోనే ప్రయోగం చేశారనే చెప్పాలి . అంతకు ముందు సింహాద్రి వంటి వయొలెన్స్ సినిమాలు చేసి . .. సడన్ గా పూర్తీ స్థాయి హాస్య ప్రధాన పాత్ర చేయడం సాహసమే . అందునా తెలుగులో ఇలాంటి ప్రయోగాలు పొరపాటున వికటిస్తే ఇక సదరు ప్రయోగం చేసిన నటుడి కెరీర్ దాదాపు క్లోస్ అనే చెప్పాల్సి ఉంటుంది . ఆంత సాహసం చేసినందుకే జూనియర్ కి ఇప్పటికీ అదుర్స్ ఒక మైలురాయిలా మిగిలిపోయింది .
by Srinivas Vedulla | Apr 7, 2025 | బిజినెస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడంతో, చైనా కూడా రివెండ్ టారిఫ్స్తో ఎదురుదాడి చేసింది. దీనితో వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. ఫలితంగా మదుపరుల సంపద సోమవారం మార్కెట్ ఓపెన్ అయిన నిమిషాల వ్యవధిలోనే .. ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
- ఈ సెషన్స్ లో టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. వాస్తవానికి అమెరికాలోకి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించిన రోజే ఈ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి . ఈ నేపథ్యంలోనే టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమెరికాకు ఎగుమతులను నిలిపివేసిందన్న వార్తలు రావడంతో టాటా మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం మేర క్షీణించి రూ.552 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకాయి.
- టాటాలకు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ షేర్లు కూడా నేడు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 19.2 శాతం పతనమై రూ.4,491 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. 2020 మార్చి తర్వాత కంపెనీ షేర్లు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
- అలాగే టాటా గ్రూపునకు చెందిన టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా, మొత్తంగా రూ.1.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161 వద్ద ముగిసింది. ఇంత దారుణమైన పతనంలోనూ కొన్ని షేర్స్ లాభపడ్డాయి .
- లాభపడిన షేర్లు : హిందూస్థాన్ యూనిలివర్
- నష్టపోయిన షేర్లు : టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఎస్బీఐ, సన్ఫార్మా, టైటాన్, టీసీఎస్.
-
- కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCలు) షేర్ ధరలలో గణనీయమైన తగ్గుదలకు దారితీసింది. కీలకమైన OMCలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL), దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ మార్కెటింగ్, పంపిణీకి ప్రధాన భూమిక వహిస్తాయి. ఈ ప్రకటన తర్వాత, ఆయా ఆయిల్ కంపెనీల స్టాక్ ధరలు భారీగా తగ్గాయి
- ఏయే కంపెనీలు ఏ మేరకు తగ్గాయి:
- BPCL: 6.24% తగ్గాయి
- HPCL: 4.31% తగ్గాయి
- IOC: 5.99% తగ్గాయి