సంక్రాంతికి ఊరేందుకు వెళ్తానంటే . . చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య

సంక్రాంతి అంటే తెలుగువారికి పెద్ద పండగ . ఎన్ని పనులు ఉన్నా . . సొంత గ్రామాలకు వెళ్లి పండగ జరుపుకోవాలి . . అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు . తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు . అందుకే నేను ప్రతి సంక్రాంతికి నా గ్రామానికి వెళ్తాను: సీఎం చంద్రబాబు నాయుడు

పండగ హంగామా.. రోడ్లన్నీ ఫుల్ ..

హైదరాబాద్ – విజయవాడ రోడ్డు బారులు . . వేలల్లో వాహనాలు.. ఎక్కడిక్కడ ట్రాఫిక్ కష్టాలు . అయినా సంక్రాంతి సంబరాల ముందు నాలుగైదు గంటల ట్రాఫిక్ కష్టాలు పెద్ద లెక్కేమీ కాదు కదా . . హైదరాబాద్ నుంచి విజయవాడ , గోదావరి జిల్లాలకు వచ్చే జనం కార్లతో విజయవాడ – హైదరాబాద్ రోడ్డు కిక్కిరిసింది . టోల్ గేట్ల వద్ద గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది . వేలాది కార్లు క్యూ కట్టాయి . … Read more

రచనలు సామాన్యులను చదివించేలా ఉండాలి..

రచనలు మేధావులనే కాకుండా . . సామాన్య పాఠకులను చదివించే ఆసక్తికర రీతిలో ఉండాలని . . గోళ్ళ నారాయణ అభిప్రాయపడ్డారు . అలాగే పఠనాసక్తిని పెండడానికి రచయితలు ద్రుష్టి సారించాలన్నారు . పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జమ్ముల చౌదరయ్య రాసిన… ‘జీవితం – ఒక అవగాహన’ పుస్తక ఆవిష్కరణ విజయవాడ బుక్ ఫెస్టివల్ లో జరిగింది . రామోజీరావు సాహిత్య వేదిక పై జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు . పుస్తక మహోత్సవ … Read more

చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కి హైకోర్టు షాక్ ..

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు , ఆ పార్టీ కీలక నేత , మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భాస్కరరెడ్డిపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు పెట్టారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చెవిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చెవిరెడ్డిపై గత ఏడాది నవంబర్‌లో … Read more

గేమ్ చేంజర్.. పర్వాలేదంతే..

” ఐదేళ్ల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అస్తవ్యస్త, అరాచక పరిపాలనను టార్గెట్‌గా చేసుకొని దర్శకుడు శంకర్ సంధించిన పొలిటికల్ సెటైర్ .. ఈ సినిమా. .. అని చెప్పాలి . ” గేమ్ చేంజర్ యాక్టర్స్ : ఆలిండియా సివిల్ సర్వేసులో ఎంపికై . .ఐపీఎస్ ఆఫీసర్‌ గా పనిచేస్తున్న యువకుడు . . అక్కడితో ఆగకుండా . . ఐఏఎస్ కు ప్రయత్ని0చి సక్సెస్ అవుతాడు . రామ్ నందన్ (రాంచరణ్) … Read more

యనమలపై చర్యలేవీ ?

తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు, సౌమ్యుడుగా పేరుగాంచిన యనమల రామకృష్ణుడు, పార్టీని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశించిన చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ విషయం టీడీపీ అధిష్టానం మర్చిపోయిందా ? లేక ఉద్దేశ్యపూర్వకంగా వదిలేసిందా ? కాకినాడ సెజ్ భూములు , దివీస్ భూముల వ్యవహారంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు దోచుకున్నారన్న అర్ధం వచ్చే రీతిలో మాజీ మంత్రి , టీడీపీ నేత యనమల రామకృష్ణుడు నెల రోజుల క్రితం చంద్రబాబుకు లేఖ రాసారు . ఆ సమయంలో … Read more

‘లాస్‌’ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. – 5 లక్షల కోట్ల నష్టం

ఐదుగురి దుర్మరణం.. 1.37 లక్షల మంది తరలింపు వేగంగా విస్తరి0చిన మంటలు.. ఈదురు గాలులు హాలీవుడ్‌కు ముప్పు.. ఆస్తులు కోల్పోయిన స్టార్లు ఆస్కార్‌ వేడుకపై నీలినీడలు.. క్రీడా టోర్నీలు రద్దు వాషింగ్టన్‌, జనవరి 10: అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్ లో రగిలిన కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. పాలిసాడ్స్‌ ఫైర్‌.. ఈటన్‌ ఫైర్‌.. సన్‌సెట్‌ ఫైర్‌.. ఇలా వేర్వేరు పేర్లతో ఆరు చోట్ల యుఎస్ లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు సహా.. … Read more

గోదావరి జిల్లాలలో మొదలైన కోడిపందాలు

సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రత్యేకం. అందునా ఆంధ్రప్రదేశ్ లో మరీను . పండుగ రోజుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో ఉండే సందడి గురించే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇళ్లలో పసందైన వంటకాలకు తోడు ఊళ్లలో కోడి పందేలు, ప్రభలు, డాన్స్ పోటీలు, రికార్డింగ్ డాన్సులు, ఆర్.కె.స్ట్రా గానా, భజానాతో పాటు గుండాటలు, సినిమాలు ఇలా మూడు రోజుల సమయం అంతా మూడు క్షణాల్లో గడిచిపోయేలా అనిపిస్తుంది. రికార్డింగ్ డాన్సులు, ప్రభలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, లొల్ల … Read more

నిర్లక్ష్యం పై చంద్రబాబు ఆగ్రహం

తిరుపతి మృతులకు 25 లక్షల నష్ట పరిహారం తిరుపతిలో తొక్కిసలాట ఘటన స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట పరిసర ప్రాంతాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, అధికారులు స ఉన్నారు. బుధవారం చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన గురించి సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు వివరించారు. రద్దీ పెరుగుతుంటే ఏం చేసారు .   అధికారులను అడిగి సీఎం చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా … Read more

తిరుమల తొక్కిసలాట – ఆరుగురు మృతి

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో అధికారుల నిర్లక్ష్యంతో ఘోరం జరిగింది . తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకోగా, శ్రీనివాసం వద్ద తమిళనాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు. బైరాగిపట్టెడ వద్ద రామానాయుడు స్కూల్‌ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన … Read more