రైతు గోడు తెలుసు కదా . .. రైతు దినోత్సవం సైకత శిల్పం

Abhi Correspondent

దేవిన సిస్టర్స్ (సోహిత , ధన్యత ) తీర్చిదిద్దిన అబ్బురపరిచే సైకతం

దేశానికి వెన్నెముఖి రైతు . ఆ రైతు పరిస్థితి దయనీయం . ఇతర ఏ వృత్తిలోలేనంత కష్ట – నష్టాలు రైతన్న అనుభవిస్తాడు . ప్రకృతి వైపరీత్యాలు , మార్కెట్ మాయాజాలం , సహకారం అందించని సర్కార్ . .. ఇలా సాగు ప్రస్తుతం సంక్షోభంలో ఉంది . సాగులో రసాయన ఎరువులు తగ్గిద్దామంటూ సందేశంతో . .. ప్రకృతి సాగును ప్రోత్సహిస్తూ వీరు రూపొందించిన సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది . ఆలోచనరెక్కెట్టిస్తోంది .

వ్యవసాయం నష్టాలు , కష్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించే సైకత శిల్పాన్ని రూపొందించారు దేవిన సిస్టర్స్ . దేవిన సోహిత , దేవిన ధన్యత అక్కా చెల్లెల్లు . వీరిది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఈ సోదరీమణులు సామాజిక అంశాలపై జనంలో అవగాహన తీసుకువచ్చేందుకు ఆయా దినోత్సవాల సందర్బంగా సైకత శిల్పాలు రూపొందిస్తు ఉంటారు .

2021 లో దేవిన సిస్టర్స్ రూపొందించిన సైకత శిల్పం .

You May Also Like…