లోకేష్ కి మోదీ అభయం – 2027 లో పట్టాభిషేకం?

లోకేష్ కి మోదీ అభయం – 2027 లో పట్టాభిషేకం?

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయ్. మన రాష్ట్ర రాజకీయ భవితవ్యం కూడా NDA చేతిలోకి వెళ్ళబోతున్నాయ్.

”2029 లోనే కాదు . . 2034 లో మరో దఫా కూడా ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారు..” అంటూ జనసేన అధినేత , ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తూ ఉంటారు . అయితే మారుతున్న సమీకరణల నేపథ్యంలో 2027 లోనే నారా లోకేష్ కి పట్టం కట్టడానికి రంగం సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.

మోదీ ఆశీస్సులు: ఏపీ మంత్రి లోకేష్ కి ప్రధాని మోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల ప్రధాని నివాసంలో రెండు గంటలపాటు లోకేష్ కుటుంబంతో మోదీ ఉల్లాసంగా గడపడమే దీనికి సంకేతంగా భావించవచ్చు. లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలంటూ కొంత కాలం క్రితం టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో జనసేన కేడర్ భగ్గుమంది. ఉపముఖ్యమంత్రి పదవి ఒకటే ఉండాలనేది టీడీపీ , జనసేన మధ్య ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం. అందులో భాగంగానే చంద్రబాబు సైతం లోకేష్ ని ఉపముఖ్యమంత్రి చేయడానికి ఇష్టపడలేదు.

2029 లో పవన్ ని సీఎం చేయాలన్న డిమాండ్ జనసైనికుల నుంచి తీవ్రంగా ఉంది . అయితే పవన్ తన బలం , బలహీనతలు బాగా అంచనావేయగలిగిన నేతగా ఎదిగారు. పొత్తుతో ముందుకెళితేనే జనసేనకు కూడా భవిష్యత్ ఉంటుందని బలంగా నమ్మిన వ్యక్తి పవన్. 2019 దెబ్బ ఈ గుణపాఠాన్ని నేర్పింది. రాబోయే ఎన్నికలకు సైతం పొత్తుతోనే వెళ్లాలన్నది పవన్ యోచన.

పొత్తుతో ఉన్నపుడు అతిపెద్ద పార్టీ ఏదైతే ఆ పార్టీ నుంచే సీఎం వంటి కీలక పదవులు కేటాయింపు ఉంటుంది . ఇందులో భాగంగానే 2029 లో కూడా టీడీపీ కె ఈ ఛాన్స్ దక్కుతుంది . పవన్ కి కేడర్ నుంచి ఒత్తిడి ఎక్కువవుతున్నా… అతను మాత్రం ఆచి – తూచి అడుగేస్తున్నారు . వచ్చే ఎన్నికలలో పవన్ ని దక్షిణాది మొత్తం తిప్పనున్నారు . సనాతన సారధిగా ఐడెంటిటీ పొందిన పవన్ ప్రాభవం . .. ఏపీ , తెలంగాణతోపాటు . .. కర్ణాటక , తమిళనాడులలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. పవన్ ని ఒక రాష్ట్రానికే పరిమితం చేయకుండా . .. సౌత్ ఇండియన్ పొలిటికల్ స్టార్ గా బీజేపీ ప్రమోట్ చేయనుంది .

2027 లో . .. అంటే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల ముందే లోకేష్ కి సీఎం పదవి పగ్గాలు అప్పగిస్తారని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి . 2026 మహానాడులో లోకేష్ ని టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చేస్తారన్న ప్రచారం కూడా ఉంది.

పవన్ కి కేంద్రమంత్రి పదవి . .. లోకేష్ సీఎం అయితే పవన్ ఉపముఖ్యమంత్రిగా ఎలా ఉంటారు ? పవన్ కి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు . ఈ మేరకు మోదీ టీమ్ ఒక అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది .

వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా . .. చంద్రబాబు : లోకేష్ సీఎం పీఠం అధిరోహిస్తే . .. చంద్రబాబును ఉప రాష్ట్రపతిగా చేసే ప్రయత్నాలు NDA నేతలు చేపట్టినట్లు తెలుస్తోంది .

2029 ఎన్నికల ఎత్తుగడగా బీజేపీ . .. 2029 లో నాలుగోసారి గెలుపు బీజేపీకి అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీతో కొన్ని ప్రాంతీయ పార్టీలు చేతులు కలిపితే పోటీ మరింత గట్టిగ ఉంటుంది. ముక్యంగా బీజేపీ దక్షిణాదిపై ద్రుష్టి సారించింది . ఇందులో భాగంగా ఏపీ , తెలంగాణలు కూడా తమకు కీలకంగా బీజేపీ భావిస్తోంది.

2014-2019 మధ్య చంద్రబాబు , బీజేపీ తో పొత్తులో ఉన్నారు . 2019 ఎన్నికలలో మాత్రం NDA నుంచి బయటకు వచ్చి . .. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేశారు. ఈ దెబ్బ 2019 లో టీడీపీకి బొప్పి కట్టింది . దీంతో 2024 లో చేసిన తప్పును సరిదిద్దుకున్నారు . బీజేపీతో జతకట్టి అప్రతిహత విజయం సాధించారు . ఇదే సమయంలో కేంద్ర0లో సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే ఏపీ నుంచి టీడీపీ మద్దతు మస్ట్. అంతేకాకుండా . .. చంద్రబాబును వదిలేస్తే లాభంలేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. గతంలో వాజపేయి ఉన్నపుడు బీజేపీతో టీడీపీ జట్టు కట్టింది. మళ్ళీ 2019 లో దూరమయింది . ఇలా ఒక్కోసారి . .. ఒక్కోరకంగా రాజకేయన్గా చంద్రబాబు మార్పులు ఉండటంతో బీజేపీ నేతలు అప్రమత్తంగా ఉన్నారు . చంద్రబాబును ఇలా వదిలేస్తే లాభంలేదన్న భావనలో ఉన్న మోడీ , అమిత్ షా . .. సీబీఎన్ కి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెడితే బాగుంటుదన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది .

భారత్ దెబ్బ – పాకిస్తాన్ కే కాదు.. చైనా, అమెరికా ఉలికిపాటు

భారత్ దెబ్బ – పాకిస్తాన్ కే కాదు.. చైనా, అమెరికా ఉలికిపాటు

మేథావుల ముసుగేసుకున్న కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు గానీ...

కేవలం 24 నిమిషాలు.. పాకిస్తాన్ లో అన్ని ఉగ్రవాద తయారీ కేంద్రాలతోపాటు కీలక స్థావరాల ధ్వంసం. వందల ,వేల మంది మరణం. పైకి చెప్పుకోడానికి దాయాది దేశానికీ నోరు పెగలడం లేదు కానీ , . .పదిలక్షల కోట్ల విధ్వంసం…కోలుకోవడానికి కనీసం పదేళ్ళు పడుతుంది.కీలకమైన తొమ్మిది ఎయిర్ బేస్ లు ధ్వ0సం. వాళ్ళ స్వీయ రక్షణ వ్యవస్థలు ధ్వంసం. ఆకాశ్, బ్రహ్మోస్ ల విలయ తాండవం వాళ్ళను సమర్థించే దేశాలకు సైతం వణుకు పుట్టించింది. పహల్గామ్ ఘటన తరవాత మోడీ ఎక్కడా నోరు మెదపకుండా మీటింగ్ లపై మీటింగ్ లు పెట్టడం చూసి చాలా మంది ఎన్నికల స్టంట్ అనుకున్నారు.

పాక్ లో కీలక స్థావరాలన్నింటినీ ధ్వ0సం చేయగలిగాం . దీనికి అమెరికన్ జిపియస్ కాకుండా మన సొంత శాటిలైట్స్ ద్వారా టార్గెట్స్ ఫిక్స్ చేయడానికి…ఇస్రో ఉపగ్రహాలన్నింటినీ సరిహద్దుల వైపు ఫోకస్ పెట్టేదాకా వేచి చూసి…అన్నీ ఫర్ఫెక్ట్ గా ఫిక్స్ చేసి కొట్టారు.(కార్గిల్ యుద్ధంలో పదాతి దళాలతో యుద్ధం చేయాల్సి రావడానికి కారణం అమెరికా వైమానిక దాడులకు జిపియస్ సహకారం నిరాకరించడమే) పాక్ లో ఆరాత్రి రెండు సార్లు ఎర్త్ కిక్ వచ్చిందన్నారు. అది ఎందుకో కొందరికే తెలుసు. పాక్ అణ్వాయుధ దేశం కావడానికి కారణమే చైనా…అమెరికా. వాళ్ళు ఆదేశంలో మొహరించి…దాచి పెట్టిన న్యూక్లియర్ వెపన్స్…పదార్థాలు గల కాంప్లెక్స్ లు…నేల మాళిగలకు మన బ్రహ్మోస్…ఆకాశ్ బొక్కలు పెట్టాయి. అది కాస్తా అక్కడ అణు ఇంధన లీకేజీకి కారణమయింది. అమెరికా, చైనా నిపుణులు కిరాణా హిల్స్ లో వాటిని డిఫ్యూజ్ చేసే పనిలోనే ఉన్నారు. దాంతో దాడులు నిలిపారు మనవాళ్ళు. ఎందుకంటే అణు లీకేజీ పెరిగితే లక్షల మంది పోతారు.ప్రపంచం ముంగిట మనం దోషులమవుతాం. గతంలోలా రోజుల తరబడి యుద్ధం చేయలేదన్న అసంతృప్తి నాబోటివాళ్ళకు కూడా వచ్చింది. కానీ మన సామర్థ్యం ప్రకారం మనోళ్ళు ఓ నాలుగైదు గంటలు చేస్తే చాలు…పాక్ దేశం ప్రపంచ పటంలో ఉండదు.

ఇప్పుడు ప్రపంచమే మన యుద్ధతంత్రానికి ఆశ్చర్య పడుతోంది. అమెరికా… చైనా ఇండియాను పాక్ ద్వారా దెబ్బతీయించి ఆనందపడదామనుకున్న ఆశలు నీరుగారిపోయి…వెంటనే చర్చలు కూడా జరుపుకున్నారు. పుతిన్ ని కూడా ప్రెజర్ చేయాలని చూస్తున్నారు. ఇకపై భారత్ మరింత అప్రమత్తతగా యుద్ధ సన్నాహాలు చేస్తుంది. లేజర్ ఆయుధాలతో స్టార్ వార్ కీ రఢీ అవుతుంది. ఇండియా గత పదేళ్ళుగా పాక్ ని కాకుండా చైనాను దృష్టిలో పెట్టుకునే యుద్ధ తంత్రం తయారు చేసుకుంటోంది. అది చైనాకూ తెలుసు. ఇక ట్రంప్ ప్రకటనలంటారా! తిరునాళ్ళలో రోడ్డుపై బూరలు , బుడగలు అమ్ముకునే వాడికీ వీడికీ తేడాలేదు. వాడి మాటలను వాళ్ళ దేశ జనమే నమ్మడం లేదు. పట్టూ పట్టూ వఛ్చినపుడు ఏమీ లేని స్థితిలోనే భారత్ అమెరికా మాట వినలేదు. మొన్న S400 రష్యా నుండి కొనొద్దనీ….ఆ డీల్ జరిపితే ఆంక్షలు విధిస్తామనీ…అమెరికా శతవిధాల ఆపడానికి ప్రయత్నించింది. అయినా కొనుక్కున్నాం. మన బ్రహ్మోస్…ఆకాశ్ లు పాక్ లో దీపావళి జరిపితే….వాళ్ళు పంపిన టర్కీ…చైనా పీసులను ఈ S400 తోపాటు…మన సొంత తయారీ యాంటీ డ్రోన్ టెక్నాలజీ సిస్టం కలిసి వచ్చిన వాటిని వచ్చినట్టే గాల్లోనే పేల్చి పడేశాయి.

పనిలో పని అమెరికా తయారీ f16 విమాలు రెండూ…చైనా విమానాలు కొన్నింటినీ ఖతం చేసారు మనోళ్ళు. చైనా…అమెరికా ఆయుధ వ్యాపారానికి మన 24 నిమషాల దాడి లక్షల కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. వాళ్ళ ఆయుధాలపై అనేక అనుమానాలు రేకెత్తాయి. ఇండియా ఆయుధ వ్యాపార మార్కెట్ పెరగనుంది. మన ఆయుధ కంపెనీల షేర్లు ఈ రెండు రోజుల్లోనే 15-20% పెరగడమే ఇందుకు తార్కాణం. మోడీ అమెరికా కు…ట్రంప్ కీ టైం చూసి వాత పెడతాడు. పుతిన్ త్వరలో భారత్ లో పర్యటించబోతున్నాడు. చైనా వత్తిడిని తోసిరాజని మరీ వస్తున్నాడు. అక్కడ ఉక్రెయిన్ తౌ యుద్ధంలో ఆర్థిక ఇబ్బందులో రష్యా సతమతం అవుతోంది. అందుకే అనేక కీలక ఆయుధాలను ఇండియాకు అమ్మబోతున్నాడు. అందులో S500, కొన్ని అధునాతన యుద్ధ విమానాలు అందులో బాగమే.. ఇండియాతో ఏ వ్యవహారం అయినా ఏదేశానికైనా ఇంతకు ముందులా మాత్రం ఉండదు. రాఫెల్ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే…ఇటీవల జరిగిన మరిన్ని రాఫెల్స్ కొనుగోలుకు ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని కూడా సమీక్షిస్తారు. ఆపరేషన్ సింధూర్ ఏమీ ముగియలేదు. కాశ్మీర్ లోగానీ భారత్ లో గానీ చిన్న టపాసు పేలితే చాలు…ఇకపై దీపావళీ…ఎప్పుడంటే అప్పుడు చేస్తూనే ఉంటారు. జైహింద్….

మన  సామర్ధ్యానికి  మచ్చుతునక ‘బ్రహ్మోస్’

మన సామర్ధ్యానికి మచ్చుతునక ‘బ్రహ్మోస్’

భారత్ ను ప్రపంచంలో అగ్రగామి శక్తిగా చూపెట్టిన స్వదేశీ క్షిపణి

”దేశ ప్రజలకు సురక్షితమైన తాగునీరు, అందరికీ కడుపునిండా తిండి పెట్టడానికే తికానలేని దాయాది దేశం పాకిస్తాన్. మనపై అణుయుద్ధం చేస్తానంటూ ప్రగల్బాలు పలుకుతోంది. తీవ్రవాదులతో అరాచకాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కి మనచేతిలో చావు దెబ్బ తిన్నా ఇంకా బుద్ధి వచ్చినట్లు కనిపించడంలేదు . .”

పాకిస్థాన్ భారత్ పై అణు ఆయుధాల ప్రయోగిస్తానని పరోక్షంగా బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ అణు నియంత్రణా కేంద్రం పక్కనే భారత్ సూపర్ సోనిక్ మిస్సైల్ “బ్రహ్మోస్” ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ పరిణామాన్ని పాకిస్థాన్ బ్లాక్ మెయిల్ కు భారత్ మౌన సమాధానంగానే దేశదేశాల దౌత్య వర్గాలు భావిస్తాయి. అణు ఆయుధాలు ఉన్న రెండు దేశాలు నేరుగా తలపడటం ప్రపంచంలో ఇదేమొదటి సారి.

భారత్ ఆయుధం “బ్రహ్మోస్” టార్గెట్ ప్రకారం పాక్ అణు నియంత్రణ కేంద్రం వరకూ వెళ్ళిన పరిమాణం పట్ల దేశదేశాల అధినేతలు నోరు మెదపకపోయినా మన సామర్ధ్యాన్ని అర్ధం చేసుకున్నారు.

భారత్ సాధనా సంపత్తిపై ప్రపంచం ఏమీ మాట్లాడకముందే అమెరికా ట్రంపు భారత్ అడగని “పెద్దన్న” బాధ్యతను నెత్తిన వేసుకుని “నా మాట విని యుద్దం ఆపేసిన భారత్ పాకిస్థాన్ లకు అభినందనలు” అని ట్విట్టర్ లో “అంతా నా వల్లే” అనే బిల్డప్ ఇచ్చారని అర్థమౌతుంది.

ఆపరేషన్ సిందూర్ లో కీలకమైన “బ్రహ్మోస్” ఆయుధం గురించి ఇక్కడ తెలుసుకుందాం!

బ్రహ్మోస్: భారత రక్షణ శక్తికి ప్రతీక

భారత్, రష్యా సంయుక్త సహకారంతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, ఆధునిక యుద్ధ సాంకేతికతలో ఒక అద్భుత విజయంగా నిలుస్తోంది. భారత డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రష్యా NPO మషినోస్ట్రోయెనియా సంస్థల సమన్వయంతో రూపొందిన బ్రహ్మోస్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియు శక్తివంతమైన క్షిపణులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే ఇపుడు వరల్డ్ వైడ్ మన రక్షణ సామర్ధాన్ని చాటి చెపుతోంది .

మాక్ 2.8 నుండి మాక్ 3 వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్, శత్రు రక్షణ వ్యవస్థలను అధిగమించగల సామర్థ్యంతో అసమానమైన శక్తిని ప్రదర్శిస్తుంది. 290 కిలోమీటర్ల నుండి 800 కిలోమీటర్ల వరకు విస్తరించిన దాని పరిధి, భూమి, సముద్రం, గాలి, జలాంతర్గాముల నుండి ప్రయోగించగల బహుముఖతతో, దీనిని యుద్ధ రంగంలో అప్రతిహత ఆయుధంగా నిలిపింది. అధునాతన గైడెన్స్ సిస్టమ్ తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ దీని స్టీల్త్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, అయితే “ఫైర్ అండ్ ఫర్గెట్” సూత్రం దాని ఖచ్చితత్వాన్ని 99.99% స్థాయికి పెంచుతుంది.

భారత్ రక్షణ సామర్ధ్యానికి ఆనవాలు

బ్రహ్మోస్ యొక్క వివిధ వెర్షన్‌లు—బ్రహ్మోస్-I, ఎక్స్‌టెండెడ్ రేంజ్ (ER), బ్రహ్మోస్-NG, హైపర్‌సోనిక్ బ్రహ్మోస్-II—భవిష్యత్ యుద్ధ అవసరాలకు అనుగుణంగా దాని సాంకేతిక పరిణామాన్ని సూచిస్తున్నాయి. మాక్ 8 వేగంతో 1,500 కిలోమీటర్ల పరిధిని లక్ష్యంగా చేసుకున్న బ్రహ్మోస్-II, హైపర్‌సోనిక్ యుగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపనుంది.

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్థాన్‌లోని లక్ష్యాలపై వినియోగం బ్రహ్మోస్ యుద్ధ సామర్థ్యాన్ని స్పష్టం చేసింది. అంతేకాక, ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల నుండి వస్తున్న ఆర్డర్లు, బ్రహ్మోస్ ప్రపంచ గుర్తింపును హైలైట్ చేస్తున్నాయి.

బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదు—ఇది భారతదేశ రక్షణ సామర్థ్యం, సాంకేతిక ఆవిష్కరణ, మరియు అంతర్జాతీయ సహకారం యొక్క సమ్మేళనం. దీని ఉనికి శత్రువులకు హెచ్చరికగా, మిత్రదేశాలకు భరోసాగా నిలుస్తోంది. బ్రహ్మోస్ ద్వారా, భారతదేశం తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి గట్టిగా చెప్తోంది.

లక్ష్యాన్ని చూశారు…గురిచూసి కొట్టారు….శతృవు చేతులు ఎత్తేశాక… ఉగ్రవాదిని లేపెయ్యడమే…నువ్వు మా జాగా ఖాళీ చేసిపోవడమే… ఇక మాటల్లేవ్…మాట్లాడుకోవడాల్లేవ్…అని దిగ్బంధనం చేశారు. చుట్టూ బిగబట్టి శతృవుని కాళ్ళ బేరానికి రప్పించుకున్న చాణక్య నీతి చూపించారు. యుద్ధతంత్రంతో

భారత్ ను అజేయ శక్తిగా ప్రపంచం ముందు నిలబెట్టారు

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతీయతకు జయహో జయహో జయహో. భారత్ మాతాకీ జై . ..

దద్దరిల్లిన సరిహద్దు- మూడోరోజు 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల దాడి- భారత్ స్ట్రాంగ్ కౌంటర్! 

దద్దరిల్లిన సరిహద్దు- మూడోరోజు 26 ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల దాడి- భారత్ స్ట్రాంగ్ కౌంటర్! 

 ఆపరేషన్ సిందూర్ పై శనివారం ఉదయం ఆర్మీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను మీడియా ముందు పెట్టింది. ఈ సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో కల్నల్‌ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ..  పాక్ సైన్యం భారత సరిహద్దుల వైపు కదులుతోందని చెప్పారు.

ఆపరేషన్‌ సిందూర్ తర్వాత భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టిన పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్ నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ 26 ప్రాంతాల్లో డ్రోన్‌ దాడులకు యత్నించగా భారత్‌ సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్‌ సహా పలు విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై డ్రోన్లను ప్రయోగించగా, భారత్‌ వాటిని నిర్వీర్యం చేసింది. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్, అవంతీపొరా ఎయిర్‌బేస్‌ సురక్షితంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. డ్రోన్‌ దాడుల తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో బ్లాక్‌అవుట్‌ ప్రకటించారు. సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలోనే ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్థాన్‌ కావాలనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌పై పాక్‌ హైస్పీడ్‌ మిస్సైల్స్‌తో దాడి చేసిందని చెప్పారు. పాక్‌లోని గురుద్వారాలపై భారత్‌ దాడి చేసిందనేది అవాస్తవమన్నారు. అఫ్గానిస్థాన్‌పైన భారత్‌ మిస్సైల్‌ ప్రయోగించిందనేది వాస్తవం కాదని విక్రమ్‌ మిస్రీ స్పష్టం చేశారు. మరోవైపు భారత S-400 వ్యవస్థను ధ్వంసం చేసినట్టు పాకిస్థాన్ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. సూరత్‌గఢ్ సిర్సాలోని వైమానిక స్థావరాలను నాశనం చేసినట్టు పాక్ చేసిన ప్రచారంలో నిజం లేదన్నారు. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు వాదనలను తోసిపుచ్చారు.

ఆగని పాక్​ కవ్వింపు చర్యలు
మరోవైపు సరిహద్దుల్లో వరుసగా మూడోరోజూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్‌ సైన్యం విచ్చలవిడి కాల్పులు కొనసాగించింది. సాంబా సెక్టార్‌లో కాల్పులు, మోర్టార్ దాడులతో తెగబడింది. పూంఛ్‌ సెక్టార్‌లోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని సైనిక వర్గాలు తెలిపాయి. పాక్‌ దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకొని బారాముల్లా, కుప్వారా, బందిపొరా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి బంకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సింధూర్.. గురితప్పని దాడి … 25 నిమిషాల్లోనే

సింధూర్.. గురితప్పని దాడి … 25 నిమిషాల్లోనే

సిందూర్ – గురితప్పని దాడి 25 నిమిషాల్లో ఆపరేషన్ సక్సెస్

భారత సాయుధ దళాలు పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే సూటిగా “ఆపరేషన్ సింధూర్” పేరుతో సైనిక చర్యను విజయవంతంగా నిర్వహించాయి.

ఇది ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పని సర్జికల్ స్ట్రైక్ మాత్రమే అని భారత్ స్పష్టం చేసింది. ఇది యుద్ధమే అని పాకిస్థాన్ ఆరోపించింది.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22, 2025న జరిగిన భీకర ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఈ చర్యతీసుకుంది. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించారు, ఇది దేశవ్యాప్త ఆగ్రహానికి కారణమైంది. లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మహ్మద్ వంటి పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు ఈ దాడికి తెగబడ్డాయని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి.

నేపథ్యం

జమ్మూ కాశ్మీర్‌లో దశాబ్దాలుగా ఉగ్రవాదం ఒక ప్రధాన సమస్యగా ఉంది. పాకిస్థాన్ నుండి నిధులు, ఆయుధాలు, శిక్షణ పొందిన ఉగ్రవాద సంస్థలు భారత్‌పై దాడులు చేస్తున్నాయని భారత్ ఎప్పటి నుండో అంతర్జాతీయ సమాజాల వద్ద ఆరోపిస్తోంది. 2016లో “ఉరి” దాడి, 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్ వరుసగా సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్‌లతో స్పందించింది. అయినప్పటికీ, పహల్గామ్ దాడి దేశంలో ఉగ్రవాద బెడదను మరింత తీవ్రతరం చేసింది. ఈ దాడిలో పర్యాటకులను, ముఖ్యంగా హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరిగాయి, ఇది భారత ప్రజల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ నేపథ్యంలో, ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడం, భవిష్యత్ దాడులను నిరోధించడం కోసం ఆపరేషన్ సింధూర్ ను ప్లాన్ చేశారు.

సిందూర్ వివరాలు

మే 7 తెల్లవారుజామున 1:05 నుండి 1:44 గంటల మధ్య 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం, వాయుసేన, నావికాదళం సమన్వయంతో పనిచేశాయి. పాకిస్థాన్‌లోని బహవల్పూర్, మురిద్కే, సియాల్కోట్ మరియు PoKలోని కొట్లీ, ముజఫరాబాద్‌లలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా SCALP క్రూయిజ్ మిసైల్స్, హామర్ స్మార్ట్ బాంబ్స్, కామికేజ్ డ్రోన్స్, లోయిటరింగ్ మ్యూనిషన్స్ వంటి అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించారు. ఈ ఆయుధాలకు దూరం నుండి సూటిగా లక్ష్యాలను మాత్రమే నాశనం చేసే సామర్థ్యం వుంది. ఆధునిక టెక్నాలజీలు జోడించిన ఈ ఆయుధాలు భారత సైనికులకు రిస్క్‌ను తగ్గించాయి.

ఈ చర్యలో 70 మంది ఉగ్రవాదులు హతమై, 60 మంది గాయపడినట్లు భారత్ డిఫెన్స్ అధికార వర్గాలు ప్రకటించాయి. “ఈ ఆపరేషన్‌ను “కేంద్రీకృత, సంయమన, అనవసర ఉద్రిక్తతలు లేని” చర్యగా భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌర నష్టాన్ని నివారించేందుకు భారత్ ఈ దాడిలో పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు, ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఉగ్రవాద కేంద్రాలను మాత్రమే ఎంచుకున్నారు.

సిందూర్ ఎందుకు

ఈ ఆపరేషన్‌కు “సింధూర్” అని నామకరణం చేయడం లో భావోద్వేగ / ఎమోషనల్ రీజన్ ఉంది. పహల్గామ్ దాడిలో మరణించిన పురుషుల భార్యలను సూచిస్తూ, హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే కుంకుమను సంకేతంగా ఈ పేరు ఎంచుకున్నారని అర్థమౌతుంది. “సిందూర” అనే పేరే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత యోధుల సంకల్పాన్ని, బాధిత కుటుంబాల పట్ల సానుభూతిని ప్రతిబింబిస్తుంది.

పాకిస్థాన్ స్పందన

పాకిస్థాన్ ఈ దాడులను “యుద్ధ చర్య”గా అభివర్ణించి, లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి ఆర్టిలరీ దాడులతో స్పందించింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించినట్లు పాకిస్థాన్ ప్రకటించింది.

అంతర్జాతీయ ప్రతిస్పందన

భారత్ ఈ చర్యల గురించి అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా వంటి దేశాలకు ముందుగా సమాచారం అందించింది. చైనా ఈ దాడులను “విచారకరం”గా పేర్కొంటూ ఉద్రిక్తతలు తగ్గించాలని కోరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్థాన్‌లు శాంతియుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

భారత్‌లో…

సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ జారీ చేయగా, విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌లు నిర్వహించారు, ఇది భవిష్యత్ ఆకస్మిక పరిస్థితులకు సన్నద్ధతను సూచిస్తుంది.

ఆపరేషన్ సింధూర్ భారత్ యొక్క ఉగ్రవాద వ్యతిరేక సంకల్పాన్ని, అత్యాధునిక సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. “ఈ చర్య ద్వారా ఉగ్రవాద సంస్థల సామర్థ్యం గణనీయంగా దెబ్బతిన్నది. భవిష్యత్తులో ఇలాంటి దాడులను నిరోధించేందుకు భారత్ సిద్ధంగా ఉంది,” అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తోంది. ఈ ఆపరేషన్ భారత సైన్యం యొక్క ఖచ్చితత్వం, సమన్వయం, దేశ భద్రత పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

మాక్ డ్రిల్ అంటే ఏమిటి ?  ఎలా చేస్తారు?

మాక్ డ్రిల్ అంటే ఏమిటి ? ఎలా చేస్తారు?

2025 మే 7న భారత్‌లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే . ఈ డ్రిల్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, 2025 మేలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత, పౌరుల భద్రతను నిర్ధారించడానికి, అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధతను పెంచడానికి చేపడతారు.

ఎలా జరుగుతుంది?

భారత్‌లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ యుద్ధం లేదా వైమానిక దాడుల వంటి అత్యవసర పరిస్థితులను అనుకరించి పౌరులు, సైనిక బలగాలు, పోలీసులు, అగ్నిమాపక దళాలు, స్థానిక పరిపాలన సమన్వయంతో చేస్తారు. ఈ డ్రిల్స్‌లో సాధారణంగా ఈ క్రింది అంశాలు ఉంటాయి:

1. వైమానిక దాడి సైరన్‌లు:

• శత్రు వైమానిక దాడి జరిగినట్లు సూచించే సైరన్‌లను మోగిస్తారు. ఈ సైరన్‌లు వినిపించగానే పౌరులు సురక్షిత ప్రాంతాలకు (బాంబు షెల్టర్లు లేదా నిర్దేశిత భవనాలు) తరలివెళ్లేలా శిక్షణ ఇస్తారు.

• ఉదాహరణకు, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ సైరన్‌లను పరీక్షిస్తారు.

2. తరలింపు ప్రణాళికలు:

• ప్రజలను రద్దీ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను అభ్యసిస్తారు. ఇందుకోసం స్థానిక పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు (NDRF), సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు సమన్వయం చేస్తారు.

• కశ్మీర్, గుజరాత్, హరియాణా, అస్సాం వంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఈ తరలింపు ప్రక్రియలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.

3. బ్లాక్‌అవుట్ చర్యలు:

• రాత్రి సమయంలో శత్రు విమానాలు గుర్తించకుండా ఉండేందుకు లైట్లను ఆర్పడం లేదా కిటికీలను మూసివేయడం వంటి చర్యలను అభ్యసిస్తారు.

• ఇది హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో అమలు చేస్తారు.

4. ప్రథమ చికిత్స, వైద్య సహాయం:

• గాయపడిన వారికి తక్షణ సహాయం అందించేందుకు ప్రథమ చికిత్స శిక్షణ ఇస్తారు. ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అత్యవసర సేవలకు సిద్ధంగా ఉంటారు.

• మాక్ డ్రిల్‌లో గాయాలను అనుకరించి, వైద్య బృందాలు ఎలా స్పందించాలో పరీక్షిస్తారు.

5. ముఖ్యమైన స్థాపనల రక్షణ:

• విద్యుత్ కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రక్షణ సంస్థలు వంటి కీలక స్థాపనల రక్షణకు సంబంధించిన ఏర్పాట్లను పరీక్షిస్తారు.

• ఉదాహరణకు, విశాఖపట్నంలోని నౌకాదళ కేంద్రాలు లేదా హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన సంస్థల వద్ద ఈ చర్యలు దృష్టి సారిస్తారు.

6. పౌరులకు శిక్షణ, అవగాహన:

• పౌరులకు యుద్ధ సమయంలో ఎలా స్పందించాలి, ఎక్కడ ఆశ్రయం పొందాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తారు.

• స్థానిక స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమాలను చేస్తారు.

7. సమాచార ప్రసారం:

• రేడియో, టెలివిజన్, సోషల్ మీడియా, SMS అలర్ట్‌ల ద్వారా ప్రజలకు సమాచారం, సూచనలను అందిస్తారు.

• ఉదాహరణకు, ఢిల్లీలో ఈ డ్రిల్స్ సమయంలో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వం సోషల్ మీడియాను ఉపయోగిస్తుంది.

ఎక్కడ జరుగుతాయి?

• దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం, దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్స్ చేస్తారు.

• తెలుగు రాష్ట్రాలు: హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ డ్రిల్స్ జరుగుతాయి.

• సరిహద్దు రాష్ట్రాలు: కశ్మీర్, గుజరాత్, హరియాణా, అస్సాం వంటి రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో డ్రిల్స్ చేస్తారు, ఎందుకంటే ఇవి యుద్ధ సమయంలో లక్ష్యంగా మారే అవకాశం ఉంది.

• పెద్ద నగరాలు: ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఈ డ్రిల్స్ జరుగుతాయి.

నిర్వహణ విధానం

• సమన్వయం: ఈ డ్రిల్స్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలన, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA), సైన్యం, పోలీసులు, సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు భాగస్వామ్యం వహిస్తారు.

• స్వచ్ఛంద సంస్థలు: బీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ డ్రిల్స్‌లో పాల్గొనమని పిలుపునిచ్చారు.

• పర్యవేక్షణ: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర సివిల్ డిఫెన్స్ విభాగాలు ఈ డ్రిల్స్‌ను పర్యవేక్షిస్తాయి.

ప్రజల పాత్ర

• ప్రజలు సైరన్‌లు వినగానే నిర్దేశిత సురక్షిత ప్రాంతాలకు వెళతారు.

• బ్లాక్‌అవుట్ సూచనలను పాటిస్తారు, భయపడకుండా శిక్షణలో పాల్గొంటారు.

• స్థానిక అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని శ్రద్ధగా అనుసరిస్తారు.

2025 మే 6 నాటికి, రాష్ట్రాలు ఈ డ్రిల్స్ కోసం సన్నాహాలు చేస్తున్నాయి. ఢిల్లీలో, ఈ డ్రిల్స్‌కు ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని మంత్రి అశిష్ సూద్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో స్థానిక అధికారులు సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు.

భారత్‌లో 2025 మే 7న జరగనున్న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ యుద్ధవాతావరణంలో పౌరుల భద్రతను నిర్ధారించడానికి, అత్యవసర సన్నద్ధతను పెంచడానికి కీలకమైనవి. ఈ డ్రిల్స్ సైరన్‌లు, తరలింపు, బ్లాక్‌అవుట్ చర్యలు, ప్రథమ చికిత్స, ముఖ్యమైన స్థాపనల రక్షణపై దృష్టి సారిస్తాయి.

( ఈ ఆర్టికల్ లో సమాచారం సీనియర్ జర్నలిస్ట్ నవీన్ పెద్దాడ గారి FB వాల్ నుంచి తీసుకోవడమైనది)