‘కారు’ చౌక బేరం.. ఢిల్లీలో…

‘కారు’ చౌక బేరం.. ఢిల్లీలో…

”పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలు , 15 ఏళ్లు పైబడిన పెట్రోల్‌ వాహనాలకు బంకుల్లో ఇంధనం నిషేధం.” అంటూ ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయం తో . .. గడువు తీరిన కార్లను నామమాత్రపు ధరలకు అమ్మకానికి పెడుతున్నారు.

దేశ రాజధాని దిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన వాహన పాలసీ ఎఫెక్ట్‌తో ఎంతోమంది ఇప్పటికే కార్లను కారుచౌకగా అమ్మేశారు.

దిల్లీ వాస్తవ్యుడు నితిన్ గోయల్ రూ.65 లక్షల జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను రూ.8 లక్షలకే అమ్మేశారు. రూ.40 లక్షల మెర్సిడెజ్ సీ క్లాస్ 220 సీడీఐ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కారును రూ.4 లక్షలకే అమ్మారు. దిల్లీకే చెందిన రితేశ్ గందోత్ర రూ.55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీ కారును నామమాత్రపు రేటుకు విక్రయించారు. వాహన పాలసీపై దిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ సర్కారు పునరాలోచనలో పడింది. త్వరలోనే కొత్త వాహన పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తును మొదలుపెట్టింది. ఈ పనేదో కొన్ని నెలల ముందే మొదలుపెట్టి ఉంటే తాము కార్లను చౌకగా అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని బాధిత వాహనదారులు వాపోతున్నారు.

ఎన్‌జీటీ ఆదేశాలు అమల్లోకి- వాహనదారులకు చుక్కలు
దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కీలక ఆదేశాలిచ్చింది. పదేళ్లకుపైగా వినియోగించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకుపైగా వినియోగించిన పెట్రోలు వాహనాలను దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోకి అనుమతించరాదని నిర్దేశించింది. ఆ ఆదేశాలను తదుపరిగా సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో పెట్రోల్, డీజిల్ వాహనదారులకు డెడ్‌లైన్ ఫీవర్ పట్టుకుంది. ఎన్‌జీటీ ఆదేశాల అమలులో భాగంగానే జులై 1 నుంచి గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం పోయద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంధనమే పోయనప్పుడు కార్లను మాత్రం ఏం చేసుకుంటామని చాలామంది వాహనదారులు భావించారు. వారంతా తమ వాహనాలను తక్కువ రేట్లకే దిల్లీ అవతలి వ్యక్తులకు అమ్ముకున్నారు. అయితే దీనిపై వ్యతికేత వ్యక్తం కావడంతో సర్కారు మళ్లీ పునరాలోచనలో పడింది.

వీలైనంత త్వరగా ఒక పరిష్కారం చూపిస్తాం : దిల్లీ సర్కారు
కాలం చెల్లిన పెట్రోలు, డీజిల్ వాహనాల్లో ఇంధనం పోయకూడదనే నిర్ణయంపై దిల్లీ సర్కార్‌ వెనుకడుగు వేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు వీలైనంత త్వరగా ఒక పరిష్కారాన్ని సాధించే దిశగా కసరత్తు చేస్తున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం రోజున ఈ అంశంపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)కి దిల్లీ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాలలో గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరింది.

బ్యాన్‌తో ఇబ్బందిపడుతున్న జనం
గడువు తీరిన వాహనాలకు ఇంధనం కొట్టకుండా డిల్హే సర్కార్ తీసుకువచ్చిన పాలసీతో ఢిల్లీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా స్పందించారు. గడువు తీరిన పెట్రోలు, డీజిల్ వాహనాలపై బ్యాన్‌ విధించడం సరికాదని, దాని అమలులో సాంకేతిక, నిర్వహణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ బ్యాన్‌తో ప్రజలు సంతోషంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కారు ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ఆయా వాహనాలపై బ్యాన్‌ను వెంటనే అమల్లోకి తేవాలనేది అపరిపక్వ నిర్ణయమని మంజీందర్ సింగ్ సిర్సా చెప్పారు. కొంత గడువు ఇచ్చిన తర్వాత బ్యాన్ చేయడం కరెక్ట్ అంటూ పలు వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది .

లిక్కర్ స్కాం లో జగన్ కి బీజేపీ  సహకారం

లిక్కర్ స్కాం లో జగన్ కి బీజేపీ సహకారం

జగన్ మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు కాంగ్రెస్ ఏపీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ సంచలన పోస్ట్

తెలంగాణలో కవిత , ఢిల్లీలో సీఎం , డిప్ట్యూటీ సీఎంల అరెస్ట్ . .. జగన్ ని వదిలేసినట్లు ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం లో వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఫోకస్ పెరిగింది. కూటమి సర్కార్ ఇప్పటికే మద్యం కుంభకోణంపై పలువురు కీలక నేతలపై కేసులు పెట్టడం , కొందరి అరెస్ట్ జరిగాయి. ఇప్పటి వరకు అరెస్టయిన నేతలు , అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా జగన్ పై కూడా మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది . అయితే కేంద్రం పెద్దల గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో జగన్ వరకు వచ్చి . .. ఈ కేసు ఆగింది.

మాణికం ఠాకూర్ సంచలన పోస్ట్

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం – జగన్‌ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ పోస్ట్

జగన్‌ రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం చేశారని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాకూర్ ఆరోపించారు . వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణంపై మాణికం ఠాగూర్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. జగన్ మద్యం కుంభకోణం శాస్త్రీయ అవినీతి మోడల్‌ అని ఎద్దేవా చేశారు. జగన్‌ మద్యం కుంభకోణం, విదేశాల్లో పెట్టుబడులు, కుట్ర కోణాలు అంటూ పలు ఆరోపణలు చేశారు. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను జగన్‌ క్యాష్‌ క్యారియర్లుగా వాడుకున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడేపల్లి, అమరావతిలోని ఫ్లాట్లలో కరెన్సీని బాక్సుల్లో దాచారని మద్యం డబ్బుతో విదేశాల్లో లిక్కర్‌ ఫ్యాక్టరీలు నెలకొల్పారని అన్నారు. ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు దుబాయ్, టాంజానియా, దక్షిణాఫ్రికాలో భేటీ అయ్యేవారని తెలిపారు. దీనిపై కేంద్రం మౌనంగా ఉండి ఈ మద్యం కుంభకోణానికి సహకరించిందని మాణికం ఠాకూర్ విమర్శించారు . కేంద్ర బీజేపీ పెద్దల సహకారం లేకపోతె జగన్ ఎప్పుడో అరెస్టయ్యేవారని పేర్కొన్నారు .

యోగాకు హద్దుల్లేవు :   ప్రధాని మోదీ

యోగాకు హద్దుల్లేవు : ప్రధాని మోదీ

యోగాంధ్రకు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోదీ – అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

” యోగాకు మతం లేదు . కులంలేదు . అందరు హ్యాపీగా చేయొచ్చు . . గత పదేళ్లలో కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపింది . గ్రామగ్రామాల్లో యువకులు, మహిళలు , చిన్నారులు యోగాను అనుసరిస్తున్నారు.యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని భారత్ నిరూపించింది . యోగాదినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయి . . 175 దేశాల్లో యోగా చేయడం అసాధారణ విషయం”   ” అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాక్షించారు . విశాఖలో యోగాంధ్ర లో ముఖ్య అతిధిగా పాలొన్న ప్రధాని ఈ సందర్బంగా యోగాసనాలు వేశారు . ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అని, చంద్రబాబు, పవన్‌ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారని కొనియాడారు.

నూనె తగ్గంపు ఛాలెంజ్ “ యోగాడే సందర్బంగా వంటల్లో 10 శాతం నూనె తగ్గించి వాడటం ప్రారంభిద్దాం . .. ఇది ఛాలెంజ్గా తీసుకుందాం . ..అని మోడీ ఇచ్చిన ఛాలెంజ్ ను యోగాంధ్రలో పాల్గొన్న వారంతా కరతాళ ధ్వనులతో స్వీకరించారు .

వ్యక్తిగత క్రమశిక్షణ  ప్రకృతిలో మనిషి భాగస్వామి అని, యోగాతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందన్న , యోగా ద్వారా నేను అన్న భావన మనంగా మారుతుందని మోడీ స్పష్టం చేసారు. క్రమం తప్పకుండ యోగ చేసే వారిలో వ్యక్తిగత క్రమశిక్షణ అలవాడుతుందన్నారు. ఇది వ్యక్తి అనూహ్య విజయాలకు దారిదీపం చూపుతుందని పేర్కొన్నారు .

భారతీయ సంస్కృతి అందరి క్షేమం కాంక్షిస్తుందన్న ప్రధాని, యోగాపై దేశంలోని అనేక వైద్యసంస్థలు పరిశోధన చేస్తున్నాయని తెలిపారు. యోగాను అనేక చికిత్సా విధానాల్లో భాగం చేస్తున్నాయని, గుండె, నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతోందని చెప్పారు. మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతుందన్న ప్రధాని, అంతర్జాతీయ చికిత్సా కేంద్రంగా భారత్‌ మారుతోందన్నారు.

ప్రధాని మోడీ చొరవతో యోగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్ గా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు . యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని చెప్పారు . – యోగా దినోత్సవాన్ని 130 దేశాల్లో నిర్వహించడం మోడీ వల్లే సాధ్యమైందన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ప్రధాని మోడీని అందరూ ప్రశంసించాలన్నారు .

గిన్నీస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం..

 విశాఖపట్నం కేంద్రంగా యోగాంధ్ర కనీ వినీ ఎరగని స్థాయిలో విజయం సాధించింది . ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది . విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌ సందడిగా మారింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేసి . .. రికార్డ్ క్రియేట్ చేశారు .

విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో 25వేల మంది గిరిజన విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సాధనలో భాగంగా ఏయూ మైదానంలో 25వేల మంది గిరిజన విద్యార్థులతో 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేయించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ విద్యార్థులను సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి లోకేశ్‌ అభినందించారు.

సిందూరం.. మొక్క నాటిన ప్రధాని మోదీ

సిందూరం.. మొక్క నాటిన ప్రధాని మోదీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ సింధూరం మొక్కను నాటారు . ‘ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారం ద్వారా 700 కి.మీ మేర విస్తరించి ఉన్న ఆరావళి పర్వతశ్రేణులను హరితభరితం చేయాలనేది మా లక్ష్యం. ప్రజలతో మొక్కలు నాటించి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును బలోపేతం చేయడమే మా సంకల్పం. ఆరావళి పర్వతశ్రేణులు ఈ భూమిపైనే అత్యంత ప్రాచీనమైనవి. ఇవి గుజరాత్, రాజస్థాన్, హరియాణా, దిల్లీలలో విస్తరించి ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఈ పర్వతశ్రేణులు సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. పర్యావరణపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఆయా సవాళ్లను అధిగమించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆరావళి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంచేందుకు మా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎక్కడికక్కడ స్థానిక అధికార యంత్రాంగాలతో కలిసి పనిచేయబోతున్నాం. జల వ్యవస్థల నిర్వహణను మెరుగుపర్చడం, ఇసుక తుఫానులకు నిరోధించడం, థార్ ఎడారి తూర్పు వైపుగా విస్తరించకుండా నిలువరించడం వంటివన్నీ చేయబోతున్నాం’’ అని పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు .

‘ఆపరేషన్ సిందూర్​’ను గుర్తు చేస్తూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేళ సిందూరం మొక్కను నాటారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. గురువారం తన అధికారిక నివాసానికి సమీపంలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్‌లో మొక్క నాటి ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలోని ప్రతీ ఒక్కరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడి, పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పేరు ‘ఆపరేషన్ సిందూర్’. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని మోదీ సిందూరం మొక్కను నాటడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రత్యేకంగా హాజరయ్యారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, దిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కూడా పాల్గొన్నారు.

కేంద్ర పనులలో రాష్ట్ర వాటా 50 శాతం… మోదీ ఓకే చెపుతారా ?

కేంద్ర పనులలో రాష్ట్ర వాటా 50 శాతం… మోదీ ఓకే చెపుతారా ?

నీతి ఆయోగ్ సమావేశంలో తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ పై వాడి – వేడి చర్చ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటాను 50 శాతానికి పెంచాలని, ప్రత్యేక పట్టణ పరివర్తన మిషన్‌ను డిమాండ్ చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేసారు. అయితే ప్రధాని మోడీ ఈ డిమాండ్ పై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి .

మే 24, శనివారం న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ, బలమైన సహకార సమాఖ్య నిర్మాణం యొక్క అవసరాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు సమానమైన ఆర్థిక మద్దతు కోసం పిలుపునిచ్చారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆర్థిక స్వయంప్రతిపత్తి పెంచాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎన్ రంగస్వామి, సిద్ధరామయ్య, పినరయి విజయన్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.


స్టాలిన్ ద్రావిడ నమూనాను ప్రదర్శించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్న సభలో ప్రసంగిస్తూ, 2030 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలనే రాష్ట్ర లక్ష్యాన్ని స్టాలిన్ పునరుద్ఘాటించారు.

“ఈ దార్శనికత రాష్ట్రం ‘ద్రవిడ నమూనా’ అని పిలిచే దానిలో పొందుపరచబడింది – ఇది ‘అందరికీ ప్రతిదీ’ నిర్ధారించడంపై దృష్టి సారించిన విధానం” అని ఆయన అన్నారు.

తమిళనాడు ఇటీవలి ఆర్థిక ప్రగతిని ఆయన గుర్తించారు, వార్షిక వృద్ధి రేటు 8% కంటే ఎక్కువగా ఉంది మరియు గత సంవత్సరం రాష్ట్రం అత్యధిక GSDP వృద్ధి రేటు 9.69% సాధించిందని అన్నారు.

2047 నాటికి భారతదేశం యొక్క దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యం $30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యానికి తమిళనాడు బలంగా దోహదపడుతుందని స్టాలిన్ కట్టుబడి ఉన్నాడు, రాష్ట్రం $4.5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను అందించే దిశగా కృషి చేస్తోందని ఆయన నొక్కి చెప్పారు.

ఆటోమొబైల్స్ నుండి గ్రీన్ హైడ్రోజన్ వరకు రంగాలను విస్తరించి ఉన్న పారిశ్రామిక కేంద్రంగా తమిళనాడును ఆయన ప్రదర్శించారు. మహిళా సాధికారత మరియు పట్టణాభివృద్ధిలో తమిళనాడు మార్గదర్శక ప్రయత్నాలను కూడా ఆయన నొక్కిచెప్పారు:

భారతదేశం అంతటా కర్మాగారాల్లో అత్యధిక శాతం (41%) మహిళా కార్మికులు తమిళనాడులో వర్క్ చేస్తున్నట్లు స్టాలిన్ గుర్తుచేశారు .

రాష్ట్ర పట్టణీకరణను నొక్కి చెబుతూ, పట్టణ మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలలో మెరుగైన పెట్టుబడి కోసం స్టాలిన్ ఒత్తిడి చేశారు. అమృత్ 2.0 పూర్తయ్యే దశలో ఉన్నందున పారిశుధ్యం, చలనశీలత మరియు మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన సమగ్రమైన కొత్త పట్టణ పునరుజ్జీవన పథకం కోసం ఆయన పిలుపునిచ్చారు.


క్లీన్ రివర్స్ మిషన్
“క్లీన్ గంగా” పథకానికి సమానమైన “క్లీన్ రివర్స్” మిషన్‌ను స్టాలిన్ అభ్యర్థించారు, ముఖ్యంగా కావేరి, వైగై మరియు తమిరబరణి వంటి దక్షిణ నదుల కోసం, వాటి సాంస్కృతిక మరియు పర్యావరణ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్నారు.

పాన్-ఇండియా యాక్సెసిబిలిటీ మరియు ప్రాంతీయ భాషలలోకి అనువదించడానికి వీలుగా అటువంటి అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఆంగ్లంలో పేరు పెట్టాలని కూడా ఆయన కోరారు.

ఆర్థిక కేంద్రీకరణ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, తమిళనాడు PM SHRI పథకం కింద ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయకపోవడంతో SSA (సమగ్ర శిక్షా అభియాన్) కింద దాదాపు ₹2,200 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడాన్ని స్టాలిన్ విమర్శించారు. ఇటువంటి ఏకపక్ష పరిస్థితులు విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ మరియు RTE (విద్యా హక్కు) పాఠశాలల్లోని విద్యార్థులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రాలు తమ సరైన ఆర్థిక బకాయిల కోసం వ్యాజ్యం వేయడానికి లేదా నిరసన తెలియజేయడానికి బలవంతం చేయడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు, ఇది సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.

15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 41% పన్ను వికేంద్రీకరణను సిఫార్సు చేసినప్పటికీ, గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర స్థూల పన్ను ఆదాయంలో 33.16% మాత్రమే పంపిణీ చేయబడిందని స్టాలిన్ ఎత్తి చూపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్ర వాటా పెరుగుతోందని, ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మరింత దెబ్బతీస్తుందని కూడా ఆయన గుర్తించారు.

ఈ ద్వంద్వ భారం, తగ్గిన పన్ను వికేంద్రీకరణ మరియు పెరిగిన సరిపోలిక సహకారాల దృష్ట్యా, కేంద్ర పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటాను 50%కి పెంచాలని స్టాలిన్ కోరారు.

చర్చకు వీలు కల్పించినందుకు నీతి ఆయోగ్ కు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు మరియు బహువచన, సంపన్న మరియు బలమైన భారతదేశానికి దోహదపడటానికి తమిళనాడు నిబద్ధతను పునరుద్ఘాటించారు.

“ప్రతి రాష్ట్రం దాని స్వంత గుర్తింపు మరియు స్వయంప్రతిపత్తితో అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచ వేదికపై నిజంగా ఐక్యమైన మరియు శక్తివంతమైన భారతదేశం ఉద్భవిస్తుంది” అని ఆయన అన్నారు.

ఇంకా చదవండి: రక్షణ మరియు అంతరిక్ష రంగాలకు నాయుడు కేంద్రాన్ని బోర్డులోకి తీసుకుంటారు

రాష్ట్రాల ఉప సమూహాలను AP ప్రోత్సహిస్తుంది

జిడిపి పెరుగుదల, జనాభా నిర్వహణ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఉపయోగించడంపై మూడు ఉప సమూహాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సిఫార్సు చేశారు.

కేంద్రంతో కలిసి ఏర్పడిన రాష్ట్రాల ఉప సమూహాలు విక్సిత్ భారత్–2047 దార్శనికతను వేగవంతం చేయడానికి కృషి చేయాలని ఆయన అన్నారు.

“జిడిపి వృద్ధిపై మొదటి ఉప సమూహం పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు మరియు ఉద్యోగ సృష్టిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది, దీనికి పిపిపి ప్రాజెక్టులకు కేంద్ర వబిలిటీ గ్యాప్ ఫండింగ్ మద్దతు ఉంది” అని టిడిపి నాయుడు ఒక మీడియా ప్రకటనలో ఉటంకించింది.

అభివృద్ధిని వేగవంతం చేయాలని ఒత్తిడి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సమావేశం సందర్భంగా స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను కలిశారు.

సింధు నది అందమైన చిత్రం అద్భుతం కదూ…

సింధు నది అందమైన చిత్రం అద్భుతం కదూ…

ఈ ఫోటోలో దృశ్యం కేవలం ఒక నది ప్రవాహం మాత్రమే కాదు, భారతదేశ ఆత్మ యొక్క సజీవ సంగ్రహావలోకనం. ఇది సింధు నది – లడఖ్ యొక్క నిర్జనమైన మరియు కఠినమైన పర్వత శ్రేణుల గుండా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది, కాలపు ఛాతీపై ప్రకాశవంతమైన కుట్టులాగా. సూర్యకిరణాలలో మెరుస్తున్న ఈ ప్రవాహాలు వెండి చారల వలె కనిపిస్తాయి, గోధుమ-ఊదా పర్వతాల మధ్య జీవితాన్ని సూచిస్తాయి.

ఈ ఫోటో చూస్తుంటే ప్రకృతి ఈ దృశ్యాన్ని కుంచెతో కాదు, హృదయంతో సృష్టించినట్లు అనిపిస్తుంది. సింధు నది ప్రతి మలుపులోనూ ప్రవహిస్తుంది, ఒక పురాతన పాటలా – ప్రశాంతంగా, మర్మంగా మరియు లోతుగా. భారతదేశానికి పేరు పెట్టింది ఇదే నది, మరియు దాని ఒడ్డున మన పురాతన నాగరికత వర్ధిల్లింది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఫోటోగ్రాఫర్ ప్రదీప్ చౌదరి రూపొందించిన ఈ కళాఖండం కేవలం ఒక సహజ దృశ్యం మాత్రమే కాదు, చరిత్ర, భౌగోళికం మరియు భావోద్వేగాల సంగమం.