బ్యాంకు లాకర్లు..  సురక్షితమేనా ?

బ్యాంకు లాకర్లు.. సురక్షితమేనా ?

బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానంతో పెరుగుతున్న అనుమానాలు

బ్యాంకు లాకర్లలో దాచుకున్న విలువైన వస్తువులకి ఉన్న బీమా కవరేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో వచ్చిన ప్రశ్నకి ఇలా సమాచారం ఇచ్చారు.

లాకర్లలో దాచిన వస్తువులను బ్యాంకు అధికారులు చూడరు (చూడడం బ్యాంకు రూల్స్ కి విరుద్ధం) కాబట్టి, వాటిని రికార్డు చేయరు, అంచేత వాటి విలువ రిజిస్టర్ కాదు. సో.. విలువ ఆధారంగా బీమా కవరేజీ ఇవ్వబడదు.

దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంకుల్లో మోసాలు వంటివి జరిగిన సందర్భాల్లో లాకర్లకు నష్టం వాటిల్లితే లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు సొమ్ముని బ్యాంకులు పరిహారంగా చెల్లిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు .

బ్యాంకు లాకర్ చార్జీలవిషయానికొస్తే.. భారతదేశంలో అనేక రేంజ్ లు ఉన్నాయి. ముఖ్యమైన జాతీయ బ్యాంకుల్లో పరిశీలిస్తే ఏరియా లొకేషన్, లాకర్ సైజు ని బట్టి ఏడాదికి 1000 రూపాయలనుంచి 12000 వరకూ లాకర్ అద్దె ఉంటుంది. కొన్ని ఇతర బ్యాంకుల్లో అత్యధికంగా 25000 నుంచి 40000 వరకూ కూడా వార్షిక లాకర్ చార్జీలు ఉన్నాయి.

దీన్ని బట్టి గరిష్టంగా లక్ష రూపాయల నుంచి 40 లక్షల వరకూ మాత్రమే లాకర్ నష్టానికి వినియోగదారులు పరిహారం పొందగలరన్నమాట.

బ్యాంక్ లాకర్లు సర్వ సురక్షితం అని భావిస్తారు, కానీ అవి 100% భద్రతను హామీ ఇవ్వవు. ఇంట్లో విలువైన వస్తువులను ఉంచడం ప్రమాదం కాబట్టి లాకర్లు అంతకంటే సురక్షితమైనవి. అయినప్పటికీ, పెద్ద స్థాయి దొంగతనాలు, సిబ్బంది ప్రమేయంతో జరిగే మోసాలు, అలాగే చెదలు, తేనెటీగలు, ఎలుకలు, నీటి లీకేజీ వంటి ఘటనల కారణంగా లాకర్లకు నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం.

బ్యాంక్ లాకర్లు బలమైన స్ట్రాంగ్ రూమ్స్ లోనే ఉంటాయి. అలారమ్‌లు, సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది. అయినప్పటికీ, దొంగతనం, అగ్ని ప్రమాదం, వరదలు వంటి ఘటనల్లో నష్టపోవడం జరుగుతూనే ఉంటుంది.

RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంక్ నిర్లక్ష్యం లేదా సిబ్బంది మోసం వల్ల లాకర్ దెబ్బతిన్నాకూడా బ్యాంక్ చెల్లించే పరిహారం వార్షిక అద్దెకి 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు, ఒక లాకర్ అద్దె ₹2,000 అయితే, గరిష్ట పరిహారం ₹2,00,000 మాత్రమే. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదం వంటి సహజ విపత్తుల వల్ల నష్టం జరిగితే, తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు నిరూపిస్తే బ్యాంక్ నష్టానికి పైసా పరిహారం కూడా ఇవ్వక్కర్లేదు.

లాకర్ ఎంత చిన్నదైనా అందులో కుక్కి కుక్కి మరీ బంగారం, నగదు విలువైన పత్రాలను దాచడం కొందరు వినియోగదారుల అలవాటు. ప్రధానంగా అక్రమార్జనపరులు కొందరు లాకర్లను తమ రహస్య సంపదని దాచడం కోసం తీసుకుంటూ ఉంటారు.

కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది లాకర్‌లను దెబ్బతీయడం లేదా వాటిలో సొమ్ముని దొంగతనం చేయడం జరిగిన ఘటనలు కూడా పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. ఒక లాకర్‌ను 7 సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే, అద్దె చెల్లించినా కూడా బ్యాంక్ కి దాన్ని తెరిచే అధికారం ఉంది. వస్తువుల జాబితా ఉండదు కాబట్టి దొంగతనం జరిగితే నిరూపించడం కష్టం. అక్రమ సంపద అయితే.. కొందరు వినియోగదారుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా కూడా మారుతుంది.

సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు లాకర్‌ను ఓపెన్ చేసి తనిఖీ చేయాలనీ బ్యాంకులు చెబుతాయి. లాకర్లలో భద్రపరచిన వస్తువుల జాబితా, ఫోటోలు, బిల్లులు ఇంట్లో భద్రపరచుకోవాలి. అలాగే

నామినీ రికార్డు పర్ఫెక్ట్ గా ఉంటే వినియోగదారుడు మరణించిన సందర్భంలో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తవు . దీనిపై స్పష్టంగా ఉండాలి .

గ్యాస్ కొరతలేనేలేదు . .. నో టెన్షన్ . ..

గ్యాస్ కొరతలేనేలేదు . .. నో టెన్షన్ . ..

గృహావసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఇవేవీ ప్రస్తుతానికి దేశంలో ఏమాత్రం కొరత లేదు. జనం ఆందోళన చెందక్కర్లేదు

యుద్ధం ఇలాగే కొనసాగినా కూడా కనీసం మరో రెండు మాసాలు మనకి ఇంధనకొరత భయం లేదని కేంద్ర ప్రభుత్వపు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే కొరత వస్తుందనే భయంతో ప్రతి వాళ్ళూ ముందుజాగ్రత్తగా, స్వార్థంతో స్టోరేజ్ చేసుకునే ప్రయత్నాలు చేయడమే అసలైన సమస్య. బ్యాంకు నష్టాల్లో ఉందనే ప్రచారం జరిగిందంటే.. ఒక్కసారిగా డిపాజిటర్లు తమ సొమ్ము తీసేసుకోవడానికి లైన్లలో నిలబడతారు. అప్పటివరకూ బ్యాంకు బాగానే ఉన్నా.. ఈ లైన్ల దెబ్బకి నిజంగానే కుదేలైపోతుంది. అలాగే ఒకేసారి వందలు, వేలమంది వినియోగదారులు గ్యాస్ రీఫిల్ బుకింగ్ లు చేయడం, వందలాది వాహనాలు పెట్రోల్, డీజిల్ కోసం బ్యాంకులకు పోటెత్తడం వలన స్వతహాగానే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అంతే కాకుండా ఈ క్యూ లు సైకలాజికల్ గా సమాజ స్టెబిలిటీని దెబ్బతీస్తాయి. ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దేశ రక్షణ, ఇంధన భద్రతకి చేపట్టాల్సిన అంతర్జాతీయ చర్యలు వంటి కీలక బాధ్యతలు నిర్వహించాల్సిన భారం పాలకులపై ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి అనవసర ఒత్తిడి వారిపై పెంచకుండా, బాధ్యతగా వ్యవహరించడం పౌరుల విధి.

ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రం కొంత రిస్ట్రిక్షన్ వచ్చిందనేది నిజం. వచ్చిన కొరత కంటే ఆయా సంస్థలు, అసోసియేషన్లు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న హడావుడి బాగా ఎక్కువగా ఉంది. తినడానికి హోటల్ తప్ప మరోదారి లేనివాళ్లు కొంత ఇబ్బంది పడతారు తప్ప, అందరికీ ఇదేమీ సమస్యకాదు. చిన్న కాకా హోటళ్లు, ఇళ్లవద్ద ఆహారం తయారు చేసి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు క్రియాశీలకం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది.

హర్ముజ్ జలసంధినుంచి ఇరాన్ మన దేశపు నౌకలను అనుమతించడం, రష్యా కోరినంత చమురుని భారత్ కి విక్రయించడం.. అలాగే క్లిష్ట సమయంలో ఒత్తిడి తగ్గించే ధోరణితో అమెరికా వ్యవహరించడం.. ఇవన్నీ భారత దౌత్య విజయాలే.. లేదా మనదేశంపై చిరకాలంగా ప్రపంచానికి ఉన్న గుడ్ విల్ కి ప్రతిగా లభించిన అవకాశాలే!

ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఎంతో కొంత ప్రభావితం అయ్యే దేశాల్లో భారత్ ముందుంటుంది. అలాగని మనమీద బాంబులు ఎప్పుడూ పడవు. స్వరాజ్యం తర్వాత (చైనా, పాకిస్థాన్ లతో మనం ప్రత్యక్షంగా చేసిన యుద్ధాల్లో మినహా) ఎప్పుడూ మనదేశంపై బాంబు పడలేదు. కానీ ప్రపంచపు ప్రతి సంక్షోభమూ పరోక్ష ప్రభావాన్ని చూపడంచేత భారత్ పై ధరల బాంబులు పడుతూ ఉంటాయి.

గతంలో గల్ఫ్ యుద్ధం సమయంలో మనం గల్ఫ్ సర్చార్జిలు కట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాలిబన్ యుద్ధం సమయంలో, ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు కైవసం చేసుకున్న సమయంలో కూడా భారత్ లో ధరలు పెరిగాయి. దిగుమతులపై ఎక్కువ ఆధారపడడం, ఎగుమతి దిగుమతులు జరిగే రవాణా మార్గాల్లోని దేశాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం వంటివే భారత్ ధరలపరంగా ప్రభావితం కావడానికి అసలు కారణాలు. కొరత వలన సమస్య రాదు.. కొరత వచ్చే అవకాశాలపై ప్రచారంతో భయపెట్టి… కృత్రిమ కొరత సృష్టించే అవినీతి పరులతోనే సమస్య వస్తుంది.

ప్రపంచం యుద్ధమేఘాలకింద అవస్థలు పడుతున్న ఈ కష్టసమయంలో ప్రకృతి, పరిస్థితులు, ఘనమైన మన వారసత్వం, ప్రస్తుత నాయకత్వం కలసి రాబట్టే మనం ఈమాత్రమైనా ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యుద్ధం త్వరగా ముగిసిపోతే భారతదేశంలో వారం రోజుల్లోనే అంతా యథాతథ పరిస్థితికి వచ్చేస్తుంది. పరిస్థితి మరీ దిగజారిపోయి.. యుద్ధం మరింతకాలం, మరిన్ని దేశాలకు విస్తరించినా కూడా భారత్ కి ప్రత్యక్ష భయం అయితే లేదు. స్వరాజ్య భారతం సుమారుగా గత 77 సంవత్సరాల్లో అనుసరించిన విదేశాంగ విధానం, ఎన్నడూ దురాక్రమణకు, ముందస్తు యుద్ధానికి పాల్పడని మన వారసత్వపు మంచితనం ఇందుకు ప్రబల కారణాలు. నాటి నెహ్రూగారి అలీన విధానం మొదలు నేటి మోదీ గారి స్వతంత్ర విదేశాంగ విధానం వరకూ కూడా భారత్ సంప్రదాయబద్ధమైన లక్ష్మణరేఖను పాటిస్తూనే వస్తోంది…. అదే మన దేశానికి శ్రీరామరక్ష.

అగ్రభాగాన దక్షిణాది … ఆదాయంలో ముందంజ

అగ్రభాగాన దక్షిణాది … ఆదాయంలో ముందంజ

భారతదేశ తలసరి ఆదాయ ర్యాంకింగ్స్‌లో దక్షిణ రాష్ట్రాలు మరోసారి అగ్రస్థానంలో నిలబడ్డాయి . ఈ విషయాన్ని ఆర్‌బిఐ గణాంకాలు చూపుతున్నాయి.
ప్రస్తుత ధరల ప్రకారం తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి ₹3,87,623తో తెలంగాణ, దేశంలో ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉంది.

జాతీయ స్థాయిలో మొదటి 10 స్థానాల్లో ఐదు దక్షిణ రాష్ట్రాలుఈ ర్యా0కింగ్ లో చోటు దక్కించుకున్నాయి . ప్రస్తుత ధరల ప్రకారం తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి (NSDP) ₹3,87,623తో తెలంగాణ, ఢిల్లీ తర్వాత దేశంలో రెండో స్థానంలో ఉంది.

ఆ తర్వాత కర్ణాటక ₹3,80,906, తమిళనాడు ₹3,61,619, కేరళ ₹3,08,338 మరియు ఆంధ్రప్రదేశ్ వరుసగా ఉన్నాయి.

దీనికి విరుద్ధంగా, పెద్ద ఉత్తర రాష్ట్రాలు చాలా దిగువ స్థానాల్లో ఉన్నాయి. ఉత్పత్తి పరంగా భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మహారాష్ట్ర, తలసరి NSDP ₹3,09,340తో ఆరో స్థానంలో ఉంది.

మధ్యప్రదేశ్ ₹1,52,615తో 22వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ ₹1,08,572తో 24వ స్థానంలో మరియు బీహార్ ₹69,321తో అన్ని రాష్ట్రాలలో చివరి స్థానంలో ఉన్నాయి. అత్యధిక ర్యాంకు పొందిన దక్షిణ రాష్ట్రానికి మరియు బీహార్‌కు మధ్య వ్యత్యాసం ఐదు రెట్లకు పైగా ఉంది.

తమిళనాడు మరియు కర్ణాటక దక్షిణ భారతదేశ ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం తమిళనాడు నికర రాష్ట్ర దేశీయోత్పత్తి (NSDP) ₹27,92,49,598 లక్షలుగా ఉంది, కర్ణాటక ₹26,03,94,756 లక్షలతో దానికి దగ్గరగా ఉంది.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి, వాటి NSDPలు వరుసగా ₹14,87,03,908 లక్షలు మరియు ₹14,22,99,773 లక్షలు. కేరళ ₹11,11,22,940 లక్షలతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. దీనికి విరుద్ధంగా, దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయిన మహారాష్ట్ర, ₹39,57,31,855 లక్షల నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (NSDP)తో, తలసరి NSDP ₹3,09,340గా ఉంది, ఇది కేరళ కంటే కొద్దిగా మాత్రమే ఎక్కువగా ఉంది.

తమిళనాడు మరియు కర్ణాటకతో పోల్చదగిన ₹26,00,00,416 లక్షల NSDP ఉన్న ఉత్తరప్రదేశ్, తలసరి ఆదాయం కేవలం ₹1,08,572గా నమోదు చేసింది, ఇది దేశంలోనే అత్యల్పంగా నమోదుకావడం గమనార్హం . .

మధ్యప్రదేశ్ యొక్క NSDP ₹13,46,24,492 లక్షలుగా ఉంది, ఇది స్థూలంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సమానంగా ఉన్నప్పటికీ, దాని తలసరి ఆదాయం ₹1,52,615 వద్ద గణనీయంగా తక్కువగా ఉంది.

బీహార్ ఆర్థిక వ్యవస్థ ₹8,99,02,050 లక్షలతో చిన్నదిగా ఉంది మరియు ఇది దేశవ్యాప్తంగా అత్యల్ప తలసరి NSDP అయిన ₹69,321కి దారితీసింది.
ఆర్థిక ఆరోగ్యం మరియు రాబడి
దక్షిణ రాష్ట్రాలలో, 2024-25 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు మరియు కర్ణాటక సొంత పన్ను వసూళ్లు వరుసగా ₹1,95,173 కోట్లు మరియు ₹1,89,893 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ ₹1,38,181 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ₹1,09,789 కోట్లు మరియు కేరళ ₹84,884 కోట్లతో ఉన్నాయి.

ఈ సంవత్సరానికి తమిళనాడు ఆర్థిక లోటు ₹1,08,690 కోట్లుగా ఉంది, ఇది ఐదు దక్షిణ రాష్ట్రాలలోకెల్లా అత్యధికం. కర్ణాటక లోటు ₹82,981 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ₹68,743 కోట్లు, తెలంగాణ ₹49,255 కోట్లు మరియు కేరళ ₹44,529 కోట్లుగా ఉంది.

ఈ లోటులో కొంత భాగాన్ని పూడ్చడానికి, తమిళనాడు ఈ కాలంలో మార్కెట్ నుండి ₹50,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ₹44,000 కోట్లు, తెలంగాణ ₹31,500 కోట్లు మరియు కేరళ ₹24,253 కోట్లు సమీకరించాయి. కర్ణాటక ₹3,000 కోట్లు సమీకరించింది.

ఉత్తరాదిలో, మహారాష్ట్ర పన్ను వసూళ్లు మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం రూ. 3,42,919 కోట్ల సొంత పన్ను ఆదాయాన్ని మరియు రూ. 1,10,355 కోట్ల ద్రవ్య లోటును నివేదించింది. ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య కాలంలో ఇది మార్కెట్ నుండి రూ. 64,000 కోట్లు సమీకరించింది.

ఉత్తరప్రదేశ్ రూ. 2,70,432 కోట్ల సొంత పన్ను ఆదాయాన్ని మరియు రూ. 86,531 కోట్ల ద్రవ్య లోటును నివేదించగా, ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఎలాంటి మార్కెట్ రుణాలను తీసుకోలేదు.

మధ్యప్రదేశ్ పన్ను వసూళ్లు రూ. 1,02,097 కోట్లుగా ఉండగా, ద్రవ్య లోటు రూ. 62,564 కోట్లు మరియు మార్కెట్ రుణాలు రూ. 15,000 కోట్లుగా ఉన్నాయి.

బీహార్ రూ. 54,300 కోట్ల సొంత పన్ను ఆదాయాన్ని నివేదించింది, రూ. 29,095 కోట్ల ద్రవ్య లోటును ఎదుర్కొంది మరియు మార్కెట్ నుండి రూ. 12,000 కోట్లు సమీకరించింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం చాలా దక్షిణ రాష్ట్రాలలో సాపేక్షంగా అదుపులోనే ఉంది. దక్షిణ రాష్ట్రాలలో తెలంగాణ అత్యల్ప సగటు ద్రవ్యోల్బణం 3.7 శాతంగా నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రెండూ 4.4 శాతంగా, తమిళనాడు 4.7 శాతంగా మరియు కర్ణాటక 4.9 శాతంగా ఉన్నాయి. కేరళలో దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా 5.9 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.

ఉత్తర భారతదేశంలో, బీహార్‌లో అత్యధికంగా 6.0 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 5.3 శాతం, మహారాష్ట్రలో 4.1 శాతం మరియు మధ్యప్రదేశ్‌లో 4.7 శాతం నమోదైంది.

పేదరికం విషయంలో కేరళ ప్రత్యేకంగా నిలుస్తుంది. NFHS-5 (2019–21) ఆధారంగా దాని బహుమితీయ పేదరిక తలసరి నిష్పత్తి కేవలం 0.55 శాతం, ఇది జాబితా చేయబడిన అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యల్పం.

తమిళనాడు 2.20 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పేదరిక స్థాయిలు వరుసగా 6.06 శాతం మరియు 5.88 శాతంగా నమోదయ్యాయి, అయితే కర్ణాటకలో ఇది 7.58 శాతంగా ఉంది. అయినప్పటికీ, ఈ ఐదు దక్షిణ రాష్ట్రాలలో పేదరిక స్థాయిలు చాలా రాష్ట్రాలలో కనిపించే స్థాయిల కంటే చాలా తక్కువగా ఉన్నాయి.

ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 22.93 శాతంతో, మధ్యప్రదేశ్ 20.63 శాతంతో మరియు గుజరాత్ 11.66 శాతంతో ఉన్నాయి. మహారాష్ట్ర 7.81 శాతంతో ఉత్తరాది రాష్ట్రాలలో చాలా వాటి కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ, కేరళ మరియు తమిళనాడు కంటే వెనుకబడి ఉంది.

2019–20 ఆర్థిక సంవత్సరానికి అందుబాటులో ఉన్న తాజా డేటాను ఉపయోగించి చూస్తే, ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయంలో స్పష్టమైన ప్రాంతీయ వ్యత్యాసం కనిపించడం లేదు. తమిళనాడు ఆరోగ్యంపై ₹13,012 కోట్లు ఖర్చు చేసింది, ఇది దక్షిణ రాష్ట్రాలలోకెల్లా అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక ₹9,474 కోట్లతో, ఆంధ్రప్రదేశ్ ₹7,941 కోట్లతో, కేరళ ₹7,539 కోట్లతో మరియు తెలంగాణ ₹7,304 కోట్లతో ఉన్నాయి.

ఉత్తరాదిలో, ఉత్తరప్రదేశ్ ఆరోగ్యంపై ₹20,250 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది, ఇది జనాభా పరిమాణాన్ని ప్రతిబింబిస్తూ, ఈ 10 రాష్ట్రాలలోకెల్లా అత్యధికం. మహారాష్ట్ర ₹14,756 కోట్లు, గుజరాత్ ₹10,396 కోట్లు, మధ్యప్రదేశ్ ₹9,673 కోట్లు మరియు బీహార్ ₹8,079 కోట్లు ఖర్చు చేశాయి.

మోదీ-లోకేష్ బంధం.. వ్యూహం ఏమిటి ?

మోదీ-లోకేష్ బంధం.. వ్యూహం ఏమిటి ?

నారా లోకేష్ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న శ్రద్ధ, అభిమానం, ఆత్మీయతల వెనుక కారణం ఏమై ఉండొచ్చు . దీని వెనుక విస్తృతమైన వ్యూహం కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా ఏ మేరకు వాస్తవికతకు తగ్గారగా ఉంది . . మిత్రపక్షాల్లో తర్వాతి తరం నాయకులను ప్రోత్సహించడం ద్వారా కూటమిని బలోపేతం చేసుకోవడం దీని లక్ష్యం. ఈ నమూనాకు బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ ఒక ఉదాహరణ. ఆయన మోదీ పట్ల పూర్తి విధేయత ప్రదర్శించారు. ప్రధాని పాదాలకు నమస్కరించారు. బదులుగా మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. ఫలితంగా చిరాగ్‌కు కీలకమైన కేంద్ర మంత్రి పదవి లభించింది. ఆయన పార్టీకి 5 ఎంపీలు ఉన్నారు.

మరోవైపు రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కు భారత రత్న ప్రకటించారు. దీంతో జయంత్ ఎన్డీఏకు మద్దతు పలికారు. ఆయన పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇది రాజకీయ వారసత్వాలను గౌరవిస్తూ, వారిని కలుపుకుపోయే ఎత్తుగడ.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కును అందుకోలేకపోయింది. దీంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పలేదు. 16 మంది ఎంపీలతో తెలుగుదేశం పార్టీ కూటమిలో రెండో అతిపెద్ద పక్షంగా అవతరించింది. ఈ పరిణామం వల్ల చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో (మరోసారి) కింగ్‌మేకర్‌ అయ్యారు. ప్రభుత్వ మనుగడకు టీడీపీ మద్దతు ఇప్పుడు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో టీడీపీతో సంబంధాలను పటిష్టం చేసుకోవడం బీజేపీకి తప్పనిసరి. అందుకే ఆ పార్టీ భవిష్యత్ నాయకుడైన లోకేష్‌కు మోదీ అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది భవిష్యత్తు కోసం వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు.

లోకేష్ తన రాజకీయ బ్రాండ్‌ను సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణపై నిర్మించుకున్నారు. విశాఖపట్నంలో ₹1500 కోట్లతో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల కోసం లండన్, సింగపూర్ వంటి నగరాల్లో సమావేశాలు నిర్వహించారు. ఆయన అభివృద్ధి మంత్రం, మోదీ ‘వికసిత భారత్’ ఆశయానికి దగ్గరగా ఉంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనను “డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్” అని లోకేష్ అభివర్ణించారు. మోదీ నాయకత్వాన్ని, ఆయన దార్శనికతను బహిరంగంగా ప్రశంసించారు. ఈ విధేయత, విధాన సారూప్యత మోదీకి నచ్చింది. అందుకే కర్నూలు సభలో లోకేష్ దూరంగా నిలబడితే, “ఇక్కడికి రా” అని ఆత్మీయంగా పిలిచారు. ఈ బహిరంగ ఆమోదం లోకేష్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

ప్రభుత్వ మనుగడకు 16 మంది ఎంపీలున్న టీడీపీ అత్యంత కీలకం. అందుకే లోకేష్‌కు ప్రాధాన్యం ఎక్కువ. చిరాగ్ బంధం వ్యక్తిగత విధేయతపై ఆధారపడితే, లోకేష్‌తో బంధం విధానాల ఏకీభావనపై కూడా నిలిచింది.లోకేష్‌ను ప్రశంసించడం ద్వారా, అభివృద్ధి రాజకీయాలు చేసే వారసులకు తన మద్దతు ఉంటుందని మోదీ ఇతర ప్రాంతీయ పార్టీలకు సందేశం పంపుతున్నారు. ఇది సంకీర్ణ రాజకీయాల కొత్త నమూనా. వ్యక్తిగత ఆభిమానం వెనుక పక్కా రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

మోదీ-లోకేష్ బంధం వెనుక స్పష్టమైన రాజకీయ లెక్కలున్నాయి. ఇది ఒక సహజీవన సంబంధం. ప్రభుత్వ స్థిరత్వం కోసం మోదీకి లోకేష్ అవసరం. జాతీయ స్థాయిలో గుర్తింపు, కేంద్రం మద్దతు కోసం లోకేష్‌కు మోదీ ఆశీస్సులు అవసరం. లోకేష్ తదుపరి ముఖ్యమంత్రి కావచ్చనే సంకేతాలను ప్రధాని పరోక్షంగా ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పుత్రోత్సాహానికి మించిన విజయం ఏ తండ్రకీ వుండదు. మోదీ అపురూపమైన ఈ మానవ సంబందపు ఆనందాన్ని చంద్రబాబు నాయుడికి ఇస్తున్నారు, మోడీ చేస్తున్న ఈ లాజిక్కు గురించి ఎవరు ఏమి చర్చుకున్నా … దేశరాజకీయ పరిస్తుతులలో పెను మార్పునకు కారణం అవుతుందా > అనేదానిపై కూడా అనేక అంచనాలు నెలకొన్నాయి .

వందేళ్ళ ఆర్ ఎస్ ఎస్ – భారత రాజకీయాల్లో ఒక ట్రాన్స్ ఫర్మేషన్

వందేళ్ళ ఆర్ ఎస్ ఎస్ – భారత రాజకీయాల్లో ఒక ట్రాన్స్ ఫర్మేషన్

భారత్ రాజకీయాలలో RSS పాత్ర అత్యంత కీలకం. ప్రయోగాత్మకం. అంతకుమించి పెనుమార్పునకు కారణమ్ . రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) శతాబ్ది ఉత్సవాలు భారత సామాజిక-రాజకీయ రంగంలో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ కు సంకేతం. ఒకప్పటి వివాదాస్పద సంస్థ ఇప్పుడు దేశ పాలక వ్యవస్థలో గట్టిగా స్థిరపడుతోంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. ఇది హిందుత్వ ఆధారిత స్వచ్ఛంద సంస్థ. 1925లో విజయదశమి రోజున మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ దీనిని స్థాపించారు. హిందూ క్రమశిక్షణ, ఏకీకరణ పెంపొందించడం, హిందూ రాష్ట్ర స్థాపన దీని ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో కాంగ్రెస్ వైఖరిపై హెడ్గేవార్ విభేదించారు. ముస్లింల ఖిలాఫత్ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై ఆయన విముఖత చూపారు.

ఈ శతాబ్ది ఉత్సవాల వేదిక నాగ్‌పూర్. దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.ఆర్ ఎస్ ఎస్ స్థాపన కేంద్రం నాగ్‌పూరే. ఈ శతాబ్ది వేడుకలు మహాత్మా గాంధీ జయంతి, డా. బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధంలోకి మారిన రోజు (ధమ్మచక్ర ప్రవర్తన దినం) తో ఏకకాలంలో రావడం గమనార్హం.

గాంధేయవాదం, అంబేద్కర్ వాదం, హిందుత్వ… ఈ మూడు ఆలోచనా స్రవంతులు దేశ రాజకీయ వ్యక్తిత్వాన్ని రూపొందించాయి. నాగ్‌పూర్ ఈ మూడు వారసత్వాలకు కేంద్రంగా నిలిచింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంసేవక్. ఆయన ఢిల్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శతాబ్ది ప్రయాణాన్ని ఆయన త్యాగం, నిస్వార్థ సేవ, దేశ నిర్మాణం, క్రమశిక్షణకు ఉదాహరణగా అభివర్ణించారు. ఆర్ ఎస్ ఎస్ శాఖలు ‘యజ్ఞ వేదీస్’ వంటివని కొనియాడారు.

సంఘ్ శతాబ్దికి గుర్తుగా భారత ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ స్టాంప్, ₹100 నాణెం విడుదల చేసింది. నాణెంపై ‘భారత్ మాత’ చిత్రం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కరెన్సీపై భారత్ మాత చిత్రం ఇదే మొదటిది.

ఆర్ ఎస్ ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఎదిగింది. విద్య, సామాజిక సేవ, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత వంటి అన్ని రంగాల్లో దాని అనుబంధ సంస్థలు విస్తరించాయి. పాలక పార్టీ బీజేపీ, అతిపెద్ద కార్మిక సంఘం బిఎంఎస్ , అతిపెద్ద విద్యార్థి సంస్థ ఎబివిపి, విద్యా భారతి పాఠశాల వ్యవస్థ సంఫ్‌ పరివార్‌లో భాగమే. ఆర్ ఎస్ ఎస్ లక్ష్యం భారతదేశాన్ని కేవలం సమృద్ధ దేశంగానే కాకుండా, ‘నైతిక, సాంస్కృతిక విశ్వగురువుగా’ మార్చడం. దీనికి ‘నేషన్ ఫస్ట్’ సిద్ధాంతమే పునాది.

అయితే, ఈ వేడుకలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ గౌరవం రాజ్యాంగాన్ని అవమానించడమే అని కాంగ్రెస్, సీపీఎం ఖండించాయి. ఆర్ ఎస్ ఎస్ స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండి, బ్రిటిష్ వారికి సహకరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. మహాత్మా గాంధీ హత్య తర్వాత సర్దార్ పటేల్ సంస్థను నిషేధించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.

అంటరానితనంపై పోరాటం చేస్తున్నామని సంఘ్ వాదిస్తున్నా , ఇది అగ్రకులాల ఆధిపత్యంలో ఉందనే విమర్శ ఉంది. చరిత్రను వక్రీకరించి పాఠ్యాంశాలను ‘కాషాయీకరణ’కు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.

ఈ శతాబ్ది మైలురాయి సంఘ్ సైద్ధాంతిక, సంస్థాగత విజయాన్ని స్థిరీకరించింది. భవిష్యత్తులో దేశ జాతీయ కథనంపై దాని పట్టు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇస్రో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమూనా ఇదిగో

ఇస్రో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్’ నమూనా ఇదిగో

అంతరిక్ష రంగంలో ప్రపంచం మనవైపు ఆసక్తిగా చూస్తోంది . దీనికి కారణం భారత్‌ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. 2035 నాటికి సొంతగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిశ్చయించుకుంది. అందులో భాగంగా తాజాగా ‘భారతీయ అంతరిక్ష్‌ స్టేషన్‌ (BAS​)’ నమూనాను తాజాగా విడుదల చేసింది. దిల్లీలోని భారత మండపంలో శుక్రవారం నుంచి నేషనల్‌ స్పేస్‌ డే వేడుకలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. అవి :

  1. ఐదు దేశాల స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌’ (ఐఎస్​ఎస్​)
  2. చైనా సొంతంగా నిర్మించుకున్న తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌.

2035 సంవసరం నాటికి భారత్‌ కూడా సొంతంగా 5 మాడ్యుల్స్‌తో ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌’ను నిర్మించాలని కృతనిశ్చయంతో ఉంది. 2028 నాటికి తొలి మాడ్యుల్‌ను నింగిలోకి పంపించడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసింది.

10 టన్నుల బరువున్న మాడ్యూల్​
బాస్‌-1 మాడ్యుల్‌ సుమారుగా 10 టన్నులు ఉండవచ్చని అంచనా. దీనిని భూమికి 450 కి.మీ ఎత్తులో ఇస్రో ప్రవేశపెట్టనుంది. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇన్విరాన్‌మెంటల్‌ కంట్రోల్‌ అండ్‌ లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌(ఈసీఎల్‌ఎస్‌ఎస్‌), భారత్‌ డాకింగ్‌ సిస్టమ్‌, భారత్‌ బెర్తింగ్‌ మెకానిజమ్‌, ఆటోమెటెడ్‌ హ్యాచ్‌ సిస్టమ్‌తోపాటు మరిన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. అంతరిక్షం, ఔషధాలు, గ్రహాంతర అన్వేషణకు ఈ బాస్​-1 మాడ్యుల్‌ వేదిక కానుంది.

40 అంతస్తుల భవనమంత ఎత్తైన రాకెట్‌ నిర్మాణం
“అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు అబ్బురపడేలా భారత్​ అద్భుత ప్రగతి సాధించింది. ప్రస్తుతం 40 అంతస్తుల భవనమంత ఎత్తు ఉండే రాకెట్‌ను నిర్మిస్తున్నాం. భవిష్యత్తులో నౌకాదళం కోసం ప్రత్యేక ఉపగ్రహం ప్రయోగించనున్నాం” అని ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన 84వ స్నాతకోత్సవంలో, గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్‌ ‘డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌’ అందుకున్నారు.

ఈ సందర్భంగా వి . నారాయణన్ మాట్లాడారు . “రష్యా, అమెరికాలకు దీటుగా మనం ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నాం. యూఎస్​కు చెందిన 6,500 కిలోల కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాం. రానున్న 10 ఏళ్లలో భారత్‌ సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించనుంది. తొలిసారిగా శుక్రగ్రహంపై ప్రయోగాలు చేస్తున్నది మనమే. ఇస్రో పరిశోధనల లక్ష్యం- కర్షకులు, కార్మికులు సహా ప్రజలందరి దైనందిన జీవితాల్లో వెలుగు నింపడమే” అని అయన స్పష్టం చేసారు .